ఆత్రేయ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: గా → గా (2) using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: స్తాన → స్థాన (4), బందిం → బంధిం, వున్నాయి. → ఉన్నాయి., లు using AWB
పంక్తి 39:
==జీవిత సంగ్రహం==
[[1921]] [[మే 7]] న [[శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా]]లోని [[సూళ్ళూరుపేట]] మండలంలో గల [[మంగళంపాడు]] గ్రామంలో జన్మించాడు. తండ్రి [[కృష్ణమాచార్యులు]]. తల్లి సీతమ్మ. చిన్నప్పటినుండి నాటకంలోని పద్యాలను రాగయుక్తంగా చదివేవారు. సమాజంలో మధ్య తరగతి కుటుంబ సమస్యలను తీసుకుని మనోహరమైన నాటకాలుగా మలిచారు. వీరి 'ప్రవర్తన', '[[ఎన్.జి.వో]]' నాటకాలు ఆంధ్ర నాటక కళా పరిషత్ అవార్డులను గెలుచుకున్నారు. విశేషంగా రాష్ట్రవ్యాప్తంగా వందల సంఖ్యలో ప్రదర్శనలు జరిగాయి. అలాగే '[[కప్పలు]]' బాగా ప్రాచుర్యమ్ పొందిన నాటకం. రాయలసీమ క్షామ పరిస్థితులను వివరించే 'మాయ' నాటకం, స్వాతంత్ర్యానంతరం దేశంలో చెలరేగిన హిందూ ముస్లిం హింసాకండను 'ఈనాడు' అనే మూడంకాల నాటకం మరియు విశ్వశాంతిని కాంక్షించే 'విశ్వశాంతి' నాటకాన్ని రచించారు. విశ్వశాంతి నాటకానికి కూడా రాష్ట్ర స్థాయి బహుమతి లభించింది. 'సామ్రాట్ అశోక','గౌతమ బుద్ధ' మరియు 'భయం' నాటకాలు కూడా వ్రాసారు.
ఆత్రేయ పలు చలన చిత్రాలకు సంభాషణలు, పాటలు రాశారు. వీరి పాటలలో ఎక్కువగా మనసుకు సంబందించినసంబంధించిన ప్రస్తావన ఉండటం వలన ఆయన '''మనసు కవి''', '''మన సుకవి ''' అయ్యాడు. [[దీక్ష]] (1950) చిత్రానికి తొలిసారి గీత రచన, అదే సంవత్సరంలో విడుదలైన [[సంసారం (1950 సినిమా)|సంసారం]] చిత్రానికి తొలిసారి కథా రచన చేసారు. [[వాగ్ధానం]] (1961) చిత్రాన్ని నిర్మించి, దర్శకత్వం కూడా చేసాడు.
 
చిన్ని చిన్ని పదాలతో స్పష్టమైన భావాన్ని పలికించడంలో ఆత్రేయ ఘనాపాటి. తెలుగు పాటను ఆస్వాదించే అందరి మనసులను దోచుకున్న ఈ మనసు కవి [[1989]],[[సెప్టెంబర్ 13]] న స్వర్గస్తులయ్యారు.
పంక్తి 103:
 
==ఆత్రేయ గురించి==
*రచనలు చేయడానికి చాలా సమయం తీసుకునేవాడు ఆత్రేయ. నిర్మాతలను తిప్పుకునేవాడు. రాయక నిర్మాతలనూ రాసి ప్రేక్షకులనూ ఏడిపిస్తాడని ఆయనపై ఓ ఛలోక్తి. కానీ ఆయన ఏమనే వారంటే రాస్తూ నేనెంత ఏడుస్తానోఏడుస్థానో ఎందరికి తెలుసు అనేవారు.
*తన పాటల్లో అత్యున్నత భావాలను పలికించినట్లే, ద్వంద్వార్థాలనూ, చవకబారు అర్థాలనూ ప్రతిఫలించాడు. అంచేత ఆయనను ''బూత్రేయ'' అనీ అన్నారు.
*ఒకసారి ఏదో చిత్రానికి పాట రాయవలసివచ్చినప్పుడు చాలా సమయం తీసుకోవడంతో నిర్మాత గొల్లుమన్నాడు. తను ఆ పాట కోసం బస చేసిన హోటల్ పేరు "చోళ" అందుకే "పల్లవి" తట్టడంలేదని చెప్పి వేరే హోటల్ కి మార్పించుకుని వెంటనే ఆ పాటను పూర్తి చేసారు. ఇంతకీ విషయమేమిటంటే చోళులకీ, పల్లవులకీ పడదు. ఇదే విషయాన్ని శ్లేషగా చెప్పారు.
