కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), గా → గా , మహ → మహా, నిషేది → నిషేధి, ప్రదమ → ప్ using AWB
పంక్తి 29:
| website = {{URL|http://cpim.org/}}
}}
[[ఫైలు:Akgopalanbhavan240.jpg|thumb|ఏ.కే.జి. భవన్, సి.పి.ఐ. (ఎమ్) ప్రధాన కార్యాలయం [[క్రొత్త ఢిల్లీ]]
 
{{coord|28|37|53.6|N|77|12|17.9|E}}]]
పంక్తి 35:
పార్టీ చరిత్ర ==
 
సిపిఐ (ఎం) అంటే ప్రజల తరపున నిలబడే శక్తిగా అందరికీ గౌరవం , నమ్మకం. స్వార్థం, సంకుచితత్వం, సంపదలపై వ్యామోహం, పదవుల కలహాలు, కులమత రాజకీయాలూ వంటి వాటికిదూరంగా ప్రజలు తరుపున రాజీ లేని పోరాటం చేస్తున్న పార్టీ గాపార్టీగా భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) (సిపిఐఎం) సుపరిచితం. . సంపాధించుకోవడం కోసం మాత్రమే రాజకీయలు అనుకునే పరిస్ధితిలో దేశం కోసం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఉన్నత ఆశయాలే ఆయుధాలుగా నడుస్తున్న ఏకైక పార్టీ సిపిఎం. దేశంలో వామపక్ష శక్తులలో అగ్ర భాగాన నిల్చిన అరుణారుణ చైతన్యం.
 
దోపిడీ పీడనలకు వ్యతిరేకంగాఅంతర్జాతీయ ఆధిపత్య పోకడలకు ప్రతిఘటనగా 'మతోన్మాద రాజకీయాలపై రణభేరిగా' కుల వివక్షపై మోగే శంఖారావంగా యువతీ యువకుల ఆశయ స్వచ్ఛతకు నిదర్శనంగా దేశ రాజకీయాలను ప్రభావితం చేసే శక్తిగా అర్ధశతాబ్ది పూర్తి చేసుకున్న ప్రజాస్వామ్య ప్రగతిశీల రాజకీయ శక్తి సిపిఐ (ఎం).
 
దేశంలో చాలా పార్టీలు రకరకాల అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయాయి. అనేక విధాల అవకాశవాదాలతో రంగులు మార్చాయి. కాని సిపిఐ (ఎం),వామపక్షాలు ఈ యాభై ఏళ్లలోనూ సామ్యవాద భావజాలానికి లౌకిక ప్రజస్వామ్య విలువలకు అంకితమై వాటిని కాపాడేందుకు ఎల్లవేళలా కృషి చేస్తున్నాయి.ఈ దేశంలో ఎర్రజండా ఎగిరిన రోజునుంచి స్వాతంత్రంస్వాతంత్ర్యం సామ్యవాద భావజాలం కోసం కమ్యూనిస్టులు అంకితమైనారు. గాంధీజీ నాయకత్వంలో కాంగ్రెస్‌ ప్రధాన భూమిక పోషించినా ప్రజల తరపున నూతన భావాలను ప్రతిపాదించిన వారు కమ్యూనిస్టులే.
 
