రక్తపోటు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''రక్తపు పోటు''' లేదా '''రక్తపోటు''' (blood pressure) అనేది రోగం కాదు, రోగ లక్షణం కాదు. ఒక వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని సంక్షిప్తంగా వర్ణించటానికి వైద్యులు నాలుగు కీలకమైన చిహ్నాలని (vital signs) వాడతారు. అవి శరీరపు [[ఉష్ణోగ్రత]] (body temperature), నాడి లేదా హృదయ స్పందన జోరు (pulse or heart rate), ఊపిరి జోరు (respiration rate), రక్తపు పోటు (blood pressure). ఈ నాలుగూ లేక పోతే ఆ వ్యక్తి మరణించినట్లే! కనుక ఈ నాలుగు కీలక చిహ్నాలూ అవధిని మించి పెరిగినా, తరిగినా మంచిది కాదు. రక్తపు పోటు అవధిని మించి పెరిగితే దానిని '[[అధిక రక్తపోటు]]'(high blood pressure or hypertension) అంటారు. ఇలా రక్తపు పోటు మితి మీరితే అది రోగ లక్షణం.
 
==రక్తపు పోటు లక్షణాలు==
పంక్తి 7:
==రక్తపు పోటు అంటే ఏమిటి?==
 
మన గుండె పని చెయ్యాలి కాని ప్రయాస పడుతూ పని చెయ్యకూడదు. రక్తపు పోటు గుండె ఎంత కష్టపడి పని చేస్తున్నాదో సూచిస్తుంది. రక్తనాళాల్లో ఉరకలు, పరుగులు తీస్తూ ప్రవహిస్తూన్న రక్తం అలల మాదిరి ప్రవహిస్తుంది. ఇలా పారుతున్న రక్తం నాళం గోడల మీద ఒత్తిడి (pressure) పెడుతుంది. ఈ ఒత్తిడి [[గుండె]] కి దగ్గరగా ఉన్నప్పుడు ఎక్కువగా ఉండి, దూరం వెళుతూన్న కొద్దీ క్రమేపీ తగ్గి, కేశనాళికల దగ్గర నెమ్మదిగా ప్రవహించి, ఆఖరున సిరలలో ప్రవేశించి నీరసించి, నెమ్మదిగా కండరాల సహాయంతో మళ్ళా గుండె చేరుకుంటుంది. కనుక శరీరం అంతటా పోటు ఒకేలా ఉండదు. వైద్యులు 'రక్తపు పోటు' అన్నప్పుడు ధమనులలో ఉన్న పీడనం (pressure). శరీరం అంతా ఈ పీడనం ఒకేలా ఉండదు కనుక సాధారణంగా జబ్బ మీద కొలుస్తారు. ఈ పోటు వేళని బట్టి, అప్పటి వరకు పడ్డ ప్రయాసని బట్టి, మనస్సులో ఉండే ఆరాటాన్ని బట్టీ, వేసుకుంటూన్న మందులని బట్టీ కూడ మారుతూ ఉంటుంది. కొందరికి వైద్యుడి పరికరాలు చూడగానే గుండె దబదబ కొట్టుకుని ఈ పోటు పెరుగుతుంది. ఇవన్నీ లెక్కలోకి తీసుకుని ఆరోగ్యంగా ఉన్న వ్యక్తుల రక్తపు పోటు 120/80 ఉంటుందని వైద్యులు నిర్ణయించేరు. ఈ విలువలు 130/85 దాటితే ఆ వ్యక్తి అధిక రక్తపు పోటు తో బాధ పడుతూన్నట్లు లెక్క. సాధారణంగా ఈ కొలతలు రెండు మూడు సార్లు తీసి, సంఖ్యలు ఎక్కువగా ఉంటేనే రక్తపు పోటు ఎక్కువయింది అని నిర్ణయిస్తారు.
 
