కవిసంగమం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , ను → ను , తో → తో , ఆగష్టు → ఆగస్టు, తిధి → తిథి (2), using AWB
పంక్తి 2:
 
== ప్రారంభం ==
'''కవి సంగమం''' [https://www.facebook.com/groups/kavisangamam/ ఫేస్ బుక్ కవిసంగమం సమూహం] చిన్ని ప్రయత్నంతో 2012 లో ప్రారంభం అయింది. ప్రముఖ [[కవి యాకూబ్]] దీనికి నాంది పలికారు. అంతర్జాలంలో ఉన్న సౌకర్యాన్ని వినియోగించుకొని ఫేస్ బుక్ చేస్తున్న వివిధమైన సామాజిక చలనాలను (సోషల్ డైనమిక్స్) గమనించి తెలుగు కవులకు ఒక మంచి వేదికగా దీన్ని మలచుకోవచ్చు అనే ఆలోచన ఈయన దీనిని రూపొందించారు. అతనికి వ్యక్తిగతంగా పాతిక ఏండ్లుగా పరిచయమైన కవి ప్రపంచాన్ని ముఖ్యంగా ఇప్పుడిప్పుడే గొంతువిప్పుతున్న వారు ఆధునిక నెట్ ప్రపంచాన్ని తెలుసుకున్న యువతీ యువకులైన కవులను ఒకచోటికి తేగలిగారు. ఈ రెండు సంవత్సరాలలో ఇది బాగా వ్యాప్తి చెందినది. ఇప్పటివరకున్న వివరాల ప్రకారం 200 మందికి పైగా కవులు , 4,300 మందికి పైగా కవితాభిమానులు ఈ వేదికలో పాలుపంచుకుంటున్నారు.
 
తెలుగులో ఒక కవి సుమారు ఒక పది పదిహేను సంవత్సరాల పాటు కవిత్వం రాసి లేదా ఒక ఏడాదిలో రాసిన కవితలను అన్నింటిన ఒక కవితా సంకలనంగా తెచ్చి, మరికాస్త కష్టపడి దానికి డబ్బుఖర్చూ పెట్టి పుస్తకావిష్కరణ చేయిస్తాడు. ఎవరో ఒక మంచి అనుభవజ్ఞుడో పేరున్నవాడో వచ్చి దాన్ని ఆవిష్కరిస్తాడు. రెండో రోజు పేపర్లో వార్త వస్తుంది. కాని ఆ పుస్తకాన్ని ఎవరు చదువుతారు. సదరు కవే ఒక వంద కాని రెండు వందల కాపీలు కాని తనకు తెలిసనవారికి పోస్టులో, ఆ ఖర్చులూ ఆయనే పెట్టుకొని పంపిస్తాడు. ఆ వందమందిలో కనీసం ఒక పాతిక మంది దాన్ని చదువుతారో లేదో. అందులో ఒక నలుగురు ఆయిదుగురు కాస్త వ్యక్తిగత క్రమశిక్షణ, మంచి బుద్ధీ ఉన్నవారు. మీ కవితలు బాగున్నాయని ఒక నెలకో ఏడాదికో ఉత్తరం రాస్తారు. దానికి ఈ అల్పసంతోషి అయిన కవి ఎంతో సంతోషిస్తాడు.
 
తెలుగు కవులకు నిన్న మొన్నటిదాకా ఉన్న పరిస్థితి ఇది. కాని కవి సంగమం ఈ పరిస్థితిన బద్దలు కొట్టింది. ఈ పరిస్థితిని బద్దలు కొట్టింది నిజానికి ఫేస్ బుక్ అంటే అంతర్జాల పరిజ్ఞానం. ఈ పరిజ్ఞానాన్ని ఒడిసిపట్టి ఆధునిక తెలుగు కవిత్వానికి దీన్ని ఒక వేదికగా మలచిన ఘనత నిస్సందేహంగా యాకూబ్ కు దక్కుతుంది. దీనితర్వాత కవిసంగమంలో భాగం కాని వారు కూడా ఫేస్ బుక్ లో తమ కవిత్వన్ని పెడుతున్నారు. బ్లాగుల్లో పెడుతున్నారు. ఈ కవితలు కూడా భాగస్వామ్యం రీత్యా కవిసంగమం లోనికి వస్తున్నాయి. అంతే కాదు గూగులమ్మ నుగూగులమ్మను అడిగి తెలుగు కవిత్వాన్ని గురించి తెలుసుకోవలనుకున్నవారికి కూడా కవిసంగమంలోని కవుల వివరాలు కవితలు అందుబాటులోనికి వస్తున్నాయి.
 
