ఆంధ్రప్రదేశ్ అవతరణ: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ) → ) (7), లో → లో (4), తో → తో using AWB
పంక్తి 3:
{{ఆధునికాంధ్రచరిత్ర}}
==ఆంధ్ర ప్రదేశ్‌ అవతరణ==
[[1953]] లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక, [[భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు]] పై వత్తిడి పెరిగింది. కాంగ్రెసు, కమ్యూనిస్టుల తోకమ్యూనిస్టులతో సహా అన్ని ప్రముఖ రాజకీయ పార్టీలూ దీనిని సమర్ధించడంతో [[విశాలాంధ్ర]] స్వప్నం నిజమయే రోజు దగ్గరపడింది. [[1953]] డిసెంబర్‌ లోడిసెంబర్‌లో సయ్యద్‌ [[ఫజల్‌ ఆలీ]] నేతృత్వంలో [[రాష్ట్రాల పునర్విభజన కమిషను]] ఏర్పాటయింది. [[1955]] [[సెప్టెంబర్ 30]] న తన నివేదిక సమర్పించింది., [[తెలంగాణా]] రాష్ట్ర ఏర్పాటును అది సమర్ధించింది. మరాఠీ మాట్లాడే ప్రాంతాలను [[మహారాష్ట్ర]]లోను, కన్నడం మాట్లాడే ప్రాంతాలను [[కర్ణాటక]]లోను కలిపి తెలుగు మాట్లాడే ప్రాంతాలను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చెయ్యాలని సూచించింది. అయితే ఐదు సంవత్సరాల తరువాత రాష్ట్ర [[శాసనసభ]]లో మూడింట రెండు వంతులు సభ్యులు ఒప్పుకుంటే, ఆంధ్రతో విలీనం చెయ్యవచ్చని కూడా సూచించింది. కమిషను సూచనలను ఆహ్వానించి, ప్రత్యేక రాష్ట్రవాదనను సమర్ధించిన వారిలో [[కె.వి.రంగారెడ్డి]], [[మర్రి చెన్నారెడ్డి]] ప్రముఖులు. [[హైదరాబాదు]] శాసనసభలో అధిక శాతం సభ్యులు ఆంధ్ర ప్రదేశ్‌ను సమర్ధించారు. శాసనసభలో ఈ విషయంపై చర్చ జరిగినపుడు, 103 మంది సభ్యులు ఆంధ్ర ప్రదేశ్‌కు మద్దతు తెలుపగా, 29 మంది మాత్రమే వ్యతిరేకించారు. 15 మంది తటస్థంగా ఉండిపోయారు. ఆంధ్ర ప్రదేశ్‌ను సమర్ధించిన ప్రముఖ నాయకులలో అప్పటి ముఖ్యమంత్రి [[బూరుగుల రామకృష్ణా రావు]], [[మాడపాటి హనుమంతరావు]], [[స్వామి రామానంద తీర్థ]] మొదలైనవారు ఉన్నారు. దీని నివేదికపై తెలంగాణా, విశాలాంధ్ర వాదులు తమతమ వాదనలను తీవ్రతరం చేసారు. కమ్యూనిస్టులు తీవ్రంగా ప్రతిస్పందిస్తూ, [[హైదరాబాదు]] శాసనసభకు రాజీనామా చేసి, ఈ విషయంపై ఎన్నికలకు వెళ్తామని ప్రకటించారు. కాంగ్రెసు అధిష్ఠానం కూడా ఆంధ్ర ప్రదేశ్‌నే సమర్ధించి, ఆంధ్ర, తెలంగాణా నాయకులను తమ విభేదాలను పరిష్కరించుకొమ్మని ఒత్తిడి చేసింది. [[1956]] [[ఫిబ్రవరి 20]] న ఢిల్లీలో రెండు ప్రాంతాల నాయకులు సమావేశమయ్యారు. తెలంగాణా తరపున [[బూరుగుల రామకృష్ణా రావు]], [[కె.వి.రంగారెడ్డి]] (మర్రి చెన్నారెడ్డికి మామ. ఈయన పేరిటే 1978 లో చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రంగారెడ్డి జిల్లా ఏర్పాటయింది.) , [[మర్రి చెన్నారెడ్డి]], [[జె.వి.నర్సింగ్ రావు]] పాల్గొనగా, ఆంధ్ర తరపున [[బెజవాడ గోపాలరెడ్డి]], [[నీలం సంజీవరెడ్డి]], [[గౌతు లచ్చన్న]], [[అల్లూరి సత్యనారాయణ రాజు]] సమావేశాల్లో పాల్గొన్నారు. ఆ విధంగా అనేక చర్చలు, సంప్రదింపుల అనంతరం [[1956]] [[జూలై 19]] న వారిమధ్య [[పెద్దమనుషుల ఒప్పందం]] కుదిరింది; ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమమైంది.[[1956]] [[నవంబర్ 1]]న అప్పటి [[ప్రధానమంత్రి]] [[జవహర్‌లాల్‌ నెహ్రూ]] చేతుల మీదుగా ఆంధ్ర ప్రదేశ్‌ ఆవిర్భవించింది. [[నీలం సంజీవరెడ్డి]] ముఖ్యమంత్రి అయ్యాడు. అప్పటి వరకు హైదరాబాదు ముఖ్యమంత్రిగా ఉన్న [[బూరుగుల రామకృష్ణా రావు]]కు [[కేరళ]] గవర్నరు పదవి లభించింది. ఆంధ్ర రాష్ట్ర గవర్నరు అయిన [[సి.ఎం.త్రివేది]], ఆంధ్ర ప్రదేశ్‌ తొలి గవర్నరుగా కొనసాగాడు.
 
==ఉపముఖ్యమంత్రి==
పెద్దమనుషుల ఒప్పందంలోని చాలా ముఖ్యమైన అంశం:రాష్ట్ర మంత్రివర్గంలో ముఖ్యమంత్రి కోస్తా, రాయలసీమ నుండి ఉంటే ఉపముఖ్యమంత్రి తెలంగాణా నుండి, ముఖ్యమంత్రి తెలంగాణా వ్యక్తి అయితే ఉపముఖ్యమంత్రి కోస్తా, రాయలసీమ ప్రాంతాల నుండి ఉండాలి.కాబినెట్ మంత్రులలో 40 శాతం తెలంగాణా ప్రాంతానికి చెందిన వారే ఉండాలి.
 
==కొత్తజిల్లాలు==
తరువాతి కాలంలో మరో మూడు జిల్లాలు ఏర్పడ్డాయి. ఆవి: [[1970]] లో [[ప్రకాశం]] జిల్లా, [[1978]]లో [[రంగారెడ్డి]] జిల్లా, [[1979]] లో [[విజయనగరం]] జిల్లా. వీటితో కలిపి మొతం 23 జిల్లాలయ్యాయి.ఇంకా విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, నంద్యాల, మంచిర్యాల, అమలాపురం మొదలైనకొత్తజిల్లాలకోసం ఆయా ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు.
 
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర]]
"https://te.wikipedia.org/wiki/ఆంధ్రప్రదేశ్_అవతరణ" నుండి వెలికితీశారు