ఉత్తర సర్కారుల్లో ఐరోపా వారి యుద్ధాలు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
కొత్త పేజీ |
→మచిలీపట్నం ముట్టడి ===== మచిలీపట్నం ప్రయాణం =: భాషా సవరణలు, వికీకరణ సవరణలు |
||
పంక్తి 34:
మిత్రులిద్దరి మధ్యన సంప్రదింపుల కోసం జరిగిన 50 రోజుల ఆలస్యం ఫ్రెంచి వారికి బాగా ఉపయోగపడింది. వారు తమ కోటలను బలోపేతం చేసుకునేందుకు ఆ సమయం పనికి వచ్చింది. దండయాత్రకు సన్నాహాలు మొదలయ్యాయి. ఐరోపా శతఘ్ని దళంతో, ఆనందరాజు సైనికులు కొందరితో బ్రిస్టల్ రాజమండ్రి కోటకు కాపలాగా ఉండిపోయాడు .ఆ కోటలో బ్రిటిషు వారికి ఒక సరుకుల డిపో ఉంది. రోగులు, గాయపడ్డవారు కూడా అక్కడే ఉంటారు.
== మచిలీపట్నం ముట్టడి
1759 జనవరి 28 న ఫోర్డ్ తన మచిలీపట్నం ప్రయాణాన్ని తిరిగి మొదలుపెట్టాడు.
=== ముట్టడి సన్నాహాలు ===
మార్చి 7 నుండి 25 వరకు, ఫోర్డు దళాలు 3 శతఘ్ని స్థావరాలు (బ్యాటరీలు) నిర్మించాయి; వాయవ్యాన, సముద్రానికి పక్కనే ఒకటి, ఉత్తరాన ఒకటి, మధ్యలో మొదటి రెంటికీ 100 మీటర్ల వెనగ్గా మూడోది. ముట్టడికి ఉపయోగపడే ఫీల్డుగన్నులను ఓడలోంచి దించారు. ఈ ఓడలు, భూమిపై సైన్యపు కదలికలకు అనుసరిస్తూ వచ్చాయి. పక్కల ఉన్న స్థావరాలపై రెండేసి రకాల చొప్పున, మధ్య స్థావరంపై మూడు రకాల ఫీల్డుగన్నులనూ మోహరించారు
=== ముట్టడి ===
మార్చి 25 న బ్రిటిషు వారి శతఘ్ని స్థావరాలు (బ్యాటరీలు)
కాన్ఫ్లాన్స్ నిజాము సలాబత్ జంగ్తో సాయం కోసం సంప్రదింపులు జరిపాడు. అతడు వెంటనే అంగీకరించి 35,000 సైన్యంతో బయలుదేరాడు. అతడు కృష్ణానది ఒడ్డుకు చేరాడని మార్చి 27 న ఫోర్డుకు వార్త చేరింది. దాంతో అతడు కలత చెందాడు. ఫోర్డు సలాబత్ జంగుతో సంప్రదింపులకు ప్రయత్నించగా, అతడు చర్చించేందుకు అంగీకరించి, ముందుకు సాగకుండా ఆగేందుకు ఒప్పుకున్నాడు. చర్చలు సాగుతూండగా ముట్టడి కొనసాగింది. బ్రిటిషు వారి గన్ను కాల్పులకు కోట బురుజులు చాలా వరకు దెబ్బతిన్నాయి. ఏప్రిల్ 5 న కుంభవృష్టి కురవడంతో, కాల్పులకు తెరపడింది. మరుసటి రోజున వర్షం ఆగింది. సలాబత్ జంగ్ ముందుకు సాగుతున్నాడని, దు రోచర్ కూడా దగ్గరిలోకి చేరుకున్నాడనీ ఫోర్డుకు చేరింది. ఇక, రెండు రోజులకు సరిపడా మాత్రమే మందుగుండు సామాగ్రి ఉందని అతడి అధికారులు చెప్పారు. ముట్టడి ఇక ముగింపుకు దశకు చేరిందని గ్రహించిన ఫోర్డు మెరుపుదాడి చెయ్యాలని నిర్ణయించుకున్నాడు.
|