ఒగ్గు కథ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చిదిద్దుబాటు సారాంశం లేదు |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ప్రథాన → ప్రధాన (2), → (18), , → , (24), లో → లో (4), గా → గా (2), తో → using AWB |
||
పంక్తి 1:
{{వ్యాఖ్య|తెలంగాణ జానపదం -ఒగ్గు కథ. ఒగ్గు అంటే శివుని చేతిలోని ఢమరుకం అని అర్ధం. ఈ పదం కేవలం తెలంగాణ ప్రాంతంలోనే వినిపిస్తుంది. ఇది అచ్చమైన దేశీపదం. ఈ పదానికి తెలుగు నిఘంటువుల్లో సరైన అర్థం ఇవ్వకపోవటం శోచనీయం. ఒగ్గు అనే పదానికి ‘జెగ్గు’,‘జగ్గు’ అని నామాంతరాలున్నాయి. శివుని చేతిలోని ప్రత్యేక వాయిద్యం ఢమరుకం. మన ప్రాచీన లాక్షణికులు, వైయాకరణులు ఢమరుకం నుంచి మహేశ్వర సూత్రాలు (అక్షరాలు) ఉద్భవించాయని చెప్పారు. అలా మొత్తం అక్షరాల పుట్టుకకి కారణమైన ఢమరుకాన్ని ఒక కళారూపానికి పేరుగా పెట్టి దానికి పూజార్హతని కల్పించిన కళారూపం ఒగ్గు కథాగానం మాత్రమే|}}
'''ఒగ్గు కథ'''
ప్రేక్షకుడిని విరామం లేకుండా కట్టి పడేసే కళ '''ఒగ్గు కథ'''. [[బోనం]] ఎత్తుకొని, [[వేప]] మండలు పట్టుకుని ఊగుతూ, తూలుతూ ఎల్లమ్మ [[కథ]] చెప్తుంటే జనం ఊగిపోతారు. బోనం నెత్తిమీద పెట్టుకొని, ఎంతో సేపు దాన్ని కదలనివ్వ కుండా కింద వేసిన నాణాల్ని నొసటితో అందుకునే దృశ్యం అద్భుతం. జానపద కళారూపాళ్లో 'ఒగ్గు కథ' ప్రముఖమైంది. ఇది కేవలం కథ మాత్రమే కాదు. గానం, నృత్యం, నాటక మిశ్రమం - గొల్ల, కురుమలు తమ కుల పురుషుడు బీరప్ప కథ చెప్పేందుకు ఎంచుకున్న రూపమే ఒగ్గు కథ. ఈ కథా ప్రక్రియకు, చదువు అవసరం లేదు. డోలు, తాళం, కంజీర వాయిద్యాలతో, తెలంగాణ భాషలో గంటల కొద్ది ఎన్నయినా కథలు చెబుతారు. పాటలు జోడించి కథను పండిస్తారు. పురాణాల మీద పట్టుతో ఆశువుగా కథ అలా చెప్పేస్తారు. నెత్తిన బోనం ఉంచుకుని కథ చెబుతూనే నేలను తలతో ముద్దాడతారు.