విదేశీ పాలకులు ఇక్కడి వనరులను ముడిపదార్థాలను కొల్లగొట్టి తమ సరుకులు మనపై రుద్దే సమయం. మన రైతులను వ్యవసాయాన్ని నాశనం చేసి తమకు అవసరమైన టీ కాఫీ పొగాకు నీలి మందు తదితర వాణిజ్య పంటలను అలవాటు చేశారు. స్వదేశీ సంస్థానాధీశులు రాజులు, జమీందారులు, దొరలను తాబేదార్లుగా చేసుకుని రైతాంగాన్ని శ్రమ జీవులను క్రూరంగా కొల్లగొట్టారు. అయినా ఈ రాజులు జమీందార్లపై పోరాటం అవసరంలేదన్నది గాంధీజీ భావనగా వుండేది. అలాంటి సమయంలో కమ్యూనిస్టులే భూస్వామ్య రాచరిక వ్యతిరేక పోరాటాలకు నాంది పలికారు. కేరళలో పున్నప్రా వయిలార్‌, బెంగాల్‌లో తెభాగ, త్రిపుర సంస్థానం, తెలుగునాట ఉత్తరాన మందసా నుంచి మునగాల పరగణా, చల్లపల్లి జమీందారు వంటి వారికి వ్యతిరేకంగా పోరాటాలు నడిపారు, దీనంతటికి శిఖర స్థాయిలో వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నిర్వహించారు. ఆ విధంగా శ్రమజీవులనూ అణగారిన తరగతులను కదిలించి గొంతునిచ్చింది విముక్తి సమరాలకు ముందు నిలిచింది కమ్యూనిస్టులే.
 
అప్పటి వరకూ మహజర్లకూమహాజర్లకూ అధినివేశ ప్రతిపత్తి వంటి కోర్కెలకు పరిమితమైన కాంగ్రెస్‌ కమ్యూనిస్టుల వచ్చాకే సంపూర్ణ స్వాతంత్రంస్వాతంత్ర్యం నినాదమిచ్చింది. అమరజీవి భగత్‌సింగ్‌తో సహా ఎందరో జాతీయ విప్లవ యోధులు కమ్యూనిస్టు భావజాలం వైపు ఆకర్షితులైనారు. ఆయన బృందాన్ని ఉరితీసినా మిగిలిన సహచరులంతా కమ్యూనిస్టు పార్టీ వైపు వచ్చారు. ఈ కారణం చేతనే బ్రిటిష్‌ పాలకులు కమ్యూనిస్టు పార్టీపై ప్రత్యేకంగా కక్ష గట్టారు. దశాబ్దాలుగా వుంటున్న కాంగ్రెస్‌పై ఎన్నడూ ఏ నిషేధం లేదు. కాని అప్పుడప్పుడే మొదలవుతున్న కమ్యూనిస్టుపార్టీనే బ్రిటిష్‌ పాలకులు నిషేదించారునిషేధించారు. కేసులమీద కేసులు పెట్టి వేధించారు.కొన్ని వేలమంది కమ్యూనిస్టులను పాలకులు వూచకోత కోశారు. జైళ్లపాలు చేశారు.
 
కమ్యూనిస్టులు గాంధీజీ లాగే దేశీయ ఆర్థికాభివృద్ధిని కోరుకున్నారు. 1920లలోనే దేశంలో కమ్యూనిస్టులు, మరోవైపున ఆరెస్సెస్‌ ముందుకొచ్చాయి. కమ్యూనిస్టులు ఇన్నిరకాల ప్రజలతో మమేకమవుతుంటే ఆరెస్సెస్‌ కేవలం ముస్లిం వ్యతిరేకతే ప్రధానమన్నట్టు వ్యవహరిస్తూ స్వాతంత్రస్వాతంత్ర్య పోరాటానికి దూరంగా వుండిపోయింది, బ్రిటిష్‌ వారు కూడా మతతత్వ రాజకీయాలను పెంచి పోషించడంతో చివరకు దేశ విభజన ఘోర మతమారణహోమం చూడవలసి వచ్చింది. స్వాతంత్రంస్వాతంత్ర్యం వచ్చి ఆరు నెలలు కాకుండానే ఒక హిందూ మతోన్మాది మహాత్మాగాంధీని క్రూరంగా కాల్చి చంపాడు, కమ్యూనిస్టులు మాత్రం మతసామరస్యం దేశ స్వావలంబన కోసం కట్టుబడ్డారు.
 