ఇక్కడ ఉటంకించిన విషయాన్ని బట్టి రక్తపు పోటు కొలవటానికి రెండు సంఖ్యలు వాడతారని తెలుస్తోంది కదా. ఈ రెండింటిలో మొదటి సంఖ్య (ఎగువ ఉన్న సంఖ్య) సిస్టాలిక్‌ పోటు (systolic pressure), రెండవ సంఖ్య (దిగువ ఉన్న సంఖ్య) డయస్టాలిక్‌ పోటు (diastolic pressure). గుండె ముకుళించుకున్నప్పుడు రక్తం ఒక్క ఉదుటున ముందుకి వస్తుంది. అప్పుడు ఈ పోటు ఎక్కువగా ఉంటుంది. అదే సిస్టాలిక్‌ పోటు అంటే. గుండె వికసించుకున్నప్పుడు ప్రవాహం అంతిమ దశలో ఉంటుంది. అప్పుడు ఈ పోటు తక్కువగా ఉంటుంది. అది డయాస్టాలిక్‌ పోటు. పూర్వపు రోజుల్లో ఉష్ణోగ్రతనీ, రక్తపు పోటుని రస స్తంబం (mercury column) పొడుగుని బట్టి కొలిచేవారు. ఈ రోజుల్లో పాదరస స్తంబం వాడకుండానే కొలవ గలుగుతున్నారు.
పంక్తి 19:
==కొత్త చికిత్స==
*రీనల్‌సింపథెటిక్‌ నెర్వ్‌అబ్లేషన్‌ లో మూత్రపిండాలకు చేరువగా ఉండే రక్తనాళాన్ని ఎంచుకుని దానిలోకి ఓ సన్ననివైరు పంపుతారు. ఈ రక్తనాళం మోసుకెళ్లే...అధికరక్తపోటుకు కారణమయ్యే సంకేతాలను సన్నని ఈ వైరు ఛిద్రం చేస్తుంది. తద్వారా రక్తపోటును పెంచేందుకు ఉద్దేశించిన సంకేతాలు మెదడునుంచి మూత్రపిండాలకు చేరడానికిముందే అంటే...మార్గమధ్యంలోనే సమసిపోతాయి.
*రోజూ తీసుకునే ఆహారంలో మిర్చీ లాగించేయండి.మిరపలో ఉండే కాప్‌సాసిన్‌ రక్తపోటుపై ప్రభావవంతంగా పనిచేస్తుంది.మిరపలో ఉన్న ప్రత్యేక గుణాలు నైట్రిక్‌ ఆక్సైడ్‌ను ఉత్పత్తి చేస్తాయి. తద్వారా [[రక్తనాళాలు]] సురక్షితంగా ఉంటాయి.
==కొత్త మందు==
అధిక రక్తపోటు నివారణకు సరికొత్త చికిత్సా విధానాన్ని శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ విధానంతో ప్రాణాలను కాపాడడమే కాదు.. లక్షలాదిమంది రక్తపోటు బాధితుల జీవన ప్రమాణాలను పెంచవచ్చని ప్రకటించారు. ఆస్ట్రేలియాలోని మోనా ష్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు మూడేళ్లపాటు క్లీనికల్ ట్రయల్స్ నిర్వహించి ఈ విధానాన్ని రూపొందించారు. ఆస్ట్రేలియా, యూరప్‌ల్లో ఈ అధ్యయనం చేశారు. చికిత్సకు లొంగని స్థాయిలో రక్తపోటు ఉన్న రోగులకు ఆరు నెలలపాటు ఈ విధానంలో చికిత్స చేశామని, తర్వాత మూడేళ్లపాటు వారి రక్తపోటు అదుపులోనే ఉందని వివరించారు. ఈ చికిత్సా విధానాన్ని పెర్క్యుటేనియస్ రీనల్ సింపథిటిక్ డినర్వేషన్ (Percutaneous Renal Sympathetic Denervation) అని అంటారు. దీని ప్రకారం.. మెదడుకు సిగ్నల్స్ పంపే నరాలు కిడ్నీల చుట్టూ ఉంటాయి. రక్తపోటును పెంచేవి కూడా కిడ్నీలే. కిడ్నీల[[కిడ్నీ]]ల నుంచి మెదడుకు సంకేతాలు పంపకుండా వాటి మధ్య ఉన్న నరాలను నిర్వీర్యం చేస్తే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఈ విధానంలో స్వల్ప, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు కూడా ఏమీ ఉండవు. ఈ విధానంలో లోకల్ అనస్థీసియా ఇస్తారు. నిర్దిష్ట నరంపై రేడియో ఎనర్జీ ఫ్రీక్వెన్సీని ఉపయోగిస్తారు. దీంతో, కిడ్నీలకు రక్తాన్ని పం పించే ఆ నరం నిర్వీర్యం అయిపోతుంది.<ref>http://www.med.monash.edu.au/news/2013/blood-pressure-treatment.html</ref>
 
