అరబిందో: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (4), ) → ) (2), లో → లో (3) using AWB
పంక్తి 30:
| education = అబెర్దీన్ విశ్వ విద్యాలయంలో వైద్య విద్య నభ్యసించాడు
| alma_mater =
| occupation = సుప్రసిద్ధ బెంగాలీ పండితుడు, </br />కవి,</br /> జాతీయ వాది, </br />యోగి, </br />మరియు గురువు.
| years_active =
| employer =
పంక్తి 62:
| partner = <!-- unmarried life partner; use ''Name (1950–present)'' -->
| children =
| parents = తల్లి స్వర్ణ లతా దేవి.</br /> తండ్రి కె.డి.ఘోష్.
| relatives =
| callsign =
పంక్తి 79:
| box_width =
}}
 
 
 
'''అరబిందో''' ([[ఆగస్టు 15]], [[1872]]–[[డిసెంబరు 5]], [[1950]]) సుప్రసిద్ధ బెంగాలీ పండితుడు, కవి, జాతీయ వాది, యోగి, మరియు గురువు.
==బాల్యము==
అరబిందో [[ఆగస్టు 15]], [[1872]] న [[కోల్‌కతా]] లో జన్మించాడు. ఈయన పూర్తి పేరు అరబిందో ఘోష్. అరవింద అనగా బెంగాలీలో పద్మము అని అర్థం. తల్లి స్వర్ణ లతా దేవి. తండ్రి కె.డి.ఘోష్. వైద్యుడు. ఈయన బ్రిటన్ లో ఉండి అబెర్దీన్ విశ్వ విద్యాలయంలో వైద్య విద్య నభ్యసించాడు. అరవిందుల మాతామహులు సుప్రసిద్ధ బ్రహ్మ సామాజికులయిన రాజనారాయణబోసు. వీరు సంస్కృతాంగ్ల భాషలలో మహావిద్వాంసులు. వీరు కుమార్తె శ్రీమతి స్వర్ణలతాదేవి అరవిందుల జనని. అరవిందుల జనకులు కృష్ణధనఘోష్. వీరు పూర్వులు బ్రహ్మ సమాజ విరోధులైనా వీరు మాత్రం బ్రహ్మసమాజంపట్ల అభిమానం చూపిస్తూ ఉండేవారట. కనుకనే వీరు బ్రహ్మసమాజ కన్యను వివాహం చేసుకున్నారు. ఈ వివాహానైకి మహర్షి దేవేంద్రనాధ్ ఠాకూర్ స్వయంగా పౌరోహిత్యం జరిపారట. వీరిద్దరికి 4 కుమారులు, ఒక కుమార్తె. వీరిలో మొదటి కుమారుని పేరు వినయభూషణుడు, రెండవవాడు మనోమోహనుడు, మూడవవాడు అరవిందులు, నాలగవ సరోజినిదేవి, చివరి వారు వారీంద్రుడు. ఈతడు వంగదేశంలో ప్రఖ్యాత విప్లవకారుడు. సరోజినీదేవి ఆజన్మ బ్రహ్మ చారిణి అయి ఆధ్యాత్మిక అన్వేషణా పరురాలుగా పేరుగాంచింది.
 
కృష్ణధనఘోషుకు ఆంగ్లవిద్యమీద అభిమానం ఎక్కువ. అందుచేత బాగా చిన్నతనం లోచిన్నతనంలో అరవిందుని డార్జిలింగు పంపించి అక్కడ సయింట్ పాల్ స్కూల్ లో చదివించారు. అయినా తృప్తి చెందక [[ఇంగ్లండు]] వెళ్ళినారు. అక్కడే వీరి చిన్న కుమారుడు వారేంద్రుడు జన్మించారు. కాని అక్కడ వీరు కుమార్తె సరోజినీదేవి ఉన్మాదవ్యాధితో బాధపడుతుండడం వల్ల అక్కడనుండి భారతదేశం తిరిగి వచ్చేరు. అరవిందులు 7 ఏండ్లు ఇంగ్లాండులో తరువాత 5 ఏండ్లు మాంచెశ్తరులో చదువుకున్నారు.ఈయన తన 18వ ఏటనే ఇ.పి.యస్ పరీక్షకు హాజరై గ్రీక్, లాటిన్ భాషలలో అత్యుత్తమ తరగతిలో ఉత్తీర్ణులయినారు.
 