సైద్ధాంతిక స్వచ్ఛత కోసం..
స్వాతంత్రానంతరంస్వాతంత్ర్యానంతరం కాంగ్రెస్‌ పాలకులు విదేశీ రుణాలపై మారుటోరియం ప్రకటించి బ్రిటిష్‌పెట్టుబడులను స్వాధీనం చేసుకునే బదులు వారితో మరింతగా కుమ్మక్కయ్యారు. ప్రజా వ్యతిరేక విధానాలతో ధనస్వాములను భుజాన మోశారు. అవకాశవాద పోకడలతో అస్తవ్యస్త పరిస్థితి సృష్టించారు. ఈ నేపథ్యంలో మరింత సమరశీల పోరాటాలకు సిద్ధమయ్యే బదులు వారిపట్ల మెతక వైఖరి అనుసరించాలని కమ్యూనిస్టు ఉద్యమంలోనే కొందరు ప్రతిపాదించారు. దాంతో విభేదించిన పుచ్చలపల్లి సుందరయ్య, ఎ.కె.గోపాలన్‌, బి.టి.రణదివే, హరికిషన్‌ సింగ్‌ సూర్జిత్‌, పి.రామమూర్తి, ప్రమోద్‌దాస్‌గుప్తా, మాకినేని బసవపున్నయ్య, జ్యోతిబాసు, నంబూద్రిపాద్‌, ముజఫర్‌ అహ్మద్‌, తదితరులు తీవ్ర సైద్ధాంతిక పోరాటం నడిపారు. అంతేగాక విప్లవ కర సిద్ధాంత స్వచ్చత కోసం ప్రజా పోరాటాల పదును పెంచడం కోసం నూతన సంస్థను స్థాపించాలన్న నిర్ణయానికి వచ్చారు.. ఈ ఏర్పాటులో ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన సుందరయ్య, బసవపున్నయ్య, మోటూరు హనుమంతరావు, నండూరి ప్రసాదరావు, తరిమెల నాగిరెడ్డిలతో పాటు ఇంకా అనేకులు ముఖ్యపాత్ర వహించారు. వారు ఈ ఆలోచనలు చేస్తున్న దశలోనే 1962లోనే చైనా యుద్ధాన్ని సాకుగా చూపి కమ్యూనిస్టు ఉద్యమంలో ఒక భాగాన్ని జైలుపాలు చేశారు. అయినా గట్టిగా నిలబడి 1964 జులై7 నుంచి జులై 12 వరకూ తెనాలిలో జాతీయ సదస్సు జరిపి నూతన పార్టీ స్థాపనకై నిర్ణయించారు.మొత్తంపైన నిర్బంధం మధ్యనే 1964 నవంబరు7న భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ఏర్పడిరది. పుచ్చలపల్లి సుందరయ్య తొలి ప్రధాన కార్యదర్శి అయ్యారు. అప్పటినుండి ఇప్పటివరకు సిపిఎం ఎప్పుడు స్వతంత్ర విధానాన్ని అనుసరిస్తోంది. ఈ దేశ పరిస్థితులకు తగిన నిర్దిష్ట విధానాన్ని నిర్ణయించుకుంటూ ముందుకు సాగుతుంది.
 
