ఆరుద్ర: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
ChaduvariAWB (చర్చ | రచనలు) AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో, లో → లో , వైవిద్య → వైవిధ్య, → using AWB |
||
పంక్తి 35:
}}
తెలంగాణా పోరాట ఇతివృత్తంతో రాసిన [[త్వమేవాహం]] (1949) కావ్యం చదివి ఇక నేను పద్యాలు రాయక పోయినా పరవాలేదు అని మహాకవి [[శ్రీశ్రీ]] ప్రశంస పొందిన '''ఆరుద్ర''' ( [[ఆగస్టు 31]], [[1925]] - [[జూన్ 4]], [[1998]]) పూర్తిపేరు '''భాగవతుల సదాశివశంకర శాస్త్రి''' . [[శ్రీశ్రీ]] తర్వాత యువతరంపై ఎక్కువ ముద్ర పడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త మరియు విమర్శకుడు.<ref>"ఆరుద్ర" మేడిపల్లి రవికుమార్, [[సాహిత్య అకాదెమీ]], 2007 ప్రచురణ ISBN 81-260-2333-3</ref><ref>ది హిందూ ఆంగ్లపత్రిక అధికారిక వెబ్సైట్ నుండి [http://www.hinduonnet.com/thehindu/mp/2002/08/19/stories/2002081900840200.htm A humanist lyricist] వివరాలు[[జూన్ 23]],[[2008]]న సేకరించబడినది.</ref> ఈయన భార్య [[కె.రామలక్ష్మి]] కూడా ప్రముఖ [[తెలుగు]] రచయిత్రి.[[ఫైలు:ARUDRA BY BAPU.png|200PX|left|thumb|'''ప్రముఖ చిత్రకారుడు [[బాపు]] గీసిన ఆరుద్ర రేఖా చిత్రం''']]
ఆరుద్ర [[1925]], [[ఆగస్టు 31]]న [[విశాఖపట్నం]]లో జన్మించాడు. [[విశాఖపట్నం]] ఎ.వి.యన్. కాలేజీ ఉన్నత పాఠశాల లో, తర్వాత [[విజయనగరం]]లో యం.ఆర్.కళాశాలలో ఆరుద్ర విద్యాభ్యాసం చేశాడు. క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో చదువుకు స్వస్తి పలికి 1943-47 మధ్యకాలంలో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో గుమ్మస్తాగా పనిచేశాడు. ఆ తర్వాత కొంతకాలం సంగీతంపై దృష్టిని నిలిపాడు. 1947-48 లో చెనై నుంచి వెలువడే ప్రముఖ వారపత్రిక ' [[ఆనందవాణి]] 'కి
==సాహిత్య సేవ==
1946 లో [[చెన్నై]] వచ్చిన ఆరుద్ర కొంతకాలం పాటు చాలా కష్టాలు అనుభవించాడు. తినడానికి తిండిలేక పానగల్
తెలుగు సాహిత్య ప్రపంచానికి ప్రాపంచిక దృష్టితోపాటు భౌతిక దృక్పథాన్ని పరిచయం చేసిన సాహితీ ఉద్యమం అభ్యుదయ సాహిత్యం . అభ్యుదయ సాహిత్యంలో పరిచయం అవసరం లేని సాహితీ మూర్తుల్లో ఆరుద్ర ఒకడు. వివిధ రంగాల్లోనే కాక వివిధ ప్రక్రియల్లో ఆరితేరిన అరుదైన వ్యక్తి ఆరుద్ర. [[త్వమేవాహం]], [[సినీవాలి]], [[కూనలమ్మ పదాలు]], [[ఇంటింటి పద్యాలు]] వంటి అనేక కావ్యాలతో పాటు '''వెన్నెల- వేసవి''', '''దక్షిణవేదం''', '''జైలుగీతాలు''' వంటి అనువాద రచనలు '''రాదారి బంగళా''', '''శ్రీకృష్ణదేవరాయ''', [[కాటమరాజు కథ]] వంటి అనేక రూపకాలుతో పాటు కొన్నికథలనూ, నవలలనూ కూడా రచించాడు. [[సమగ్ర ఆంధ్ర సాహిత్యం]] ( 14 సంపుటాలు) ఆరుద్ర పరిశోధనాదృష్టికి పరాకాష్ట. దీనికోసం మేధస్సునే కాకుండా, ఆరోగ్యాన్ని కూడా ఖర్చుపెట్టాడు. '''వేమన వేదం''', '''మన వేమన''', '''వ్యాస పీఠం''', '''గురజాడ గురుపీఠం''', ప్రజాకళలో ప్రగతివాదులు వంటివి ఆరుద్ర సాహిత్య విమర్శనా గ్రంథాలు. '''రాముడికి సీత ఏమౌతుంది?''','''గుడిలో సెక్స్''' వంటి రచనలు ఆరుద్ర పరిశీలనా దృష్టికి అద్దంపడతాయి. సంగీతం పైనా, నాట్యం మీద రచించిన అనేక వ్యాసాలు ఇతర కళల్లో ఆరుద్ర అభినివేశాన్ని పట్టి చూపిస్తాయి. [[చదరంగం]] పైనకొన్ని దశాబ్ధాలకు పూర్వమే ఒక గ్రంథాన్ని ప్రకటించడం ఆరుద్రలోని మరో ప్రత్యేకత. ఇలా పలు రచనా ప్రక్రియలలో చేపట్టి, కవిత్వం- పరిశోధనా రెంటినీ వినియోగిస్తూ కవి పరిశోధకుడిగా నవ్యత కోసం పరితపించిన నిత్య శోధకుడు [[హేతువాది]] ఆరుద్ర.
పంక్తి 50:
* ఏటికేడాది
* శుద్ధ మధ్యాక్కరలు.
* శ్రీశ్రీతో కలసి రుక్కుటేశ్వర శతకం,
* శ్రీశ్రీ వరదలతో కలసి సాహిత్యోపనిషత్,
|