}}
'''కొడవటిగంటి కుటుంబరావు''' ([[అక్టోబర్ 28]], [[1909]] - [[ఆగష్టు 17]], [[1980]]) , ప్రసిద్ధ తెలుగు రచయిత, [[హేతువాది]]. '''కొకు''' గా చిరపరిచుతుడైన ఆయన తన యాభై ఏళ్ళ రచనా జీవితంలో పది పన్నెండు వేల పేజీలకు మించిన రచనలు చేసాడు. [[చందమామ పత్రిక]] ను చందమామగా తీర్చిదిద్దిన ప్రముఖులలో ఆయన అగ్రగణ్యుడు. సమకాలీన మానవ జీవితాన్ని పరామర్శించి, విమర్శించి, సుసంపన్నం చేసేదే సరైన సాహిత్యంగా ఆయన భావించాడు. ఇతను కొ.కు అను పొడి అక్షరములతో ప్రసిద్ధి చెందినాడు.
== జీవితము ==
కొకు [[గుంటూరు|గుంటూరు జిల్లా]], [[తెనాలి]] లోని ఒక మధ్య తరగతి [[బ్రాహ్మణ]] కుటుంబములో జన్మించాడు. తెనాలిలో పాఠశాల చదువు [[1925]] వరకు సాగింది. చిన్నవయసులోనే [[1914]] లో తండ్రీ, [[1920]] లో తల్లీ మరణించడంతో మేనమామ వద్ద పెరిగాడు. ఆయన చిన్నతనం గ్రామీణ జీవితంతో పెనవేసుకుపోయింది. కవీ, రచయితా అయిన అన్నయ్య వెంకటసుబ్బయ్య ద్వారా కొకు సాహితీ రంగప్రవేశం జరిగింది. ఆ కాలంలోనే ఆయనకు పాశ్చాత్య సాహిత్య పరిచయమూ జరిగింది. పదమూడేళ్ళ లేతవయసులోనే కొన్ని పద్యాలు, ఒక అసంపూర్ణ థ్రిల్లరు నవలా రాసాడు. అయితే కొద్ది కాలంలోనే వాటిని వదిలిపెట్టేసాడు. [[1925]] లో ఉన్నత విద్య పూర్తికాక మునుపే 11 ఏళ్ళ పద్మావతితో ఆయన పెళ్ళి జరిగింది.[[1925]] నుండి [[1927]] వరకు గుంటూరు [[ఆంధ్ర క్రైస్తవ కళాశాల|ఆంధ్రా క్రిస్టియన్ కళాశాల]] లో ఇంటర్మీడియేటు చదివాక, 1927-29 కాలంలో [[మహారాజా కళాశాల]], విజయనగరం లోవిజయనగరంలో బియ్యే ఫిజిక్సు చదివాడు. ఈ కాలంలోనే రచనా వ్యాసంగాన్ని సీరియస్సుగా మొదలుపెట్టాడు. బియ్యే చివరికి వచ్చేసరికి ఆయన [[నాస్తికత్వం|నాస్తికుని]] గా మారిపోయాడు.
[[1929]] లో [[కాశీ]] [[బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం|హిందూ విశ్వవిద్యాలయం]] లో ఎం.ఎస్.సి ఫిజిక్సులో చేరాడు. [[1930]] లో కొకు తొలిరచన ''సినిమా '' ఓరియంటల్ వీక్లీలో ప్రచురితమైంది. ఆయన మొదటికథ ''ప్రాణాధికం '' [[గృహలక్ష్మి మాసపత్రిక]] లో అగ్ర స్థానం పొందింది. అంతర్జాతీయంగా అలుముకున్న ఆర్థిక సంక్షోభం కారణంగా ఎం.ఎస్.సి రెండో సంవత్సరం చదువు ఆగిపోయింది. [[1931]] లో కొంతకాలం పాటు [[వరంగల్లు]] లో ఉండి పిల్లలకు ప్రైవేట్లు చెప్పారు. [[చక్రపాణి]], పిల్లలమర్రి బాలకృష్ణశాస్త్రి, పిల్లలమర్రి సాంబశివరావు లతో కలిసి యువ ప్రెస్ను స్థాపించి ''[[యువ]]'' పత్రికను ప్రారంభించాడు.
[[1939]] లో భార్య పద్మావతి మరణించింది. [[1940]] - [[1942|42]] మధ్య కాలంలో [[ఆంధ్ర పత్రిక]] లో పనిచేసాడు. ఆ కాలంలో [[జరుక్శాస్త్రి]] (జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రి) ఆయనకు సహోద్యోగి. 1942 లో నాలుగు నెలల పాటు ఒక మెటలు కర్మాగారంలో పనిచేసాడు. 1942 జూలై నుండి [[1943]] జనవరి వరకు సిమ్లాలో జాతీయ యుద్ధ ప్రచారక సమితిలో కాపీరైటరుగా పనిచేసాడు. [[1944]] లో [[ఒడిషా]] [[జయపూరు]] లో ఇన్స్పెక్టరేట్ ఆఫ్ మెటల్ అండ్ స్టీల్లో ఆర్నెల్ల పాటు ఫోర్మనుగా పనిచేసాడు.
మొదటి భార్య చనిపోయాక రెండవ పెళ్ళి చేసుకొన్నాడు. రెండవ పెళ్ళి జరిగైన రెణ్ణెల్లకే భార్య అనారోగ్యంతో మరణించడంతో [[1945]] లో వరూధినిని మూడవ పెళ్ళి చేసుకున్నాడు. [[1948]] లో మూణ్ణెల్ల పాటు [[ముంబై|బొంబాయి]] ఎయిర్ ఇండియా కార్యాలయంలో ఎకౌంట్సు క్లర్కుగా పనిచేసాడు. [[1948]] లో [[ఆంధ్రపత్రిక]] దినపత్రికలో చేరి [[1950]]-[[1951|51]] లో వారపత్రిక సంపాదకత్వం నిర్వహించాడు. అదే సంవత్సరం కినిమా వారపత్రిక సంపాదకత్వం కూడా నిర్వహించాడు. [[1952]], [[జనవరి 1]] నుండి చనిపోయే వరకూ [[చందమామ]] లో పనిచేసి ఆ పత్రిక అత్యున్నత స్థితిస్థితికి కి రావటానికి ఎంతో కృషి సలిపాడు.
==రచనలు==
*మారుతున్న కాలానికి అనుగుణంగా సాహిత్యమూ మారాలి … పాతకాలపు సాహిత్య పద్ధతులకే కట్టుబడి ఉండడమంటే మోసం చెయ్యడమే
<!-- పై వ్యాఖ్యలు ఇంగ్లీషు వికీ వ్యాసంలోని వాటిని అనువదించినవి. కొకు చెప్పిన/రాసిన యథాతథ వ్యాఖ్యలు కావు. రెండుసార్లు అనువాదమైనందువలన అసలు వ్యాఖ్యలకు భిన్నంగా ఉండే అవకాశం ఎంతైనా ఉంది -->
*కులం మిథ్య, మతం మిథ్య, ధనమొకటే నిజం (పేదవాడైన అగ్రకులస్తుని కంటే డబ్బున్న దళితునికే ఎక్కువ పేరు ఉంటుంది. ఈ వ్యవస్థని ఉద్దేశించి అన్న వాక్యం)
==బయటి లింకులు==
|