సిపిఎం పై దాడి
సిపిఎం పూర్తిగా ఏర్పడక ముందే ప్రభుత్వం దాడి ప్రారంభించింది. చైనాతో తలెత్తిన సరిహద్దు సంఘర్షణను సంప్రదింపులతో పరిష్కరించుకోవాలని చెప్పడం పెద్ద అపరాధంగా చిత్రించబడింది. ఇప్పుడు దేశ ప్రధాని నరేంద్ర మోడీతో సహా అందరూ చైనాతో స్నేహ సంబంధాలు పెంచుకోవాలనే చెబుతున్నారు. ఆ రోజుల్లో సిపిఎం చెప్పిందీ అదే. దీనికోసమే సిపిఎం నేతలపై చైనా ఏజంట్లని ముద్ర వేశారు.లోక్‌సభలో అప్పటి హోంమంత్రి గుల్జారీ లాల్‌ నందా సిపిఎంపై ఆరోపణలతో ఒక చిట్టా చదివారు. అంతేగాక దేశమంతటా వున్న సిపిఎం నేతలను అర్థరాత్రి అరెస్టు చేశారు. ఆంధ్ర ప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లో ముఖ్యమైన నాయకులంతా జైళ్లపాలయ్యారు. బ్రిటిష్‌ వారు ఏ విధంగా కాంగ్రెస్‌ను గాక కమ్యూనిస్టుపార్టీని నిషేధించారో అలాగే కాంగ్రెస్‌ కేంద్ర ప్రభుత్వం కూడా సిపిఎంపై కక్ష గట్టి ఆదిలోనే దాడి చేసింది. ఇందుకోసం ప్రివెంటివ్‌ డిటెన్షన్‌ (పిడి)చట్టాన్ని పెద్ద ఎత్తున ప్రయోగించింది. అయితే అలా నాయకులందరినీ అరెస్టు చేసి జైళ్లలో కుక్కినా అప్పుడప్పుడే ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు ఎంతో ధైర్యంగా ప్రజల పక్షాన నిలబడ్డారు. సమస్యలపై ఉద్యమాలు సాగించారు. బంజరు భూముల పంపిణీ, డ్రైనేజీల మరమ్మత్తులు వంటి అంశాలపై పోరాడారు. ప్రజాశక్తి పత్రికస్థానంలో ఎన్నో త్యాగాలు చేసి సమిష్టిసమష్టి కృషితో నిర్మించుకున్న విశాలాంధ్ర పత్రిక సిపిఐ చేతికిపోగా సిపిఎం తరపున డి.వి.సుబ్బారావు తదితరులు జనశక్తి పత్రిక స్థాపించారు. అరెస్టయిన నాయకుల విడుదల కోసం ఎందరో మేధావులు పౌర హక్కుల ఉద్యమం నడిపించారు. కొద్ది రోజుల తర్వాత ఆ మేధావులను కూడా అరెస్టు చేశారు. నాటి పత్రికల్లోహక్కుల కోసం జరిగే పోరాటాలకుఇప్పుడు మీడయాలో వామపక్షలకు వస్తున్న ప్రచారంలో కొంతకూడా లేదు.జైళ్లలోని డిటెన్యూల భార్యలు పిల్లలూ ప్రత్యేకంగా పోరాడిన తర్వాతనే ప్రభుత్వం కనీస హక్కులు సదుపాయాలు కలిగించింది. కనక సిపిఎం పుట్టుకే పోరాటాలతో జరిగింది.
 
ఉద్యమాలకు తోడ్పాటు :
పంక్తి 62:
ప్రకాశం జిల్లాలో ప్రత్తి రైతులకు ధర పడిపోయి 1984`85లో ఆత్మహత్యలు ప్రారంభమైనప్పుడు సిపిఎం రైతుసంఘం దేశంలోనే మొదటిసారిగా ముందుగా ఆ సమస్యను గుర్తించాయి. గిట్టుబాటు ధర సమస్యను రంగం మీదకు తెచ్చాయి. ప్రత్తికి ధర కావాలని నిర్భందాలని ఎదిరించి పోరాడారు. కొన్ని రాయితీలు సాధించేవరకు ఉద్యమం నడిచింది.
 
కరువు లోకరువులో ప్రజలకు అండగా :
రాజకీయాలు, ఉద్యమాలతో పాటు సేవా కార్యక్రమాలలో కూడా సిపిఎం ఎప్పుడూ ముందుంటున్నది. 1986లో మహబూబ్‌నగర్‌లో తీవ్రమైన కరువు ఏర్పడింది. ప్రభుత్వ యంత్రాంగం అశ్రద్ధ వలన ప్రజలు సహాయం అందక నానా బాధలు పడుతున్న స్థితి.ఆ సమయంలో సిపిఎం దాతల సహాయంతో నిర్వహించిన గంజి కేంద్రాలు ఎంతో ఉపశమనం కలిగించాయి. అనంతపురం లోఅనంతపురంలో వరదులు విలయతాండవం చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సిపిఎం కేడర్ ని పూర్తిగా రంగంలోనికి దింపి, శక్తికి మంచి ప్రజలకు సహాయ సహకారాలు అందించింది.
 
