'''ఛాందోగ్యోపనిషత్తు''' సామవేదానికి చెందినది. [[ఉపనిషత్తు]]లన్నిటిలోకి ప్రాచీనమైనదని కొందరి అభిపాయం. నాలుగు మహా వాక్యాలలో ఒకటైన "తత్వమసి" ఈ [[ఉపనిషత్తు]]లోనిదే. ఎనిమిది అధ్యాయాలకు విస్తరించిన ఈ [[ఉపనిషత్తు]]లో [[దేవకి|దేవకీ]] పుత్రుడైన [[శ్రీకృష్ణుడు|శ్రీకృష్ణుని]] గురించి, [[విచిత్రవీర్యుడు|వైచిత్రవీర్యుడైన]] [[ధృతరాష్ట్రుడు|ధృతరాష్ట్రుని]] గురించి ప్రస్తావించబడింది.
ఇందు 8అధ్యాయములు కలవుఉన్నాయి. మొదటి రెండవాధ్యాయములలోను సామమును గురుంచి చెప్పబడియున్నది. ఓంకారోత్పత్తిని గురుంచియు, బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థాశ్రమ ధర్మముల గురుంచియు చెప్పబడియున్నది. యతి విధులనుగూర్చియు జెప్పబడియున్నది.మూడవ అధ్యాయముయందు అచ్యుతుడగు బ్రహ్మ మానవుని హృదయమందు నివసించునని చెప్పబడియున్నది. బ్రహ్మ సాక్షాత్కారమునకు జీవాత్మ పరమాత్మల ఐకత్యమునకు జ్ఞానమే కారణము అని చెప్పబడినది. నాల్గవ అధ్యాయమునందు ప్రాణవాయువు మొదలైన వాటి గురుంచియు ఆత్మబ్రహ్మను చేరు విధములగూర్చియు చెప్పబడియున్నది. ఈ ఉపనిషత్తునందే "బ్రహ్మ సత్యం జగన్మిధ్య" అని తొలుత ఘోషించడము జరిగినది. సత్తునుండి పంచ భూతములు జన్మించెనవి. జీవాత్మ ఈపంచ భూతములలో బ్రవేశించినది. ఆసత్తే సత్యమైనది. జీవాత్మ త్రివిధావస్థలలో నుండును, అనగ జాగ్రత్, స్వప్నా, సుషుప్తావస్థలలో నుండును.