ఏ.పి.జె. అబ్దుల్ కలామ్: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (8), , → ,, లో → లో (11), కు → కు (2), గా → గా (2), తో → తో using AWB
పంక్తి 29:
ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ అని ప్రముఖంగా పిలవబడే డాక్టర్ '''అవుల్ పకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలామ్''' ([[అక్టోబర్ 15]], [[1931]] - [[జులై 27]], [[2015]] ), భారత దేశపు ప్రముఖ క్షిపిణి శాస్త్రవేత్త మరియు 11 వ[[రాష్ట్రపతి|భారత రాష్ట్రపతి]].
 
[[తమిళనాడు]] లోని [[రామేశ్వరం]] లో పుట్టి పెరిగారు. [[తిరుచిరాపల్లి]] లోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో భౌతిక శాస్త్రం అభ్యసించారు. [[చెన్నై]] లోని మద్రాస్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పట్టాపొందారు.
 
భారత రాష్ట్రపతి పదవికి ముందు, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) మరియు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) తో ఒక ఏరోస్పేస్ ఇంజనీర్ పనిచేశారు. భారతదేశం యొక్క '''మిస్సైల్ మాన్''' పిలవబడే కలాం ముఖ్యంగా బాలిస్టిక్ క్షిపణి మరియు వాహన ప్రయోగ టెక్నాలజీ అభివృద్ధికి కృషిచేశారు. 1998లో భారతదేశ పోఖ్రాన్-II అణు పరీక్షలలో కీలకమైన, సంస్థాగత, సాంకేతిక మరియు రాజకీయ పాత్ర పోషించారు. 2002 అద్యక్షఎన్నికలలో [[భారతీయ జనతా పార్టీ]] ద్వారా అభ్యర్ధిగా ప్రతిపాదించబడగా , ప్రతిపక్ష కాంగ్రేస్ మద్దతు తెలిపింది. ఎన్నికలలో వామపక్షాలు బలపరిచిన లక్ష్మీ సెహగల్ పై గెలిచారు. కలాం తన పుస్తకం '''ఇండియా 2020''' లో 2020 నాటికి భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి అభివృద్ధి ప్రణాళికలు సూచించారు. భారతదేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారమైన [[భారత రత్న]] సహా అనేక ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు.
 
==బాల్యం మరియు విద్యాభ్యాసం==
అవుల్ పకీర్ జైనులబ్దీన్ కలాం, రామేష్వరమ్, [[తమిళనాడు]] రాష్ట్రంలో ఒక తమిళ ముస్లిం కుటుంబంలో [[1931]], [[అక్టోబరు 15]] న జన్మించాడు. తండ్రి జైనులబ్దీన్, పడవ యజమాని మరియు తల్లి ఆషియమ్మ, గృహిణి. పేద కుటుంబ౦ కావటంతో కుటుంబ అవసరాలకు చిన్న వయసులోనే పని ప్రారంభించాడు. పాఠశాల విద్య పూర్తి చేసిన తర్వాత, తన తండ్రికి ఆర్థికంగా ఏ.పి.ఙే.అబ్దుల్ కలామ్ తోడ్పడటానికి న్యూస్ పేపర్ పంపిణీ చేశాడు.
 
