దక్షిణ భారతదేశం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up using AWB
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ను గురించి → గురించి, ను → ను (7), గా → గా , తో → తో (3), భంధ using AWB
పంక్తి 1:
{{సమాచార పెట్టె దక్షిణ భారతము}}
'''దక్షిణ భారతదేశము''' దక్షిణ భారతీయులు లేక ద్రవిడులు నివసించు ప్రాంతం. దక్షిణ భారతదేశము [[ఆంధ్ర ప్రదేశ్]], [[తమిళనాడు]], [[కర్నాటక]] మరియు [[కేరళ]] రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు [[పాండిచ్చేరి]] (పుదుచ్చేరి)ల సముదాయము (లక్ష దీవులు, అండమాన్ నికోబార్ దీవులు చాలా దూరముగా ఉన్నవి). భారత [[ద్వీపకల్పము]]లో [[వింధ్య పర్వతము]]లకు దక్షిణమున ఉన్న ప్రాంతమంతా దక్షిణ భారతదేశము. ఉత్తరమున [[నర్మదా నది]], [[మహానది]] పడమటన [[అరేబియా సముద్రము]], దక్షిణమున [[హిందూ మహాసముద్రము]], తూర్పున [[బంగాళాఖాతము]] ఉన్నవిఉన్నాయి. దక్షిణాన చివరి స్థానం [[కన్యాకుమారి]]. ఇరువైపులా ఉన్న [[తూర్పు కనుమలు]], [[పడమటి కనుమలు]] మధ్య [[దక్కన్ పీఠభూమి]]లతో దక్షిణ భారతదేశము భౌగోళికంగా కూడా వైవిధ్యము కలదుఉంది. [[తుంగభద్ర]], [[కావేరి (నది)|కావేరి]], [[కృష్ణా నది|కృష్ణ]] మరియు [[గోదావరి]] ఇచ్చటి ముఖ్యనదులు.
 
== ఉపోద్ఘాతం ==
పంక్తి 7:
ఇచట వ్యవసాయం ప్రధాన వృత్తి. మొత్తం స్థూల ఉత్పత్తిలో [[వ్యవసాయం|వ్యవసాయాని]]దే మొదటి స్థానం. [[సాఫ్టువేరు]] రంగం ఇచట చాలా వేగంగా విస్తరిస్తోంది. దేశంలోని సాఫ్టువేరు ఉత్పత్తిలో అధికశాతం దక్షిణ భారతదేశంలోని నగరాలలోనే తయారవుతోంది. చలన చిత్ర రంగం లో కూడా దక్షిణాది తనదైన ప్రత్యేకతతో ప్రపంచం లోని వివిధ దేశాల ప్రజలను అలరిస్తోంది. దక్షిణ భారతదేశంలోని ప్రజలు దేశంలోని మిగిలిన ప్రజలకన్నా [[విద్యారంగం]]లో ముందుండి అత్యధిక [[తలసరి ఆదాయం]] కలిగియున్నారు. ఇచటి విద్యారంగం మరియు వ్యవసాయం రెండు వేల సంవత్సరాలుగా తన వైశిష్ట్యాన్ని, ప్రత్యేకతను చూపుతున్నాయి. ఇచటి రాజకీయాలలో ప్రాంతీయ పార్టీల ప్రభావం అధికం.
 
దక్షిణ భారతానికి [[ఆంగ్లం]]లో ఉన్న ''సౌత్ ఇండియా'' (South India) అనే కాక సంస్కృత పదం ''దక్షిణం'' వలన ''డెక్కన్'' (Deccan) అని కూడా పేర్లు ఉన్నాయి. ప్రస్తుతం ''డెక్కన్'' అన్న పదం [[దక్కను పీఠభూమి]]కి మాత్రమే పరిమితమైంది. కర్ణాటక (Carnatic) అను పదం "కరునాడు" అనగా నల్లని దేశం అన్న పదం నుండి పుట్టింది. [[ద్రవిడనాడు]] అనునది దక్షిణ భారతానికి ఉన్న మరొక పేరు. అలాగే వివిధ రాష్టాలలోని ప్రజలను వారి వారి భాషను బట్టి కూడా పిలుస్తారు. ఉదాహరణకు తెలుగు మాట్లాడు వారిని ఆంధ్రులు అని, మళయాళంమలయాళం మాట్లాడువారిని మళయాళీలుమలయాళీలు అని పిలుస్తారు.
 
