తూము లక్ష్మీనరసింహదాసు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 32:
 
 
దాసు భారతదేశం అంతా సంచరించి తాను దర్శించిన దేవతలను పద్య కుసుమాలతో పూజించాడు. కాలినడకన దాసు కాశీయాత్ర, [[పూరీ]], [[కుంభకోణం]], [[తిరువయ్యూరు]] దర్శించాడు. మహాభక్తుడైన [[త్యాగరాజు]] దాసుని ఎదుర్కొని కీర్తనలు గానం చేస్తూ స్వాగతం చెప్పాడు. తరువాత [[కాంచీపురం]], [[తిరుపతి]], [[అయోధ్య]], [[హరిద్వారం]] కూడా దర్శించాడు. అక్కడ నుండి భద్రగిరి చేరిన దాసుకు, శ్రీరామునికి జరుగవలసిన పూజాదికాలు కుంటుపడటం, బాధ కలిగించింది. [[రామచంద్రుడు]] ఒకనాటి రాత్రి కలలో కన్పించి [[హైదరాబాదు]]లో మంత్రిగా ఉన్న చందూలాల్ అనే తన భక్తుని దర్శించమని అజ్ఞాపిస్తాడు. కలిసిన నరసింహ దాసును [[భద్రాచలం]], [[పాల్వం]]చ పరగణాలకు పాలకునిగా నియమించాడు. నాటి నుండి భక్త నరసింహదాసు రాజా నరసింహదాసుగా ప్రసిద్ధిచెందాడు. ఆ రోజులలో నరసింహదాసు, అతని శిష్యుడు [[వరద రామదాసు]] తమ ఐశ్వర్యాన్ని [[భద్రాద్రి]] రాముని కైంకర్యానికే వినియోగించారు. [[భద్రాచలం]] కలియుగ వైకుంఠంతో తులతూగినది. నారద తుంబురులే, నరసింహ, వరద రామదాసులుగా దివి నుండి భువికి దిగివచ్చారని భక్తులు భావించారు.