పాఠశాలలో సగటు మార్కులు వచ్చినప్పటికీ నేర్చుకోవటానికి తపన పడేవాడు మరియు ఎక్కువ సమయం కష్టపడేవాడు. [[రామనాథపురం]] స్క్వార్జ్ మెట్రిక్యులేషన్ స్కూల్ లో తన పాఠశాల విద్య పూర్తి చేశాక, కలాం సెయింట్ జోసెఫ్స్ కళాశాల, [[తిరుచిరాపల్లి]] చేరి, 1954 క్రీ.శ లోశలో భౌతికశాస్త్రం నందు పట్టా పొందారు. అప్పట్లో ఈ కళాశాల మద్రాస్ విశ్వవిద్యాలయం అనుబంధ సంస్థగా ఉండేది. ఈ కోర్సుపై అతనికి కోర్సు పూర్తి అయ్యేవరకు మక్కువ కలగలేదు. నాలుగు సంవత్సరాలు ఈ కోర్సు చదివినందుకు తరువాత చింతించారు. 1955లో మద్రాసులో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేరారు. కలాం సీనియర్ తరగతి ప్రాజెక్ట్ పనిచేస్తుండగా, పురోగతి లేకపోవడంతో డీన్ అసంతృప్తి చెంది ప్రాజెక్ట్ తదుపరి మూడు రోజుల్లో పూర్తి చేయకపోతే తన [[స్కాలర్షిప్]] రద్దుచేస్తాను అని బెదిరించాడు. ఇచ్చిన గడువులో కష్టపడి పని పూర్తిచేసి డీన్ ను ఆకట్టుకున్నాడు. తరువాత డీన్ "కలాం నీకు తక్కువ గడువు ఇచ్చి ఎక్కువ ఒత్తిడి కలిగించాను" ఆన్నారు. ఎనిమిది స్థానాల కొరకు జరిగిన ప్రవేశ పరీక్షలో తొమ్మిదో స్థానం పొంది యుద్ధ పైలట్ కావాలనే తన కలను తృటిలో కోల్పోయాడు.
 
==శాస్త్రవేత్తగా==
మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT - [[చెన్నై]]) నుండి పట్టా పొందిన తరువాత 1960 లో, కలాం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) యొక్క ఏరోనాటికల్ డెవెలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ శాస్త్రవేత్తగా చేరారు. కలాం భారత సైన్యం కోసం ఒక చిన్న హెలికాప్టర్ చెయ్యటం ద్వారా తన వృత్తిని ప్రారంభించాడు, కానీ DRDO లో ఉద్యోగం చేయడంతొ ఆయన సంతృప్తి చెందలేదు. 1969 లో, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థలో (ఇస్రో) చేరి, ఇస్రో యొక్క మొట్టమొదటి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ వాహనం (SLV-III) ప్రయోగానికి డైరెక్టర్ గా పనిచెసి జూలై 1980 లో ఈ వాహనం రోహిణి ఉపగ్రహాన్ని భూమి దగ్గర కక్ష్య లోకక్ష్యలో విజయవంతంగా చేర్చినది. [ఇస్రో]లో పనిచేయడం తన జీవితంలో అతిపెద్ద విజయాల్లో ఒకటిగా పేర్కొన్నారు.1970 మరియు 1990 మధ్య కాలంలో, కలాం పోలార్ SLV మరియు SLV-III ప్రాజెక్టుల అభివృద్ధికి పనిచేశారు. రెండు ప్రాజెక్ట్లు విజయవంతం అయినాయి. 1970 లలో స్థానికంగా తయారైన SLV రాకెట్ ఉపయోగించి రోహిణి-1 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపడం ఇస్రో చరిత్రలో మైలురాయి.
జూలై 1992 నుండి డిసెంబర్ 1999 మధ్య ప్రధాన మంత్రి శాస్త్రీయ సలహాదారుగా మరియు [[డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్]] ముఖ్యకార్యదర్శి గాముఖ్యకార్యదర్శిగా వ్యవహరించారు. ఇదే సమయంలో జరిపిన పోఖ్రాన్లో-II అణు పరీక్షలలో కలాం రాజకీయ మరియు సాంకేతిక పాత్ర నిర్వహించారు.very good
 