== చరిత్ర ==
పంక్తి 17:
[[కొత్తరాతియుగమున]]కు సంబంధించిన కొన్ని శిలలపై [[కార్బన్ డేటింగ్]] ద్వారా దక్షిణ భారతదేశపు ఉనికిని క్రీస్తుపూర్వం 8000కి చెందినదిగా శాస్త్రవేత్తలు తేల్చారు. రాతి ఆయుధాలు, మరియు కొన్ని రాగి పాత్రలు ఈ ప్రాంతమునందు లభించాయి. క్రీస్తు పూర్వం 1000 నాటికి [[ఇనుప యుగం]] ఈ ప్రాంతంలో ప్రాబల్యం పొందినది. అయినా ఈ ఇనుప యుగానికి ముందు బాగా అభివృద్ధి చెందిన ఇత్తడి యుగం ప్రాచుర్యం పొందినట్లు ఆధారాలు లేవు <ref name="prehistory">Agarwal, D.P.[http://web.archive.org/web/20090318014356/http://www.arkeologi.uu.se/afr/projects/BOOK/agrawal.pdf "Urban Origins in India"], 2006. Archaeology and Ancient History, Uppsala Universitet</ref>. దక్షిణ భారతదేశం మధ్యధరా ప్రాంతాన్ని మరియు తూర్పు ప్రాంతాన్ని కలిపే కూడలి వంటిది. [[కార్వార్]] నుంచి [[కొడంగళూర్]] వరకు గల దక్షిణ తీర ప్రాంతం ప్రాంతీయులకు మరియు విదేశీ వ్యాపారస్థులకు ప్రధానమైన వాణిజ్య కూడలిగా ఉండేది<ref name="Pillai">T.K Velu Pillai, 1940; Wilfred Schoff 1912 "Periplus Maris Erythraei" (trans) 1912, Menachery, G 1998; James Hough 1893; K.V. Krishna Iyer 1971</ref>. మలబార్ ప్రాంతం వారు మరియు [[సంగం]] ప్రాంతానికి చెందిన తమిళులు [[గ్రీకులు]], [[రోమన్లు]], [[అరబ్బులు]], [[సిరియన్లు]], [[చైనీయులు]], [[యూదులు]] మొదలైన వారితో వ్యాపార సంబంధాలు కలిగి ఉండేవారు. వీరికి ఫోయనీషియన్లతో కూడా సంపర్కముండేది<ref name="Blandstrom">(Bjorn Landstrom, 1964; Miller, J. Innes. 1969; Thomas Puthiakunnel 1973; & Koder S. 1973; Leslie Brown, 1956</ref>. దక్షిణ భారతదేశాన్ని పేరెన్నికగన్న అనేక మంది రాజులు మరియు వంశాలు పరిపాలించాయి. [[అమరావతి]]ని రాజధానిగా పాలించిన [[శాతవాహనులు]], బనవాసి [[కదంబులు]], [[పశ్చిమ గంగ]] వంశము, [[బాదామి]] [[చాళుక్యులు]], [[చేర వంశము]], [[చోళులు]], [[హోయసాలులు]], [[కాకతీయులు|కాకతీయ]] వంశపు రాజులు, [[పల్లవులు]], [[పాండ్యులు]], మణ్యకేతమునకు చెందిన [[రాష్ట్ర కూటులు]] మొదలైన చాలామంది రాజులు పరిపాలించారు. [[మధ్య యుగం]] నాటికి దక్షిణ భారతంలో [[ముస్లింలు|మహమ్మదీయుల]] పెత్తనం పెరిగింది. 1323లో [[ఢిల్లీ సుల్తాన్]] [[ముహమ్మద్ బిన్ తుగ్లక్]] సేనలు [[ఓరుగల్లు]]ను పరిపాలిస్తున్న కాకతీయులను ఓడించడంతో చరిత్రలో ఒక నూతన అధ్యాయం ఆరంభమైంది. [[గుల్బర్గా]]కు (తరువాతి కాలంలో [[బీదర్]]కు మార్పు) చెందిన [[బహమనీ సుల్తానులు|బహమనీ సామ్రాజ్యం]], మరియు [[విజయనగర సామ్రాజ్యం|విజయనగర సామ్రాజ్యానికి]] (ఇప్పటి [[హంపి]]) చెందిన రాజులకు జరిగిన ఆధిపత్య పోరాటాలు చరిత్రలో చెప్పుకోదగ్గవి. విజయనగర రాజుల పతనం మరియు బహమనీ సుల్తానుల చీలిక వల్ల హైదరాబాదు, [[గోల్కొండ]]కు చెందిన [[కుతుబ్ షాహీ వంశము|కుతుబ్ షాహి వంశస్తులు]] ప్రధాన రాజులయ్యారు. [[ఔరంగజేబు]] నాయకత్వంలోని మొఘాలాయి సేనలు దక్షిణ ప్రాంతాన్ని ముట్టడించేవరకు (7వ శతాబ్దం మధ్యవరకూ) వీరి ఆధిపత్యం కొనసాగింది. అయితే ఔరంగజేబు మరణం తర్వాత మొఘలాయిల ఆధిపత్యం సన్నగిల్లింది. దక్షిణ భారతదేశపు రాజులు ఢీల్లీ నుంచి స్వయం ప్రతిపత్తిని సంపాదించుకున్నారు. [[మైసూరు]] సామ్రాజ్యానికి చెందిన [[ఒడయార్లు]], [[హైదరాబాదు]]కు చెందిన [[ఆసఫ్ జాహీ]]లు, [[మరాఠీ]]లు అధికారాన్ని పొందగలిగారు.
 
పద్దెనిమిదవ శతాబ్దం మధ్య భాగంలో అటు [[ఆంగ్లేయులు]], ఇటు [[ఫ్రెంచి వారు]] దక్షిణ భారతదేశము యొక్క సైనికాధికారానికి ధీర్గకాలికదీర్ఘకాలిక పోరు సాగించారు. యూరోపియన్ సైన్యాలకు కొన్ని ప్రాంతీయ శక్తులకు ఏర్పడిన సంబంధాల వలన, అన్ని పక్షాలచే ఏర్పాటు చేయబడ్డ కిరాయి సైన్యాలు దక్షిణ భారతదేశంలో అల్లకల్లోలం సృష్టించాయి. ఆంగ్లేయులతో నాలుగు సార్లు జరిగిన మైసూరు యుద్ధం, మూడు సార్లు జరిగిన మరాఠా యుద్ధం వలన [[మైసూరు]], [[పూణె]], [[హైదరాబాద్]] వంటి నగరాలు కొన్ని బ్రిటిష్ వారితోనూ, కొన్ని ఫ్రెంచి వారితోనూ సంబంధం కుదుర్చుకొన్నాయి. బ్రిటిష్ వారి పరిపాలనలో దక్షిణ భారతదేశాన్ని, [[మద్రాసు ప్రెసిడెన్సీ]], [[హైదరాబాదు]], [[మైసూరు]], [[తిరువిత్తంకూర్]] ('ట్రావెంకూర్' అని కూడా వ్యవహరిస్తారు), 'కొచి' ([[కొచ్చిన్]] లేదా ''పెరంపదపు స్వరూపం''), [[విజయనగరం (కర్ణాటక)|విజయనగరం]] మరియు ఇతర చిన్న చిన్న రాజ్యాలుగా విభజించారు. రాజుల కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు ఆంగ్ల పరిపాలకులు కొన్ని ముఖ్యమైన రాష్ట్ర రాజధానులలో నివాసం ఉండేవారు.
 
