మంగళగిరి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 68:
లక్ష్మీనరసింహస్వామి గుడిమీద (కొండ కింది గుడి)గల రాతి చెక్కడాలకు చారిత్రక ప్రాధాన్యత ఉంది. [[1558]]లో [[సదాశివ రాయలు]] విజయనగర రాజ్యాన్ని పాలించేటపుడు, అప్పటి కొండవీటి సామంతుడు తిమ్మరాజయ్యచే ఈ చెక్కడం లిఖించబడింది. అప్పట్లో రాజ్యంలోని వారసుల్లో తిరుమల రాజు ఒకడు. అతడు తిమ్మరాజయ్యకు మేనమామ. ఈ 143 పంక్తుల చెక్కడంలో తిమ్మరాజయ్య ఇచ్చిన దానాల వివరాలు ఉన్నాయి. అందుకే దీనిని ధర్మ శాసనం అని అంటారు.
 
చెక్కడాలపై నున్న వివరాలు ఇలా ఉన్నాయి: పన్నులు తొలగించబడ్డాయి. విజయనగర సామంత రాజైన తిరుమలరాజు 28 గ్రామాలలోని 200 కుంచాల భూమిని (10 కుంచలుకుంచాలు = 1 ఎకరం) గుడికి దానమిచ్చాడు. [[నంబూరు]], [[తాళ్ళూరు]], [[నల్లపాడు]], [[మేడికొండూరు]], [[వీరంభొట్ల పాలెం]] (రాంభొట్ల వారి పాలెం?), [[తాడికొండ]], [[పెదకొండూరు]], [[గొడవర్తి]], [[దుగ్గిరాల]], [[ఉప్పలపాడు]], [[వడ్లమాను]], [[కుంచెన పల్లి]], [[కొలనుకొండ]], [[ఆత్మకూరు]], [[లాం]], [[గోరంట్ల]], [[గోళ్ళమూడిపాడు]], [[నిడమర్రు]], [[కురగల్లు]], [[ఐనవోలు]], [[శాఖమూరు]] గ్రామాల్లో భూమిని దానం చేసాడు. వాణిజ్య మండలి ముఖ్యుడైన పాపిశెట్టిని మంగళగిరికి అధికారిగా నియమించారు. ఈ చెక్కడంపై ముగ్గురు రాజ వంశీకుల ప్రస్తావన ఉన్నది. వారు: సదాశివ రాయలు, తిరుమల రాజు, తిమ్మరాజు. వారు జరిపిన ఉత్సవాలు, గుడికి చేసిన అభివృద్ధి గురించి కూడా ప్రసక్తి ఉన్నది. గుడి కొరకు 5 విధాల విగ్రహాలను, 10 రకాల ఉత్సవ రథాలను తయారు చేయించారు, కోనేటిని తవ్వించారు, పూల తోటలను పెంచారు.
 
==వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు==
"https://te.wikipedia.org/wiki/మంగళగిరి" నుండి వెలికితీశారు