==పురస్కారాలు==
{| class="wikitable"
|-
! సంవత్సరం !! పురస్కారం !! అందచేసినవారు
|-
| 2014
పంక్తి 118:
==ఇతరాలు==
* "ఉదయం నాలుగు గంటలకు నిద్ర లేచేవాడ్ని. మా అమ్మ ఉదయాన్నే నన్ను నిద్ర లేపేది. అప్పుడు స్నానం చేసి లెక్కల ట్యూషన్‌కి వెళ్లేవాడ్ని. స్నానం చేసి రాకపోతే మా మాస్టర్ పాఠాలు చెప్పేవారు కాదు. నేను ట్యూషన్ పూర్తి చేసుకొచ్చేసరికి మా నాన్న నన్ను నమాజ్ తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉండేవారు. ఆ కార్యక్రమం పూర్తి అయ్యాక రైల్వేస్టేషన్‌కి వెళ్లేవాడ్ని. మద్రాసు నుంచి వచ్చే దినపత్రికల పార్సిల్‌ని తీసుకొని వాటిని పంపిణీ చేసేవాడ్ని. ఈ విధంగా పని చేస్తూనే చదువుకున్నా. మాది ఉమ్మడి కుటుంబం. సభ్యులు ఎక్కువ మంది ఉండేవారు. 'మా అమ్మ మాత్రం నాకు మిగితా వారికన్నా ఎక్కువ తిండి పెట్టేది. ఇంట్లో నేను చివరివాడ్ని. దానికి తోడు చదువుకుంటూ.. పని చేయడం వల్ల మా అమ్మ నాపై చాలా శ్రద్ధ చూపేది. మా ఇంట్లో ఆనందం.. విషాదం రెండూ ఉండేవి'
* '''ముగ్గురమ్మల కథ-ఆ ముగ్గురు అమ్మలు నాకెంతో ఇష్టం''' తనకు ముగ్గురు అమ్మలంటే చాలా ఇష్టమని.. వారందరిని తాను కలవగలిగానని కలాం చెప్పారు. ఆ ముగ్గురు అమ్మలు ఎవరంటే.. 'ఒకరు మా సొంత అమ్మ. మరొకరు భారత సంగీతానికి అమ్మ.. ఎంఎస్ సుబ్బలక్ష్మి. మరొకరు ప్రపంచానికి అమ్మ అయిన మదర్ థెరిస్సా' అని చెప్పారు. 1950లో తిరుచ్చిలో తాను చదువుకుంటున్నప్పుడు విన్న 'ఎందరో మహానుభావులు.. అందరికీ వందనాలు' అన్న పాట తనను పరవశంలో ముంచెత్తిందని.. అప్పటి నుంచి ఆమె సంగీతాన్ని ఎంతగానో అభిమానించానన్నారు. 'ఆమె భారతరత్న అవార్డు తీసుకునే సమయంలో నా తల నిమిరింది. ఆ ఘటనను నేనెప్పటికీ మరవలేను' అని ఉద్వేగంతో చెప్పారు. దేశం కాని దేశంలో పుట్టి.. మన దేశానికి నలభైఏళ్ల పాటు అమూల్య సేవల్ని అందించిన మదర్ థెరిస్సా తాను అభిమానించే మూడో అమ్మగా కలాం చెప్పారు. (ఈనాడు 3.8.2008)
* ప్రస్తుత [[తమిళనాడు]] రాష్ట్రంలోని [[ధనుష్కోడి]]లో ఒక [[మధ్యతరగతి]] [[ముస్లింలు|ముస్లిం]] కుటుంబంలో పుట్టిన ఆయన [[1958]] లో మద్రాస్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి [[ఏరోనాటికల్ ఇంజినీరింగు]] లో పట్టా పుచ్చుకున్నారు. పట్టభద్రుడైన తర్వాత ఆయన భారత దేశపు [[రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ]] డి.ఆర్.డి.ఒ. లో ఒక విఫలమైన [[హోవర్ క్రాఫ్ట్]] (hovercraft) ప్రాజెక్టు మీద పనిచేయడానికి చేరారు. [[1962]] లో ఆయన (భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ) [[ఇస్రో]] కు మారారు. అక్కడ ఆయన ఇతర శాస్త్ర వేత్తలతో కలసి అనేక కృత్రిమ [[ఉపగ్రహం|ఉపగ్రహాలను]] విజయవంతంగా ప్రయోగించారు. [[రోహిణి (ఉపగ్రహం)|రోహిణి]] ఉపగ్రహాన్ని జూలై [[1980]] లో విజయవంతంగా భూమి సమీప కక్ష్యలోకి వదిలిన భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ [[ఉపగ్రహ ప్రయోగ వాహనం]] ([[SLV-III]]) ని అభివృద్ధి చేయడంలో ప్రాజెక్టు డైరెక్టరుగా ఆయన కృషి ఎంతో ఉంది. [[1982]] లో, ఆయన DRDO కు డైరెక్టరు గాడైరెక్టరుగా తిరిగి వచ్చి, [[గైడెడ్ మిస్సైల్]] (guided missile)ల మీద దృష్టి కేంద్రీకరించారు. [[అగ్ని క్షిపణి]] మరియు [[పృధ్వి క్షిపణి]] మిస్సైళ్ళ అభివృద్ధి, ప్రయోగాలకు ఆయనే సూత్రధారి. దీంతో ఆయనకు భారత దేశపు "మిస్సైల్ మాన్" అని పేరు వచ్చింది. జూలై [[1992]] లో ఆయన భారత దేశపు [[రక్షణ మంత్రి]]కి సాంకేతిక సలహాదారు అయ్యారు. [[భారత్|భారత ప్రభుత్వానికి]] ప్రధాన సాంకేతిక సలహాదారుగా ఆయనకు [[క్యాబినెట్ మంత్రి]] హోదా వచ్చింది. ఆయన కృషి ఫలితంగానే [[1998]] లో [[పోఖ్రాన్-II]] [[అణుపరీక్షలు]] విజయవంతంగా జరిగాయి. ఈ అణు పరీక్షలు భారతదేశాన్ని [[అణ్వస్త్ర రాజ్యం|అణ్వస్త్ర రాజ్యాల]] సరసన చేర్చాయి.