పంక్తి 6:
''కురబ '' జాతివారు శివున్ని, బసవన్నని పూజిస్తారు. కురుమలకు ప్రత్యేక పూజారులు, కుల వాయిద్యకారులు ఉన్నారు. తెలంగాణలో ఒగ్గువాళ్లు, బీరప్పలు, రాయలసీమలొ [[గొరవయ్యలు]] అని వీరిని పిలుస్తారు. వైవిద్యం కలిగిన ఒగ్గుకథ గాన, కళారూపం ఒక్క తెలంగాణాలోనే కనిపించడం విశేషం. కురుమ కుల పురోహిత వర్గానికి చెందినవారు ఒగ్గుకథని చెప్పే వృత్తిని స్వీకరించారు. బీరన్నలకు ప్రత్యేకమైన వాయిద్యం [[ఒగ్గు]] ([[ఢమరుకం]]) ఉపయోగించి చెప్పే వృత్తి [[పురాణం]] గురించి తెల్సుకోవడం అంటే [[కురుమ జాతి]] చరిత్ర, సంస్కృతుల్ని గురించి తెలుసుకోవట మన్నమాట. [[ఒగ్గు దీక్ష]] ఒకటి ఈ కురుమల్లో కనిపిస్తోంది. ఒగ్గు కథలో తర్ఫీదు పొందాలంటే కులపెద్దల అనుమతితో శైవక్షేత్రాలలో ఏదో ఒక క్షేత్రానికి వెళ్తారు. ఆలయ లోగిళ్లలో పట్టాలువేసి విభూతి ధరించి, నామాలను జపించుకొంటూ మల్లన్న దేవుడినే ధ్యానిస్తారు. ఈ పూజ అయిపోగానే ఒగ్గువంతులు [[మంత్రం]] బోధించి ఆశీర్వదిస్తారు. ఎల్లమ్మ ప్రసాదించిన ఏడు గవ్వల హారం మెడలో వేసుకుని మల్లన్నకు ఒదుగుతూ ఒగ్గులవుతారు. ఈ ఒగ్గు దీక్ష తర్వాతే వారు [[బీరన్న, మల్లన్న కథలు]] చెప్పేందుకి అర్హత సంపాదించు కొన్నట్లు అవుతుంది. కురుమలు బీరప్ప దీక్ష తీసుకున్న వాళ్లు బీరప్పలవుతారు. ఈ సంప్రదాయం పూర్వం నుంచే వస్తోంది. కురుమల్లో పౌరోహిత్యం చేసేది ఈ ఒగ్గులే. కొంత మంది ఒగ్గులు దేవుని పెట్టెలో మల్లన్న దేవుని విగ్రహాలు పెట్టు కొని కావడి కట్టుకొని ఊరూరా తిరుగుతారు. వీరు నెత్తి విరబోసుకోని, నుదిటిని పసుపు రాసుకొని, కళ్లకి కాటుక రాసుకొని ఎర్రని పొట్టి చేతుల చొక్కా, మువ్వల లాగు ధరించి కాళ్లకి గజ్జెలు కట్టుకొని నృత్యం చేస్తూ శైవగీతాలు పాడతారు.
==పుట్టుక==
ఒగ్గు కళారూపం శైవమత వాప్తిలో ప్రచార మాద్యమంగా ఉద్భవించి ఉంటుంది. ఎందుకంటే పాల్కురికి సోమనాధుడు తెలంగాణ ప్రాంతంలో పుట్టి, శైవమత వ్యాప్తికి విశేషమైన కృషి చేసారు. అటువంటి గొప్పవ్యక్తి ప్రభావం ఈ ప్రాంతంలో కళలపై ఉందనడానికి నిదర్శనం ఒగ్గు కథ. ఈ కథల ఇతివృత్తాల్లో
ఒగ్గుకథల్ని తెలంగాణ ప్రాంతంలోని గొల్ల, కుర్మలు తమ కుల పురాణంగా భావిస్తారు. కుర్మలు ఈ కథల్ని ఎక్కువ ప్రచారం చేసారు. తరువాత కాలంలో ఇతర కులాల వాళ్ళు కూడా ఈ కళారూపాన్ని నేర్చుకొని ప్రచారం చేసారు. ఇటువంటి వారి సంఖ్య చాల తక్కువ. బీరప్ప, మల్లయ్య కథలు మెదటి నుంచి ఉన్నాయి.ఆ తరువాత ఇతర కథలు పుట్టుకొచ్చాయి.
పంక్తి 29:
ఒగ్గుకథలో తప్పకుండ ఉండేది ఒగ్గు. దీన్ని పలుసన్నివేషాల్లో తాళానికి అనుగుణంగా సంఘటనలకి అనుకూలంగా వాయిస్తూంటారు.ఒక్కోసారి ఈ వాయిద్యాన్ని ఆయా పాత్రలుగా ఊహింపజేస్తారు.ఉదాహరణకి చిన్నపిల్లాడిని లాలించే సందర్భం వచ్చినప్పుడు ఒగ్గుని ఆ చిన్నపిల్లాడిలా ఊహింపజేసి ప్రేక్షకులని ఆ సంఘటనలో లీనం చేస్తారు. కథానడకలో ఒగ్గు కొంచెం డోలుకన్న తక్కువ ప్రాధాన్యతని కలిగుంటుంది.జానెడు పొడవుతో మధ్యభాగం ఇత్తడి లేదా చెక్కతో ఉండి ఇరువైపులా మేక చర్మాన్నిబిగించి ఈ ఒగ్గుని తయారుచేసుకుంటారు.