కళాశాలాచార్య పదవి విడిచిన తరువాత అరవిందులు [[వందేమాతరం]] పత్రికాసంపాదకత్వం స్వీకరించారు. అంతకుపూర్వం వారపత్రికగా ప్రచురింపబడుతున్న ఈ ఆంగ్లపత్రిక అరవిందుల సంపాదకత్వంలో దినపత్రిక అయింది. ఈపత్రికమూలంగా జాతీయతత్వం వంగదేశాన్ని ఉర్రూతలూగించింది. క్రమంగా వీరి జాతీయ సందేశం భారతదేశం అంతటా అల్లుకోవడం మొదలుపెట్టింది. ఈసమయంలో ఆంగ్లప్రభుత్వం వీరిని రాజద్రోహ నేరంమీద శిక్షించాలని ప్రయత్నించింది. కాని నేరం ఋజువు కాకపోవడంవల్ల ప్రభుత్వం వీరిని ఏమీచెయ్యలేకపోయింది. అరవిందులీ సమయంలోనే 1907 డిసెంబరులో జరిగిన సూరత్కాంగ్రేస్ జాతీయపక్షనేతలుగా హాజరైనారు. అక్కడ మితవాదులకు జాతీయపక్ష నాయకులైన అరవింద ప్రభృత్యులకు మధ్య తీవ్ర విభేధాలు బయలుదేరాయి. జాతీయపక్షనేతలందరు అరవిందుల నాయకత్వంతో వేరుగా ఒక సమావేశం జరిపి దేశాభివృద్ధికరమైన మార్గం ఆదేశించారు. అటుతరువాత వీరిపై అల్లీపూరు బాంబుకేసు నడిచింది. అరవిందుల కనిష్ఠసోదరుడు వారీంద్రుడు విప్లవకారుడు కావడం వలన వీరిపై ప్రభుత్వం అపోహలు మోపారు. దీనిమూలంగా అరవిందులు జైలులో పలు కష్టాలు అనుభవించారు. ఈ ఆలీపూరు కేసులో [[చిత్తరంజను దాసు]] వీరికి న్యాయవాదిగా పనిచేసారు.
Line 92 ⟶ 90:
==జీవిత విషయాలు==
ఇంచుమించుగా 1893సం.వరకు ఈయన ఆంగ్లదేశంలోనె ఉండిపోయారు. అరవిందుల 20వఏట వీరి తండ్రిగారు మరణించడంతొ భారతదేశం తిరిగి వచ్చి బరోడా మహారజు పరిచయంతో అక్కడ మహారాజు గారికి ఆంతరంగిక కార్యదర్సిగా పని చేసారు. ఆపిమ్మట కొంతకకాలమే రెవెన్యూ శాఖలో పనిచేసి, చివరికి బరోడా ఆంగ్లకళాశాలలో ఉపాధ్యక్షులుగా కుదురుకున్నారు. ఈ ఉద్యోగం 13 సం. చేసారు. ఈ సమయంలోనే వీరు [[హిందీ]], [[సంస్కృతం]], [[గుజరాతీ]], [[బెంగాలీ]] మొదలయిన భాషలలో అఖండ పాండిత్యం సంపాదించారు.
అరవిందులు [[బరోడా]]లో ఉన్నప్పుడే వీరు మృణాలినీదేవిని వివాహమాడినారు. అప్పటికి వీరి వయస్సు 28 ఏండ్లు. గృహస్థాశ్రమంలో ఉన్న స్వల్పకాలంలోనూ వీరు, తమ సహధర్మ చారిణిని దేశభక్తురాలినిగా ఆధ్యాత్మిక చింతా పరాయణురాలినిగా తీర్చిదిద్దు కున్నారు.శ్రీ అరవిందులు మృణాలినీదేవి గారికి వ్రాసిన లేఖలను బట్టి అప్పటికే వారిలో తీవ్రంగా మొలకలెత్తుతున్న ఆదర్సాంకుర ప్రభావం గ్రహింపవచ్చును. బరోడాలో ఉన్నప్పుడు అరవిందులకు ఆధ్యాత్మిక జిజ్ఞాస మిక్కుటముగా ఉండేది. ఈసమయంలో వీరు నర్మదా నదీ తీరంలో ఉన్న బ్రహ్మానందస్వామి, సుప్రసిద్ధ విష్ణుభాస్కర స్వామి సాంగత్యం కలిగింది. ఆపిమ్మట వీరు రాజకీయాలలో ప్రవేశించినా, లోలోపల వీరి ఆధ్యాత్మిక తృష్ణ అణిగిపోలేదు.
 
