కాశీయాత్ర చరిత్ర: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (6), కలవు. → ఉన్నాయి. using AWB
పంక్తి 7:
{{main|ఏనుగుల వీరాస్వామయ్య}}
శ్రీ ఏనుగుల వీరాస్వామి అనే మహాపురుషుడు మద్రాసు నుండి కాశీకి రెండుసార్లు కాలి మార్గంలో ప్రయాణం చేశాడు. ఆ వివరాలు ఏనుగుల వీరాస్వామి కాశీయాత్ర చరిత్ర అనే గ్రంథంగా తర్వాతి కాలంలో అంటే 1838 లో కోమలేశ్వరపురం శ్రీనివాసపిళ్లై అనే విద్వాంసుడు అచ్చు వేయించాడు. శ్రీ వీరాస్వామి [[మద్రాసు]] సుప్రీం కోర్టు శాఖలో ఇంటర్‌ప్రిటర్‌గా పనిచేసినట్లు తెలుస్తోంది. ఆయనకు ధర్మబుద్ధి, పలుకుబడి ఎక్కువే. సకుటుంబ సపరివారంగా డేరాలతో సహా ఆయన చేసిన ప్రయాణాలలో మనకు అద్భుతం కల్గించే అంశాలు ఎన్నో ఉన్నాయి.
1941 లో [[దిగవల్లి వేంకట శివరావు]] ఈ గ్రంథాన్ని సంస్కరించి ఎన్నో క్లిష్టతరమైన ఆలనాటి [[తెలుగు]]-[[ఉరుదూ]]-[[తమిళం]] కలిసియున్న మాటలకు అర్ధములతో సరళమైన తెలుగు భాషలో వెలువరించి 3 వ సంకలనము ప్రచురించారు. వీరస్వామి వ్రాసింది తెలుగు భాషలోనే. ఐతే అది రెండు వందల సంవత్సరాల నాటి జనవ్యవహార భాష కావటంతో మూడవసంకలనములో చేసిన సంస్కరణలుకు భాషా శాస్త్రపరంగా కూడా ఎంతో ప్రాధాన్యం లభించి, గిడుగు రామమూర్తి పంతులుగారి మన్ననలకు పాత్రమయింది. వెళ్ళేటప్పుడు మద్రాసు, హైదరాబాద్‌, నాగపూర్‌, [[అలహాబాదు]]ల మీదుగా వీరాస్వామిగారు [[కాశీ]] చేరారు. వచ్చేటప్పుడు [[గయ]], [[ఛత్రపురం]], [[భువనేశ్వర్‌]], [[విశాఖపట్నం]], [[ఒంగోలు]], [[కావలి]], [[నెల్లూరు]] మీదుగా సాగరతీరం వెంట మద్రాసు చేరారు. మొదటి రెండు సంకలనములలో క్లితరమైన భాషాశైలే కాక పేరాలుగానీ, విశేషములవారి విభజనలుగానీ లేవు. 1941 మూడవ సంకలనము నకు సంపాదకులు దిగవల్లి వేంకటశివరావుగారు ఆ పుస్తకముయొక్క గ్రంధకర్త అయిన ఏనుగుల వీరస్వామయ్య గారి జీవిత చరిత్రపై దీర్ఘ పరిశోధన జరిపారు, మొదటి రెండు సంకలనములలోగల క్లిష్టమైన భాషా శైలి ని మచ్చుచూపించుటకు కొన్ని కొన్ని నమునాల ముఖపత్రములను తన సంకలనములో చేర్చారు. ఆ కాలమునాటి మాటల అర్ధములకొరకు అనేక చారిత్రక గ్రంధములలోనుండి సేకరించి మూడవ సంకలనము లో విశేషములవారీగా పేరాగ్రాఫ్ విభజనలుచేసి వివిరణలిచ్చారు. గ్రంధకర్త(ఏనుగుల వీరస్వామయ్యగారి)జీవితవిశేషములు, రాజకీయ సాంఘిక పరిస్తితులను గూర్చి వివరణ, 39 పుటల అకారాది సూచిక, అనేక చిత్రపఠములు కలవుఉన్నాయి. 3వ సంకలన మొదటిముద్రణ లో యాత్ర మార్గసూచికాపఠము(route map) లేదు. 1991 సంవత్సరము రెండవముద్రణలో అప్పటికి 94 సంవత్సరముల వయస్సు గల సంపాదకులు దిగవల్లి వేంట శివరావుగారు వీరస్వామయ్యగారు ప్రయాణించిన మార్గసూచికాపఠమును (route map)ను 1991లో ఏషియన్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ క్రొత్త ఢిల్లీ వారు చేసినరెండవముద్రణ లో జతచేయించారు. ఈ అమూల్య పుస్తకమును అనేక సాహిత్యకారులు, విద్వాంసులు సమీక్షించి బహుముఖముగా ప్రశంసించారు
 
==కాశీయాత్ర చరిత్ర రచన ప్రాముఖ్యత==
క్షేత్ర మహాత్మ్య కధలు, తీర్ధశార్ధ విధులు మతధర్మ చర్చలు, దేశచరిత్రాంశములు మొదలగునవి. గ్రంధకర్త([[ఏనుగుల వీరస్వామయ్య]]గారి)జీవితవిశేషములు, రాజకీయ సాంఘిక పరిస్తితులను గూర్చి వివరణ,
 
==యాత్రా క్రమం, విశేషాలు==
పంక్తి 25:
 
==రచయిత వాడిన పదాలు==
 
 
==ముద్రణలు==
Line 39 ⟶ 38:
* "పాత కెరటాలు- [[ఏనుగుల వీరస్వామయ్య]] గారి [[కాశీ యాత్ర చరిత్ర]]" [[మాలతీ చందూర్]](1981) స్వాతి మే 1981
"గుర్తింపుకు నోచుకోని బహుముఖ ప్రజ్ఞాశాలి దిగవల్లి శివరావు" [[కంచి వాసుదేవరావు]], వ్యక్తులు వ్యక్తిత్వాలు 121, శ్రీవాణి అక్టోబరు 2001
 
 
{{వికీసోర్స్|కాశీయాత్ర చరిత్ర}}
Line 45 ⟶ 43:
==బయటి లింకులు==
*[http://ia331330.us.archive.org/3/items/kasiyatracharitr020670mbp/kasiyatracharitr020670mbp.pdf కాశీయాత్రచరిత్ర పూర్తి పుస్తకం పీడిఎఫ్]
 
{{ఆధునిక యుగం}}
 
[[వర్గం:తెలుగు పుస్తకాలు]]
[[వర్గం:1941 పుస్తకాలు]]
[[వర్గం:ఏనుగుల వీరాస్వామయ్య]]
 
{{ఆధునిక యుగం}}
"https://te.wikipedia.org/wiki/కాశీయాత్ర_చరిత్ర" నుండి వెలికితీశారు