==రక్తపు పోటుని అదుపులో పెట్టటం ఎలా?==
పంక్తి 30:
 
* ప్రతి రోజూ నియమం తప్పకుండా వ్యాయామం చెయ్యటం. ప్రతిరోజూ అరగంటకి తక్కువ కాకుండా, కొద్దిగా చెమట పట్టే వరకు, గబగబ నడవటం.
* ఆహారంలో ఉప్పు తగ్గించి తద్వారా సోడియం తగ్గించటం. [[ఉప్పు]] లేక పోతే తిండి రుచించదు. కాని సాధ్యమయినంత వరకు ఉప్పుని మితిగా వాడటం చిన్నప్పటినుండి అలవాటు చేసుకొనటం మంచిది.
* మనస్సుకి ఆరాటం, ఉద్విగ్నత (anxiety, stress) తగ్గించటం. యోగ మంత్రం జపం చెయ్యటం వల్ల రక్తపు పోటు అదుపులోకి వస్తుందనటానికి ఆధారాలు ఉన్నాయి.
* మాదక ద్రవ్యాలని సేవించేటప్పుడు మితి మీరకుండా ఉండటం. [[ఆల్కహాలు]], సారా వంటి మాదక ద్రవ్యాలు మోతాదులో పుచ్చుకుంటే పరవాలేదు కాని, మితి మీరితే ప్రమాదం. ఆడవారి యెడల విచక్షణ చూపటం కాదు కానీ, మగ వారు బరించగలిగే మోతాదులో సగమే స్త్రీలు భరించగలరు. గర్బిణి స్త్రీలు - ఆరోగ్యంగా ఉన్నా సరే - మాదక ద్ర్వ్యాలు మూట్టకూడదు.
 
ఈ సలహాలు పాటిస్తే ఎంతెంత లాభం ఉంటుందో (అంటే ఈ సలహాలు పాటించటం వల్ల సిస్టాలిక్‌ పోటు ఏ మాత్రం తగ్గుతుందో ఈ దిగువ పట్టికలో చూపటం అయింది.
పంక్తి 47:
| పథ్యం చెయ్యాలి
| కొవ్వు తక్కువ ఉన్న పాలు,
పళ్ళు, [[కాయగూరలు]], తింటే..
| 8 నుండి 14 పాయింట్లు
|- align="left"
| రోజూ [[వ్యాయామం]] చెయ్యాలి
| చెమట పట్టే వరకు 30 నిమిషాలు గబగబ నడిస్తే..
| 4 నుండి 9 పాయింట్లు
పంక్తి 72:
ఆహారములో ఉప్పు వాడకము తగ్గించాలి. రోజుకు 5 గ్రాములకంటే మించి ఉప్పు వాడొద్దు . ముఖ్యము గా ప్రాసెస్డ్ , ప్యాకేజీపధార్ధములు , ఫాస్ట్ పుడ్స్ , క్యాన్డ్ పధార్ధములు తినడము బాగా తగ్గించాలి. ఎందుకంటే ఇందులో అదనపు ఉప్పు ఉంటుంది. సోడియం క్లోరైడ్ బి.పి.ని అధికము చేస్తుంది.
 