వంగదేశ విభజన వల్ల, వండేమాతరం ఉద్యమం వల్ల ఆరోజుల్లో అప్పుడే మొదలయిన పాశ్చాత్యుల జాతీయ కళాశాలకు అరవిందులు ప్రధానోపాధ్యాయులుగా నెలకు 25 రూపాయలకు చేరారు. అయితే వీరు ఈకళాశాల ప్రభుత్వ సంబంధమ్లెని పరిపుర్ణమైన జాతీయ కళాశాలగా ఉండాలని అభిప్రాయ పడ్డారు దీనిని కళాశాల వ్యవస్థాపకులు వ్యతిరేకించడంతో ఈ ఉద్యోగంనుంచి అరవిందులు విరమించారు.
 
==రాజకీయాల్లోంచి ఆధ్యాత్మికత వైపుకు==
అరబిందో రాజకీయం నుంచి ఆధ్యాత్మికత వైపుకు క్రమక్రమంగా ప్రవేశించడం జరిగింది. మొదటగా వడోదరలో మహారాష్ట్ర యోగియైన విష్ణు భాస్కర్ లెలె ఉపదేశంతో ఆధ్యాత్మికత వైపుకు ఆకర్షితుడైనాడు. రెండవసారి కోల్‌కతాలోని [[ఆలీపూర్]] కేంద్ర కారాగారం లోకారాగారంలో శిక్ష అనుభవిస్తున్నపుడు ఆధ్యాత్మికత పట్ల గాఢమైన ఆసక్తి కలిగింది. ఇక్కడ ఆయన చేసిన [[భగవద్గీత]] పారాయణం, అనుసరణ ఆయనకు అనేక ఆధ్యాత్మిక అనుభూతుల్ని కలిగించాయి.
 
==తాత్విక మరియు ఆధ్యాత్మిక రచనలు==
[[పుదుచ్చేరి]]లో నాలుగేళ్ళు ఏకాగ్రతతో యోగాను పాటించి అనంతరం 1914 వ సంవత్సరంలో ఆర్య అనే అరవై నాలుగు పేజీల సమీక్షను మాసపత్రిక రూపంలో వెలువరించాడు. తర్వాత ఆరున్నరేళ్ళ పాటు ఆయన ఈ పత్రిక ద్వారానే తన ముఖ్యమైన ధారావాహికంగా రచనలను ప్రజలకు చేరవేసేవాడు.
 
అరవిందులు ఏకాంతంగా ఎక్కడో ఎవరికీ కనబడకుండా ముక్కు మూసుకొని కూర్చొని ప్రపంచంతో సంబంధంలేని యోగి అని సామాన్యదృష్టికి తోచవచ్చును. కాని కొంచెం నిశితంగా వీరి ఆధ్యాత్మిక దృక్పధము, దర్శన తత్వము పరిశీలిస్తే ఇది నిజం కాదని తేలిపోతుంది. ప్రస్తుత జీవితదుఃఖాలలో నుంచి తప్పించుకొని ప్రబ్రహ్మలో విలీనమైపోవడం వీరి ఆదర్శం కాదు. ఈ విషయంలో వీరికీ శంకరభగవత్పాదులచే ప్రవర్తితమైన అద్వైతానికీ చాలా భేదాలు కనిపిస్తునాయి.
 
