గురువును మించిన శిష్యుడు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
కథ పూర్తయించి |
|||
పంక్తి 8:
starring = [[కాంతారావు]],<br>[[కృష్ణకుమారి]]|
}}
'''గురువును మించిన శిష్యుడు''' 1963 లో విఠలాచార్య దర్శకత్వంలో వచ్చిన జానపద కథా చిత్రం. ఇందులో గురువుగా ముక్కామల నటించగా, గురువును మించిన శిష్యుడిగా కాంతారావు నటించాడు. కృష్ణకుమారి కథానాయికగా నటించింది. ఇతర పాత్రలలో కైకాల సత్యనారాయణ, అంజిగాడు తదితరులు నటించారు.
==కథ==
సువర్ణగిరి
రాజదంపతులు
తల్లిదండ్రుల వద్దకు వచ్చిన ఇద్దరు కుమారులు తమ రాజ్యం తిరిగి చేజిక్కించుకోవడానికి బయలు దేరతారు. తండ్రి గుర్రాల గురవయ్య దగ్గర దాచిపెట్టిన నగలు తీసుకోవాలని అతన్ని మోసం చేయడానికి విజేయుడు గుర్రం రూపం ధరించి, అజేయుడిని అతనికి ఇరవై వేల వరహాలకు అమ్మేయమంటాడు. అదే సమాయానికి కాలకేతుడు వచ్చి గుర్రం రూపంలో ఉన్న విజేయుడిని తీసుకుని తన గుహ కు తీసుకుని వెళ్ళి బలి ఇవ్వాలని చూస్తాడు. కానీ విజేయుడు తన చాతుర్యంతో గురువు నుంచి చిలుక రూపంలో తప్పించుకుని పారిపోతుంటే, గురువు వేసిన బాణం దెబ్బ తగులుతుంది. అప్పుడు కీర్తిసేనుని కుమార్తె అయిన పద్మావతి ఆ చిలుకకు సపర్యలు చేసి తన మందిరంలో పంజరంలో ఉంచుతుంది. ఆ చిలుక తెలివి రాగానే విజేయుడిగా మారి పద్మావతికి అసలు సంగతి తెలియజేస్తుంది. వారిద్దరూ ప్రేమలో పడతారు. మరోవైపు అజేయుడు ఒక దెయ్యాల గుంపును లోబరుచుకుని కీర్తిసేనుడి అన్నగారి కూతురును, అర్ధ రాజ్యాన్ని సంపాదిస్తాడు.
విజేయుడిని వెతుకుతున్న కాలకేతు కీర్తిసేనుడిని వశపరచుకోమని రత్నం, కళావతి అనే ఇద్దరిని ప్రేరేపించి వారిద్దరి ద్వారా ప్రజల దగ్గర నుండి అన్యాయంగా డబ్బు వసూలు చేస్తుంటారు. అజేయుడు అక్కడికి వచ్చి ఆ మోసాన్ని ఎండగడతాడు. అక్కడే తన అన్న విజేయుడు ఉన్న సంగతి కూడా తెలుస్తుంది. ఇద్దరూ కలిసి రత్నం, కళావతిలకు తగిన బుద్ధి చెబుతారు. అజేయుడు, లీలావతిల పెళ్ళికి అన్నగారిని, కూతురిని, విజేయుడినీ ఆహ్వానిస్తాడు. దారిలో పద్మావతి విజేయుడిని పరకాయ ప్రవేశ విద్య తన పెదనాన్న కోసం ప్రదర్శించ మంటుంది. అప్పుడు విజేయుడు తన శరీరాన్ని వదిలి పెట్టి అక్కడ చచ్చిపడి ఉన్న ఎలుగుబంటి లోకి ప్రవేశించగా అదే సమయానికి అక్కడికి వచ్చిన కాలకేతు తన శరీరాన్ని విడిచి విజేయుడి శరీరంలో ప్రవేశిస్తాడు. ఎలుగుబంటి రూపంలో ఉన్న విజేయుడు తిరిగి రాజ్యానికి వెళ్ళి తనవాళ్ళకి జరిగిన సంగతి చెబుతాడు. ఆ ఆపద నుంచి బయటపడటానికి రాజు గారి తరపున, రాణి గారి తరపున రెండు పొట్టేళ్ళ పందెం ఏర్పాటు చేయమంటాడు. విజేయుడు ఎలుగుబంటి శరీరంలో నుంచి ఒక చచ్చిన పొట్టేలు శరీరంలోకి ప్రవేశిస్తాడు. అది రాణి గారి తరపున పోరాడుతుంటుంది. రాజు గారి పొట్టేలు ఓడిపోవడం తట్టుకోలేక విజేయుడి శరీరంలో ఉన్న కాలకేతు ఆ పొట్టేలులో ప్రవేశించగా ఇదే అదనుగా విజేయుడు తన స్వశరీరంలోకి ప్రవేశిస్తాడు.
కీర్తిసేనుడి అన్న అజేయుడి పెళ్ళితోబాటు పద్మావతితో విజేయుడి పెళ్ళి చేయబోతుండగా వారు ఇద్దరు ధర్మపాలుడి పుత్రులని తెలుసుకుని అడ్డుకుని విజేయుడితో యుద్ధం చేసి ఓడిపోతాడు. చివరికి విజేయుడు పరాక్రమవంతుడని ఒప్పుకొని అతనికి తన కుమార్తెనిచ్చి వివాహం చేయడానికి ఒప్పుకుంటాడు. అదే సమయానికి వచ్చి తనను మోసం చేసావని కాలకేతుడు విజేయుడితో యుద్ధానికి దిగుతాడు. కానీ విజేయుడి చేతిలో ఓడిపోయి అతన్ని గురువును మించిన శిష్యుడిగా గుర్తించి దంపతులను ఆశీర్వదించి హిమాలయాలకు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోవడంతో కథ ముగుస్తుంది.
==తారాగణం==
*
*పద్మావతి గా [[కృష్ణకుమారి (నటి)|కృష్ణకుమారి]]
*కాలకేతుడు గా [[ముక్కామల కృష్ణమూర్తి]]
*ధర్మపాలుడి గా [[కైకాల సత్యనారాయణ]]
*
*లంకా సత్యం
==పాటలు==
Line 31 ⟶ 39:
==మూలాలు==
*డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
==బయటి లింకులు==
*[https://www.youtube.com/watch?v=IqB9-JLxXV0 యూట్యూబులో గురువును మించిన శిష్యుడు పూర్తి సినిమా]
[[వర్గం:తెలుగు జానపద చిత్రాలు]]
|