జంగం కథలు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: clean up, replaced: ప్రసిద్ద → ప్రసిద్ధ using AWB
పంక్తి 7:
దాసరు లందరూ వైష్ణవ భక్తులైనట్లే జంగాలందరూ శైవభక్తులు. వీరు చెప్పే కథలకు జంగం కథలని పేరు. వీరికే [[బుడిగె జంగాలు]] అనే పేరు కూడ వాడుకలో వుంది. అందుకు కారణం వారు కథలో ఉపయోగించే వాయిద్యానికి [[బుడిగె]] అనేపేరును బట్టి బుడిగె జంగాలనే పేరు సార్థక నామమైంది.ఈ బుడిగెనే [[డక్కీ]] అనీ, [[డిక్కీ]] అనీ, [[గుమ్మెట]]నీ అనేక రీతులలో ఆయా ప్రాంతాలలో ఉదహరిస్తునారు. బుడిగెలు మామూలు గుమ్మెట్ల కంటే చిన్నవి. ఇవి ఇత్తడితోనో లేదా కంచు తోనో చేయబడి వుంటాయి.
 
జంగాలు ప్రారంబంలో శైవ కథలనే ప్రచారాం చేసే వారు. తరువాత శైవేతర కథలైన దేసింగు రాజు, [[విరాటపర్వం]], భల్లాణ, [[సిరియాళ]], [[దేవయాని]], వామన విజయం. [[అంబరీషోపాఖ్యానం]] మొదలైన కథలను కూడ ప్రచారంలోకి తెచ్చారు. [[జంగాలు]] [[వీర శైవ]] ప్రచారకులు కావడం వల్ల వారి కథలన్నీ వీరావేశంతో చెప్పబడుతూ వుండేవి. ధేనువు కొండ వెంకటయ్య గారి విరాట పర్వం జంగం కథలో జంగాల యొక్క వేష ధారణ, వాయిద్యాల వర్ణనవుంది...... [[ఆడిదం సూరకవి]] ''జంగాలు పాలు దేవాంగుల విత్తంబు '' అని వర్ణిచడంవల్ల, దేవాంగులైన సాలెవారిని యాచిస్తారని తెలుస్తూ వుంది. ఆంధ్రదేశంలో [[శారదకాండ్రు]] అనే ఒక జాతి వారు, ఒక్క [[తెలంగాణా]]లో తప్ప మరెక్కడా అంతగా కనిపించరనీ, జానపద గాయకులుగా బిక్షకులుగా వుండే వారిలో కూడ వీరె ఎక్కువనీ, మున్నూరు ముతరాసి మొదలైన కులముల నుండి ఉద్భవించిన జాతుల్లో [[శారద కాండ్ర]] జాతి ఒకటని జానపద వాజ్మయంలో.... [[బి. రామరాజు]]గారు వుదహరించారు. ఓ భారతీ, కరుణామతీ భళి, శారదా, కారుణానిధి అనేవంత పాట పాడటం వలన కూడ వీరికి శారదకాండ్రనే పేరు వచ్చి వుండవచ్చు. అంతే కాక, వీరు పయోగించే వాద్యంలో భుజము మీద ధరించే తంబురాకు శారద అనిపేరు. బుర్ర కథలో ఉపయోగించే తంబురాకూ దీనికీ ఏమీ తేడాలేదు. శారదను ఒక భుజం మీద ధరించి వాయిస్తారు. శారద అంటే సరస్వతి. విద్యల తల్లి, సరస్వతి పేరును వారుపయోగించే తంబురా వాయిద్యానికి మారుపేరుగా శారద అని నామకరణం చేశారు. వీరి కథ శారదాదేవి స్తోత్రంతో ప్రారంభమౌతుంది. ముఖ్యంగా వీరి జట్టులో పురుషుడు కథ చెపితే అతని ఇద్దరు భార్యలూ [[వంత]] పాడుతారు. ఒక భార్యను కలిగి వున్న కథకుడు కథచెపితే, అతని భార్య డక్కీ కొడుతుంది. దీనిని వీరు [[డిమ్కీ]] అని కూడ పిలుస్తారు. వీరు పాడే పాటల్లో శారద వరుసలనే కాక చారిత్రాత్మక మైన గేయాలను వీరావేశంతో పాడుతారు. తెలంగాణాలో ప్రచారంలో వున్న ప్రసిద్దప్రసిద్ధ వీరకథ లైన సదాశివ రెడ్డి కథ, [[సర్వాయి పాపడు]] కథలనూ, సర్కారు ఆంధ్రదేశంలో ప్రఖ్యాతి వహించిన [[బొబ్బిలి యుద్ధం]], [[పల్నాటి వీరచరిత్ర]], [[బాలనాగమ్మ]] మొదలైన కథలనూ శారద కాండ్రు చెపుతూ వుంటారు. పైన వుదాహరించిన ఒక్కొక్క కథనూ, మూడు నాలుగు రాత్రులు చెపుతారు. ఈ కథలు చెప్పేవారు ఎక్కువమంది [[వరంగల్లు]] తాలూకా వెంకట్రావుల పల్లి మొదలైన చుట్టుపట్ల గ్రామాలలో వున్నారు. శారద కాండ్రు అందరూ శైవ మతస్థులు. మాంసాహారులైన జంగమ జాతివలన కలిగిన జాతి. ఈ శారద కాండ్రు అని కొందరి అభిప్రాయం. వీరు [[ఎల్లమ్మ]], [[పోచమ్మ]] మొదలైన ముఖ్య దేవతల్నిపూజిస్తారు. వీరు ఎంతమంది భార్యలనైనా చేసుకోవచ్చు. వీరందరూ శైవ మతస్థులైనప్పటికీ [[లింగధారణ]]లో కొంతమందికి పట్టింపు లేదు.
[[File:Jamgam devara two.JPG|thumb|right|జంగమయ్యలు]]
==ఉత్తమ కళారూపం==
"https://te.wikipedia.org/wiki/జంగం_కథలు" నుండి వెలికితీశారు