బొబ్బిలి యుద్ధం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Nrgullapalli (చర్చ | రచనలు) |
కొన్ని సవరణలు |
||
పంక్తి 1:
[[File:Thandra Paparayudu of Bobbili.jpg|thumb|Thandra Paparayudu of Bobbili]]
'''బొబ్బిలి యుద్ధం''' [[ఆంధ్ర ప్రదేశ్
[[బొబ్బిలి]] కోట [[విశాఖపట్నం|విశాఖపట్నానికి]] ఈశాన్యంగా 140 మైళ్ళ దూరంలో ఉంది; బొబ్బిలి జమీందారు రాజా గోపాలకృష్ణ రంగారావుకు, [[విజయనగరం|విజయనగర]] సంస్థానం ప్రభువు పూసపాటి పెద విజయరామరాజుకూ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఉంది. రెండు రాజ్యాల సరిహద్దుల వద్ద ఉన్న వాగుల్లోని నీటిని బొబ్బిలి ప్రజలు బలవంతంగా తిసుకు వెళ్ళేవారు. తన బలం చాలనందున విజయరామరాజు ఈ దోపిడీని ఎదుర్కొనలేకపోయేవాడు. ఫ్రెంచి కమాండర్ ఇన్ ఛీఫ్ బుస్సీ వద్ద తనకున్న పలుకుబడిని ఉపయోగించుకుని, ఈ పొరుగు రాజును ఇక్కడి నుండి తరిమికొట్టాలని పెద విజయరామరాజు భావించాడు.
భారత దేశ చరిత్రలో మున్నెన్నడూ ఎరగని సంఘటనను ఆవిష్కరించిన యుద్ధం ఇది. అనేక జానపద గాథలకు ప్రాణం పోసిన బీభత్స కాండ ఈ యుద్ధంలో జరిగింది.
== బొబ్బిలికి విజయనగరానికీ మధ్య జరిగిన ఘర్షణలు ==
బొబ్బిలికీ విజయనగరానికీ మధ్య అనేక ఘర్షణలు, యుద్ధాలూ జరిగాయి. ఎక్కువగా బొబ్బిలి విజయం సాధిస్తూ ఉండేది. వాటిలో ప్రధానమైనవి ఇవి:
# పెద విజయరామరాజు, నారాయణపట్నాన్ని ఆక్రమించేందుకు సాగి నారాయణరాజు నేతృత్వంలో సైన్యాన్ని పంపించాడు. ఆ సైన్యం బొబ్బిలి పరగణా గుండా పోతున్నపుడు, బొబ్బిలి సైన్యం అడ్డగించి, ఓడించి వెనక్కు పంపింది.
# రాజు తన కింద ఉన్న పాలెగాళ్ళను కూడగట్టి పెద్ద సైన్యంతో బొబ్బిలిపై దాడి చేసాడు. మళ్ళీ బొబ్బిలి సైన్యం చేతిలో ఓడిపోయాడు. బొబ్బిలి సైన్యం రాజును వెంటాడగా, అతడు పారిపోయి కమిలీ కోటలో తలదాచుకున్నాడు.
# రాజు
# విజయరామరాజు మళ్ళీ తన సైన్యాన్ని కూడగట్టి బొబ్బిలిపై దాడి తలపెట్టాడు. ఈ సారి అతడు దేశస్తులను కూడగట్టాడు. దేశస్తులంటే ఐరోపా వారితో యుద్ధాల్లో పాల్గొన్న దేశీయులు. కానీ బొబ్బిలిని ఓడించడం సాధ్యం కానిపని వారు రాజును హెచ్చరించారు. తన దీవాను బుర్రా బుచ్చన్న సలహా మేరకు సైన్యాన్ని తానుకాక, పూసపాటి రామచంద్రరాజు సారథ్యంలో దాడి పంపించాడు. బొబ్బిలి సైన్యం వారిని ఓడించి, రామచంద్రరాజు తలను నరికి, దానికి తిరునామాలు పెట్టి, విజయనగరానికి పంపారు.<ref>[https://archive.org/stream/revisedenlargeda00rang#page/60/mode/2up బొబ్బిలి జమీందారీ గురించిన విపులమైన విశేషాలు]</ref>
ఎన్ని ప్రయత్నాలు చేసినా, బొబ్బిలిని గెలవలేకపోయాడు, విజయరామరాజు.
Line 15 ⟶ 17:
=== బుస్సీ వద్ద రాజకీయం ===
[[హైదరాబాదు]] [[నిజాం]] [[సలాబత్ జంగ్]] బుస్సీని ఉద్యోగం నుండి తొలగించిన వార్త తెలిసిన తరువాత
విజయరామరాజు తాను బుస్సీకి కట్టాల్సిన కప్పం పది లక్షలూ కట్టేసాడు, అంతేకాక, మూడు లక్షల లంచం హైదర్ జంగుకు ఇచ్చి, బుస్సీకి బొబ్బిలిపై మనసు విరిచేందుకు సహకరించమని చెప్పాడు. హైదర్ జంగు అందుకంగీకరించాడు.