* తెలుగు సినిమా పాటలను మామూలు వాడుక మాటలతోనే రాయగలిగిన ఘనాపాటీ ఆత్రేయ. ఉదాహరణకి, [[తేనె మనసులు]] సినిమాలో ఈ రెండు పాటలు "'''ఏవమ్మా నిన్నేనమ్మా ఏలా ఉన్నావు'''," "'''నీ ఎదుట నేను వారెదుట నీవు, మా ఎదుట ఓ మామా ఎప్పుడుంటావు'''." అలాగే [[ప్రేమనగర్]] సినిమాలో "'''నేను పుట్టాను ఈలోకం మెచ్చింది,, నేను ఏడ్చాను ఈ లోకం నవ్వింది, నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది'''." పాట, మరియు "'''తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా'''" పాట. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ చిట్టా అనంతమే అవుతుంది.
*మరోచరిత్ర సినిమాకి రాసిన పాటలు<br> ఏ తీగ పువ్వునో...ఏ కొమ్మ తేటినో...<br>పదహారేల్లకు...నీలో నాలో<br>బలే బలే మగాడివోయ్ ...నీ అన నీ దానినోయ్...అనే పాటలు ఇప్పటికి శ్రోతలని అలరిస్తూనే వున్నాయిఉన్నాయి.
* [[ఘట్టమనేని కృష్ణ|కృష్ణ]], [[శారద]] లు నటించిన "[[ఇంద్రధనుస్సు]]" సినిమాలోని పాట "'''నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమ వాసివి'''" అనే పాట ఆత్రేయకు అత్యంత ఇష్టమైన పాటగా చెబుతారు. ఆయనే ఒకసారి ఏదో సందర్భంలో ఈ పాట నా జీవితానికి సంబంధించిన పాట అని చెప్పారు.
*ఆత్రేయ వాస్తవిక జీవితంలో భగ్నప్రేమికుడయ్యుంటాడు. అందుకనే ఆయన రాసిన పాటల్లో విషాద గీతాలు, ముఖ్యంగా మనసును గూర్చి రాసిన పాటల్లో అంతటి విషాదం గోచరిస్తూ ఉండేవేమో. ఇంతకీ మనసును గూర్చి ఆత్రేయ రాసినన్ని పాటలు వేరొకరు రాసి ఉండలేదు. అందుకనే ఆతడిని మనసు కవి అనేవారు. బహుశా అందుచేతనే అయ్యుంటుంది, [[డాక్టర్ చక్రవర్తి]] సినిమాలోని "'''మనసున మనసై బ్రతుకున బ్రతుకై'''" పాటని ఆత్రేయనే రాసారని అనుకునేవారు. కానీ ఈ పాటని రాసినది వాస్తవానికి [[శ్రీశ్రీ]]గా లబ్ధప్రతిష్టుడైన శ్రీరంగం శ్రీనివాసరావు.
*వీరిద్దరికీ సంబంధించినదే ఇంకొక సంగతుంది. అదేమంటే ...... సినిమాలో "'''కారులో షికారికెళ్ళే పాలబుగ్గల పసిడిచాన'''" పాటని శ్రీ.శ్రీ. రాసారేమో అనుకునేవారు. కాని ఈపాటని రాసింది మాత్రం ఆత్రేయ.
పంక్తి 116:
** ఇక్కడనుంచే మా అధికారం ప్రారంభం అవుతుంది. అహంకారం విజృంభిస్తుంది. ఇక్కడి వందల వేల ఎకరాల స్థలం అంతా మాదే. కాని, చివరకు మనిషికి కావలసింది అటు ఆరడుగులు. ఇటు రెండడుగులు.
