ఇందిరా నాథ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), → , , → ,, ( → ( using AWB
పంక్తి 31:
}}
 
'''ఇందిరా నాథ్''' (Indira Nath) (జ. [[14 జనవరి]], [[1938]]) సుప్రసిద్ధ భారతీయ [[శాస్త్రవేత్త]]. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం [[బ్రాహ్మణకోడూరు]] గ్రామానికి చెందిన వెంకటరావు,నాగరత్నమ్మ తల్లిదండ్రులు.
 
==జీవిత విశేషాలు==
[[గుంటూరు]] లో ఎన్.వి. రావు, లకు జన్మించింది. కొత్తఢిల్లీలోని భారత వైద్య శాస్త్ర సంస్థ లోసంస్థలో (AIIMS) 1963లో M.B.B.S, 1969లో M.D పట్టాలు పొందింది. ఇంగ్లాండ్ లో 1983 లో M.R.C.P (Pathology) పట్టా పొందింది.ఆ తర్వాత ఎం.ఎన్.ఎ.ఎమ్‌ . ఎస్. మరియు ఎఫ్.ఎ.సి.ఐ; ఎఫ్.ఎన్.ఎస్.సి డిగ్రీలను కూడా పొందారు.. .
==ఉద్యోగాలు==
తొలుత లండన్ నగరములోని ఈస్ట్ సఫొల్క్ వైద్యశాలలో (1963-64), తరువాత కార్డిఫ్ నగరములోని వైద్య కళాశాలలో (1964), లండన్ లోని రాష్ట్రీయ హృదయ వైద్యశాలలో (1965) పనిచేసింది. 1965లో సెయింట్ ఆండ్రూస్ వైద్యశాలలో రిజిస్ట్రార్ గా నియమించబడింది. 1967లో స్వదేశము వచ్చి AIIMS లో బయోటెక్నాలజీ విభాగానికి అచార్య పదవి (1967 - 71) చేబట్టారు. సత్యేంద్రనాథ్ బోస్ రీసెర్చ్ సంస్థలోప్రొఫెసర్ గా ఉంటూ (1999) ఎంతో మంచి వైద్య విద్యార్థుల పరిశోధనలకు ఊతమిచ్చారు.
== పరిశోధనలు==
వ్యక్తులలో తీవ్ర ఆరోగ్య నష్టాలకు దారితీసే క్లిష్టమైన సమస్యలను కనుగొనడంలో, సునాయాసంగా, ముదస్తుగా కుష్టువ్యాధిని గుర్తించేందుకు రెండు "ఎం లెఫ్రాయ్" ప్రోటీను అన్వేషించి కనుగొనడాంలో ఈమె పరిశోధనలు ఎంతో మార్గదర్శకం వహించాయి. మూడు నుంచి ఆరు వారాల లోపుగానే '''లెప్రా బాలిల్లి''' (శరీరమంతా వ్యాపించిన లెప్రొమా కంతులు) ని సూక్ష్మ దర్శిని ద్వారా కనుగొనడాన్ని వివరించారు. వంశపారంపర్యంగా తలెత్తు శోష రస కణముల అసాధారన అభివృద్ధిని, వాటి పనితీరును తన పరిశోధనల ఫలితాల ద్వారా వెల్లడించారు. ఉత్తమ స్థాయి ఔషధాల ద్వారా కూడా సాధించలేని వ్యాధి నివారణకు మూలములను కనుగొన్నారు.. కుష్టువ్యాధి బయల్పడక పూర్వమే, దాని ఆనుపానులను కనుగొని మూలములను నశింపజేయటానికి అవసరమైన చికిత్సలను కనుగొని, మన దేశములో కుష్టువ్యాధి వ్యాపించకుండా ఉండటానికి తమ వంతు కృషి చేసి విజేత కాగలిగారు.
 
[[కుష్టు వ్యాధి]] మీద ఈమె చేసిన పరిశోధనలు ప్రపంచ ప్రసిద్ధమైనవి. ఈమె ప్రస్తుతం [[అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ]]లోని బయోటెక్నాలజీ విభాగానికి అధిపతిగా ఎస్.ఎన్.బోస్ కేంద్రంలో పరిశోధకులుగా చిరకాలంగా పనిచేస్తున్నారు. ప్రొఫెసర్ నాథ్ కుష్టు వ్యాధి మీదనే కాకుండా మానవులలో వ్యాధి నిరోధక ప్రక్రియ (ఇమ్యునాలజీ) మీద జరిపిన పరిశోధనలు వైద్యంలోను, కొత్తగా వ్యాధులగురించి చేసే పరీక్షలు అభివృద్ధి చేయడానికి ఉపకరిస్తాయి.
==సంపాదకులుగా==
ఈమె "ఇండియన్ జర్నల్ ఆఫ్ లెప్రసీ" , "ఆసియన్ ఫసిఫిక్ జర్నల్ ఆఫ్ ఎలర్జీ అండ్ ఇమ్యూనిటీ" పత్రికలకు సహాయ సంపాదకులుగా పనిచేశరు. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వారి ప్రచురనల సంపాదక మండలికి ఛైర్ పర్సంగా కూడా వ్యవహరించారు.
==వివిధ పదవులు==
పరిశోధనా రంగంలో ఎంతో కృషి చేసిన డాక్టర్ ఇందిర ఇండియన్ అకాడామీ ఆఫ్ సైన్సెస్, కాలేజీ ఆఫ్ అలర్జీ అండ్ అప్లైయడ్ ఇమ్యూనాలజీ సంస్థలలో ఫెలోషిప్ అందుకుని పరిశోధనలు సల్పారు. పలు ప్రతిష్టాత్మక వైద్య సంస్థలలో వివిధ పదవులను అందుకుని, ఆయా సంస్థల అభివృద్ధికి కృషిచేసరు. [[నేషనల్ అకాడామీ ఆఫ్ మెడికల్ సైన్సెస్]], ఇండియన్ ఇమ్యూనాలజీ సొసైటీ, ఇండియన్ అసోషియేషన్ ఆఫ్ పాథాలజిస్ట్స్ అండ్ మైక్రో బయోజజిస్ట్స్ మొదలగు సంస్థలలో బాధ్యతాయుత పదవులను నిర్వహించారు. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లెప్రొలాజిస్ట్స్ జీవిత సభ్యులుగా ఉన్నారు.
పంక్తి 66:
*[http://www.agora.forwomeninscience.com/education_of_girls_and_women/2006/04/too_many_brains_are_going_to_w.php Interview to L'Oreal]
* http://insaindia.org/detail.php?id=N92-1095
 
[[వర్గం:సుప్రసిద్ధ భారతీయులు]]
[[వర్గం:పద్మశ్రీ పురస్కార గ్రహీతలు]]
"https://te.wikipedia.org/wiki/ఇందిరా_నాథ్" నుండి వెలికితీశారు