స్వాతంత్ర్యానంతరం చాలావరకు దక్షిణ భారతదేశం మద్రాసు రాష్ట్రంలో ఉండేది. మద్రాసు రాష్ట్రంలో మద్రాసు ప్రెసిడెన్సీ ప్రాంతం, బనగానపల్లి, పుదుకోట్టై, సందూరు మొదలైన ప్రాంతాలు కలిసి ఉండేవి. 1953, అక్టోబరు 1న, మద్రాసు రాష్ట్రంలో తెలుగు ప్రధానంగా మాట్లాడే ఉత్తర ప్రాంత జిల్లాల పోరాటం మూలంగా భారతదేశంలో మొట్ట మొదటి సారిగా భాషా ప్రాతిపదికన ప్రత్యేక [[ఆంధ్ర రాష్ట్రం]] ఏర్పాటు అయ్యింది. నెల్లూరు జిల్లాకు చెందిన అమరజీవి [[పొట్టి శ్రీరాములు]] ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఆత్మార్పణ కావించారు. ఆ తరువాత 1956లో వచ్చిన [[రాష్ట్రాల పునర్విభజన చట్టం]] క్రింద భాషా ప్రాతిపదికన అనేక భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. తరువాత ఆంధ్ర రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ గా పేరు మార్చారు. మలయాళం మాట్లాడే వారి కోసం ప్రత్యేక [[కేరళ]] రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. 1956 తరువాత తమిళులు అధికంగా నివసించే ప్రాంతం కాబట్టి మద్రాసు రాష్ట్రం 1968లో [[తమిళనాడు]]గా రూపాంతరం చెందింది. 1972లో మైసూరు, [[కర్ణాటక]]గా మార్పు చెందింది. పోర్చుగీసు వారి స్థావరమైన [[గోవా]] 1961లో భారతదేశంలో కలపబడింది. 1987లో ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. ఇంకా ఫ్రెంచి వారి స్థావరాలైన ప్రాంతాలు 1950 నుంచి [[పాండిచ్చేరి]] అనే [[కేంద్రపాలిత ప్రాంతం]]గా పిలవబడుతున్నాయి.
పంక్తి 24:
== భౌగోళిక స్వరూపం ==
[[దస్త్రం:South India satellite.jpg|200px|thumb|2003, జనవరి 31న [[నాసా]] ఉపగ్రహము తీసిన దక్షిణ భారతదేశ ఛాయాచిత్రము.]]
దక్షిణ భారతం త్రికోణాకృతిలో ఉన్న [[ద్వీపకల్పం]]. ఎల్లలుగా తూర్పున [[బంగాళాఖాతం]], పశ్చిమాన [[అరేబియా సముద్రం]] మరియు ఉత్తరాన వింధ్య సాత్పురా పర్వతాలు కలవుఉన్నాయి. సాంస్కృతిక పరంగా దక్షిణ భారతానికి, ఉత్తర భారతానికి నర్మదా మరియు మహానదులు ఎల్లలుగా ఉన్నాయి. [[నర్మద]] నది వింధ్య మరియు సాత్పుర పర్వత లోయల మధ్య పడమర దిశగా ప్రవహిస్తుంది. సాత్పుర పర్వతాలు డెక్కను పీఠభాగానికి ఉత్తరం వైపు ఎల్లగా వుంది. అలాగే [[పశ్చిమ కనుమలు]] (Western Ghats) మరొకవైపు ఎల్లలుగాను ఉన్నాయి. పశ్చిమకనుమలు మరియు అరేబియా సముద్రం మధ్య ప్రాంతాన్ని [[కొంకన్]] అని నర్మదానదికి దక్షిణాన ఉన్న ప్రాంతాన్ని [[గోవా]] అని అంటారు.
పశ్చిమ కనుమలు దక్షిణం వైపు వ్యాపించి, కర్ణాటక తీరప్రాంతం వెంబడి [[మలనాడ్]], [[కెనరా]] ప్రాంతాలను ఏర్పాటు చేస్తూ, తూర్పు దిశగా విస్తరించిన [[నీలగిరి]] పర్వతాలతో అంతమౌతాయి. నీలగిరినే ఊటి అని కూడా పిలుస్తారు. నీలగిరి అర్థచంద్రకారంలో ఉండి [[తమిళ నాడు]],[[కేరళ]], [[కర్ణాటక]] సరిహద్దుగా ఉన్న [[పాలక్కాడ్]] మరియు [[వేనాడ్]] కొండలు, ఇంకా [[సత్య మంగళం]] అడవులు, వీటి కంటే తక్కువ ఎత్తులో తమిళనాడు - ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో గల తూర్పు కనుమలలోకి కూడా వ్యాపించి ఉన్నాయి. [[తిరుపతి]] మరియు [[అన్నామలై]] కొండలు కూడా ఈ పర్వత శ్రేణులకే చెందుతాయి.
 
పంక్తి 63:
[[File:Sri Venkateswara National Park Tirumala Hills 01.jpg|thumb|200px|శ్రీ వెంకటేశ్వర అభయారణ్యం, తిరుమల, తిరుపతి]]
దక్షిణ భారతదేశంలో ఎక్కువ భాగం ఉష్ణ మండల ప్రాంతమే. సతత హరితారణ్యాలు, మరియు ఆకురాల్చు అడవులు పశ్చిమ లోయ ప్రాంతం పొడవునా కనిపిస్తాయి.
[[File:Deccan Scrub Forests at Mastyagiri 02.JPG|thumb|200px| (Deccan Scrub Forests) ఉష్ణమండలపు పొడి అడవులు, నల్గొండ జిల్లా, ఆంధ్రప్రదేశ్‌]]
దక్కన్ పీఠభూమిలో ఉష్ణమండలపు పొడి అడవులు (Tropical Dry Forests), [[:en:South Deccan Plateau dry deciduous forests|దక్షిణ దక్కన్ పీఠభూమి ఆకురాలు అడవులు]], [[:en:Deccan thorn scrub forests|దక్కన్ చిట్టడవులు]] అధికంగా కనుపిస్తాయి. పశ్చిమ కనుమలలోని ఎత్తైన ప్రాంతాలలో [[:en:South Western Ghats montane rain forests|నైఋతి పడమటికనుమల వర్షారణ్యాలు]] ఉన్నాయి. [[మలబారు తీరపు చిత్తడి అడవులు]] తీరమైదానాలలో కనిపిస్తాయి.<ref name="netgeo_terres">{{cite web| url=http://www.nationalgeographic.com/wildworld/profiles/terrestrial_im.html| title = Indo-Malayan Terrestrial Ecoregions| accessdate = April 15, 2006}}</ref> పశ్చిమ కనుమలు జీవ వైవిధ్యానికి ప్రధాన కేంద్రాలు.<ref name="cons_intl_hotspots">{{cite web| url=http://www.biodiversityhotspots.org/xp/Hotspots/ghats/| title= Biodiversity Hotspot - Western Ghats & Sri Lanka, Conservation International| accessdate = April 15, 2006}}</ref>
 
పంక్తి 72:
== జనాభా వివరాలు ==
 
ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మరియు తమిళనాడు లతో కూడిన దక్షిణ భారతదేశం మొత్తం మీద 233 మిలియన్ జనాభా ఉన్నారు.<ref name=demographics>{{cite web |url=http://www.censusindiamaps.net/page/Religion_WhizMap1/housemap.htm |title=Census India Maps |accessdate=2006-04-11}}</ref>. ఇది వివిధ రకాలైన జాతుల, మతాల, భాషలకు పుట్టినిల్లు. వీరిలో [[ఆంధ్రులు]], [[తమిళులు]], [[కన్నడిగులు]], [[మలయాళీలు]], మరియు [[కొంకణీయులే|కొంకణీయులు]] అత్యధిక శాతం. మొత్తం జనాభాలో 83% మంది హిందువులు, 11% మంది ముస్లింలు, 5% మంది క్రైస్తవులు. భారతదేశంలో క్రైస్తవులు అత్యధికంగా ఉన్న ప్రాంతాలలో దక్షిణ భారతదేశం కూడా ఒకటి. [[రోమన్ కాథలిక్]] , [[ఇండియన్ ఆర్థోడాక్సు]], [[సిరియన్ జాకోబైట్]], [[ప్రొటెస్టంట్లు]], [[సైరో-మలబార్]], మరియు [[మర్తోమా]] మొదలైనవి కొన్ని క్రైస్తవ సాంప్రదాయాలు. [[జైనులు]], [[బౌద్ధులు]], [[యూదులు]], మరియు ఇతర మతాల వారు 1% కంటే తక్కువగా ఉంటారు.
 