=== ఆత్రేయ గురించి ప్రముఖ నటుడు / రచయిత [[రావి కొండలరావు]] గారి అభిప్రాయం<ref name="ఆత్రేయని చీల్చిచెండాడిన తెలుగు మాస్టారు!">{{cite web|url=http://www.eenadu.net/Homeinner.aspx?item=break200|title="ఆత్రేయని చీల్చిచెండాడిన తెలుగు మాస్టారు! " |publisher=[[ఈనాడు]] |date= 2015-10-23|accessdate=2015-10-23}}</ref>===
నాకు తెలిసి, ఆత్రేయ ఒక డబ్బింగ్ సినిమాకు రాశారు. ఆ సినిమా తమిళం. దాని పేరు 'అళగి' అంటే సుందరి. ఆత్రేయగారికి తమిళం వచ్చు. తెలుగులో మరి, ఏం పేరు పెట్టారో! నేను డబ్బింగ్‌లు చెబుతూ, ఆ అవకాశాల కోసం తిరుగుతున్నప్పుడు ఆత్రేయ గారిని కలిశాను. మద్రాసు రాయిపేటలో వున్న ఒక హోటల్ గదిలో వున్నారాయన. గదిలోకి వెళ్లగానే నేలమీద దిండు తలకింద పెట్టుకుని పడుకుని తమిళంలో వున్న దృశ్యాలు చదువుతూ పక్కన వున్న ఇద్దరు సహాయకులకి డిక్టేట్ చేస్తున్నారు. నేను నిలబడివుండగా నన్ను చూసి, 'ఎవరు?' అన్నారు. చెప్పుకున్నాను. ''ఎప్పుడు డబ్బింగ్ మొదలవుతుందో తెలీదు. మొదలైన తర్వాత వస్తే ఏదో పాత్రకి చెబుదురుగాని'' అని చెప్పి పంపించేశారు. ఐతే అది ఎప్పుడు మొదలైందో, అసలు మొదలైందో లేదో కూడా నాకు తెలిసి రాలేదు. నేను వెళ్ళలేదు. (ఈ సంఘటన 1954వ సంవత్సరంలో అని గుర్తు) అంతకు ముందొకసారి, రాజా అన్నాతమలైపురంలో ఆయన అద్దెకి వున్న పెద్ద ఇంటికి వెళ్ళి కలిశాను. ఉద్యోగార్థం. నేనొక రచయితనని, ఆయన దగ్గర అవకాశం ఇస్తే సహాయకుడిగా చేస్తాననీచేస్థాననీ అడిగాను. ''నేనే సహాయకుడిని. దర్శకుడు, నిర్మాత ఏం చెబితే అది రాస్తాను. నాకు మళ్ళీ సహాయకుడెందుకు?'' అనేశారు. ఆయన వీధి గుమ్మం ముందున్న పోర్టికోలో కూచున్నారు. నేను నిలబడే వున్నాను. నన్ను ఆయన కూచోమనలేదు, నేను కూచోలేదు. ఆయన ఆ మాట చెప్పగానే నమస్కారం పెట్టి వచ్చేశాను. ఆదుర్తిగారు 'తేనె మనసులు' (1965) తీస్తున్నప్పుడు పరిచయం అయింది ఆత్రేయ గారితో. ఐతే, అంతకు ముందు నేను కలిసిన సందర్భాలు ఆయనకి గుర్తులేవు. నేనూ గుర్తు చెయ్యలేదు. తేనేమనసులులో నాకు వేషం లేదు. కాని, నా భార్య రాధాకుమారితో హైదరాబాదు వచ్చాను. మొత్తం నటీనటులందరికీ సారిథి స్టూడియోలోనే బస. ఆత్రేయగారు లక్డీకాపూల్‌లో ఉన్న వెంకటేశ్వరా లాడ్జిలో వుండేవారు. ఆయన, ఆదుర్తిగారు, నిర్మాత సుందరంగారూ, ఇద్దరు సహాయకులూ. నేను సినిమా జర్నలిస్టుని. ఆదుర్తి గారితో ఇంటర్వ్యూ చేశాను... ఆంధ్రజ్యోతి దినపత్రికకి. ఆదుర్తి గారు నేను రాసిన నాటకాలు చూశారు. అప్పుడు 'మూగమనసులు' రజతోత్సవం చేసుకోబోతోంది హైదరాబాదులో. ఆ వేదిక మీద అందరి గురించి రాసిన సన్మానపత్రం - సమర్పించాలి. నా అదృష్టం కొద్దీ ఆ సన్మానపత్రం నన్ను రాయమన్నారు- ఆదుర్తిగారు. ఆ సందర్భంలో ఆత్రేయగారిని కలిశాను. కలిశాను ఏమిటి- ఆదుర్తి సుబ్బారావు గారు కలిపారు. 