ఒక కవి తన కవితను రాసిన తర్వాత ఏ మాత్రం ఎడం లేకుండా అంటే రాత్రి కవితను రాస్తే తెల్లవారి పాటికి తన బృందంలోని సుమారు 200 మంది కవిత్వంపైన ప్రేమ ఉన్న పాఠకులకు అందేలా చేస్తున్నాడు. ఇది ఫేస్ బుక్ వేదిక మీద సాధ్యం అవుతూ ఉంది. అంతే కాదు దీని విజయం ఏమంటే ఆకవికి చాలా విలువైన అభిప్రాయ మాల మరుసటి రోజు సాయంత్రానికి తెలిసి పోతూఉంది. ఒక కవితకు సుమారు వందకు పైగా అభిప్రాయ ప్రకటనలు ఒక్కరోజులో రావడం ఒక్కరోజులో కొన్ని వందలమంది సాధారణ పాఠకులు కాక కవిత్వం కోసం ఉన్న ప్రత్యేకమైన పాఠకులు ఆ కవితను చదవడం మామూలు విషయం కాదు. ఆ కవికి వచ్చే ప్రోత్సాహం కాని సంతోషం కాని ఇంతకు ముందు సంప్రదాయ పద్ధతుల్లో అచ్చుపుస్తకం ద్వారా రావడం అన్నది కలలో కూడా ఊహించడానికి సాధ్యం కానిది. కవికి వచ్చే స్థితిని కాస్సేపు పక్కకు పెట్టి కవిత్వానికి వచ్చే స్థితిని గురించి ఆలోచిస్తే మరింత సంతోషకరంగా కనిపిస్తూ ఉంది. కవిత్వ వ్యాప్తి ఇబ్బడి ముబ్బడిగా మునుపెన్నడూ లేని వేగంతో వ్యాప్తి చెందుతూ ఉంది. ఇది తెలుగు సాహిత్య కారులు అందరూ సంతోషంగా గర్వించదగిన విషయం.
పంక్తి 20:
== కార్యక్రమాలు ==
 
కవిత్వంతో ఒక సాయంత్రం పేరుతో కవిసంగమం ఆధ్వర్యంలో ప్రతినెలా ఒక సాయంత్రంపూట ఎంపిక చేసిన ఐదుగురు కవుల కవిత్వమూ వారి కవిత్వ నేపధ్యంతోనేపథ్యంతో ఒక కార్యక్రమం జరుగుతుంది.
ఈ కార్యక్రమం ముఖ్యఉద్దేశం ~
* కొత్తగా రాస్తునవాళ్ళు ప్రత్యక్షంగా సీనియర్ కవులను కలవడం,
* వారి కవిత్వానుభావాల్ని వినడం, కవిత్వ రహాస్యాలను తద్వారా అవగతం చేసుకోవడం ;
* అలాగే తామూ చదవడం,రాయడం ,
*కవిత్వం వినడం ,
*కవిత్వం చదవడం
*కవిత్వ తత్వాన్ని అవగాహన చేసుకోవడం
* తమను తాము ఇంప్రూవ్ చేసుకోవడం ,
* పాల్గొంటూ,వింటూ నేర్చుకోవడం -
ఆ సిరీస్ ల వివరాలు
 
*జూలై 26 ,2014 - శంషాద్ మహమ్మద్ కవితాసంపుటి ఆవిష్కరణ సభ .
*జూలై 27 ,2014 - అఫ్సర్ 'కవితో ఒక సాయంత్రం 'సభ .
*సెప్టెంబర్ 14,2014 - నిర్మలారాణి తోట కవితాసంపుటి ఆవిష్కరణ సభ.
*ఫిబ్రవరి 22,2014 - కవి నారాయణస్వామి వెంకటయోగితో ఒక కవిత్వ సాయంత్రం కార్యక్రమం జరిగింది.
 