===డోలు ===
అన్ని వాయిద్యాల్లోకెల్లా పెద్దది,ముఖ్యమైనది డోలు. డోలు మోతతోనే కథా ప్రారంభమవుతుంది. సుమారు ఒక మీటరు పొడవుండీ డ్రమ్ము ఆకారంలో ఇత్తడితో కాని చెక్కతో కాని నిర్మాణమై ఇరువైపులా మేక చర్మాన్ని అమర్చి తాళ్ళతో బిగిస్తారు.గంభీరమైన ధ్వని చేస్తూ ప్రతి సన్నివేషంలో తప్పక మోగే వాయిద్యం డోలు. గోల్ల కుర్మల పెండ్లిలో జరిగే మైలపోలు, ఎదురుకోలు,ఊరేగింపు సందర్భాల్లో డోలు తప్పకుండా ఉంటుంది.కథాగమనంలో కొన్ని సన్నివేషల్లో ఉద్రేకం కలిగించడానికి డోలుని మెళ్ళో వేసుకుని నృత్యం చేస్తారు,పళ్ళతో బిగించి పట్టుకుని తాండవం చేస్తారు,గ్రుండంగా ఆవేషంతో
===తాళాలు ===
అరచేతికి రెండింతలు పెద్దగా ఉండి ప్రతీరాగానికి లయని అందింస్తూ శ్రావ్యంగా మోగే వాయిద్యమే ఒగ్గులో ఉపయోగించే తాళాలు.వీటికి తోడుగా చిన్నతాళాలని కూడ ఉపయోగిస్తారు.మెండు తాళం
===నపీర ===
''నపీర ''
==కథా నడక ==
ఇతివృత్తం దగ్గర నుంచి కథనం వరకు ప్రత్యేకమైన శైలిలో నిర్మాణం పొందిన ప్రక్రియ ఒగ్గుకథ. జీవిత చరిత్రల్ని ఇతిహాసాలుగా మలిచే పద్ధతి ఒగ్గు కథని చూసి నేర్చుకోవచ్చు. గొల్ల కుర్మల కులదైవాలు దైవాంశ సంబూతులైనా మానవ మాత్రులుగా జీవించిన తీరు వారికి కుల వృత్తిపైన ఉండే అభిమానం కళ్లకు కట్టినట్టు చూపిస్తారు.ఈ కథలు విన్న ఏ మనిషైన ఈ కులాల్ని గౌరవభావంతో
కథని ఉపన్యాస ధోరణిలో లేక నాటక రూపంలోనో లేక సంగీత రూపకంలోనో లేదా పద్యాల రూపంలోనో చెప్పటం ఆయా కళారూపాల స్వభావం. ఇవన్ని విభాగాలను తనలో పలికించడం ఒగ్గుకథ ప్రత్యేకత. ఒక ప్రధాన కథకుడు ఒక సహాయకుడు ముగ్గురు వంతగాళ్ళు ఉంటే చాలు ఒగ్గు కథ అలవోకగా సాగిపోతుంది. ఒగ్గు కళాకారులకి ముఖ్యంగా నాలుగు విషయాలపైన పట్టుంటుంది. వీరు ప్రదర్శించే ఈ అంశాల్లోని నైపుణ్యమే ఒగ్గుకథని జానపదుల హృదయస్పందనల్లో ఎప్పటికీ మర్చిపోలేని రీతిలో నిలబెట్టింది.
==సంగీతం, ఉచ్చారణలో నైపుణ్యం==
‘పువ్వుకి పరిమళం, కళాకారుడికి కంఠం’ ఉండాలి. మంచి పరిమళం లేని పువ్వుకి విలువలేదు. మంచి గొంతులేని కళాకారునికి భవిష్యత్తులేదు. ఒగ్గుకథా నిర్వహణలో శబ్దం పాత్ర కీలకమైంది. సంభాషణలు, ధన్యనుకరణలు, రాగాలు అన్నీ శబ్దంపైనే ఆదారపడి ప్రవర్తిల్లుతాయి. సంభాషణలు స్త్రీ, పురుష పాత్రలకి అనుగుణంగా మలుచుకుంటారు. కొన్ని స్త్రీ పాత్రలు ఏడ్చే సందర్భంలో కళాకారులు కూడా ఏడుస్తారు, శ్రోతల్నీ ఏడిపిస్తారు. కొన్ని కొన్ని చోట్ల ధ్వన్యాను కరణ చేస్తుంటారు. గొర్రెలాగా అరవటం, గొర్ల కాపర్లు చేసే విచిత్రమైన ధ్వనిని అనుకరిస్తూ శ్రోతల్ని నవ్విస్తూ ఉంటారు. ఇక దేశీసంగీత ఆలాపనలో ఒగ్గుకళాకారులు దిట్టలు . దాదాపు అన్ని జానపద సంగీత బాణీలు ఒగ్గుకథలో ఉన్నాయి. జోలపాటలు, సువ్వి పాటలు, మంగళహారతి పాటలు, బతుకమ్మ పాటలు, శృంగార పాటలు వంటివి ఒగ్గు కథల్లో వినిపిస్తుంటాయి. వీటితో పాటు కథని నడిపించడానికి ఆ...ఆ....