'మూగమనసులు' కథలో, సంభాషణల్లో ముళ్లపూడి రమణగారి ప్రమేయం వుంది. ఆయన మద్రాసులో వుండి, 'ప్రేమించి చూడు' రాస్తున్నారు. 'తేనెమనసులు' కథలోనూ రమణ గారి ప్రమేయం వుంది. ఆ సినిమాలో రాధాకుమారికి వేషం వుందన్న విషయం రమణ గారే మా యింటికి వచ్చి చెప్పారు. ఆ చేత్తోనే నాకు లేదనీ చెప్పారు. నేను 'దాగుడుమూతలు'లో వేశాను కదా- అందుకట. ''మరి రాధాకుమారీ వేసింది కదా'' అని వాదించాను. ఆ పాత్రకి సరైన వాళ్లు దొరకలేదని, అంచేత తప్పని సరిగా రాధాకుమారికి ఇవ్వవలసి వచ్చిందనీ, కృష్ణకి తల్లి పాత్ర అనీ, రాధాకుమారి అలా కనిపించదు గనక, కృష్ణ తండ్రి (చలపతిరావు)కి రెండోభార్యగా మార్చామనీ చెప్పారు- రమణ గారు. 'మూగమనసులు' సన్మానపత్రం ఫస్ట్ వెర్షన్ (సినిమా భాష) రాసి ఆదుర్తి గారు, ఆత్రేయ గారూ వుండగా చదివి వినిపించాను. ఇంకొంచెం విస్తరింపు కావాలని టెక్నీషియన్లని ఇంకా మెచ్చుకోవాలనీ సలహా ఇచ్చారు. మళ్లీ రాసి, వినిపిస్తే ''బాగుంది'' అన్నారు ఆదుర్తిగారు. అని, ''మీరే చదవండి వేదిక మీద'' అని గొప్ప అవకాశం ఇచ్చారు. ఆ సందర్భంలోనే ఆత్రేయ గారి ముందు- ఎవరో చెప్పగా- 'తెలుగు మాస్టారు' ప్రహసనం చేశాను. ఆయన చాలా ఆనందంగా నవ్వి, ఇంకోసారి చెప్పమన్నారు. అలా ఆ పరిచయం ''ముదిరి''- ఆత్రేయగారిని, తెలుగు మాస్టారు కలిస్తే ఎలా మాట్లాడతారో చెప్పమంటే- చెప్పాను. ఆయన్ని, ఆయన రచనల్ని రాసే విధానాల్ని ''చీల్చి చెండాడాను''. ఆయన ఎంత నవ్వారో! ఎంత స్పోర్టివ్‌గా ఆనందించారో! ''శిలలపై శిల్పాలు చెక్కినారూ- ఏమిటి, శిలలపై శిల్పాలు కాక, పెన్సిళ్లు చెక్కుతారా- ఏమిటి తమ రచన?'' అంటూ, ఇలాంటివే.
ఆత్రేయగారి 'రచనాచమత్కృతి' ఎలాంటిదంటే- రాయరు. చెప్పి రాయిస్తారు. అదీ రాత్రివేళ. రాత్రి తొందరగా భోజనం చేసి, తొమ్మిదిన్నర, పదిగంటలకి పడుకోవాలి. రెండుగంటలకి లేవాలి. ఆ రెండు నుంచి, కోడి కూసే వరకూ (కోళ్లు లేవు- కాకులే అరిచేవి) సాగుతుంది ఆ రచన. అందుకే ఆయన్ని 'అర్ధరాత్రేయ' అని చమత్కరించేవాళ్లం. అక్కడక్కడ కొన్ని చిన్నచిన్న బూతులు రాయడంవల్ల 'బూత్రేయ' అని కూడా అన్నారు. దేనికీ ఆయన నొచ్చుకోరు. ఐతే, ఆ అర్ధరాత్రి భోగాలు నాకు అనుభవం లేదుగాని, కె.వి.రావుగారు, సుదర్శన్ భట్టాచారి గారూ (నేటి 'భారవి') అనుభవించారు.