* భారత దేశపు మూడు అత్యున్నత పౌర పురస్కారాలైన [[పద్మ భూషణ్]] ([[1981]] లో); [[పద్మ విభూషణ్]]([[1990]] లో); మరియు [[భారత రత్న]] ([[1997]] లో) లతో బాటు నలభై విశ్వవిద్యాలయాలనుంచి గౌరవ డాక్టరేట్లు, పొందిన వ్యక్తి డా. కలామ్. [[జూలై 18]], [[2002]] న కలామ్ బ్రహ్మాండమైన ఆధిక్యతతో(90% పైగా ఓట్లతో) భారత [[రాష్ట్రపతి]]గా ఎన్నికై, [[జూలై 25]]న పదవీ స్వీకారం చేశారు. ఆయన్ను ఆ పదవికి తమ అభ్యర్థిగా నిలబెట్టింది అప్పటి అధికార పక్షమైన [[నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్]] (NDA) కాగా ప్రధాన ప్రతిపక్షమైన [[కాంగ్రెసు పార్టీ]] తన మద్దతు తెలిపింది. ఆ పోటీలో ఆయన ఏకైక ప్రత్యర్థి [[వామపక్షవాదులు]] తమ అభ్యర్థిగా నిలబెట్టిన 87-ఏళ్ళ [[లక్ష్మీ సెహగల్]], [[రెండవ ప్రపంచ యుద్ధం]]లో [[బ్రిటిష్ ప్రభుత్వం|బ్రిటిష్ ప్రభుత్వానికి]] వ్యతిరేకంగా పోరాడిన [[ఇండియన్ నేషనల్ ఆర్మీ]] (INA)లో [[సుభాష్ చంద్రబోస్]] నాయకత్వం క్రింద మహిళా విభాగానికి నేతృత్వం వహించిన వీర వనితగా ప్రసిద్ధురాలు.
* కలామ్ శాకాహారి. మధ్యపాన వ్యతిరేకి. [[బ్రహ్మచారి]] . ఖచ్చితమైన వ్యక్తిగత క్రమశిక్షణను పాటిస్తారు. "ప్రజలు తమ భార్యాపిల్లలకు తమ పిల్లల పిల్లలకూ ఆస్తులు సంపాదించి పెట్టటం కోసమే అవినీతిపరులౌతారు" అంటూ ఆయన పెళ్ళి చేసుకోలేదు. ఇస్లాం ప్రకారమైతే ప్రతి ముస్లిమూ పెళ్ళి చేసుకోవాలి. [[ఖురాన్]] తో బాటు, [[భగవద్గీత]] ను కూడా చదువుతారు. మతఘర్షణలను నిరసించే శాంతికాముకుడు. [[మానవతావాది]] . వారు [[తిరుక్కురళ్]] లో చెప్పిన మార్గాన్ని అనుసరిస్తారు. ఆయన చేసే ప్రతి ప్రసంగంలోనూ కనీసం ఒక్క "[[పాశురం]] " నైనా ప్రస్తావిస్తారు.
* కలామ్ రాజకీయంగా భారత దేశం అంతర్జాతీయ సంబంధాలలో మరింత దృఢమైన నిర్ణయాలు తీసుకుని నిర్ణయాత్మక పాత్ర పోషించాలని కోరుతున్నారు. తాను సుదీర్ఘ కాలం కృషి చేసి అభివృద్ధి చేసిన అణ్వాయుధ కార్యక్రమం, కాబోయే ప్రపంచ ప్రబల శక్తిగా భారతదేశ స్థానాన్ని సుస్థిరం చేసే సాధనాల్లో ఒకటిగా ఆయన భావిస్తున్నారు. ఆయన భారత దేశపు యువతను వెన్ను తట్టి ప్రోత్సహించే ఉద్దేశ్యంతో పాఠకుల్ని ఉత్తేజితుల్ని చేసే తన ఆత్మ కథ ''[[వింగ్స్ ఆఫ్ ఫైర్]]'' లాంటి పుస్తకాలు అనేకం వ్రాశారు. [[2020]] సంవత్సరానికల్లా భారత దేశాన్ని ఒక వైజ్ఞానిక ప్రబల శక్తిగా, ఆర్థికంగా [[అభివృద్ధి చెందిన దేశం]]గా మార్చడానికి ఒక కార్యాచరణ ప్రణాళికను ఆయన చాలా బలంగా ముందుకు తెస్తున్నారు. శాస్త్ర సాంకేతిక రంగాలలో ఆయన చాలా చురుకైన పాత్ర పోషిస్తున్నారు. [[బయో ఇంప్లాంట్స్]] (bio-implants) వాడడం ద్వారా తెలివిని పెంచడానికి ఒక పరిశోధనా కార్యక్రమాన్ని ఆయన ప్రతిపాదించారు. ఆయన ప్రొప్రైటరీ సాఫ్టు వేర్ కంటే [[ఓపెన్ సోర్సు]] [[సాఫ్టు వేర్]] నే సమర్థిస్తారు. ఓపెన్ సోర్సు సాఫ్టు వేర్ ను పెద్ద ఎత్తున వాడడం ద్వారానే [[సమాచార విప్లవం]] ఫలాలు ఎక్కువ మందికి అందుతాయని ఆయన విశ్వాసం.
 