సారా వ్యతిరేకోద్యమం... సామాజిక తరగతుల పోరాటం :
1992, 93లోనే జన విజ్ఞాన వేదిక, మహిళా సంఘం ఆధ్వర్యంలో సారా వ్యతిరేక ఉద్యమం వూపందుకుంది. నెల్లూరు జిల్లాలో మొదలైన ఈ ఉద్యమం కొద్ది కాలంలోనే రాష్ట్రమంతటా వ్యాపించింది. సిపిఎం ఈ ఉద్యమానికి అండగా నిలిచింది. మతతత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూనే సిపిఎం కులతత్వాలపై కూడా సమరశంఖం పూరించింది. కుల వివక్షతా వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్‌)ను స్థాపించి సమరశీల ఉద్యమానికి నడుం కట్టింది. సిపిఎం పోరాటఫలితంగాచివరకు నకబడిన కులాల పరిస్థితిని అధ్యయనం చేసేందుకు జస్టిస్‌ పున్నయ్య అధ్యక్షతన ఒక కమిషన్‌ను నియమించాల్సి వచ్చింది. ఇది సామాజిక రంగంలో పెద్ద విజయం.
 
విద్యుచ్చక్తి ఉద్యమ ఉత్తేజం :
సిపిఎం మొదటే హెచ్చరించినట్టు విరుచుకుపడుతున్న నూతన విధానాలు దేశానికి శాపంగా మారాయి. చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం విజన్‌2020 వంటి వాటితో ఈ విధానాలకు రాష్ట్రాన్ని ప్రయోగశాలగా మార్చివేసింది. ఆ పరిస్థితుల్లో అటు సరళీకరణ విధానాలపై పోరాటం ఉదృతం అయ్యింది. ఈ సమయంలోనే చంద్రబాబు ప్రభుత్వం 2000లో విద్యుచ్చక్తి బోర్డును ముక్కలు చేసి రేట్లు పెంచింది.ఈ పరిస్తితుల్లో సిపిఎం మరో ఎనిమిది వామపక్షాల వామపక్ష పార్టీలతో పాటు కాంగ్రెస్ ను కలుపుకుని విద్యుత్‌ ఉద్యమం ప్రారంభించింది. 2000 ఆగష్టు 28న చలో అసెంబ్లీ సందర్భంగా బషీర్‌బాగ్‌ వద్ద జరిపిన కాల్పులు మూడు నిండు ప్రాణాలను బలిగొన్నాయి. అది మహోద్యమంగా విస్తరించి చంద్రబాబు సర్కార్‌కు ప్రాణ సంకటంగా తయారైంది.
ప్రపంచీకరణకు ప్రయోగశాలగా మారిన రాష్ట్రాన్ని ప్రతిఘటనలకూ కేంద్రంగా మార్చడంలో సిపిఎం కృషి ఫలప్రదమైందిఫల ప్రథమైంది. నీటి మీటర్లు, యూజర్‌చార్జీలు, ఔట్‌ సోర్సింగు వంటి అనర్థక పద్ధతుల ప్రమాదాన్ని ప్రారంభంలోనే గుర్తించి హెచ్చరించడమే గాక వాటికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసింది. ఆ దశలో జరిగిన అంగన్‌వాడీ వర్కర్ల ఉద్యమం, ఆర్టీసీలో సమ్మెలకు మద్దతూ నిచ్చి వాటివిజయంలో రాజకీయ పాత్ర పోషించింది.
 
ఉదృతంగా భూపోరాటం :
పంక్తి 86:
=== పార్టీ సంబంధ వెబ్-సైట్లు ===
* [http://www.cpim.org/ సి.పి.ఐ. (ఎమ్) వెబ్-సైట్]
* [http://www.leftword.com Leftword Books] సి.పి.ఐ. (ఎమ్) పబ్లిషింగ్ హౌస్
* [http://www.cpimap.org/ సి.పి.ఐ.(ఎమ్) ఆంధ్రప్రదేశ్ స్టేట్ కమిటి]