అంకితం వెంకట భానోజీరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
ఆయన [[అక్టోబరు 1]] [[1890]] న జమీందారీ వంశంలో [[అంకితం వెంకట జగ్గారావు]] కు జన్మించారు. అతను సామ్యవాదిగా పెరిగారు. అట్లాగే ఆయనను విశాఖపట్నం వాసులు సేవ ఆధారిత పరోపకారి అని పిలిచేవారు. ఆయన సి.బి.ఎం. హైస్కూలు విద్యార్థిగా ఉన్నప్పుడు అనేక క్రీడలలో పాల్గొనేవారు. ముఖ్యంగా ఫుట్‌బాల్ ఆయనకు యిష్టమైన ఆట. ఆయన ఆ క్రీడలో అనేక పతకాలను పొందారు. ఆయన తన తండ్రితో అనేక ప్రాంతాలను సందర్శించి అనేక పుస్తకాలను అధ్యయనం చేసారు.<ref name="A.V. Jagga Row"/>
 
1932లో విజయవాడలో ఉన్న ఆధ్ర విశ్వవిద్యాలయాన్ని విశాఖపట్నం అరలించేటప్పుడి ఆయన తన భూమిలో మూడవ వంతు దానం చేసి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఆయన విశాఖపట్నం లోని ప్రముఖ వైద్యశాల అయిన కింగ్ జార్జి హాస్పటల్ కు కూడా భూమిని మరియు ధనాన్ని యిచ్చి నిర్మాణానికి సహాయపడ్డారు. తాడిపూడి జలాలను [[విశాఖపట్నం]] తరలించాలనే ఆలోచన ఆయనదే. ఆయనతో సన్నిహిత సంబంధాలున్న వాల్‌చంద్ హరచంద్ మరియు వారి మధ్య గల స్నేహం మూలంగా విశాఖపట్నంలో హిందూస్థాన్ షిప్‌యార్డ్ నెలకొల్పబడినది.
 
ఆయన ప్రారంభించిన "ఎ.వి.భానోజీరావు & గరుడ పట్టాభిరామయ్య" షిప్పింగ్ ఏజెన్సీ యిప్పటికీ కూడా [[అంకితం (ఇంటిపేరు)|అంకితం]] కుటుంబాలచే నడుపబడుతున్నది.
 
==రాజకీయ రంగం==
ఆయన తండ్రి మరణించిన తదుపరి క్రియాశీల రాజకీయాలలోనికి ప్రవేశించారు. ఆయన జస్టిస్ పార్టీలో చేరి పనగల్ రాజావారితో కలసి పనిచేసారు. ఆయన 1955-1972 మధ్య [[తూర్పు విశాఖపట్నం శాసనసభ నియోజకవర్గం]] నుండి శాసనసభ్యునిగా ఎన్నికైనారు.<ref>{{cite book|title=ఆంధ్ర శాసనసభ్యులు 1955|publisher=యన్.సత్యనారాయణరావు, గుంటూరు|page=8|url=https://te.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:Aandhrashaasanasabhyulu.pdf/32|accessdate=9 June 2016}}</ref> 1930-1938, 1951-1958, 1960-1962 లలో ఆయన విశాఖపట్నం మ్యునిసిపల్ చైర్మన్ గా వ్యవహరించారు. ఆయన ఎన్నో ప్రజోపయోగమైన పనులు చేసారు.<ref name="A.V. Jagga Row"/>