[[పొటాషియం]] : ఇది బి.పి.ని తగ్గిస్తుంది .బీన్స్ , జఠాణీలు, నట్స్ , పాలకూర , జ్యాబేజీ , కొత్తిమిర , అరటి , బొప్పాయి, ద్రాక్ష , కమలా , నారింజ , నిమ్మ వంటి పండ్లలలో పొటాషియం లభిస్తుంది. తక్కువ [[సోడియం]] , ఎక్కువ పొటాషియం గల పండ్లు రక్తపోటు తగ్గించడము లో బాగా ఉపయోగపడతాయి. [[కొబ్బరి]] నీరులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది.
 
కొవ్వు పదార్ధములు : వీటివలన రక్తము లో కొలెస్టిరాల్ పెరిగి బిపి ఎక్కువయ్యేందుకు దోహదపడుతుంది. నూనెలు ద్రవరూపములో ఉన్న కొవ్వులు. వీటి వాడాకము తగ్గించాలి. ఏ రకమైన పచ్చళ్ళు , [[ఆవకాయ]] , [[కారం]] ఊరగాయ వంటి వాటిలో నూనెలు ఎక్కువగా ఉంటాయి. తక్కువ మోతాదులో వాడాలి. జంతు మాంసాలలో కొవ్వు ఎక్కువ ఉంటుంది.
 
ఆహారములో మార్పులు : ఎక్కువ పీచు పదార్ధము ఉన్న వాడాలి. పండ్లు , కాయకూరలు , [[ఆకు కూరలు]] , పప్పులు వాడాలి. రోజుకు కనీషము 5 సర్వింగులు పండ్లు , కూరకాయలు తింటుండాలి. సాష్ లు , ఊరగాయలు బాగా తగ్గించాలి.
 
ఆల్కహాలు : అలవాటు ఉండే వారు మానివేయాలి , . . లేదా పరిమితులు ఉండాలి. ఆల్కహాల్ ఎక్కువ కేలరీలు ఉన్న పానీయము .
 
పొగ త్రాగడము : దీనిలో నికొటిన్‌ ఉండడము వలన రక్తనాళాల పై ప్రబావము చూపుతుంది. పొగతాగడం వల్ల రక్తనాళాలు కుంచించుకుపోతాయి.
పంక్తి 87:
[[ఫైలు:Blutdruck.jpg|thumb| [[స్ఫిగ్మోమానోమీటర్]], ధమనీ పీడనాన్ని కొలిచే యంత్రం]]
శరీరంలో ప్రసరించే [[రక్తం]], రక్తనాళాలపై కలిగించే ఒత్తిడిని '''రక్త పీడనం''' లేదా '''రక్తపోటు''' అంటారు. శరీరము యొక్క ప్రధాన జీవ లక్షణాలలో రక్తపోటు ఒకటి. ధమనులు, ధమనికలు, రక్తనాళాలు మరియు శిరల ద్వార రక్తం ప్రవహించే క్రమంలో దాని పీడనం తగ్గుతూ వస్తుంది. సాధారణంగా రక్తపీడనం అని వ్యవహరించేటప్పుడు ధమనీ పీడనాన్ని (గుండెనుండి రక్తాన్ని ఇతర అవయవాలకు చేరవేసే పెద్ద ధమనులలోని పీడనం) పరిగణిస్తారు.
ధమనీ పీడనాన్ని సాధారణంగా [[స్ఫిగ్మోమానోమీటర్]] అనే యంత్రంతో కొలుస్తారు. ఇది [[పాదరసం]] యొక్క నిలువుటెత్తుతో ప్రసరించే రక్తం యొక్క ఒత్తిడిని సూచిస్తుంది.
 
==వనరులు==
"https://te.wikipedia.org/wiki/రక్తపోటు" నుండి వెలికితీశారు