[[దస్త్రం:Mattancherry palace bhagvathy kshetram.JPG|170px|thumb|left|సాంప్రదాయక 'నూనె-దీపం' కేరళ)]]
దక్షిణ భారతదేశం సగటు అక్షరాస్యతా శాతం దాదాపు 73%.ఇది భారతదేశపు సగటుకన్నా ఎక్కువ (60%).<ref name="ciaindia">{{cite web |url=https://www.cia.gov/library/publications/the-world-factbook/geos/in.html |title=CIA factbook |accessdate=2006-04-11}}</ref> కేరళ 91% అక్షరాస్యతా శాతంతో దేశంలో అగ్రస్థానాన్ని అలంకరించింది. ఇక్కడ స్త్రీ పురుష నిష్పత్తి 997 (అనగా ప్రతి వెయ్యి మంది పురుషులకు 997 మంది స్త్రీలు ఉన్నారు). దేశంలోకల్లా ఒక్క కేరళలో మాత్రమే ఈ నిష్పత్తి వెయ్యి కంటే ఎక్కువగా ఉంది.<ref name="demographics"/>. ఈ ప్రాంతంలో [[జనాభా సాంద్రత]] సుమారుగా 463. జనాభాలో 18% షెడ్యూల్డు కులాలు మరియు తెగలకు చెందిన వారు. వ్యవసాయం ప్రధాన జీవనాధారం. 47.5% మంది వ్యవసాయ సంభందమైన పనుల్లో నిమగ్నమై ఉంటారు. 60% మంది ప్రజలు శాశ్వత గృహ వసతి కలిగి ఉన్నారు. 47.8% శాతం మంది రక్షిత మంచినీటిని పొందగలుగుతున్నారు. [[ఊట బావులు]] కూడా చాలామందికి నీటిని సరఫరా చేస్తాయి. 31% శాతం మందికి ముఖ్య ప్రయాణ సాధనం సైకిలే. 36.7% శాతం మంది టివి వీక్షించగలరు. రాష్ట్ర ప్రభుత్వంచే నడుపబడే [[దూర దర్శన్]] మరియు ఇతర ప్రాంతీయ ఛానళ్ళు చాలా ఉన్నాయి.
 
=== ప్రధాన భాషలు ===
{{ద్రవిడ భాషల వంశ వృక్షం}}
దక్షిణ భారతంలో ద్రవిడ భాషలు ప్రధానమైనవి. ద్రవిడ భాషలు సుమారుగా 73 ఉన్నాయి.<ref>[http://www.ethnologue.com/show_family.asp?subid=90422 Language Family Trees - Dravidian.] [[Ethnologue]].</ref>. ద్రవిడ భాషల పుట్టుక మరియు వివిధ భాషల తోభాషలతో సంబంధం గురించి వివిధ బాషా శాస్త్రజ్ఞులు వేరు వేరు రకాలుగా చెపుతారు. 1816 లో బ్రిటిష్ అధికారి అయిన ఫ్రాన్సిస్ ఎలిస్ (Francis W. Ellis) ద్రవిడ భాషలను ఏ ఇతర భాషా సమూహానికి చెందని భాషలుగా అభివర్ణించాడు. ద్రవిడ భాషల్లో ప్రధానమైనవి [[తెలుగు]], తమిళం, కన్నడ మరియు మలయాళం. ద్రవిడ భాషలను దక్షిణ ద్రవిడ భాషలు, దక్షిణ మధ్య ద్రవిడ భాషలుగాను విభజించవచ్చు. తమిళం, మలయాళం, కన్నడ మరియు తులు భాషలను దక్షిణ ద్రవిడ భాషలుగాను; తెలుగు మరియు గోండి లను దక్షిణ మధ్య ద్రవిడ భాషలుగాను విభజించారు. 1956 లో ఏర్పడిన భాషాప్రయుక్త రాష్ట్రాలలో ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, కేరళ మరియు తమిళనాడు రాష్ట్రాలుగా విభజించారు.
 
2001 జనాభా లెక్కల ప్రకారం తెలుగు 8 కోట్లతో హిందీ తరువాతి స్థానాన్ని ఆక్రమించింది. 6.4 కోట్లతో తమిళం, 5 కోట్లతో కన్నడ మరియు 3.57 కోట్లతో మలయాళం తరువాతి స్థానాలు ఆక్రమించాయి. తెలుగు,తమిళం,కన్నడ,సంస్కృతం భాషలను భారత దేశ ప్రభుత్వం ప్రాచీన భాషలుగా (Classical Languages) గుర్తించింది. ఈ నాలుగు భాషలను జాతీయ భాషలుగా గుర్తించారు. [[ఇండో-ఆర్యన్]] సమూహానికి చెందిన కొంకణి భాషను [[గోవా]], [[కోస్తా కర్ణటక]], [[కేరళ]] మరియు [[మహారాష్ట్ర]]ల యందు విరివిగా మాట్లాడుతారు. [[కొంకణి]] భాష మీద కన్నడ మరియు మలయాళం భాషల ప్రభావం ఎక్కువగా వుండి ఈ రెండు భాషలనుండి చాలా పదాలను అరువు తెచ్చుకుంది. ఉత్తర దక్కను మరియు కొంకణ్ ప్రాంతాలలో [[మరాఠి]] ఎక్కువగా మాట్లాడుతారు. [[బార్కూరు]] సమీపంలో [[తులు]] బాషలో వున్న శాసనాలు (inscriptions) లభ్యమయ్యాయి. వీటిని జాగ్రత్త పరచడం ఎంతైనా అవసరం.
 
== ఆదాయ వనరులు ==
పంక్తి 96:
|}
 
దక్షిణ భారతదేశంలో దాదాపు 50% ప్రజలు [[వ్యవసాయం]] ప్రధాన వృత్తిగా కలిగి ఉన్నారు.<ref name="demographics"/> [[భారతదేశం]] లోని ఇతర ప్రాంతాల వ్యవసాయదారుల మాదిరిగా ఇక్కడి రైతులు కూడా ప్రధానంగా నీటి కొరకు వర్షపాతం ముఖ్యంగా [[ఋతుపవనాలు|ఋతుపవనాల]] మీదనే ఆధార పడతారు. [[వరి]], [[వేరుశనగ]], [[చెరకు]], [[పత్తి]], [[రాగి]], [[మిరియాలు]], [[పప్పు దినుసులు|పప్పుదినుసు]]లైన [[మినుములు]], [[కందులు]], [[శనగలు]] మొదలగునవి ఇక్కడ పండే కొన్ని ముఖ్యమైన పంటలు. ఇంకా [[కాఫీ]], [[తేయాకు]], [[వెనీలా]], [[రబ్బారు]] మొదలైన పంటలను కొండ ప్రాంతాలలో పెంచుతారు. కోస్తా ప్రాంతాలలో [[కొబ్బరి]] తోటలు విస్తారంగా పెరుగుతాయి. వరి పంట పండించడం లో [[ఆంధ్ర ప్రదేశ్]] భారతదేశం లోనే మొదటి స్థానంలో వుంది.,<ref name="aponline">{{cite web |url=http://www.aponline.gov.in/quick%20links/apfactfile/apfactmain.html |title=Andhra Pradesh Online |accessdate=2006-04-10}}</ref>. భారత దేశంలోని కాఫీ పంట సాగులో కర్ణాటక 70% శాతాన్ని ఆక్రమించింది. ఎడతెరిపిలేని కరువుల వలన ఉత్తర [[కర్ణాటక]], [[రాయలసీమ]], మరియు [[తెలంగాణా]] ప్రాంత రైతులు అప్పుల పాలై ఉన్న ఆస్థులుఆస్తులు అమ్ముకుని , చివరికి కొద్ది మంది ఆత్మ హత్యలు కూడా చేసుకున్నారు.<ref name=farmersuicide>{{cite web |url=http://news.bbc.co.uk/2/hi/south_asia/3769981.stm |title=BBC |accessdate=2006-04-10}}</ref> ఇక్కడ వేసవి కాలంలో నీటి ఎద్దడి కూడా ఎక్కువే.
 