==='''కవిసంగమం సిరీస్ 1'''===
పంక్తి 48:
==='''కవిసంగమం సిరీస్ 2'''===
 
*కవిత్వాన్ని చదివేందుకు పాల్గొన్న సభ్యులు : నిఖిలేశ్వర్ | పులిపాటి గురుస్వామి | నందకిషోర్, జయశ్రీనాయుడు, క్రాంతి శ్రీనివాసరావు
*తేది : 2013 ఫిబ్రవరి 9
*వేదిక :[[లామకాన్]]
పంక్తి 66:
==='''కవిసంగమం సిరీస్ 4'''===
 
*కవిత్వాన్ని చదివేందుకు పాల్గొన్న సభ్యులు : వరవరరావు | కాసుల లింగారెడ్డి | [[అనిల్ డ్యాని]] , [[మెరాజ్ ఫాతిమా]], నరేష్ కుమార్
*తేది :2013 ఏప్రిల్ 13
*వేదిక :[[లామకాన్]]
పంక్తి 84:
==='''కవిసంగమం సిరీస్ 6'''===
 
కవిత్వాన్ని చదివేందుకు పాల్గొన్న సభ్యులు : అమ్మంగి వేణుగోపాల్ | రెడ్డి రామకృష్ణ | మొయిద శ్రీనివాసరావు, రాళ్ళబండి శశిశ్రీ, తుమ్మా ప్రసాద్
*తేది : 2013 జూన్ 8
*వేదిక : [[లామకాన్]]
పంక్తి 202:
==='''కవిసంగమం సిరీస్ 19'''===
 
*కవిత్వాన్ని చదివేందుకు పాల్గొన్న సభ్యులు : డా.[[రాధేయ]] | [[అన్నవరం దేవేందర్‌]] | డా. [[కత్తిమండ ప్రతాప్]] |జ్యోతిర్మయి మళ్ళ | గుబ్బల శ్రీనివాస్
*తేది :అక్టోబర్ 26, 2014
*వేదిక :[[గోల్డెన్ త్రెషోల్డ్]]
పంక్తి 258:
==='''కవిసంగమం సిరీస్ 25'''===
* కవిత్వాన్ని చదివేందుకు పాల్గొన్న సభ్యులు: వఝల శివకుమార్ | కె. విల్సన్ రావు | రాఘవ రాఘవ| శాంతి ప్రబోధ |నవీన్ కుమార్
* తేది: డిసెంబర్ 12, 2015 (రెండవ శనివారం)
* వేదిక: [[గోల్డెన్ త్రెషోల్డ్]]
* కార్యక్రమం విడియోల లింకు:
పంక్తి 306:
 
