దీవి గోపాలాచార్యులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ను → ను (2), చెశారు → చేసారు, బారత → భారత, గ్రంధా → గ్రంథా using AWB
పంక్తి 17:
 
==బాల్యం, విద్యాభ్యాసం==
ఈయన స్వగ్రామం. [[కృష్ణా జిల్లా]] , నాగాయలంక మండలం (దివిసీమ) లోని భావదేవరపల్లి గ్రామం . అయితే [[బందరు]] లో [[1872]] , [[అక్టోబరు 10]] న జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసానంతరం. 1886 లో తిరుపతి వెళ్ళి మహంతు పాఠశాలలో కొంతకాలం చదివారు. సంస్కృత భాషాధ్యయనం పూర్తి చేసిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేశారు. ఆ సందర్భంలోనే సాటి ప్రజల ఆరోగ్య సమస్యలను అవగాహన చేసుకొని వైద్య పరిశోధనల ల్పట్ల మక్కువ పెంచుకున్నారు. సామాజిక సేవకు ప్రాచీన హిందూ సంప్రదాయ వైద్య విధానమే ఉత్తమమని నిర్థారణకు వచ్చారు.
==పరిశోధనలు==
[[కర్ణాటక]] రాష్ట్రం చేరి, మైసూరులోని సంస్కృత కళాశాలలో చేరి, ఆయుర్వేద వైద్య విధ్యార్థిగావిద్యార్థిగా విద్యాభ్యాసం చేశారు. ప్రాచీన హిందూ వైద్య శాస్త్రాలలో ప్రధాన విభాగంగా రూపొందింన ఆయుర్వేద వైద్య చికిత్సా శాస్త్రమును ఆపోసన పట్టారు. 1893 లో వైద్య విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకొని రెండేళ్ళపాటు విస్తృతంగా దేశపర్యటనలు చేశారు. పర్యటనలు చేస్తూనే నగరాలలోని, కుగ్రామాలలోని భిషగ్వర్యులను శుశ్రూషతో సేవించి, వైద్య పరిశోధనలు చేశారు.
 
ఆయా ప్రాంతములలోని ప్రకృతివనరులను, మూలికలను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ఆ సమయంలో (1894-95) [[కలరా]] , [[ప్లేగు]] వ్యాధులు దేశమంతా వ్యాపించి వున్నాయిఉన్నాయి. సరైన చికిత్స, ప్రామాణిక మందులు లేక వందలాది మంది మృత్యువాత పడటం చూసిన ఈయన మనసు తల్లడిల్లిపోయింది.
 
[[బెంగళూరు]] లోని ధియోసాఫికల్ సొసైటీ వారి ఆసుపత్రిలో వైద్యులుగా చేరి చాలాకాలం వైద్య సేవలు అందిస్తూ, ప్రత్యక్ష శాస్త్రానుభవాన్ని సంపాదించారు. 1898-99 లో బెంగళూరు నగరాన్ని కూడా గొప్ప భయంకర ప్లేగు వ్యాధి చుట్టుముట్టింది. ప్రజల్లో భయాందోళనలు నెలకొని హాహాకారాలు చెశారుచేసారు. ఇదే సమయంలో మైసూరు మహారాజు ఈయనను రాష్ట్ర ఆస్థాన చికిత్సకులుగా నియమించారు.
==ప్లేగు మందు ఆవిష్కణ==
ప్లేగు, కలరా వ్యాధుల నిరోధానికి ప్రాచీన హిందూ సంప్రదాయ వైద్యాన్ని ఉపయోగించుకొని "శతధౌత ఘృతం" "హైమాది పంక్రమ్‌ (పానకం)" అనే రసాయనాలను సృష్టించి ఔషధ రూపంలో వ్యాధిగ్రస్తులకు అందించారు. ఆ విధంగా ప్రజలకు ఎంతో మేలు ఒకకూర్చారు.
==ఆయుర్వేదాశ్రమము==
తర్వాత కొద్దికాలానికి చెన్నపట్టణం చేరి, శ్రీకన్యకా పరమేశ్వరి ఆయుర్వేద కాలేజి అండ్ హాస్పిటల్ లో ప్రొఫెసర్ గా, వైద్యులుగా పనిచేశారు. ఇంగ్లీషు రాకున్నా ఎనిమిది భారతీయ భాషలు మీద సాధికారత సంపాదించుకున్నారు. వైద్యులుగా పనిచేస్తున్న సమయంలోనే గొప్ప పేరు ప్రతిష్టలను సంపాదించుకొని, మద్రాసులోనే ఆయుర్వేదాశ్రమమును నెలకొల్పారు. మరణించేవరకు అక్కడే ఉన్నారు. మద్రాసు ఆయుర్వేద కాలేజీకి కొంతకాలం ప్రిన్సిపాల్ గా వ్యవహరించారు. ఆయుర్వేదాంగ శల్యతంత్రము<ref>{{cite book|last1=గోపాలాచార్యులు|first1=దీవి|title=ఆయుర్వేదాంగ శల్యతంత్రము|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=Ayurvedamga%20Shalyatamtramu&author1=D.Gopala%20Charyulu&subject1=SCIENCE%20OF%20THE%20SURGERY&year=1914%20&language1=telugu&pages=100&barcode=2020120000061&author2=&identifier1=&publisher1=AYURVEDA%20SHRAMAMU&contributor1=CCL&vendor1=NONE&scanningcentre1=ccl,%20hyderabad&slocation1=NONE&sourcelib1=VEMANA%20ANDHRA%20BHASHANILAYAMU,HYDERABAD&scannerno1=&digitalrepublisher1=PAR%20INFORMATICS,HYDERABAD&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=enter%20name%20of%20the%20copyright%20owner&copyrightexpirydate1=&format1=%20&url=/data/upload/0000/060}}</ref> అనే గ్రంథం రచించారు.
 