ఇక పరిశ్రమల విషయానికొస్తే [[చెన్నై]] లో వాహనాలు మరియు ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తి పరిశ్రమలు చాలా ఉన్నాయి. [[బెంగుళూరు]]లో భారీ ప్రభుత్వ రంగ సంస్థల ప్రధాన కార్యాలయాలు చాలా ఉన్నాయి. ఇటీవలి కాలంలో సమాచార సాంకేతిక రంగం (ఐటి) బాగా అభివృద్దిఅభివృద్ధి చెందడంతో ఆదాయం బాగా పెరిగింది. ముఖ్యంగా బెంగుళూరు నుబెంగుళూరును భారత దేశపు సిలికాన్ వ్యాలీగా పిలుస్తారు. ఐటి కిఐటికి ఇదే ప్రధాన కేంద్రం. ఇక్కడ 200 వరకు చెప్పుకోదగిన కంపెనీలు ఉన్నాయి. [[1992]] మరియు [[2002]] మధ్యలో కర్ణాటక రూ 21,566 మిలియన్ల విదేశీ పెట్టుబడులను ఆకర్షించింది. ఇది దేశంలో నాలుగో అత్యధిక మొత్తం. [[2005]]-[[2006|06]] ఆర్థిక సంవత్సరంలో దక్షిణ భారతదేశం నుంచి సుమారు 64000 కోట్ల సాఫ్ట్‌వేర్ ఎగుమతులు జరిగాయి.<ref name="stpi">{{cite web |url=http://www.thehindubusinessline.com/2006/05/07/stories/2006050702500300.htm |title=BusinessLine article on Tamil Nadu Software Exports |accessdate=2006-10-05}}</ref>
 
తమిళనాడు యొక్క [[నికర జాతీయోత్పత్తి|నికర రాష్ట్ర ఉత్పత్తి]] చాలా రాష్ట్రాల నికర రాష్ట్ర ఉత్పత్తి కన్నా ఉన్నత స్థానంలో ఉంది.<ref name="indiabudget">{{cite web |url=http://indiabudget.nic.in/es2002-03/chapt2003/tab17.pdf |title=India Budget |accessdate=2006-04-10}}</ref>. పారిశ్రామికీకరణ విషయానికొస్తే [[కేరళ]] కొద్దిగా వెనుకబడి ఉన్నా అక్కడి ప్రజల జీవన ప్రమాణాలు మాత్రం మెరుగ్గానే ఉన్నాయి. అక్కడి తలసరి ఆదాయంలో 20% విదేశీ మారకం ద్వారా వస్తున్నదే. దీనినే కేరళ అభివృద్ధి నమూనాగా తరచూ వ్యవహరించడం జరుగుతుంది.
 
గత కొద్ది కాలం నుంచి ఐటి కంపెనీల వేతనాలు భారీగా ఉండటం మూలాన, వాటిలో పని చేసే విద్యావంతులైన యువత మంచి ఆదాయాలు గడిస్తున్నారు. మరొక వైపు పేదవారు తమ కనీస అవసరాలు తీరక అవస్థ పడుతున్నారు. మహానగరాల్లో బహుళ అంతస్థులఅంతస్తుల భవంతుల మధ్య ఇళ్ళు లేని వారు వేసుకొన్న చిన్న చిన్న గుడారాలు కనిపించడంలో ఆశ్చర్యం లేదు. తమ పిల్లలను కనీసం పాఠశాలకు కూడా పంపలేక అలాగే పేదరికంలో మగ్గుతున్న వారు ఉన్నారు. {{Fact|date=February 2007}}
 
== రాజకీయాలు ==
పంక్తి 110:
 
దేశానికి స్వాతంత్ర్యం రాక మునుపు [[మద్రాసు ప్రెసిడెన్సీ]] లో [[జస్టిస్ పార్టీ]] మరియు [[భారత జాతీయ కాంగ్రెస్]] లే కీలక పాత్ర పోషించేవి.
[[పెరియార్ ఉద్యమం]] ప్రారంభించిన [[పెరియార్ రామసామి]] 1938 లో జస్టిస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 1944లో దీని పేరు [[ద్రవిడర్ కజగం]] గా మార్పు చెందింది. దీని ప్రారంభ లక్ష్యం స్వాతంత్ర్యస్వతంత్ర భారతదేశం నుంచి ప్రత్యేక ''ద్రవిడ నాడు'' ఏర్పరచడం.<ref name="periyar">{{cite web |url=http://www.periyar.org/html/dk_movement_eng.asp |accessdate=19 April |accessyear=2006 |title="Periyar Movement- Periyar.org"}}</ref>. స్వాతంత్ర్యానంతరం పెరియార్ తమ పార్టీ ఎన్నికల్లో పాల్గొనబోదని తేల్చి చెప్పడంతో, అతని అంతరంగిక అనుచరులు కూడా ఆయనతో విభేదించక తప్పలేదు. 1948 లో పెరియార్ అనుచరుడు, మరియు ద్రవిడర్ కజగం పార్టీ ప్రధాన కార్యదర్శియైన [[అన్నాదురై]] ఆ పార్టీ నుంచి వేరుపడి [[ద్రవిడ మున్నేట్ర కజగం]] అనే పార్టీని నెలకొల్పాడు.<ref name="periyar"/>.
 
