దేవులపల్లి కృష్ణశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: తో → తో (2), విధ్య → విద్య, → , , → , (2) using AWB
పంక్తి 43:
 
==జీవిత విశేషాలు==
దేవులపల్లి కృష్ణశాస్త్రి [[తూర్పు గోదావరి జిల్లా]], [[పిఠాపురం]] దగ్గరలోని [[రామచంద్రపాలెం|రావు వారి చంద్రపాలెం]] అనే గ్రామంలో ఒక పండిత కుటుంబంలో [[1897]] [[నవంబరు 1]]న జన్మించాడు. అతని తండ్రి, పెదతండ్రి గొప్ప పండితులు. వారింట్లో నిరంతరం ఏదో సాహిత్యగోష్టి జరుగుతూ ఉండేది. కృష్ణశాస్త్రి చిన్న వయసునుండే రచనలు ఆరంభించాడు. పిఠాపురం హైస్కూలులో అతని విద్యాభ్యాసం సాగింది. పాఠశాలలో తన గురువులు [[కూచి నరసింహం]], [[రఘుపతి వెంకటరత్నం]] [[ఆంగ్ల సాహిత్యం]]లో తనకు అభిరుచి కల్పించారని దేవులపల్లి చెప్పుకొన్నాడు. 1918లో [[విజయనగరం]] వెళ్ళి డిగ్రీ పూర్తి చేసి తిరిగి [[కాకినాడ]] పట్టణం చేరాడు. [[పెద్దాపురం]] మిషన్ హైస్కూలులో ఉపాధ్యాయవృత్తి చేపట్టాడు.
 
ఆ కాలంలో [[వ్యావహారిక భాషావాదం]], [[బ్రహ్మసమాజం]] వంటి ఉద్యమాలు ప్రబలంగా ఉన్నాయి. కృష్ణశాస్త్రి తన అధ్యాపకవృత్తిని వదలి బ్రహ్మసమాజంలో చురుకుగా పాల్గొన్నాడు. అదే సమయంలో సాహితీ వ్యాసంగం కూడా కొనసాగించాడు. 1920లో వైద్యంకోసం రైలులో బళ్ళారి వెళుతూండగా ప్రకృతినుండి లభించిన ప్రేరణ కారణంగా "కృష్ణపక్షం కావ్యం" రూపు దిద్దుకొంది. 1922లో భార్యా వియోగానంతరం అతని రచనలలో విషాదం అధికమయ్యింది.
పంక్తి 52:
1929లో విశ్వకవి [[రవీంద్రనాధ టాగూరు]]తో పరిచయం ఏర్పడింది. వారిద్దరి మధ్య సాహితీ సంబంధాలు ఏర్పడ్డాయి. 1933-41 మధ్య కాలంలో కాకినాడ కాలేజీలో తిరిగి అధ్యాపకవృత్తిని చేపట్టాడు. 1942లో [[బి.ఎన్.రెడ్డి]] ప్రోత్సాహంతో [[మల్లీశ్వరి]] చిత్రానికి పాటలు వ్రాశాడు. తరువాత అనేక చిత్రాలకు సాహిత్యం అందించాడు. 1957లో {{fact}} [[ఆకాశవాణి]]లో చేరి తెలుగు సాహిత్య ప్రయోక్తగా అనేక గేయాలు, నాటికలు, ప్రసంగాలు అందించాడు.
 
భావ కవిగా, ‘ఆంధ్రా షెల్లీ ’గా ప్రసిద్ధులైన దేవులపల్లి వేంకట కృష్ణశాస్ర్తి... బి.ఎన్.రెడ్డి ప్రోత్సాహంతో ‘మల్లీశ్వరి (1951)’ తో’తో చిత్రరంగంలో అడుగుపెట్టారు. సినిమా పాటకు కావ్య గౌరవం కలిగించారు. ఆపాత మధురమైన కృష్ణశాస్ర్తి సాహిత్యం ఇక్షురసార్ణవం వంటిదని శ్రీశ్రీ శ్లాఘించారు. లాలిత్యం, సారళ్యం, ప్రకృతి సౌందర్యం - కృష్ణశాస్ర్తి పాటల్లోని ప్రధాన లక్షణాలు. భావోద్వేగాలకు, హృదయ స్పందనలకు అక్షర రూపమిచ్చి భావ కవితలంత సుకుమారంగా ప్రణయ విరహ గీతాల్ని రాసిన కవి. ఆత్మ నివేదన, ఆరాధన గల భక్తిగీతాలు కూడా అనేకం. రాజమకుటం, సుఖదుఃఖాలు, కలిసిన మనసులు, అమెరికా అమ్మాయి, గోరింటాకు మొదలైన చిత్రాల్లో 170 పాటలు మాత్రమే రాసిన కృష్ణశాస్ర్తి, ఈ పన్నెండుగురు పద నిర్దేశకుల్లోనూ తక్కువ పాటలు రాసిన కవి.
 