==ఆశు రచనా ==
ఒగ్గు కళాకారులు ఆశురచనా నైపుణ్యం కూడా కలిగి ఉంటారు.యతి,ప్రాసలు తప్పకుండా మాత్రాచందస్సులో కథాసందర్భానికి తగిన విధంగా పాటలు అల్లుతారు.మూలకథకి ఏమాత్రం భంగం కలగకుండా వీటిని జొప్పిస్తారు.అప్పుడప్పుడు హాస్యపు సంఘటనల్ని కూడా శ్రోతల్లో ఉత్సాహం కలిగించడం కోసం సృష్టిస్తుంటారు.
పంక్తి 44:
ఇది అన్నిటికన్నా ప్రధానమైనది. ఒగ్గు కళాకారుల్లో విస్తృతంగా ఉంటుంది. ప్రేక్షకుల మనసు తెలుసుకుని వారికి నచ్చే విధంగా కథని చెప్తారు. ఎక్కడ ప్రేక్షకుడు ఏడుస్తాడు, ఎక్కడ నవ్వుతాడు, ఎక్కడ భక్తి భావంతో ఉంటాడో తెలుసుకొని కథను నడిపిస్తాడు. కథచెబుతూ వెంటనే పాత్రదారునిగా మారటం అందులో పూర్తిగా లీనమై వెనువెంటనే కథకుడిగా మారటం సంయమనం ఉన్న కళాకారుడు తప్ప ఇతరులకి అసాధ్యం.ఒగ్గుకళాకారుడు ఇవన్నీ కలిగుంటాడు.
==ప్రార్థనాగీతం==
ప్రార్థనాగీతంలో మొదట గంగని తలవటం ప్రత్యేకమైన అంశం. దేశీయత ఉట్టిపడేటట్టుగా గంగ గొప్పతనాన్ని చెప్పడం, జనాల్ని మంత్ర ముగ్దుల్ని చేసేరాగాలాపన, విస్మయం కలిగించే ఆహార్యం, పొడుపు కథలు, జాతియాలు, సామెతలు, ఇతర అన్యదేశ్యాలు కథలో సహజంగా ప్రవర్తిల్లుతాయి. సీన్ కి తగిన స్టేజ్ ఉండకపోయినా, పాత్రకి తగిన వేషదారణ కనబడకపోయినా ప్రేక్షకులు తమ హృదయసభల్లో ఆ లోటుని భర్తీ చేసుకుంటారు. మిద్దెరాములు, చుక్కసత్తయ్య మొదలైన
==ఆహార్యం==
ఒగ్గుకథ నాటక ప్రక్రియ కాదు. అయిన నాటక సన్నివేషాలు అనేకం ఉన్నాయి. సంప్రదాయ వేషదారనే కాని పాత్రోచిత వేషదారణ ఉండదు. కూచిపూడి కళాకారులకి ఉండేంత అభినయ నైపుణ్యం ఒగ్గుకళాకారులకీ ఉంటుంది. కథకులు కథని చెబుతూ
==కత్తి సాములూ, కఱ్ఱ సాములూ....==
పూర్వం ఏ గ్రామంలో చూసినా వ్వాయామ శాలలకు సంబంధించిన తాలింఖాలు వుండేవి. ముఖ్యంగా వ్యవసాయ తరుణం అయిపోయిన తరువాత తీరుబడిగా వున్న సమయంలో గ్రామంలో వుండే యువకులందరూ పైన సూచించిన తాలింఖానాలలో చేరు కఱ్ఱ సాము, కత్తి సాము, గరిడీలను చేసే వారు. వారు ముఖ్యంగా ఆత్మ రక్షణ కోసం ఈ విద్యను నేర్చుకునే వారు.