డిఎంకె పార్టీ మొట్ట మొదటి సారిగా 1968లోనూ మరలా 1978 లోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే తరువాతి సంవత్సరమే [[ఎం జి రామచంద్రన్]] డిఎంకె నుంచి విడిపోయి [[ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం]] (AIADMK) ఏర్పాటు చేశాడు. ప్రస్తుతం ఈ రెండు పార్టీలే తమిళనాడులో 60% శాతం వోటుబ్యాంకును కలిగి ఉన్నాయి.
పంక్తి 117:
 
[[దస్త్రం:Soudha.jpg|thumb|left|200px|[[బెంగళూరు|బెంగలూరు]] లోని [[కర్నాటక]] అసెంబ్లీభవనం [[విధాన సౌధ]].]]
1980 వ దశకంలో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రముఖ కథానాయకుడైన [[నందమూరి తారక రామారావు]] [[తెలుగుదేశం పార్టీ]]ని నెలకొల్పటంతో రాష్ట్ర రాజకీయాలలో కాంగ్రెస్ ఏకచక్రాధిపత్యానికి అడ్డుకట్ట పడింది. కాంగ్రెస్ ఆధిక్యాన్ని సవాలు చేస్తూ మొత్తం నాలుగు సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగింది. 1995లో భారీ మెజారిటీ తోమెజారిటీతో గెలిచిన ఒక సంవత్సరం తర్వాత ఆయనకు, భార్య [[లక్ష్మీ పార్వతి]] మరియు కుటుంబ సభ్యుల మధ్య తలెత్తిన వివాధాల వలన తెలుగుదేశం పార్టీలో చీలిక వచ్చింది. చాలామంది పార్టీ సభ్యులు రామారావు అల్లుడైన [[నారా చంద్రబాబు నాయుడు]]ను సమర్థించడంతో తర్వాత ఆయన ముఖ్య మంత్రి అయ్యారు. నాయుడు సమాచార సాంకేతిక రంగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టడంలో విశేష కృషి చేశారు. మిగతా ప్రభుత్వాలకు మార్గదర్శకుడిగా నిలిచాడు. ఇటీవలి కాలంలో తెలంగాణా ప్రాంతంలో [[తెలంగాణా రాష్ట్ర సమితి]] ప్రత్యేక తెలంగాణా నినాదంతో ప్రభావాన్ని పుంజుకుంటోంది. ఈ పార్టీ ముఖ్య లక్ష్యం ఆంధ్ర ప్రదేశ్ నుంచి తెలంగాణా ప్రాంతాన్ని వేరు చేయడమే. అది జరిగితే అప్పుదు దక్షిణాది లో ఇంకో రాష్ట్రం ఏర్పాటవుతుంది. 1990వ దశకంలో ఫ్యాక్షనిజంతో సతమతమైన కాంగ్రెస్ పార్టీ 2004 అసెంబ్లీ ఎన్నికల్లో [[వై. యస్. రాజశేఖర రెడ్డి]] నాయకత్వంలో , తెలంగాణా రాష్ట్ర సమితి తోసమితితో వ్యూహాత్మక సంధి కుదుర్చుకుని భారీ మెజారిటీతో గెలుపొంది, తెలుగుదేశం పార్టీని గద్దె దించడంలో సఫలీకృతమైంది.
 
[[జనతాదళ్]] ఇప్పటిదాకా దేశ రాజకీయాలలోకన్నా , కర్ణాటకలోనే ఎక్కువగా ప్రాచుర్యం పొందింది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, మరియు బిజెపి లుబిజెపిలు ఇతర దక్షిణ భారతదేశ రాష్ట్రాల కంటే కర్ణాటకలోనే ఎక్కువగా విజయాలను చవిచూస్తున్నాయి. కర్ణాటక రాజకీయాలను [[ఒక్కలిగ]] మరియు [[లింగాయతులు]] అనే రెండు కులాలు శాసిస్తున్నాయి.<ref name="karnatakapolitics">Price, Pamela. [http://www.isec.ac.in/Karnataka_Price16.5.05_aligned.pdf" Ideological Elements in Political Instability in Karnataka..."]. <u>University of Oslo</u></ref>. 1980లలో జనతాదళ్ దేశ రాజకీయాల్లోకి ప్రవేశంలో, [[రామక్రిష్ణ హెగ్డే]] ప్రముఖ పాత్ర పోషించాడు. అయితే అతని రాజకీయ ప్రత్యర్థి ఐన [[హెచ్ డి దేవెగౌడ]] (అప్పటి కర్ణాటక ముఖ్య మంత్రి) ప్రధాని అయ్యాడు.
 
ఇక కేరళ విషయానికొస్తే ఇక్కడ కాంగ్రెస్ నాయకత్వంలోని, [[ఐక్య ప్రజాతంత్ర కూటమి]] (యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్), మరియు [[లెఫ్ట్]] నాయకత్వం లోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ప్రధానమైనవి. లెఫ్ట్ కంచుకోటల్లో కేరళ కూడా ఒకటి. కాంగ్రెస్ మరియు కమ్యూనిస్టులు ఒకరు మార్చి ఒకరు అధికారంలోకి రావడం ఇక్కడ విశేషం.
పంక్తి 127:
{{main|దక్షిణ భారత సంస్కృతి}}
 
దక్షిణ భారతీయులు భాషాపరంగా, సాంస్కృతిక పరంగా మిగతా భారతదేశము కంటే భిన్నముగా ఉంటారు. కాని భారతీయుల మధ్య ఉన్న సంబంధాలు, భారత దేశము మొత్తము పై బడ్డ విదేశీయుల ప్రభావము వలన సంస్కృతి పై కూడా ప్రభావము కనపడుతుంది. కొంతమంది నిపుణుల అభిప్రాయము ప్రకారము దక్షిణ భారతీయుల "ప్రపంచ దృష్టి" (వెల్టన్‌షవాంగ్ ([http://en.wikipedia.org/wiki/Weltanschauung weltanschauung]) శరీర సౌందర్యము నుసౌందర్యమును [[మాతృత్వము]] ను ఆస్వాదించడము ద్వారా అనంతమైన [[విశ్వము]] ను అస్వాదించడము. ఇది వారి నృత్యము, వస్త్రధారణ, శిల్పకళల ద్వార వ్యక్తమవుతున్నది.<ref name="beck">Beck, Brenda. 1976; Bharata, 1967; Dehejia, Vidya, Richard H. Davis, R. Nagaswamy, Karen Pechilis Prentiss, 2002; Wadley, Susan, ed. 1980</ref>
 
దక్షిణ భారతీయ వనితలు [[చీర]]ను, పురుషులు లుంగీ లాగ కాని, పంచ లాగ కాని, జరీ ([http://en.wikipedia.org/wiki/Batik బేటిక్]) ఉన్న ఒక పెద్ద వస్త్రమును ([http://en.wikipedia.org/wiki/Sarong సరాంగ్]) ను ధరిస్తారు. చీర ఎక్కడా కుట్లు లేకుండా నడుము భాగము కనపడుతూ ఉంటుంది.
 