=== ఫ్రెంచి సిపాయీల వధ ===
Line 23 ⟶ 25:
=== ఇబ్రహీమ్ ఖాన్ ఉదంతం ===
ఇబ్రహీం ఖాన్ శ్రీకాకుళంలో ఫ్రెంచి వారి తరపున ఫౌజుదారు. బుస్సీకి నిజాముతో సంబంధాలు దెబ్బతిన్న సమయంలో అతడు బుస్సీపై తిరుగుబాటు చేసాడు. రాజమండ్రి కోటలో సైనికులను రెచ్చగొట్టి, తిరుగుబాటు చేయించాడు. ఫ్రెంచి వారు వసూలు చేసిన శిస్తులు వెనక్కి ఇచ్చేయాలని అతడు డిమాండు చేసాడు. బుస్సీ రాజమండ్రి చేరుకోగానే అతడు భయపడి పారిపోయి, బొబ్బిలి రాజుల వద్ద శరణు కోరాడు.
ఈ సంఘటనలన్నీ బుస్సీకి బొబ్బిలిపై ఉన్న కోపాన్ని పెంచి, వారిపట్ల అతడికి ఉన్న శత్రు భావనను మరింతగా పెంచి, అతణ్ణి, యుద్ధం దిశగా నడిపించాయి.
== యుద్ధాన్ని నివారించేందుకు బొబ్బిలి చేసిన ప్రయత్నాలు ==
హైదర్ జంగుకు, రాజుకూ మధ్య జరిగిన లంచం ఒప్పందం తన వేగుల ద్వారా రంగారావుకు తెలిసింది. హైదర్ జంగుకు విషయం తెలియజెప్పేందుకు రంగారావు తన రాయబారి పంతెన బుచ్చన్నను పంపించాడు. జంగు మన మాట వినకపోతే, మచిలీపట్నం వెళ్ళి అక్కడి ఫ్రెంచి అధికారి ఎం. కమాండరును కలిసి విషయం చెప్పమని అన్నాడు. కమాండరు మన గురించి, మన ఆత్మాభిమానం గురించి తెలిసిన వాడు. అతడు మనకు సాయం చేస్తాడు అని బుచ్చన్నకు చెప్పి ఇద్దరి పేరిటా ఉత్తరాలిచ్చి పంపించాడు.
బుచ్చన్న పెద్దాపురం చేరుకుని హైదరు జంగును కలిసాడు. అతడు బుచ్చన్న చెప్పే విషయాన్ని వినలేదు. నువ్వు ఇక్కడికెందుకు వచ్చావ్? మీ ప్రభువు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదని, మాతో స్నేహం చెయ్యాల్సిన అవసరం లేదనీ అనుకున్నాడు గదా. నువ్వు నీ ప్రభువు దగ్గరికే పో అని చెప్పాడు. మా దొర వచ్చే సరికే మా శత్రువు విజయరామరాజు బుస్సీ వద్దకు రావడంతో ఆయన రాలేదని, విజయరామరాజుకు
బుచ్చన్న అట్నుంచటే నేరుగా మచిలీపట్నం వెళ్ళి కమాండరును కలిసి, ఉత్తరం ఇచ్చి, జరిగింది చెప్పాడు. కమాండరు బుస్సీకి తాను ఉత్తరం రాసి, తన అనుచరుణ్ణి బుచ్చన్నకు తోడిచ్చి పెద్దాపురం పంపాడు. బొబ్బిలి ప్రజలు మంచివాళ్ళని, విజయరామరాజు చెప్పుడు మాటలు వినవద్దని ఆ ఉత్తరంలో రాసాడు. బుస్సీ ఆ ఉత్తరాన్ని చదివి సానుకూలంగానే మాట్లాడాడుగానీ, అతని చర్యల్లో ఆ సానుకూలత కనిపించలేదు.
ఆ సాయంత్రం, విజయరామరాజు హైదర్ జంగును కలిసి, ''చూసారా నేను చెప్పిందే నిజమైంది, రంగారావు మిమ్మల్ని కలవడానికి రాకుండా, కమాండరు ద్వారా బుస్సీకి ఉత్తరం పంపించాడు, అతడికి మీరంటే లెక్కే లేదు'' అని అతణ్ణి రెచ్చగొట్టాడు. బుస్సీ [[కశింకోట]] నుండి బయలుదేరి,
బుస్సీ అక్కడి నుండి ససైన్యంగా బొబ్బిలి వెళ్ళి కోట ఎదురుగా శిబిరం
# సర్కారు వారి పసుపుపచ్చ జెండాను విజాయరామరాజు 40 వేల సైన్యం ముందు ఉంచండి. మేం మా నాలుగు వేల సైన్యంతో దాన్ని లాక్కోగలిగితే మమ్మల్ని అతడి జమీందారీకి ప్రభువులను చెయ్యండి. లాక్కోలేకపోతే, మమ్మల్ని, మా జమీందారీని మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి.
# మీ రాగద్వేషాలు మీ కందుతున్న ధనంపై ఆధారపడి ఉన్నట్లైతే, విజయరామారాజు మీకిచ్చిన దానికి రెండింతలు ధనమిస్తాం. అతడి రాజ్యాన్ని మాకిప్పించండి.
|