==రచనలు==
దేశీయ ఆయుర్వేద వైద్యానికి ప్రాచుర్యం తీసుకు రావాలనే మహదాశయంతో "ఆయుర్వేదాశ్రమ గ్రంథమాల" ను ఏర్పాటు చేసి వివిధ భారతీయ భాషలలోని ప్రాచీన గ్రంధాలనుగ్రంథాలను సేకరించి, ఎంతో అరుదైన వాటిని అనువదింపజేశారు. ఈ గ్రంథమాల నుంచి దాదాపు 22 అతి ముఖ్యమైన వైద్య శాస్త్ర గ్రంథాలు వెలువడినాయి. వీటిలో మాధవ నిదానం, అర్క ప్రణాళిక, ఆయుర్వేద వైద్య పరిభాష, రస ప్రదీపిక, భేషకల్పం మొదలైన శీర్షికలతో ప్రాచీన హిందు వైద్య గ్రంథాలకు తెలుగులో చక్కని వ్యాఖ్యానాలు జోడించి, వివరించారు.
 
ఆయుర్వేద వైద్య చికిత్సకు దేశస్థాయిలో కీర్తి ప్రతిష్టలు తెచ్చిన అపర ధన్వంతరిగా పేరు సంపాదించారు. ఆధునిక కాలంలో ఆయుర్వేద వైద్య చికిత్సకు పునరుజ్జివం కల్పించారు. యావన్మందికీ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చి, వివిధ రుగ్మతలను, దీర్ఘకాలిక వ్యాధులను నయం చేసే ఎన్నో రకాల మందులను అద్భుత శైలిలో ఆవిస్కరించి, చిరకీర్తిని పొందారు.
==వైద్యసేవలకు గుర్తింపు==
ఈయన వైద్య సేవలు గుర్తింపు పొందగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో ఈయనకు అపూర్వమైన ఘన సన్మానాలు చేశారు. నాసిక్ (ప్లేగు వ్యాధితో అట్టుడికి పోయిన పట్టణం) లో "ఆయుర్వేద మార్తాండ" , కలకత్తా లో "భిషజ్ఞణి" బిరుదులు అందుకున్నారు (1907) , అయిదవ జార్జి బ్రిటీష్ పాలక ప్రభుత్వం తరపున "వైద్యరత్న" బిరుదును అందించి (1913) ప్రతిష్టాత్మక గౌరవ మన్ననలు అందించారు.
==సేవలు==
ఆయుర్వేద వైద్య జగత్తుకు ప్రచారం కల్పించటానికి అహరహం కష్టించారు. ఈయన జీవితమే భారతదేశ ఆయుర్వేద చరిత్రగా భాసిల్లింది. ఏక సంధాగ్రాహి, అవిశ్రాంత వైద్య పరిశోధకులు కావటంతో 1919 లో "శ్రీ ధన్వంతరి" పక్ష పత్రికను స్థాపించి ఆంధ్ర దేశమంతటా వ్యాపింపజేశారు. ఆయుర్వేద వైద్య ప్రచారానికి అహరహం కష్టిస్తూ తమ సంపాదనంతటినీ వ్యయపరిచారు. "ఆల్ ఇండియా ఆయుర్వేదిక్ కాంగ్రెస్" కు అధ్యక్షులుగా కొద్దికాలం ఉన్నారు. ముఖ్యంగా దక్షిణా పథంలో ఆయుర్వేద వైద్యానికి పునఃప్రాణప్రతిష్ట చేసి, యావధ్బారతయావధ్భారత ఖ్యాతి గాంచిన ఏకైక ఆంధ్రుడు. అయితే, ఈ మాత్రం చారిత్రక గుర్తింపుకు నోచుకోలేదు.
 
== మరణం ==
ఆయుర్వేద వైద్య ప్రక్రియలో నూతన ఆవిష్కారాలు చేసిన ఈయన [[1920]] , [[సెప్టెంబరు 29]] న మృతి చెందారు. మైసూర్, మద్రాస్ లలోని ప్రభుత్వ ఆయుర్వేదిక్ కాలేజీలలో ఆయుర్వేదబోధనకు ప్రత్యేకించి ప్రొఫెసర్ పదవులను ప్రవేశపెట్టడానికి కృషి చేసిన మహానుభావుడు ఈయన.
 
==సూచికలు==