==మారిని పరిస్థితులు==
పంక్తి 56:
ఈనాడు వీటికి ఏవిధమైన ఆదరణ లేక పోయి నప్పటికి ఈ ప్రదర్శనాలు ఒక ప్రక్రియగా, ఒక కళగా ప్రదర్శిస్తున్నారు. ఈ ప్రదర్శనాలు వెనుకటి రోజుల్లో కత్తి సాములో రక్షణ కొరకు కృపాణాలనూ, కవచాలనూ ధరించి సైనికుల్లాగాఏ పోరాటం జరిపే వారు. అయితే ఈ నాడు మామూలు వస్త్ర ధారణ తోనే ఈ విద్యను ప్రదర్శిస్తున్నారు.
ముఖ్యంగా కర్ర సాములో ఒక కర్ర తోనూ రెండు చేతులతో రెండు కర్రల తోనూ ఒకరి కొకరు పోటీ పడి, ఒకరు కొట్టిన దెబ్బను మరొకరు కాచు కుంటూ ప్రేక్షకులకు భయం కలిగే విధంగా ఉధృతంగా కర్ర సాము చేసేవారు. అదే విధంగా కత్తి, డాలును ధరించి కూడ అలాగే పోరాటం జరిపేవారు. ఈ పోరాటంలో ఎత్తుకు పై ఎత్తులు, దెబ్బ కొట్టడం, దెబ్బ కాచు కోవడం ఒకరి కొకరు తల పడి ఉధృతంగా పోరాటం జరిపే వారు. ఈ పోరాటంలో కొందరు డప్పు
==టాసా వాయిద్యం==
కర్ర సాము, కత్తి సాము జరిపేవారు అడుగులనూ, భంగిమలనూ చాల అట్ట హాసంగా చూపించే వారు. అడుగులకు అనుగుణంగా టాసా అనే వాయిద్యాన్నివాయించేవారు.
తొలి చెమట, మలి చెమట
==బీరప్ప కథ, చుక్కయ్య కథనం==
ముఖ్యంగా మేము చెప్పే కథలు వీర భద్రుని గూర్చి. దీనినే వీరప్ప కథ అని పిలుస్తాం అంటాడాయన. వారి కుల దైవం అయనే గనక అతని పేరు మీద వచ్చే పండగలకు బీరప్ప ఒగ్గు కథలను చెపుతారు. అలాగే మల్లన్న కథలను కూడా చెపుతారు. తెలంగాణా ప్రాంతంలో వీరప్ప దేవుడు, మల్లన్న దేవుడు గుళ్ళు వుంటాయి. ముఖ్యంగా ఒగ్గు కథలు
బీర్ఫప్ప పండుగ రోజున బీరప్ప యొక్క జీవిత చరిత్రను గురించి ఒగ్గు కథా రూపంలో చెపుతారు. ఒక్క కురుమలే కాక ఇతర కులాలకు చెందిన వారు కూడ ఈ కథను ఎంతో ఆప్యాయతతో చెప్పించుకుంటారు. అంటే ఆ కథ యొక్క విశిష్టత అంతటిది. ఆ కళా రూపం యొక్క గొప్పతనమది.
పంక్తి 79:
==స్త్రీ వేషం==
మైల పోలూ, తెల్ల పాలు తీసినపుడు నాగవల్లి, వీర బోనం సమయాల్లోనూ డోలు వాయిద్యాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ సన్ని వేశాల్లో ఎన్నో డోళ్ళ తోళ్ళ నుపయోగిస్తారు. ఉధృత యాయిద్యపు వరుసలతో పాటూ రకరకాల అడుగులు వేస్తూ గుండ్రంగా తిరుగుతూ నృత్యం చేస్తూ వాయించడమే కాక డోలుకు కటిన తాళ్ళను పళ్ళతో కరిచి పట్టి నృత్యం చేస్తూ వాయిస్తారు. కూర్చొని డోలును వీపునకు ఆనించి చేతులను వెనకకు త్రిప్పి, డోలును వాయిస్తూ నియాసాలు చేస్తారు. ఈ డోళ్ళు ధిళ్ళెం, భళ్ళెం..... ధిళ్ళెం.... భళ్ళెం అని ధ్వని నిస్తాయి. ఈ విన్యాసాలకు తోడు కళాకారుల నైపుణ్యానికి తగినట్లు మరి కొన్నీంటిని జోడించి డోలు నృత్యంగా తయారు చేశారు. ఇలాంటి ఒగ్గు డోలు నృత్య బృందాలు, బండి పెద్దాపురం, జట్టు, మల్లెల బీరప్ప జట్టు, సుక్కా సత్తెయ్య జట్టు మరియు బర్మ బీరయ్య జట్టు మొదలైనవి ప్రఖ్యాతి వహించాయి. ఇలా ఒగ్గు కథా బృందాలు దినదిన ప్రవర్దమానం అవుతున్నాయి.
