నండూరి రామకృష్ణమాచార్య: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , ను → ను , హైదరాబాద్ → హైదరాబాదు, బందం → బంధం, వృ using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 24:
'''నండూరి రామకృష్ణమాచార్య''' ( 1921 - 2004) సుప్రసిద్ధ కవి మరియు విమర్శకులు.
 
వీరు పశ్చిమ గోదావరి జిల్లా [[గరపవరం]] గ్రామంలో 29 ఏప్రిల్ 1921 తేదీన జన్మించారు. వీరి తల్లిదండ్రులు: శోభనాద్రి ఆచార్యులు మరియు వెంగమాంబ. వీరు [[ఉరవకొండ]]లో ప్రాథామికప్రాథమిక విద్యను పూర్తిచేసి విజయవాడలోని ఎస్.ఆర్.ఆర్. కళాశాల విద్యను చదివారు. కవిసామ్రాట్ [[విశ్వనాథ సత్యనారాయణ]] వీరి గురువు. తర్వాత [[ఆంధ్ర విశ్వకళాపరిషత్తు]]లో ఎం.ఏ., చదివి [[మైసూరు విశ్వవిద్యాలయం]] నుండి పి.హెచ్.డి. పూర్తిచేశారు. అనంతరం భీమవరం, అనంతపురం, చిత్తూరు కళాశాలల్లో తెలుగు శాఖాధిపతిగా పనిచేశారు. పిమ్మట తాడేపల్లిగూడెం, విశాఖపట్నం, చీరాల కళాశాలల్లో ప్రధానోపాధ్యాయునిగా పనిచేశారు. [[తిరుమల తిరుపతి దేవస్థానం]] పుస్తక విభాగంలో ప్రచురణ శాఖ సంపాదకునిగా కొంతకాలం పనిచేశారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో [[అధికార భాషా సంఘం]] ఛైర్మన్ గా 1985-87 మధకాలంలో వ్యవహరించారు.
 
==వ్యక్తిత్వం==
స్వర్గీయ డా. నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య లోకంలో బహుళ ప్రసిద్ధి చెందిన మహాకవి. వీరు రచించిన ’శీర్ణ మేఖల’ ఖండ కావ్యం ఏభయ్యేళ్ళ క్రితం ఒక సంచలనాన్ని సృష్టించింది. అందులోని కర్ణ, సుయోధన మైత్రికి సంబంధించిన ఘట్టం వీరి స్వీయ కల్పితం. ఈనాటికీ అది ఒక అపురూపమైన సృజనగా నీరాజనాలందుకొంటూనే ఉంది. వీరు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ’అధికార భాషా సంఘం’ అధ్యక్షులుగా (1987- 1990) పని చేసారు. వీరి రచనలలో ’తారా తోరణం’, ’ఆలోచనం’, ’ప్రగతి గీత’, ’కవితా ప్రభాస’, ’ముత్యాల గొడుగు’, ’కచ్ఛపీ కింకిణీకం’ వంటి కవితా సంపుటులు; ’శివాజీ’, ’ధర్మ చక్రం’, ’జ్యోత్స్నాభిసారిక’, ’గోదావరి’ వంటి నాటికలు; ’కావ్యాలోకం’ అనే లక్షణ గ్రంథం; ’కవిత్రయం’, ’పద్య శిల్పం’ వంటి విమర్శన గ్రంథాలు ప్రముఖమైనవి. ఇవి గాక ఆంగ్లంలో 'Maha Bharata', 'Gandhian Era' ప్రసిద్ధ రచనలు. ’కవిత్రయం’ గ్రంథానికి ’తెలుగు భాషా సమితి’ పురస్కారాన్ని ఆనాటి [[రాష్ట్రపతి]] డా. [[సర్వేపల్లి రాధాకృష్ణన్]] చేతుల మీదుగా అందుకొన్నారు. ' Gandhian Era ' గ్రంథానికి నాటి రాష్ట్రపతి డా. శంకరదయాళ్ శర్మ ’ముందు మాట’ను వ్రాసారు. మహాకవి ’కరుణశ్రీ’, వీరు ఆత్మీయ మిత్రులు. ’కరుణశ్రీ’ గ్రంథాలన్నిటికీ ’నండూరి’ వారే పీఠికలు వ్రాసారు. ’కేంద్ర సాహిత్య అకాడమి’ 1955 ప్రాంతంలో వీరితోబాటు ’జాషువ’, ’కరుణశ్రీ’ లను ’నవ్య సంప్రదాయ కవులు’గా గుర్తించింది. ఆచార్యుల వారు ’ఆంధ్ర పద్య కవితా సదస్సు’ రాష్ట్ర స్థాయి అధ్యక్షులుగా ఆమరణాంతం పద్య కవితాభివృద్ధికై విశేష కృషిని సలిపారు.
 
నండూరివారు [[భీమవరం]] కాలెజీలోకాలేజీలో తెలుగు డిపార్టుమెంటు హెడ్ గా వుండేవారు. అక్కడ చదివినవారు ఎందరో ఉన్నతస్థాయికి ఎదిగిన వారెవారే. మైసూరు యూనివర్సిటి ప్రొపెసర్ప్రొఫెసర్ [[తంగిరాల సుబ్బారావు]], ఆంధ్ర యూనివర్సిటియూనివర్సిటీ, [[కొర్లపాటి శ్రీరామమూర్తి]]., [[ఉషశ్రీ]], మొదలగు వీళ్లంతా నా శిష్యులు. లోకానికి వెలుగు నింపిన కాగడాలు. ఈ కాగడాలని వెలిగించిన కొవ్వొత్తిని నేను. అదే నా సంతృప్తి, గర్వమూనూ అనే వారు నండూరి వారు.
 
భీమవరంలో ఉన్న తన గృహానికి "కవితాప్రభాస " అని పేరు పెట్టుకుని, కావ్వ శిల్పమయ శబ్ద తపో ముఖశాలా అని, రసరాజధాని యని [[అతిధి]] దేవులకు, సహృదయులకే గాదు శత్రువులకి కూడా స్వాగతం అని, ద్వారబంధం మీద, తలుపుల మీద రెండు అందమైన [[పద్యాలు]] చెక్కించి తాను అ ఇంట్లో వున్న పదేళ్లు అనగా 1946 నుండి 1956 వరకు, కవితా చర్చలతో, ఆత్మీయులైన అతిధి, అభ్యాగతులతో. భోజనాలతో ఆ ఇంటిని అక్షరాలా అటు రస రాజధాని గాను ఇటు అన్న[[సత్రం]]గాను మార్చి తానెంతో మంచిపని చేశానని మురిసిపోయే సంస్కారి శ్రీ నండూరి రామకృష్ణమాచార్యులు.