==వార్షికోత్సవం/పొయట్రీ ఫెస్టివల్స్ ==
ఫిబ్రవరి 9, 2012న కవిసంగమం గ్రూపు ఫేస్బుక్ లో కవిత్వ వేదికగా మొదలయ్యింది. ఎంతోమంది టెక్నికల్ గా కనీస అవగాహన వున్న సాహితీ మిత్రులను కలుపుకుంటూ సాగింది. ఫేస్బుక్ కవితావేదికగా తన అస్తిత్వాన్ని నిలుపుకుంటోంది. వివిధ సాహిత్యసందర్భాల్ని సృష్టించింది. కొత్తగా రాస్తున్నవాళ్ళు ఎందరో ఇవాళ తమదైన ముద్రను దీని ద్వారా ఏర్పరుచుకున్నారు. చర్చలు, సూచనలు, సందేహాలు, నివృత్తులు వీటన్నింటి మధ్య తమను తాము నిరూపించుకుంటూ ముందుకు కొనసాగుతున్నారు.
===ప్రధమ వార్షికోత్సవం===
*తేదీ : అగష్టు 15, 2012 (బుధవారం)
*వేదిక : EFLU ( English & Foriegn Languages Univrsity), Tarnaka,Hyderabad.
*ప్రత్యేక అతిధిఅతిథి : శ్రీ సుభోధ్ సర్కార్ [[:en:Subodh Sarkar]] ( ప్రముఖ బెంగాలీ కవి)
*[https://www.facebook.com/events/465263866826437/ ఫేస్ బుక్ గ్రూప్ ఈవెంట్ లోని వివరాలు ]
*[http://www.indianpoetsubodhsarkar.com/ సుభోద్ సర్కార్ అధికారిక వెబ్ సైట్ ]
*ఆగష్టు2012ఆగస్టు2012 పదిహేనున ఇఫ్లూ లోఇఫ్లూలో జరిగిన 'కవిసంగమం పోయెట్రీ ఫెస్టివల్' జరిగింది.ఆంధ్రజ్యోతి,పాలపిట్ట,దక్కన్ క్రానికల్ ,హిందూ వంటి పత్రికలూ ఈ కృషిని ప్రస్తావిస్తూ ఆర్టికల్స్ ను ప్రచురించాయి.అలాగే ఒక ప్రయత్నంగా,ఒక ప్రయోగంగా 144 కవితలతో 'కవిసంగమం-2012 ' కవితా సంకలనం వెలువడింది . ఇందులో తొట్టతోలిగా ముద్రణలో కన్పించినవారు ఎనభై మందికి పైగానే వర్థమాన కవుల కవితలున్నాయి.
 
బెంగాలీ కవి సుబోద్ సర్కార్ అతిధిగాఅతిథిగా పాల్గొని కవిసంగమం కాన్సెప్ట్ ను చూసి ముచ్చటపడ్డాడు.గొంతెత్తిన కొత్తకవుల కవిత్వంతో ఉక్కిరిబిక్కిరే అయ్యాడు.అప్పటివరకూ కవిత్వంలో లేని పేర్లేన్నో ఇవాళ కవిత్వరంగంలో వినబడుతున్నాయి. ఆమధ్య వచ్చిన ప్రసిద్ధ తమిళకవి చేరన్ రుద్రమూర్తి చేసిన ప్రసంగాలు,చదివిన కవిత్వం ;మనవాళ్ళు అనువదించి వేదికపై చదివిన ఆయన కవితలూ- ఇదంతా 'లర్నింగ్ ఇన్ ప్రాసెస్ ' గా ఎంతో ఉపయోగపడ్డాయి.
 
== కవితో ముఖాముఖి==
పంక్తి 330:
===అప్సర్===
*తేదీ: 2014 జూలై 27 ఆదివారం సాయంత్రం 6 గంటలు
*వేదిక: గోల్డెన్ థ్రెషోల్డ్
*ఫోటోలు:
*విడియోలు:
పంక్తి 352:
=== కృష్ణుడు/కృష్ణారావు===
జర్నలిస్టుగా, కవిగా రెండు దశాబ్దాలకు పైగా ఢిల్లీలో నివాసం. మూడు దశాబ్దాల వృత్తి అనుభవం. అయిదు దశాబ్దాలకు పైగా జీవితానుభవం. ఇప్పటివరకూ ఇండియా గేట్ పేరుతో కాలమ్స్ సంకలనం; ఇంకెవరు, ఉన్నట్లుండి - పేర్లతో రెండుకవితా సంపుటాలు వెలువడ్డాయి.
కలువకొలను రామ్మోహన రాజు తోరాజుతో కలిసి విపశ్యన కవులకు జవాబుగా కవితా సంకలనం వెలువరించారు. క్రితంతర్వాత కవుల్లో ఒకరు. అనేక జాతీయ కవితా సమ్మేళనాల్లో కవితలు చదివారు.
తాజాగా నవంబర్ 21,22,23 తేదీల్లో పాట్నాలో భారతీయ కవితా సమరొహ్ లో పాల్గొన్నారు. అనేక పత్రికల్లో కవితలు, సాహిత్య విమర్శా వ్యాసాలూ వెలువడ్డాయి.
 
"https://te.wikipedia.org/wiki/కవిసంగమం" నుండి వెలికితీశారు