పంక్తి 87:
==నేటి ఒగ్గు కథకులు==
ఈనాడు తెలంగాణాలో ఒగ్గుకథ చెప్పే బృందాలు వరంగల్లు, నల్లగొండ, హైదరాబాదు జిల్లాలో వున్న ఏభై బృందాలలో నాలుగు దళాలు మాత్రమే బహుశ ప్రచారంలో వున్నాయి. వాటిలో ప్రధాన కథకులు నేర రామస్వామి డెబ్బై సంవత్సరాలు, చీమల కొండూరు, భువనగిరి తాలూకా, నల్లగొండ జిల్లా.
[[మిద్దె రాములు]] గౌడ కులస్తుడై నప్పటికీ ఒగ్గుకథ పట్టుపట్టి మరీ నేర్చుకుని అందులో ప్రసిద్ధుడయ్యాడు.<ref>http://www.ourtelangana.com/node/1733</ref>
==ప్రపంచ జానపద కళల దినోత్సవం , World Village Arts Day==
ప్రపంచ జానపద కళల దినోత్సవం -- ప్రతిసంవత్సరము ఆగస్టు 22 న జరుపుకొంటారు .
[[తెలంగాణ]]
మన ప్రాచీన సాంస్కకళలు : కళలు 64 రకాలుగా విభజించారు.వీటిలో ప్రధానమైనవి సంగీతం,నాట్యం,నాటకం, కవిత్వం.
1. ఇతిహాసము 2. ఆగమము 3. కావ్యం 4.అలంకారం 5.నాటకం 6.గాయకత్వం 7.కవిత్వం 8. కామశాస్త్రం 9. దురోదరం జ్ఞానం 10.దేశభాషలిపి 11.లిపికర్మం 12.వాచకం 13.అవధానం
జానపద కళలు : భారత గ్రామీణ
ఉరుము నృత్యము,
Line 109 ⟶ 107:
గొరవయ్యలు,
జ్యోతినృత్యం,
తెలుగునాట చోది చెప్పడం
తెలుగునాట జానపద ఉడుపు పాటలు
తోలుబొమ్మలాట,
పగటి వేషాలు,
Line 120 ⟶ 118:
డప్పు,
తప్పెట గుళ్ళు,
జముక గిరిజ నృత్యము
లంబాడీ,
బోనాలు,
Line 158 ⟶ 156:
వీరభద్ర విన్యాసం,
శ్రీ కాళీమాత నృత్యం,
కోయ నృత్యము .
బుడబుక్కల పాట
గంగిరెద్దులు వారు
బుట్ట పాములు ఆటవారు
చెంచు వారి పాటలు
జంగాల వారి పిట్టకథలు
మానవుడి మనోవికాసానికి, వినోదానికి, మంచి నడవడికి జానపద కళారూపాలు ఆలంబనగా నిలిచాయి. సినిమాలు, టి.వి.లు లేని ఆ రోజుల్లో ఈ వృత్తి కళాకారుల ప్రదర్శనలకు ప్రజలు బ్రహ్మరథం పట్టేవారు. అలిసిపోయిన పల్లె ప్రజలకు వీరి ప్రదర్శనలు సేదతీర్చేవి.
Line 172 ⟶ 168:
కాలాన్నిబట్టి కళలు
గంగిరెద్దులు వాళ్లు సంక్రాంతి వచ్చిందంటే గ్రామాల్లో ఎద్దులను ఇంటింటికి తిప్పుతూ, పాటలతో సారాంశాన్ని చెబుతూ భిక్షాటన చేసేవారు. హరికథా దాసులు కూడా అంతే. సగం రాత్రి వాళ్లు కూడా వేకువ జామున గ్రామాల్లో తిరుగుతూ భిక్షాటన చేసేవారు.