‘భక్త ప్రహ్లాద (1931)’తో ప్రారంభమైన తెలుగు సినిమా పాట ఎనభయ్యో పడిలో అడుగుపెట్టింది. ఈ ఎనిమిది పదుల కాలంలో సుమారు 400 మంది కవులు దాదాపు 34 వేల పాటల్ని (అనువాద గీతాల్ని మినహాయించి) రాశారు. ముఖ్యమైన జాబితా లో ఎవరు ఎంపిక చేసినా మహా అయితే మరో ఏడెనిమిది మంది కవుల కంటే ఆ జాబితాలో చోటు చేసుకోరు. ఇలా గుర్తింపు పొందిన కవులను కూడా జల్లెడ పడితే, తమ ప్రత్యేకతలతో తెలుగు సినిమా పాటకు దిశానిర్దేశం చేసిన కవులు 12 మంది మాత్రమే అంటే కించిత్ ఆశ్చర్యం కలగక మానదు. అందులో ఒకరు ...దేవులపల్లి కృష్ణశాస్త్రి.
పంక్తి 70:
==రచనలు==
* [[కృష్ణ పక్షము]] : ఇది కృష్ణశాస్త్రి కవితా ప్రస్థానంలోనూ, తెలుగు సాహితీ చరిత్రలోనూ ఒక ముఖ్య ఘట్టం. ఒకసారి ఆయన బెజవాడ నుండి బళ్ళారికి రైలులో వెళుతుండగా చుట్టూ ఉన్న పొలాల సౌందర్యానికీ, రైలు లయకూ పరవశించి "ఆకులో ఆకునై, పూవులో పూవునై" అని పలవరించారట. అది తెలుగు భావకవితా యుగంలో ఒక ముఖ్య క్షణం. 1922లో సంభవించిన భార్యా వియోగం ఆయన కవితలను మరింత వేదనా భరితం చేసింది.ఊహా ప్రేయసి, ఆత్మాశ్రయత్వం, ప్రవాసము, ఊర్వశి వంటి కవితలు ఈ ఖండకావ్యసంపుటిలో ఉన్నాయి.
* ఊర్వశి కావ్యము ,
* అమృతవీణ - 1992 - గేయమాలిక
* అమూల్యాభిప్రాయాలు - వ్యాసావళి
* బహుకాల దర్శనం - నాటికలు,కథలు
* ధనుర్దాసు - నాలుగు భక్తీ నాటికలు ,
* కృష్ణశాస్త్రి వ్యాసావళి - 4 భాగాలు
* మంగళకాహళి - దేశభక్తి గీతాలు
పంక్తి 86:
 
==సినిమా పాటలు==
[[మల్లీశ్వరి]] తో ప్రారంభించి కృష్ణశాస్త్రి ఎన్నో చక్కని సినిమా పాటలు అందించారు. అవి సామాన్యులనూ, పండితులనూ కూడా మెప్పించే సాహితీ పుష్పాలు. ఉదాహరణకు
* [[సీతామాలక్ష్మి]] - మావి చిగురు తినగానే కోయిల పలికేనా
* [[మేఘ సందేశం (సినిమా)|మేఘ సందేశం]] - ఆకులో ఆకునై, పూవులో పూవునై
పంక్తి 126:
జయ జయ జయ.......
*[http://www.telugubhakti.com/TELUGUPAGES/Telugu/Toranam/devulapalli.htm]
ఈ గీతాన్ని ఆయన కాకినాడ ప్రభుత్వ కళాశాలలో లక్చరర్ గా పనిచేస్తున్నపుడు వారి విధ్యార్థులవిద్యార్థుల కోసం వ్రాసారు.
===కృష్ణపక్షము నుండి===
:నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు ?
పంక్తి 205:
{{నంది పురస్కారాలు}}
{{దేవులపల్లి వేంకట కృష్ణ శాస్త్రి వంశవృక్షం}}
 
[[వర్గం:తెలుగు కవులు]]
[[వర్గం:తెలుగు సాహితీకారులు]]