బమ్మెర పోతన: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: AWB తో RETF మార్పులు, typos fixed: → (2), చేసినాడు → చేసాడు, చినారు → చారు (2) using AWB
పంక్తి 4:
[[బొమ్మ:POtanaamaatyuDu.jpg|right|250px|పోతన]]
[[బొమ్మ:POtanaamaatyuDu text.jpg|right|250px|పోతన]]
'''బమ్మెర పోతన''' గొప్ప కవి, ప్రజా కవి, పండిత పామరులను ఇద్దరినీ మెప్పించే విధంగా రాసిన కవి. వీరు సంస్కృతములో ఉన్న [[శ్రీమద్భాగవతము]]ను ఆంధ్రీకరించి తన జన్మనీ, తెలుగు భాషని, తెలుగు వారిని ధన్యులను చేసినాడుచేసాడు. [[శ్రీమదాంధ్ర భాగవతము]]లోని పద్యాలు వినని తెలుగు వాడు లేడంటే అతిశయోక్తి కాదు. వీరు నేటి [[వరంగల్ జిల్లా]] లోని బొమ్మెర గ్రామములో జన్మించినారుజన్మించారు{{fact}}. [[శ్రీరాముడు|శ్రీ రాముని]] ఆజ్ఞపై [[శ్రీకృష్ణుడు|శ్రీ కృష్ణుని]] కథ, [[విష్ణువు|విష్ణు]] భక్తుల కథలు ఉన్న [[భాగవతము]]ను తెలుగించినారుతెలుగించారు. ఈ భాగవతము మొత్తము [[తెలుగుదనం]] ఉట్టిపడుతుంది.
ఆంధ్రభాగవతమును రచియించిన మహాకవి. ఈయ న ఆఱువేలనియోగి. తండ్రి కేసన. కుమారుఁడు మల్లన. నివాసగ్రామము కడపకు సమీపమున ఉండెడు ఒంటిమిట్టి అనఁబరఁగిన ఏకశిలానగరము.
 
పంక్తి 17:
గూళుల కిచ్చి యప్పడుపు కూడుభుజించుటకన్న
సత్కవుల్ హాలికులైన నేమి గహనాంతర సీమల కందమూల
గౌధ్దాలికులైననేమి నిజదారసుతాదిక పోషణార్థమై."
 
అని ప్రత్యుత్తరము చెప్పెను. అంతట శ్రీనాథుఁడు పల్లకి దిగివచ్చి పోతనకు నమస్కరించి "బావా నీమహిమ నేనెఱుఁగనా బావమఱఁదులము కనుక కొంచెము మేలము చూపితిని" అనెను. అందులకు పోతనయు సరే అట్లుకాక ఇప్పుడు ఏమివిరుద్ధ ధర్మములు నడచెను అనుచు కొడుకును దుక్కి నిలిపి ఇంటికి పోయి అక్కతో శ్రీనాథకవి మనయింట విందారగింపఁవచ్చెను వేగవంటచేయమని చెప్పుము అని చెప్పిపంపి తానును అతనిని వెంటఁబెట్టుకొని తన కుటీరమునకు పోయెను.
 
ఇట్లు శ్రీనాథుఁడు పోతన ఇంటికి పోయి మిక్కిలి శిథిలమై సంకుచితమై ఉన్న ఆపూరియింటిని చూచి "బావా మహానుభావుఁడవు అగు నీవు ఈగుడిసెలో ఉండి ఈ పేదఱికమును అనుభవింపనేల ఎవరినేని గొప్ప రాజులను ఆశ్రయించి సంపదలు పడయరావా" అని పలికెను. ఇంతలో వంట అయినది స్నానమునకు యత్నము చేయుఁడు అని మల్లన వచ్చి చెప్పెను. అంత ఆయిరువురును స్నానముచేసి తమతమ అనుష్ఠానములు జరపుకొని భోజనము చేయ పోయిరి. అప్పుడు మనుష్య స్త్రీరూపము ధరియించి పోతనకు కూఁతురు అను పేర అతనియింట మెలఁగుచు ఉన్న సరస్వతీదేవి పళ్లెరమున అన్నమును కొనివచ్చి విస్తళ్లలో వడ్డించుచు కన్నుల నీళ్లు రాల్చెను. అది చూచి పోతన
 
"ఉ. కాటుకకంటినీరు చనుకట్టుపయింబడ నేల యేడ్చెదో,
కైటభరాజుమర్దనుని గాదిలికోడల యోమదంబ యో, హాటక
గర్భురాణి నిను నాఁకటికిం గొనిపోయి యల్ల కర్ణాట
కిరాత కీచకుల కమ్మఁ ద్రిశుద్ధిగ నమ్ము భారతీ"
 
అని చెప్పెను. అది విని ఆమె శోకము మాని సర్వపదార్థములు వడ్డింపఁగా భోజనముచేసి తగనమర్యాదతో పోతరాజు పంపఁగా శ్రీనాథుఁడు తానేమి చెప్పుటకును ఎడములేక తన వచ్చినదారిని పోయెను.
 
ఇట్లు పరమ వైరాగ్యపరుఁడై రామాంకితముగ భాగవతమును సమగ్రముగా తెనిఁగించి ముక్తుఁడు అయ్యెను. ఇదికాక వీరభద్రవిజయము అను దక్షాధ్వర ధ్వంసకథ ఒకటి ఈయన రచించినట్టు తెలియవచ్చుచు ఉన్నది. అది మాత్రము నరాంకితము చేయఁబడి ఉన్నది. అందులకు కారణము తెలిసినది కాదు. ఇతఁడు శాలివాహన శకము వేయిని మున్నూఱు అగుకాలమున జనియించినవాఁడు.
 
పోతన, [[శ్రీనాథ కవిసార్వభౌముడు]] సమకాలికులు, బంధువులు అనే సిద్ధాంతం ప్రాచుర్యంలో ఉంది కానీ ఈ సిద్ధాంతం నిజం కాదనే వారూ ఉన్నారు. వీరిమధ్య జరిగిన సంఘటనలగురించి ఎన్నో గాధలు ప్రచారములో ఉన్నాయి. పోతన [[వ్యవసాయము]] చేసి జీవనము సాగించినవారు. "పట్టునది కలమొ, హలమొ - సేయునది పద్యమో, సేద్యమో" అని "కరుణశ్రీ" [[జంధ్యాల పాపయ్య శాస్త్రి]] గారు చమత్కరించిరి. కవిత్వమును రాజులకో, కలిగినవారికో అంకితమిచ్చి, వారిచ్చిన సొమ్ములు, సన్మానములు స్వీకరించుట అప్పటి సంప్రదాయము. కాసు కోసము ఆసపడి తన "బాల రసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకను" క్రూరులైన రాజుల పరము జేయుటకు పోతన అంగీకరింపలేదు. ఆయన తన కవిత్వము శ్రీరామునకే అంకితము చేసిన పరమ భాగవతోత్తములు.
 
పోతన కవిత్వములో భక్తి, మాధుర్యము, తెలుగుతనము, పాండిత్యము, వినయము కలగలిపి ఉంటాయి. అందులో తేనొలొలుకుతున్నవనేది ఎలా చూచినా అతిశయోక్తి కానేరదు. భావి కవులకు శుభము పలికి రచన ఆరంభించిన సుగుణశీలి ఆయన.
"https://te.wikipedia.org/wiki/బమ్మెర_పోతన" నుండి వెలికితీశారు