Line 182 ⟶ 177:
ఇదే కోవలో చిందు భాగవతం [[తెలంగాణ]]లో ఎంతో ప్రాధాన్యత సంతరిం చుకుంది. చిందు ఎల్లమ్మవంటి వారు ప్రపంచ వేదికలపై తమ కళను ప్రదర్శించారు. దేశీయ కవి అంబాల మల్లగౌడ్ తెలంగాణ ప్రాంతం నుండి జానపద కళలను వెలికి తీయడానికి ఎంతో ప్రయత్నించి డోలు విన్యాసం, డప్పుల నృత్యం, భాగవతం, కోలాటం వంటి కళలను ప్రపంచ కళావేదికలపై పరిచయం చేశారు. అదే విధంగా ఎన్నో భాగవత రచనలు చేసి ఇక్కడి దేశీయ సంస్కృతిని ప్రతిబింబిచారు. శ్రమైక జీవనం నుంచి ఆవిష్కరించిన ఈ కళలు అనేక రూపాలుగా విలసిల్లి వర్థిల్లాయి. సంస్కృతి సత్సంప్రదాయా లను, ఆచార వ్యవహారాలను ప్రతిబింబిస్తూ దేశ విదేశాల్లో గుర్తింపు పొందాయి.
అదే సందర్భంలో ఈ సాంస్కృతిక కళలనే వృత్తిగా జీవనం చేసు కొని బతుకుతున్నవారు అనేకమంది. జానపద కళారూపాలను వారే
చిందు, యక్షగానం, గౌడ శెట్టిల [[గౌడపురాణం]], ఎనూటి వారి పటం కథ లు, మంద హెచ్చు కథలు, కొమ్ములవారి కథలు, పొడప్రొతుల కథలు, ఝం జ కథలు, విప్రవినోదులు, బైకాని కథలు, సాధనా శూరులు, పిచ్చకుం ట్లవారు, కాకి పడిగల పంట కత, గుర్రం పటం కథ, మాచయ్య పటం కథలు, గంచీ కూటిపటం కథలు, కొర్రొజులోటి కథలు, ఆడేంఎల్లయ్య కథ లు, పూజారి పటం కథలు, డోలి, పట్టి కథలు ప్రధానమైనవి. ఇవేకాకుండా వృత్తికళాకారులు ప్రదర్శించే కళారూపాలు- కొన్ని బైండ్ల కథలు, రాజన్నల వారు, హరిదాసులు, బుడబుడకలవారు, కాటిపాపలు, చెక్కబొమ్మలాట, గంగిరెద్దులాట, పగటివేషాలు, పాములాట, తోలుబొమ్మలాట, నాటకాలు, భాగవతం, వీధినాటకం, యక్షగానం, బుర్రకథ, చిరుతల రామాయణం, చెక్కభజన కర్రసాధన, డోళ్ళ విన్యాసం
వీటిని ప్రోత్సహిం చేది కూడా ప్రధానంగా గ్రామాల్లో రైతాంగం, చేతి వృత్తి దారులు, గిరిజనులు, హరిజనులే. నేడు వ్యవ సాయ సంక్షోభంవల్ల, ప్రపంచ పరిణామాల ప్రభా వం వల్ల చేతివృత్తులు దెబ్బతిన్నాయి. కరవు కాటకాలు మన జానపద రూపా లను క్షీణదశకు తీసుకువచ్చాయి. ప్రధానంగా గ్రామీణ ప్రజానీకంపై ఆధారపడ్డ సాంస్కృతిక వృత్తులు నేడు అంతరించి పోతున్నాయి.ఇప్పటి వరకు ప్రభుత్వం కూడా మన జానపద సాంస్కృతిక వృత్తులను కాపాడడంలో సవతి తల్లి ప్రేమనే చూపుతోంది.అయినా గ్రామాల్లో ఈ వృత్తి కళాకారులు కూలి, నాలి చేసుకుంటూ ప్రదర్శనలు ఇస్తూనే ఉన్నారు. ఊపిరి ఉన్నంతకాలం జానపద కళారూపాలను కాపాడుకుంటాం. ముందు తరాలకు మా వృత్తి కళలను అందిస్తాం అంటూ ఈ వృత్తి కళాకారులు ఇప్పటికీ ధీమాగా ఉన్నారు.
|