ఆవుల గోపాల కృష్ణమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ప్రధమ → ప్రథమ, → (3), లో → లో (2), కు → కు , గా → గా using AWB
పంక్తి 35:
| weight =
}}
[[ఎ.జి.కె.]] గా ప్రసిద్ధిచెందిన [[హేతువాది]] '''ఆవుల గోపాలకృష్ణమూర్తి'''. వీరు [[ఏప్రిల్ 29]], [[1917]] న జన్మించారు. [[సూత పురాణం]] లోని పద్యాలన్నీ కంఠతా పట్టాడు. [[ఆవుల సాంబశివరావు]] పై ఈయన ప్రభావం ఉంది. [[రాడికల్ హ్యూమనిస్టు ]], [[సమీక్ష]] పత్రికలు నడిపారు. 1952 తెనాలి లోతెనాలిలో ఈయన జరిపిన హ్యూమనిస్టు సభకు [[ఎం.ఎన్.రాయ్]] ప్రారంభోపన్యాసాన్ని పంపారు. 1964లో అమెరికా ప్రభుత్వం ఈయన్ని ఆహ్వానించింది. [[వివేకానంద]] పై ఈయన చేసిన విమర్శల ధృష్ట్యా ఈయన్ని అమెరికా వెళ్ళనివ్వరాదని [[ఆంధ్రప్రభ]] ఆందోళన చేసింది.
 
==జీవిత విశేషాలు==
గుంటూరు జిల్లా తెనాలి తాలూకా [[మూల్పూరు]] గ్రామంలో సామాన్య మధ్యతరగతి రైతు కుటుంబంలో కనిష్టుడుగా [[ఏప్రియల్ 29]]-[[1917]]లో జననం. ఉన్నత పాఠశాలా విద్యాభ్యాసం తురుమెళ్ళలో. ఆనాడే విద్యార్థులలో వేరుగా మసిలాడు. ప్రైవేటుగా తెలుగు చదువుకున్నాడు. అప్పుడే 'కృష్ణశతకం' వ్రాసాడని వినికిడి. కళాశాల విద్యాభ్యాసానికి గుంటూరు ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో చేరినప్పటినుండి ప్రతిభావ్యుత్పత్తులు విప్పార నారంభించినవి. స్వగ్రామంలో జి.బి.యస్. సరస్వతీ స్వాములవారితో తాత్త్విక చర్చ ఫలితంగా కలానికి పదునెక్కింది. గుంటూరు కళాశాలా జీవితంలో భవిష్యత్తుకు పునాదు లెర్పడ్డాయి. ఇంగర్ సాల్, త్రిపురనేని రామస్వామి రచనలు ఛాందస భావాల్ని ఛేదించటానికి వుపకరించగా, ఆ ప్రోత్సాహం మున్ముందుకు నడిపించింది. పట్టణ విద్యార్థి సంఘానికి అధ్యక్షుడుగా ఎన్నుకోబడటం అందులో భాగమే. అప్పుడే కర్ణాకర్ణిగా ఎం.ఎన్.రాయ్ ని గురించి విని, తెలుసుకోవాలనే జిజ్ఞాసలోవుండగా, ఒకానొక కమ్యూనిస్టు రాయ్ ని దూషిస్తుంటే, సాచి చెంపపెట్టు పెట్టిన ఉద్రేకి గొపాలకృష్ణమూర్తి. ఆప్తమిత్రుడు ఎలవర్తి రోసయ్య చాదస్తాన్ని వదలించ దీక్షబూని, త్రిపురనేని రామస్వామి పద్యాలు వినిపించి, విప్లవబీజాలు నాటి ఒకనాటి రాత్రి పిలక కత్తిరించిన చిలిపి గోపాల కృష్ణమూర్తి. యధార్థ సాహిత్య సమితి స్థాపించి గ్రాంధిక వాదానికి మద్దత్తుగా రచనలు సాగించాడు. ఆ తర్వాత ఎం.ఎన్.రాయ్ తో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపి, 'ఇండిపెండెంట్ ఇండియా' దినపత్రిక తెప్పించి, గుంటూరులో అమ్మిన ఘట్టాలు కేవలం తలపులుగా నిలిచిపోయినయ్. లక్నోలో ఎం.ఏ., ఎల్.ఎల్.బి., చదువుతుండగా రాయ్, బోస్ ప్రభృతులతో పరిచయమైంది. ఆవుల దృష్టిలో బోస్ 'సోషల్ ఫాసిస్టు' కాగా, రాయ్ తాత్త్విక విప్లవమూర్తిగా సన్నిహితత్వం వల్ల గ్రహించగలిగాడు. నేషనల్ హెరాల్డ్ లో వ్యాసాలు వ్రాయటంతో పత్రికా రచనలోకి దిగాడు. అప్పటి గోపాలకృష్ణమూర్తి తేడాగల రాయిస్టు. చివరివరకూ అలాగే వున్నాడు. తేడా గల రాయిస్టుగా వుండగలగటమే ఆయన వ్యక్తిత్వ విశిష్టత.
 
