ఎక్కిరాల కృష్ణమాచార్య: కూర్పుల మధ్య తేడాలు

మొలక స్థాయిని దాటింది మూస తీసివేశాను
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), కు → కు (2) using AWB
పంక్తి 36:
}}
 
'''ఎక్కిరాల కృష్ణమాచార్య''' ([[ఆగష్టు 11]], [[1926]] - [[మార్చి 17]], [[1984]]) [[ఆంధ్రప్రదేశ్]] కు చెందిన రచయిత. ఆయన శిష్యులు ఆయనను ''మాస్టర్ ఇ. కె.'' అని పిలుచుకుంటుంటారు.
 
== జననం ==
ఈయన [[1926]], [[ఆగష్టు 11]]వ తేదీన [[ఆంధ్రప్రదేశ్]] కు చెందిన గుంటూరు జిల్లా, [[బాపట్ల]] లో అనంతాచార్యులు మరియు బుచ్చమ్మ దంపతులకు జన్మించాడు. ఈయన తెలుగు, సంస్కృత, ఆంగ్ల భాషలలో పాండిత్యాన్ని సాధించాడు. 'పాండురంగ మాహాత్మ్యం' కావ్యంపై పరిశోధన చేసి ఒక అద్భుతమైన గ్రంధాన్ని వెలయించి 'డాక్టరేట్' సాధించాడు. గుంటూరులోని హిందూ కళాశాలలోను, తరువాత ఆంధ్ర విశ్వకళాపరిషత్తులోను తెలుగు ఉపన్యాసకుడుగా పనిచేశాడు. వీరి రచనలలో 'రాసలీల', 'ఋతుగానం', 'గోదా వైభవం', 'అశ్వత్థామ సుభద్ర', 'అపాండవము', 'స్వయంవరము', 'పురాణ పురుషుడు', 'పురుష మేధము', 'లోకయాత్ర' లు మంచి ప్రచారం పొందాయి. [[జయదేవుడు|జయదేవుని]] 'గీత గోవిందము'ను '[[పీయూష లహరి]]' అనే పేరుతో అచార్య తెలుగులోకి అనువదించారు.
 
ఈయన యూరపులో పర్యటించి సనాతన భారత ధర్మానికి అక్కడ ప్రచారాన్ని కల్పించి, జగద్గురువుగా ఖ్యాతిగాంచాడు. 'వరల్డు టీచర్స్ ట్రస్టు' (జగద్గురు పీఠం) అనే సంస్థను స్థాపించి తన బోధనలు తగు ప్రచారం పొందే ఏర్పాటుచేసాడు. ఈయన కృషి ఫలితంగా [[జెనీవా]] నగరంలో [[మొరియా విశ్వవిద్యాలయం]] రూపొందింది. ఇది మానవ జీవితానికి ఆవశ్యకాలైన తత్వశాస్త్ర, వైద్యశాస్త్రాలను సమగ్రంగా సమన్వయించే విద్యాపీఠం. [[హోమియోపతి]] వైద్యవిధానం భారత దేశ ఆర్థిక పరిస్థితికి చక్కగా సరిపోతుందని భావించి, ఈయన కొన్ని కేంద్రాలలో ఉచిత హోమియో వైద్యాలయలను నెలకొల్పారు. ఈ వైద్యశాస్త్రాన్ని వివరించే సారస్వతాన్ని తెలుగులోను, ఆంగ్లంలోను రచించారు.
పంక్తి 46:
 
== మరణం ==
ఇంతటి బహుముఖ ప్రజ్ఞాశాలి [[1984]] [[మార్చి 17]] న విశాఖపట్టణం లోవిశాఖపట్టణంలో పరమపదించాడు.
 
==మూలాలు==