శ్రీ కృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి clean up, replaced: గ్రంధాలయం → గ్రంథాలయం using AWB
పంక్తి 7:
ఈ సంస్థ ప్రథమ గౌరవ కార్యదర్శి శ్రీ రావిచెట్టు రంగారావు. వీరు 1910లో స్వర్గస్థులు కాగా, వీరి స్థానంలో [[కర్పూరం పార్థసారధి నాయుడు]] కార్యదర్శిగా గ్రంథాలయానికి స్వంత భవనం నిర్మించాలని సంకల్పించారు. శ్రీ రంగారావు గారి సతీమణి శ్రీమతి రావిచెట్టు లక్ష్మీ నరసమ్మ గారు భాషా నిలయానికి అవసరమైన ఇల్లు కొనడానికి 3,000 రూపాయలు విరాళం ప్రకటించారు. దానితో ఇప్పుడు సుల్తాన్ బజార్ లో భాషా నిలయం భవనం ఉన్న చోటనే 1910లో ఒక పెంకుటిల్లు కొని, కొన్ని మార్పులు చేసి అందులో గ్రంథాలయం నెలకొల్పడం జరిగింది.
 
1915 సంవత్సరంలో ఆంధ్ర పితామహుడిగా ప్రసిద్ధిచెందిన శ్రీ [[మాడపాటి హనుమంతరావు]] పంతులు కార్యదర్శి పదవిని చేపట్టిన తర్వాత పాత ఇల్లు స్థానంలో కొత్త భవనం నిర్మించడానికి దీక్ష వహించారు. శ్రీ నాయని వెంకట రంగారావు, కర్పూరం పార్థసారధి, నాంపల్లి గౌరీశంకర వర్మ, లాల్ జీ మేఘ్ జీ గారల ఆర్థిక సహాయంతో నూతన భవన నిర్మాణం జరిగింది. ఈ భవనానికి ప్రఖ్యాత విద్యావేత్త శ్రీ [[కట్టమంచి రామలింగారెడ్డి]] గారు సెప్టెంబర్ 30, [[1921]] తేదీన ప్రారంభోత్సవం చేశారు. <ref name="మన సాంస్కృతిక కూడలి">{{cite news|last1=నమస్తే తెలంగాణ|first1=సండే న్యూస్|title=మన సాంస్కృతిక కూడలి|url=http://www.namasthetelangaana.com/Sunday/%E0%B0%AE%E0%B0%A8-%E0%B0%B8%E0%B0%BE%E0%B0%82%E0%B0%B8%E0%B1%8D%E0%B0%95%E0%B1%83%E0%B0%A4%E0%B0%BF%E0%B0%95-%E0%B0%95%E0%B1%82%E0%B0%A1%E0%B0%B2%E0%B0%BF-10-9-477668.aspx|accessdate=29 August 2016|date=UGUST 28, 2016}}</ref>
 
==ఉత్సవాలు==
పంక్తి 14:
భాషా నిలయం స్థాపన జరిగి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో [[రజతోత్సవాలు|రజతోత్సవాలను]] [[1927]] ఫిబ్రవరి 16, 17, 18 తేదీలలో [[కావ్యకంఠ గణపతి శాస్త్రి]] గారి అధ్యక్షతన జరిగాయి. అప్పటి గౌరవ కార్యదర్శి శ్రీ [[బూర్గుల రామకృష్ణారావు]] ప్రధాన పాత్ర పోషించి రజతోత్సవ సంచిక ప్రచురించారు.
 
[[File:Sri Krishna Devaraya Andhra Bhasha Nilayam-Hydarabad-1 (2).jpg|thumb|తెలంగాణాలో అతి పురాతన గ్రంధాలయంగ్రంథాలయం కృష్ణదేవరాయ ఆంధ్రభాషానిలయ భవనం]]
 
దీని [[స్వర్ణోత్సవాలు]] 1952 సెప్టెంబరు 1వ తేదీనుండి మూడు రోజులపాటు వైభవంగా జరిగాయి. అప్పటి ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణారావు గారు అధ్యక్షత వహించారు. అప్పటి ఆంధ్ర ప్రభుత్వ ఆస్థానకవి [[శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి]] గారు ప్రారంభోత్సవం చేశారు. ఉత్సవాలలో భాగంగా ఆనాటి తెలంగాణలోని 114 గ్రంథాలయాల ప్రతినిధుల సమావేశం, స్త్రీల సభ, వైజ్ఞానిక సభ, సాహిత్య సభ, కవి సమ్మేళనం వంటి కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా స్వర్ణోత్సవ సంచికను ప్రచురించారు.