ఎర్రకోట: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWB (చర్చ | రచనలు) AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ని → ని (3), గా → గా , బందిం → బంధిం, బడినది. → బడింది., ఉన్న using AWB |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి →కోట ఈనాడు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: పని చేస్తు → పనిచేస్తు using AWB |
||
పంక్తి 73:
ఒక కాలములో, 3000 మంది కంటే ఎక్కువ జనము ఢిల్లీ కోట సముదాయము లోపల నివసించేవారు. కాని [[1857]] సంవత్సరములోని [[సిపాయిల తిరుగుబాటు]] అనంతరం, [[బ్రిటన్]] ఈ కోటని కైవసం చేసుకొని, నివాస రాజభవనాలని నాశనం చేసింది. ఈ కోట బ్రిటిష్ ఇండియన్ సైన్యం యొక్క కేంద్ర స్థావరముగా మార్చబడింది. తిరుగుబాటు జరిగిన వెనువెంటనే బహదూర్ షా జఫర్ మీద ఎర్రకోటలో విచారణ జరిపించారు. ఇక్కడే నవంబరు 1945లో, [[ఇండియన్ నేషనల్ ఆర్మీ]]కి చెందిన మూడు అధికారుల మీద, ప్రసిద్ధి చెందిన సైన్య విచారణ జరిగింది. 1947లో భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తరువాత, [[భారత సైన్యం]], ఈ కోటని తన కైవసం చేసుకుంది. డిసెంబర్ 2003లో భారత సైన్యం, ఈ కోటని భారత పర్యాటక అధికారులకు స్వాధీనం చేసింది.
ప్రస్తుతం మొఘల్ చరిత్రని వివరించే ఒక [[ధ్వని మరియు కాంతి ప్రదర్శన]] సాయంత్రం జరిగుతుంది. ఇది పర్యాటకులని ఎంతగానో ఆకర్షిస్తుంది. ముఖ్యమైన వాస్తుశిల్ప కళారూపాల యొక్క పరిస్థితి మిశ్రమంగా ఉంది. విస్తరించి ఉన్న నీటి వనరులలో వేటిలోనూ నీరు లేదు. కొన్ని కట్టడాలు ఒక మోస్తరుగా మంచి పరిస్థితిలోనే ఉన్నాయి. వాటి అలంకరణలు కూడా అదే పరిస్థితిలో ఉన్నాయి. మరి కొన్నిట్లో పాలరాతి పూల చెక్కుడులని జులాయిలు మరియు దోపిడీదార్లు తీసివేశారు. తేనీరు భవనము చారిత్రాత్మిక పరిస్థితిలో లేనప్పటికీ, ప్రస్తుతం ఇది ఒక
లాహోర్ ద్వారము నుండి ఆభరణాలు, చేతిపనికారుల తయారు చేసిన వస్తువుల చిల్లర విక్రయము చేసే ఒక దుకాణ సముదాయం వస్తుంది. "రక్తపు చిత్రాలని" ప్రదర్శించే ఒక మ్యూజియుం ఉంది. దీంట్లో 20వ శతాబ్దానికి చెందిన ప్రాణత్యాగం చేసిన భారతీయ యువకుల చిత్రాలు, వాళ్ళ త్యాగానికి సంబంధించిన వివరాలు ప్రదర్శించారు. భవన నిర్మాణ కళకి సంబంధించిన మ్యూజియుం మరియు భారత యుద్ధ స్మారక చిహ్నాల మ్యూజియం ఉన్నాయి.
|