భారతీయ తత్వ శాస్త్రం ప్రకారం [[బ్రహ్మ]] యొక్క నాభి (బొడ్డు) సకల జీవ సృష్టికి ఆధార భూతమైనది. దీని వెనుక ఉన్న కారణం చాలామందికి తెలియనప్పటికీ నాభి భాగాన్ని, పొట్టనూ మూసి వేయకుండా అలాగే వదిలి వేస్తారు. ప్రాచీన [[నాట్యశాస్త్రం]] వెలిబుచ్చిన అభిప్రాయం ప్రకారం ఈ విధంగా నాభి భాగాన్ని కప్పుకోకుండా వదలి వేయడం వలన ''ఆంగికం భువనం యస్య'' ( భగవంతుని శరీరమే ప్రపంచమనే భావన) ఈ సంప్రదాయంలో ప్రతిఫలిస్తుంది.<ref name="beck">Beck, Brenda, 1976; Bharata, 1967</ref> స్ర్తీలు సాంప్రదాయంగా [[చీర]]ను ధరిస్తారు, అలాగే పురుషులు [[లుంగీ]] లేదా [[ముండు]] ను ధరిస్తారు.<ref name="Boulanger">Boulanger, Chantal; 1997</ref>
 
దక్షిణ భారతదేశ సంగీతాన్ని [[కర్ణాటక సంగీతం]] అని వ్యవహరిస్తారు. ఇది [[పురందర దాసు]], [[కనక దాసు]], [[త్యాగరాజు]], [[అన్నమయ్య]], [[ముత్తుస్వామి దీక్షితులు]], [[శ్యామ శాస్త్రి]], [[సుబ్బరాయ శాస్త్రి]], [[మైసూరు వాసుదేవాచార్యులు]], మరియు [[స్వాతి తిరునాళ్]] వంటి వాగ్గేయ కారులు ఏర్పరచిన తాళ, లయగతులతో కూడిన సంగీతం. సమకాలిక గాయకుల్లో మంగళంపల్లి బాలమురళీకృష్ణ, [[కె.జె. యేసుదాసు]] (జేసుదాసు), శ్రీమతి పట్టమ్మాళ్, కర్ణాటక సంగీతంలో ప్రముఖులు. భారత రత్న[[కీ.శే.ఎం.ఎస్. సుబ్బులక్ష్మి]], కీ.శే.మహరాజపురం విశ్వనాథన్, కీ.శే.మహరాజపురం సంతానం, కీ.శే.చెంబై వైద్యనాధభాగవతార్, కీ.శే.శంభంగుడి శ్రీనివాస అయ్యర్ ప్రభృతులు కర్ణాటక సంగీతాన్ని తారాపథానికి తీసికెళ్ళిన నిన్నటి తరపు విద్వాంసులలో కొందరు.
పంక్తి 141:
దక్షిణ భారతదేశం వివిధ నాట్యరీతులకు ఆల వాలమైంది. [[భరతనాట్యం]], [[కూచిపూడి]], [[కథాకళి]], [[యక్షగానం]], [[తెయ్యం]], [[ఒట్టంతుళ్ళ]], [[ఒప్పన]], [[కేరళ నటనం]], మరియు [[మొహినీ అట్టం]] ఇందులో ప్రధానమైనవి. భరత నాట్యం భువనైక సౌందర్యాన్ని సాక్షాత్కరింపజేస్తుంది. భరతనాట్య కళాకారులు, కళాకారిణులలో చక్కటి శరీరాకృతి, సౌష్టవమైన శరీరం, సన్నని నడుము, పొడవైన కేశాలు, ఎత్తైన జఘనాలకు (వంపు సొంపులకు) ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది.<ref name="Kallarasa">Kallarasa Virachita Janavasya Ed: G.G. Manjunathan. Kannada Adhyayana Samsthe, University of Mysore, 1974.</ref> వీరు ''నాట్య శాస్త్రం'' యొక్క తత్వానికి జీవం పోస్తారు. సగం కూర్చున్నట్లు కనిపించే '''అరైమండి''' అనే భంగిమలో మోకాళ్ళు పక్కకి వంగి ఉంటాయి. ఈ ప్రాథమిక భరతనాట్య భంగిమలో తల నుంచి నాభి వరకు ఉన్న దూరం, నాభి నుంచి భూమికి ఉన్న దూరానికి సమానంగా ఉంటుంది. అదేవిధంగా చాచిన రెండు చేతుల మధ్య దూరం, తలనుంచి నాభి వరకు ఉన్న దూరానికి సమానం. ఇది జీవము మరియు పుట్టుక కలయికయైన్ '''నాట్యపురుషుని''' వ్యక్తీకరిస్తుంది.<ref name="beck">Beck, Brenda, 1976; Bharata, 1967</ref>
 
[[దస్త్రం:Lunch from Karnataka on a plantain leaf.jpg|thumb|200px|అరటి ఆకులపై భోజనం వడ్డించే సాంప్రదాయం (ముఖ్యంగా పండుగ దినాలలో)]]
ఇక్కడి ప్రజల ప్రధానమైన ఆహారం [[అన్నము]]. చేపలు, కోస్తా ప్రాంతాలలో నివసించేవారి ఆహారంలో ఒక అంతర్భాగం. కేరళ వంటకాలలో కొబ్బరి, ఆంధ్ర వంటకాలలో పచ్చళ్ళు, కారంతో కూడిన కూరలు సర్వ సాధారణం. [[దోశ]], [[ఇడ్లీ]], [[ఊతప్పం]] మొదలైనవి కొన్ని ప్రసిద్ధి చెందిన వంటకాలు. దక్షిణ కర్ణాటక, కేరళ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలలో విస్తారమైన కాఫీ తోటలు ఉన్నాయి.
 
పంక్తి 151:
నృత్యం తరువాత [[శిల్పకళ]] ఇక్కడ కళలలో ప్రసిద్ధి గాంచింది. ఈ మాధ్యమంలో నిజస్వరూపాలను మూర్తులుగా మలచడం తక్కువ సమయంలోనే సాధ్యమౌతుంది. సాంప్రదాయిక శిల్పి ఒక శిల్పాన్ని చెక్కడం బొడ్డు నుంచి ప్రారంభిస్తాడు. శిల్పాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే, ఆత్మ మరియు పరమాత్మ యొక్క సంగమాన్ని ప్రతిబింబిస్తూ బొడ్డు శిల్పానికి సరిగ్గా కేంద్ర స్థానంలో ఉన్న విషయం తెలుస్తుంది. దేవాలయాలకు నలు వైపులా ఉన్న భవనాలు వివిధ రకాల శిల్పాలు, వివిధ రకాల భంగిమలలో అలంకరించబడి ఉన్నాయి. ఈ రకమైన నాట్య భంగిమల చిత్రణ వివిధ రకాలైన నాట్య రీతులను తరువాతి తరాల వాళ్ళకు అందజేస్తాయి.<ref name="Dehejia">Dehejia, Vidya, Richard H. Davis, R. Nagaswamy, Karen Pechilis Prentiss; 2002</ref>
 