పంక్తి 139:
 
==మరణం==
రాష్ట్రపతిగా కూడా సేవలందించిన మహనీయుడు ఏపీజే అబ్దుల్‌ కలాం [[జూలై 27]], [[2015]] సోమవారం సాయంత్రం హఠాన్మరణానికి గురయ్యారు. షిల్లాంగ్‌లోని ఏఐఎంలో సోమవారం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రొఫెసర్‌ అబ్దుల్‌ కలాం.. హఠాత్తుగా ప్రసంగం మధ్యలో కుప్పకూలిపోయారు. గుండెపోటుతో కుప్పకూలిన అబ్దుల్‌ కలాంను స్థానిక బెథాని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఐసీయూలో ఉంచి చికిత్స అందించే ప్రయత్నం చేశారు. ఆయన గుండెపోటుతో చేరినట్లు, పరిస్థితి విషమంగానే ఉన్నట్లు డాక్టర్లు ప్రకటించారు. ఆ తర్వాత 45 నిమిషాల వ్యవధిలోనే కలాం కన్నుమూశారు. ఆయన వయస్సు 84 సంవత్సరాలు.భారత కీర్తి పతాక అబ్దుల్‌ కలాం అస్తమయం.
 
== మూలాలు ==
పంక్తి 160:
{{భారత రాష్ట్రపతులు}}
{{భారతరత్న గ్రహీతలు}}
 
నీవు ఎవరు అని నిలదీస్తే ఎమని చెప్పెదవు?
కోకిల కంఠం కావురుమన్నది.
 
[[వర్గం:1931 జననాలు|అబ్దుల్ కలామ్]]
Line 170 ⟶ 173:
[[వర్గం:ప్రపంచ ప్రసిద్ధులు]]
[[వర్గం:2015 మరణాలు]]
[[వర్గం:గుండెపోటు మరణాలు]] నీవు ఎవరు అని నిలదీస్తే ఎమని చెప్పెదవు?
కోకిల కంఠం కావురుమన్నది.