పట్నం సుబ్రమణ్య అయ్యరు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎జననం - బాల్యం: clean up, replaced: నేపధ్యం → నేపథ్యం using AWB
పంక్తి 1:
'''పట్నం సుబ్రమణ్య అయ్యరు''' (జననం 1845, మరణం జూలై 31 1902) [[కర్ణాటక సంగీతము|దక్షిణ భారత శాస్త్రీయ సంగీత]] వాగ్గేయకారుడు. ఈయన [[త్యాగరాజు|త్యాగరాజ స్వామి]] సాంప్రదాయాన్ని అనుసరించారు. దాదాపు ఒక వంద దాకా కీర్తనలను వ్రాసారు.
==జననం - బాల్యం ==
సుబ్రమణ్య అయ్యరు [[తమిళనాడు]]కు చెందిన [[తంజావూరు]] జిల్లా [[తిరువయ్యారు]]లో పుట్టారు. వీరి కుటుంబానికి గొప్ప సంగీత నేపధ్యంనేపథ్యం ఉంది. వీరి తండ్రి భారతం వైద్యనాథ అయ్యరు సంగీతం-శాస్త్రమూ రెండిటిలో ఉద్దండులు. వీరి పితామహులు పంచానంద శాస్త్రి తంజావూరు సెర్ఫోజీ మహారాజా ఆస్థానంలో ఆస్థాన సంగీతకారుడు. సుబ్రమణ్య అయ్యరు సంగీతాన్ని మొదటి వారి మామయ్య మేలత్తూర్ గణపతి శాస్త్రి వద్ద తదుపరి మనంబుచవాది వేంకటసుబ్బయ్యర్ వద్ద నేర్చుకున్నారు.
సుబ్రమణ్య అయ్యరు చాలా యేళ్ళు చెన్నపట్నం(చెన్నై)లో ఉన్నారు. అందువలన ఆయన ఇంటిపేరుగా పట్నం స్థిర పడిపోయి, ఆయన పట్నం సుబ్రమణ్య అయ్యరు గానే పిలవబడ్డారు. ఈయన శిష్యులలో ప్రముఖ వాగ్గేయకారులు, గాయకులు ఉన్నారు. వీరిలో ముఖ్యులు మైసూరు వాసుదేవాచార్, పూచి శ్రీనివాస అయ్యంగార్, భైరవి కెంపెగౌడ, టైగర్ వరదాచార్యర్ తదితరులు.