దక్షిణ భారతదేశానికి 2000 సంవత్సరాల స్వతంత్రమైన సాహిత్య చరిత్ర ఉంది. వీటిలో మొట్టమొదట పేర్కొనదగ్గవి 2000-1500 ఏళ్ళ క్రితం తమిళంలో రాయబడ్డ [[సంగం]] కవితలు. 850 CE కి చెందిన ఒకటవ అమోఘవర్షుడు రచించిన ''[[కవిరాజమార్గ]]'' అనే రచనలో ఐదవ శతాబ్దానికి చెందిన [[దుర్వినీతుడు]] అనే రాజు యొక్క రచనలనురచనల గురించి ప్రస్తావించాడు. పదవ శతాబ్దానికి చెందిన తమిళ బౌద్ధుడు ''నెమ్రినాథం'' నాలుగవ శతాబ్దానికి చెందిన కన్నడ రచనలను ప్రస్తావించాడు. తరువాత శతాబ్దాలలో మళయాళంమలయాళం, తెలుగు సాహిత్య సాంప్రదాయాలు అభివృద్ధి చేయబడ్డాయి. ఇలంగో ఆదిగళ్ రచించిన [[శిలప్పాధికారం]] (దీనినే [[సిలప్పాటికారం]] అనికూడా అంటారు) లాంటి రచనలు గమనిస్తే దక్షిణ భారతదేశ వాసులు ప్రకృతిని ఎంతగా ఆరాధిస్తారో అవగతమౌతుంది. తొల్కప్పియార్ రచించిన [[తొల్కప్పియం]], మరియు [[తిరువళ్ళువర్]] రచించిన [[తిరుకురల్]] కూడా చెప్పుకోదగిన రచనలు. ఇక్కడి సాహిత్యంలో మరియు తత్వ శాస్త్రంలో స్త్రీని శక్తి స్వరూపిణిగా భావిస్తారు. వివాహితయైన మహిళ శుభసూచకంగా, ఆదిశక్తి స్వరూపంగా, భర్తనూ, పిల్లలనూ కంటికి రెప్పలా కాపాడుకొనే తల్లిలా భావించి గౌరవిస్తారు.
 
== భిన్నత్వం ==
[[దస్త్రం:Charminar Hyderabad.jpg|thumb|180px|[[హైదరాబాదు]] లోని [[చార్మినారు]].]]
కొన్ని శతాబ్దాల క్రిందట [[జైనమతం]] ప్రభావం ఉన్నప్పటికీ, ప్రస్తుతం మాత్రం దక్షిణ భారతదేశంలో హిందూ మత శాఖలైనటువంటి [[శైవ భక్తులు]], [[వైష్ణవులు]] ప్రధానమైన ఆధ్యాత్మిక సాంప్రదాయాలు. కర్ణాటకలో గల [[శ్రావణబెళగొళ]] జైనులకు ప్రఖ్యాతి గాంచిన పుణ్యక్షేత్రం. అదే విదంగా కర్ణాటకలోనే కల [[కొడగు]] అతి పెద్ద బౌద్ధారామాల్లో ఒకటి. చైనాలో కమ్యూనిస్టులు చెలరేగినపుడు వారి ఆగడాలను భరించలేక [[టిబెట్]] నుంచి పారిపోయి వచ్చిన చాలామంది బౌద్ధులు ఈ మఠంలోనే తలదాచుకున్నారు. ముస్లిం జనాభా కూడా ఇక్కడ కొంచెం ఎక్కువే. ప్రాచీన కాలంలో, కేరళ తీర ప్రాంతమైనటువంటి [[మలబారు తీరం]] ప్రజల్లో, ఒమన్ మరియు ఇతర అరబ్బు దేశాలు వ్యాపార సంభంధాలుసంబంధాలు కలిగి ఉండటం వలన ఇక్కడ ముస్లిం జనాభా చెప్పుకోదగిన సంఖ్యలో ఉంటుంది. ఇంకా తమిళనాడులో [[నాగపట్టణం]] (నాగూరు అని కూడా అంటారు) కూడా మహమ్మదీయుల సంఖ్య బాగానే ఉంది. ఈ పట్టణంలో పురాతన కాలానికి చెందిన [[నాగూర్ దర్గా]] కూడా ఉంది. ఇక ఆంధ్ర రాష్ట్ర రాజధానియైన [[హైదరాబాదు]] దక్షిణ భారతదేశ మహమ్మదీయ సంస్కృతికి చారిత్రక కేంద్రం. [[చార్మినార్]], [[పాతబస్తీ]] లాంటి ప్రాంతాల్లో చాలావరకు ముస్లింలే నివసిస్తుంటారు.
సెయింట్ థామస్ కేరళకు వచ్చి సిరియన్ క్రైస్తవ సాంప్రదాయాన్ని ఏర్పాటు చేయడం వలన దక్షిణ భారతదేశంలోని తీరప్రాంతాలలో క్రైస్తవ మతస్తులు అధికంగానే ఉంటారు. వీరినే సిరియన్ క్రైస్తవులు లేదా సిరియన్ మలబార్ నజ్రానీలు అని కూడా అంటారు.<ref name="LeslieBrown">Menachery G; 1973, 1998; Mundalan, A. M; 1984; Podipara, Placid J. 1970; Leslie Brown, 1956</ref>. సిరియన్ రైట్ క్రైస్తవులు, సైరో-మలబార్ చర్చి, సైరో-మలంకరా క్యాథలిక్ చర్చి,మలంకరా జాకోబైట్ సిరియన్ ఆర్థోడాక్స్ చర్చి, మార్థోమా చర్చి మొదలైనవి ఈ సాంప్రదాయం కిందకే వస్తాయి.<ref name="LeslieBrown">Menachery G; 1973, 1998; Mundalan, A. M; 1984; Podipara, Placid J. 1970; Leslie Brown, 1956</ref>. The two [[Eastern Catholic Churches]] have their Holy See in Kerala. క్యానయా అనే క్రైస్తవ-యూదు జాతి సైరో-మలబార్ చర్చి, మరియు మలంకరా జాకోబైట్ సిరియన్ ఆర్థోడాక్స్ చర్చి సాంప్రదాయాల నుంచి ఉద్బవించింది.<ref name="LBrown">Menachery G; 1973, 1998; Leslie Brown, 1956; Vellian Jacob 2001; Weil, S. 1982; Poomangalam C.A 1998</ref>
 
పంక్తి 167:
== మూలాలు మరియు రచనలు ==
<div class="references-small">
* Beck, Brenda. 1976. “The Symbolic Merger of Body, Space, and Cosmos in Hindu Tamil Nadu." Contributions to Indian Sociology 10 (2): 213-43.
* Bharata (1967). The Natyashastra [Dramaturgy], 2 vols., 2nd. ed. Trans. by Manomohan Ghosh. Calcutta: Manisha Granthalaya.
* Boulanger, Chantal; (1997) Saris: An Illustrated Guide to the Indian Art of Draping, Shakti Press International, New York. ISBN 0-9661496-1-0
పంక్తి 181:
* Zvelebil, Kamil. 1975. Tamil Literature. Leiden: Brill. ISBN 90-04-04190-7
* Economy referenced from the Encyclopaedia [[Britannica]] online.
* Some economic statistics from [http://indiabudget.nic.in Union Budget and Economic Survey, Government of India]. URL accessed April 10<sup>th</sup>10th, 2006.
* Menachery G (1973) The St. Thomas Christian Encyclopedia of India, Ed. George Menachery, B.N.K. Press, vol. 2, ISBN 81-87132-06-X, Lib. Cong. Cat. Card. No. 73-905568; B.N.K. Press
* Mundalan, A. Mathias. (1984) ''History of Christianity in India'', vol.1, Bangalore, India: Church History Association of India.
"https://te.wikipedia.org/wiki/దక్షిణ_భారతదేశం" నుండి వెలికితీశారు