తాను ఒక మంచి నీతిగల సాంఘిక చిత్రం నిర్మిస్తూ దర్శకత్వం కూడా చేస్తాననిచేస్థానని- ఒకరోజు ప్రకటించారు. నన్ను, కె.వి.రావుగారినీ పిలిచి, ''మీరిద్దరూ నాకు సహాయకులు. కథ సూక్ష్మంగా చెబుతాను. ఇద్దరూ కలిసి స్క్రీన్‌ప్లే వండండి. వంట అయ్యాక చెప్పండి. తింటాను అదే, వింటాను'' అన్నారు. ''మరి...'' అని గొణిగాం. తన ఇంట్లోని లైబ్రరీ గది చూపిస్తూ ''ఇదే మన ఆఫీసు. ఇద్దరూ ఒకవేళ అనుకుని - వచ్చి కూచోండి. మీకు టీలు, కాఫీలూ కావలసివస్తే ఇంట్లో చెప్పండి పంపిస్తారు'' అన్నారు. ఇంటినిండా జనమే- వాళ్లెవరోగాని. ''మరి....'' అని మళ్లీ గొణిగాం. ''పదిరోజుల తర్వాత మీ ఇద్దరి జేబులూ నింపుతాను'' అని ఆయన అనుకున్న కథ చెప్పారు. ''దీనికి ఏం పాత్రలు కలుపుతారో, ఎలా మంచి కథగా రూపొందిస్తారో ఆలోచించండి'' అని లేచారు. మేము కొన్నాళ్లపాటు కుస్తీలు పట్టి - ఒక విధంగా దృశ్యాలు పేర్చాం. వినమని చెప్పాం. ''రేపు'' అన్నారు. అలాంటి రేపులు చాలా అయినాయి. ఆయన వినడం మాత్రం కాలేదు. మా జేబులూ నిండలేదు. నిండడం కాదుగదా- ఉన్న జేబు ఖాళీ అయింది. ఓ రోజు ఇద్దరం వుండగా- అడావుడిగా వచ్చారు ఆత్రేయ. ''రేపు దీపావళి. మంచిరోజు. ఇద్దరూ తలంటు పోసుకుని రండి. మీ ట్రీట్‌మెంట్ వింటాను. గట్టిగా అడ్వాన్సులు ఇస్తాను'' అన్నారు. మర్నాడు తెల్లవారేసరికి లేచి, ఆయన చెప్పినట్టు తలలు అంటుకోకపోయినా, ఆయన ఇంటిని అంటుకున్నాం. తీరా వెళితే- తెల్లవారుజామునే బెంగళూరు వెళ్లిపోయారుట! అదే కబురు! అంతే కథ! ఆ కథని కంచికి పంపించేశాం. ఆయన ఎంత గొప్ప రచయితో అంత నిబద్ధత లేని మనిషి. సినిమా రచయితలకి ఒక సంఘం వుండాలని, అందరికీ చెప్పి, మొదటి సమావేశం ఎక్కడో ఎప్పుడో చెప్పి అందర్నీ ఆహ్వానించి, ఆయన వెళ్లలేదు!
ఆయన 'వాగ్దానం' సినిమా డైరక్టు చేశారు. ఆయనే రచయిత కూడా. అక్కినేని హీరో. ఒక సందర్భంలో అక్కినేని చెప్పారు. ''మేము నటీనటులందరం సిద్ధమై సెట్లో కూచునేవాళ్లం. టెక్నీషియన్లు రెడీ. ఉదయం 9 గంటల కాల్‌షీటు. దర్శకుడే 10-30, 11 గంటలకు వచ్చేవాడు. ''ఏమిటి మహానుభావా!'' అని అడిగితే- ''బద్దకిష్టి రచయితని పెట్టుకున్నానయ్యా. సీన్లు రాయడు. (తానే, తనమీదే జోకు లాంటిది) దగ్గర కూచుని రాయించుకుని వచ్చేటప్పటికి ఇంత ఆలస్యమైంది!'' ఇదీ ఆత్రేయ సమాధానం!
ఆత్రేయగారు ఒక టి.వి సీరియల్ డైరెక్టు చేశారు. అందులో రాధాకుమారి వేసింది. ఎన్ని రోజులు వేషం వేసి పనిచేసినా డబ్బు ఇవ్వలేదుట- అడిగితే- ''అమ్మా! నాచేత ఎవరూ పాటలు రాయించుకోవడం లేదు. నువ్వు ఎవరికైనా చెప్పి- పాట రాయించమను. అతను డబ్బు ఇస్తాడు కదా, అప్పుడు మీ అందరికీ ఇస్తానుఇస్థాను'' అన్నారు. నిజమా! చమత్కారమా! ఏమైతేనేం ఒక గొప్ప రచయిత. ఎన్ని గొప్ప నాటకాలు, ఎన్ని సినిమాలు! ఎన్ని గొప్ప పాటలు! ఆయన చేత పాట రాయించుకోవాలని తిరగని వాళ్లు లేరు. ఐతే, ఆ పాట, ఆ మనసులో ఎప్పుడు పుడుతుందో! ఆయనకే తెలీదు. ఆత్రేయ సంభాషణలూ అంతే, వింటూ థియేటర్లో ప్రేక్షకులు చప్పట్లు కొట్టేవారు.
 
==చిత్ర సమాహారం==
"https://te.wikipedia.org/wiki/ఆత్రేయ" నుండి వెలికితీశారు