కమలాకర కామేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎సినీ విమర్శకునిగా: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → , ను గురించి → గురించి using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: పని చేశాడు → పనిచేశాడు (3) using AWB
పంక్తి 50:
ఇక మానసంరక్షణం చిత్రానికి [[ఎన్.జగన్నాథ్]] దర్శకత్వం వహించాడు. ఇందులో దుర్యోధన పాత్ర ధరించింది [[బళ్ళారి రాఘవ]] కాగా అందులో [[యడవల్లి సూర్యనారాయణ]]. కథ నడిపిన విధానం, నటన మానసంరక్షణంలో బాగున్నాయని కామేశ్వరరావు వ్రాశాడు.
 
ఈ విమర్శలను [[నార్ల వెంకటేశ్వరరావు]], [[గూడవల్లి రామబ్రహ్మం]] లాంటి ప్రముఖులందరూ ప్రశంసించారు. రామబ్రహ్మం 'వస్త్రాపహరణం' సినిమాలో పని చేశాడుపనిచేశాడు. అయినా కామేశ్వర రావు విమర్శలను మెచ్చుకున్నాడు! ఈ 'వస్త్రాపహరణం', 'మానసంరక్షణం' చిత్రాల మీద వ్రాసిన విమర్శలే కామేశ్వర రావును చిత్ర పరిశ్రమలో ప్రవేశ పెట్టాయి.
 
==రంగ ప్రవేశం==
హెచ్.ఎం.రెడ్డి '[[కనకతార]]' తీస్తున్న రోజుల్లో కామేశ్వరరావు [[మద్రాసు]] వచ్చాడు. తాను 'సినీఫాన్' అనే పేరుతో కృష్ణా పత్రికలో సినిమాల గురించి విమర్శలు వ్రాస్తూ ఉంటానని చెప్పి 'మానసంరక్షణం', 'వస్త్రాపహరణం' చిత్రాల మీద తాను వ్రాసిన విమర్శలు చూపించాడు - వాటిల్లో ఆర్థికంగా హిట్టైనా సరే, బాగాలేదని తాను వ్రాసిన వస్త్రాపహరణం సినిమా తీసిన హెచ్.ఎం.రెడ్డి కి! కానీ విమర్శలు పూర్తిగా చదివి హెచ్.ఎం.రెడ్డి ఆయన్ను అభినందించాడు!! "చాలా బాగుంది" అని మెచ్చుకున్నాడు!! పైగా తన సినిమాను విమర్శించి, దానికి పోటీగా ఇంకొకరు తీసిన సినిమాను ప్రశంసించిన కామేశ్వరరావుకు ఉద్యోగమివ్వడానికి సిద్ధపడ్డాడు ఆయన.
 
[[గృహలక్ష్మి]] సినిమా ప్రారంభానికి ముందు కబురందుకుని కామేశ్వరరావు మద్రాసు చేరుకుని [[రోహిణీ]] సంస్థలో చేరాడు. అయితే ఆ సినిమాలో పనిచేసేనాటికి ఆయనకు సినిమాలలో పని చేసినపనిచేసిన అనుభవం లేదు కాబట్టి జీతం లేదు కానీ భోజనం, వసతి సౌకర్యాలు ఉచితంగా ఏర్పాటు చేశారు. కామేశ్వరరావు రోహిణీ వారి లాడ్జిలోనే వుండేవారు. (ఆ రోజుల్లో ఒక సినిమాలో పని చేసే వాళ్లందరికీ ఒకే లాడ్జిలో వసతి, భోజనాలు ఏర్పాటు చేసేవారు). రోహిణీలో చేరడంతో ఆయనకు పెద్దవారితో పరిచయాలు ఏర్పడ్డాయి. [[రామ్‌నాథ్]], [[ఎ.కె.శేఖర్]], [[బి.ఎన్.రెడ్డి]], [[కె.వి.రెడ్డి]], [[సముద్రాల రాఘవాచార్య]] మొదలైన వారు పరిచయమయ్యారు. కె.వి.రెడ్డి అప్పుడు రోహిణిలో క్యాషియర్ గా ఉండేవాడు. పెద్ద, చిన్న భేదం లేకుండా అందరూ ఒకే చోట భోజనాలు చేసేవారు. ఒక్కసారే ఒకే కార్లో షూటింగుకు బయల్దేరే వారు. అంతా ఒక కుటుంబంలా ఉండేవారు.
 
కామేశ్వరరావుకు ఆ సినిమాలో జీతమేకాదు, పని కూడా ఏమీ ఉండేది కాదు. ప్రతిరోజూ తప్పనిసరిగా ఏదో ఒక సినిమా చూసేవాడు. రాత్రయాక లాడ్జిలో పడుకుని కె.వి.రెడ్డి, ఆయనా ఆ సినిమా గురించి చర్చించుకునేవారు. అలా వారిద్దరూ బాగా సన్నిహితులైనారు. గృహలక్ష్మి చిత్రం పూర్తయాక బి.ఎన్.రెడ్డి, రామ్‌నాథ్, ఎ.కె.శేఖర్ తదితరులంతా కలిసి [[వాహినీ సంస్థ]] స్థాపించారు. దాంట్లో కామేశ్వరరావు సహాయ దర్శకుడుగా చేరాడు. కె.వి.రెడ్డి ప్రొడక్షన్ మానేజరు, బి.ఎన్.రెడ్డి దర్శకుడు. వాహినీ వారి [[దేవత]] చిత్రం నుంచి కామేశ్వరరావు అసోసియేట్ గా పని చేశాడుపనిచేశాడు. ఆసియాలోకెల్లా అతిపెద్ద స్టూడియోగా పేరుపొందిన [[వాహినీ స్టూడియో]]కు శంకుస్థాపన జరిగినప్పుడు అక్కడుండి మట్టి వేసిన వారిలో కామేశ్వరరావు ఒకడు.
 
బందరులో కామేశ్వరరావుకు [[పింగళి నాగేంద్రరావు]]తో పరిచయముంది. ఆయన [[వింధ్యరాణి]] చిత్ర నిర్మాణ సమయంలో మద్రాసు వచ్చాడు. అప్పుడు కామేశ్వరరావు ఆయనను కె.వి.రెడ్డికి, బి.ఎన్.రెడ్డికి పరిచయం చేశాడు. అలా తెలుగు సినిమా చరిత్రలో అత్యంత ప్రతిభావంతమైన రచయితను పరిశ్రమకు పరిచయం చేసింది కూడా కామేశ్వరరావేనని చెప్పవచ్చు.అంతలో కారణాంతరాల వల్ల వాహినీ స్టూడియో చేతులు మారి [[విజయా సంస్థ]] స్టూడియోను నిర్వహించసాగింది. విజయా వారు కామేశ్వరరావును కూడా తమ సంస్థ లోకి తీసుకున్నారు. తొలుత విజయా వారి [[పాతాళభైరవి]] సినిమాకు ఆయన పనిచేశాడు. తర్వాత విజయా వారే నిర్మించిన [[చంద్రహారం]] సినిమాతో కామేశ్వరరావు తొలిసారిగా దర్శకుడయ్యాడు.