అరవిందుల దర్శనంలో మాయా ప్రమేయమే లేదు. అద్వైతవాదంలో బ్రహ్మపై జగత్తు అధ్యాసితమై వివర్తంగా భాసిస్తుంది. అరవిందులు అద్వైతులు ప్రతిపాదించే నిర్గుణ పరబ్రహ్మ అధ్యాత్మికాన్వేషకుని సాధనలో ఒకమెట్టు మాత్రమే అనీ, దీనికి పైన అతిమానసిక భూమికలు క్రమక్రమంగా అనేకం ఉన్నాయని, అన్నింటికి పైన విజ్ఞాన భూమిక (Supra mental Plane) ఉన్నదనీ చెబుతున్నారు. ఆ భూమికల కన్నింటికీ దిగువ సకోఅనాలిసిస్ చెప్పే (Sub conscious) అవ్యక్త మనస్సు కూడా ఉన్నదని అంగీకరిస్తారు. ఈ రెండు భూమికలకు మధ్యన ఇంకా అనేకమైన భూమికలున్నవని ప్రతిపాదించి అరవిందులు ఆయన భూమికలను గురించి సవిస్తరంగా వ్యాఖ్యానించారు. అయితే ఈ భూమికలన్నిటిలోను దివ్య చైతన్యం అంతర్గతమై ఉన్నదని, క్రమంగా ఊర్ధ్వంగా అధిరోహించినకొలది ఈ చైతన్యం స్వయంప్రకాశమాన మవుతున్నదని అరవిందుల అభిప్రాయము.
 
అరవిందుల తాత్విక దృక్పధంలో గమనించవలసిన అతి ముఖ్యమైన విషయం ఉన్నది. ఇంతవరకు ప్రపంచంలో పదార్ధము (Matter) , ప్రాణశక్తి (Vital Force) , మనస్సులు (Mind) మాత్రమే ఆవర్భవించాయని వీటితో ఆధ్యాత్మిక పరిణామం నిలిచిపోలేదని క్రమంగా మనస్సుకు పైబడిన ఉన్నత భూమికలు కూడా పృధ్వి పై అవతరించగలవని ఇదే ఆధ్యాత్మిక పరిణామంలో అంతర్ధానమని అరవిందులు ప్రవచించారు.
 
అరవిందులు తమ సిద్ధాంతాలన్నీ '''దివ్యజీవనము''' (Life Divine) అనే తాత్విక గ్రంధంలో వివరించారు.వీరురచించిన గీతవ్యాసాలు (Essays on Gita) కూడా పలుప్రాచుర్యం పొందిన గ్రంధము. వీరు వ్రాసిన కవితలు Mystic Poetry, Love and Death, Six Poems Savitri చదవవలసినవి మరియు పేరుగాంచినవి.
 
 
[[వర్గం:సుప్రసిద్ధ భారతీయులు]]
[[వర్గం:స్వాతంత్ర్య సమర యోధులు]]
[[వర్గం:ఆధ్యాత్మిక గురువులు]]
[[వర్గం:1872 జననాలు]]
[[వర్గం:1950 మరణాలు]]
[[వర్గం:భారత స్వాతంత్ర్య సమర యోధులు]]
[[వర్గం:పశ్చిమ బెంగాల్ ప్రముఖులు]]
[[వర్గం:కవులు]]
==మూలాలు==
{{మూలాలజాబితా}}
Line 129 ⟶ 118:
* [http://www.writespirit.net/authors/sri_aurobindo/biography-sri-aurobindo/ Biography of Sri Aurobindo].
* [http://www.dailynews.lk/2001/08/15/fea03.html Sri Aurobindo, his work in the occult].
 
[[వర్గం:సుప్రసిద్ధ భారతీయులు]]
[[వర్గం:స్వాతంత్ర్య సమర యోధులు]]
[[వర్గం:ఆధ్యాత్మిక గురువులు]]
[[వర్గం:1872 జననాలు]]
[[వర్గం:1950 మరణాలు]]
[[వర్గం:భారత స్వాతంత్ర్య సమర యోధులు]]
[[వర్గం:పశ్చిమ బెంగాల్ ప్రముఖులు]]
[[వర్గం:కవులు]]
"https://te.wikipedia.org/wiki/అరబిందో" నుండి వెలికితీశారు