బండ్లమూడి సుబ్బారావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
'''బండ్లమూడి సుబ్బారావు''' [[ప్రకాశం జిల్లా]] [[వీరన్నపాలెం (పర్చూరు)]] లో [[మే 22]],[[1954]] న జన్మించారు. బెనారస్ హిందూ యూనివర్శిటీ లో వ్యవసాయశాస్త్రంలో డాక్టరేటు పట్టా పొందారు. ఆయన [[ఆంధ్ర ప్రదేశ్]] లోని గుంటూరు లో [[ఫిబ్రవరి 2]] , [[1982]] న ఆనాటి ప్రధానమంత్రి [[రాజీవ్ గాంధీ]] చే ప్రారంభింపబడిన "ఇండియన్ కిసాన్ మజ్దూర్ కాంగ్రెస్" కు వ్యవస్థాపక అధ్యక్షుడుగా యున్నారు. ఆయన గత 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ సభ్యునిగా యుండి రైతుల సంక్షేమం కోసం కృషిచేయుచున్నారు. ఈయన ఎన్.జి.రంగా పౌండేషన్<ref name=f2/> కు వ్యవస్థాపక అధ్యక్షునిగా యున్నారు. ఈ పౌండేషన దివంగత నాయకుడు, పార్లమెంట్ సభ్యుడు ఎన్.జి.రంగా పేరు మీద ప్రారంభించారు.అతను అనేక సమావేశాలు, సెమినార్లు, సభలు మరియు సమకాలీన సమస్యలపై సమూహం చర్చలు నిర్వహించారు ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది. ఈయన 1983-85 మధ్య కాలంలో ఇండియన్ ఆయిల్ సీడ్స్ డెవలెప్‌మెంట్ కౌన్సిల్ కు సభ్యునిగా యున్నారు, 1991-94 మధ్య కాలంలో గవర్నింగ్ కౌన్సిల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్‌టెన్సన్ మేనేజిమెంట్ కు సభ్యునిగా మరియు 1994-96 లో పారదీప్ పోర్ట్ ట్రస్ట్ కు ట్రస్టీ గా కూడా యున్నారు.
 
అతనువ్యవసాయరంగంపై 25 గ్రంధాలు రచించారు. 1982 లో లండన్ లో జరిగిన వ్యవసాయ ప్రొడ్యూసర్స్ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ సిల్వర్ జూబ్లీ కాన్ఫరెన్స్ కు భారత ప్రతినిధిగా హాజరయ్యారు. St.Luis, USA లో జరిగిన ప్రపంచ వ్యవసాయ ఫోరం 2007 వరల్డ్ కాంగ్రెస్ కు మే 8-10, 2007 నుండి భారత ప్రతినిధిగా హాజరయ్యారు. జూలై 4-6 నుండి వాషింగ్టన్ DC వద్ద తానా కాన్ఫరెన్స్ లో గౌరవనీయ వ్యక్తిగా ఆహ్వానించబడ్డాడు.అతను కెనడా, ఫ్రాన్స్, ఇటలీ, నెదర్లాండ్స్, సింగపూర్, స్విట్జర్లాండ్, USA మరియు UK వెళ్లాడు.అతను వ్యవసాయంపై శాస్త్రీయ పత్రికలలో ప్రముఖమైన 25 పరిశోధన పత్రాలను ప్రచురించారు. ఈయన తెలుగులో "శ్రీ కృష్ణ దేవరాయలు" అనే చారిత్రాత్మక నవలను ప్రచురించారు. యిది మూడు ఎడిషన్లలో ప్రచురింపబడినది. ఈయన తెలుగులో "బూజుపట్టిన రాజ్యాంగం" అనే పుస్తకాన్ని ప్రచురించారు.17.9.2016 న హైదరాబాదులో మరణించారు.
 
==రచనలు==