==కెరీర్==
పంక్తి 48:
 
వ్యాసాలు-ఉపన్యాసాలు, పౌరోహిత్యం, ప్రెస్ క్లబ్, బాలకళామందిర్, లయన్స్ క్లబ్, పంతుళ్ళ సమావేశాలు; సన్మానాలు కవులకు, కళాకారులకు; స్టడీకాంపులు, రాడికల్ హ్యూమనిస్ట్ లకు; అన్నిటా 'గాత్రం' పాడి, 'వైశేషికత్వాన్ని' నిలబెట్టుకున్నాడు. అనేక యుద్దముల ఆరితేరిన జ్ఞానవృద్ధుడయ్యాడు. అఖిల భారత సమావేశాల్లో, అమెరికా, ఐరోపాలలో విశిష్టుడుగానే చలామణి అయ్యాడు. ఇంట్లో పిల్లలమధ్య హాయిగా కాలక్షేపం చేసాడు. వాళ్లు పూజలు, పునస్కారాలు చేస్తుంటే - మతస్వేచ్ఛ అర్థం చేసుకుని ఆచరణలో పెట్టిన వ్యక్తిగనుక - నిరోధించనూలేదు, ప్రోత్సహించనూ లేదు. తన భావాలు చెప్పేవాడు.
 
సాహిత్యంలో ఔచిత్యం వుండాలనేది ఆవుల గోపాలకృష్ణమూర్తి గట్టి అభిప్రాయం. ఆ దృష్టితోనే విశ్వనాధ సత్యనారాయణ మొదలు ప్రాచీన కవుల వరకూ తన విమర్శకు గురిచేశాడు. కవులు, రచయితలలో ఆవుల అంటే విపరీతాభిమానం గలవారు, తీవ్రంగా భయపడేవారు. రెండు వర్గాలుగా వుండేవారు. భయపడిన వారిలో విశ్వనాథ సత్యనారాయణ ప్రధముడుప్రథముడు. ఆవుల వుంటే ఆ సభసభకు కు [[విశ్వనాథ]] వచ్చేవాడు కాదు. వేయి పడగలు మొదలు రామాయణ కల్పవృక్షం వరకూ వుతికేసిన ఆవుల అంటే భయపడడం సహజం.
 
1941 ప్రాంతాలలో ఎజికె గాంధీజీ పై తీవ్ర విమర్శలతో కూడిన వ్యాసం ప్రచురిస్తే, [[ఎం.ఎన్. రాయ్]] పక్షాన ఆంధ్రలో రాడికల్ డెమోక్రటిక్ పార్టీ నాయకుడుగా వున్న అబ్బూరి రామకృష్ణరావు అదిరిపడ్డాడు. ఎం.ఎన్. రాయ్ కు ఫిర్యాదు చేశాడు. కాని రాయ్ వ్యాసంలో విషయం తెలిసి ఎజికెని సమర్ధించాడు.
పంక్తి 61:
ఎ.జి.కె. పెళ్ళి ఉపన్యాసాలంటే అదొక సాహిత్య వ్యాసం అనవచ్చు. ప్రతి చోట ప్రత్యేక పాయింట్లు చెప్పేవారు. ఎజికె చేత ఎందరో రచయితలు కవులు పీఠికలు రాయించుకున్నారు.
 
వీరు [[సెప్టెంబరు 6]], [[1966]] లో చనిపోయారు.
 
వీరు [[సెప్టెంబరు 6]], [[1966]] లో చనిపోయారు.
 
==మూలాలు==
Line 68 ⟶ 67:
* http://agk-rationalist.blogspot.in/search/label/AGK
==ఇతర లింకులు==
 
[[వర్గం:1917 జననాలు]]
[[వర్గం:1966 మరణాలు]]