కాశీ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
"గురించి"కి ముందు ని చేర్చాను |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ట0క → టంక, భోధకు → బోధకు, వివిద → వివిధ, స్థంభ → స్తంభ, ప్ర using AWB |
||
పంక్తి 21:
}}
'''కాశీ''' లేదా ''వారాణసి'' (''Kasi, Benaras, Varanasi'') [[భారతదేశము|భారతదేశపు]] అతి ప్రాచీన నగరాల్లో ఒకటి. [[హిందూమతము|హిందువులకు]] అత్యంత పవిత్రమైన [[పుణ్య క్షేత్రము]]. ఇది [[ఉత్తరప్రదేశ్]] రాష్ట్రంలోవుంది. ఇక్కడ ప్రవహించే [[గంగానది]]లో స్నానం ఆచరిస్తే సర్వపాపాలు నశించి పునర్జన్మ నుంచి విముక్తులౌతారని హిందువుల నమ్మకం. వరుణ, అసి అనే రెండు నదులు ఈ నగరం వద్ద [[గంగ|గంగానదిలో]] కలుస్తాయి. అంచేత, ఈ క్షేత్రానికి [[వారణాసి]] (వారణాసి అని అంటుంటారు) అని కూడా నామాంతరం
'''''కాశ్యాన్తు మరణాన్ ముక్తి:''''' - "కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుంది" - అని [[హిందూమతం|హిందువులు]] విశ్వసిస్తారు. [[ద్వాదశ జ్యోతిర్లింగాలు|ద్వాదశ జ్యోతిర్లింగాల్లో]] ఒకటైన '''విశ్వేశ్వర లింగం''' ఇక్కడ ఉంది. బౌద్ధులకు, జైనులకు కూడా ఇది పుణ్యక్షేత్రం. వారాణసి ప్రపంచంలోనే [[:en:List of oldest continuously inhabited cities|అవిచ్ఛిన్నంగా జనావాసం ఉన్న నగరాలలోఅత్యంత పురాతనమైనది]] అని భావిస్తున్నారు.<ref name=bsfw /><ref>{{cite web |url=http://www.britannica.com/eb/article-9074835/Varanasi |title=Varanasi |publisher=[[Encyclopædia Britannica Online]] |accessdate=2008-03-06}}</ref>
పంక్తి 52:
=== ప్రముఖులు ===
మౌర్యుల కాలంలో [[తక్షశిల]] మరియు [[పాటలీపుత్ర]] మద్య ఉన్న రహదారితో కాశీపట్టణం అనుసంధానించబడి ఉంది. 1194లో వారణాశి నగరం కుతుబుద్దీన్ ఐబక్ స్వాధీనమైంది. కుతుబుద్దీన్ ఐబక్ ఆదేశంతో నగరంలోని సుమారు 1000 ఆలయాలను ధ్వశం చేయబడ్డాయి. ముస్లిం ఆక్రమణలో నగరం దాదాపు 3 శతాబ్ధాల కాలం క్షీణావస్థను చవిచూసింది. ఆఫ్గన్ దండయాత్ర తరువాత నగరంలో సరికొత్తగా ఆలయాలు నిర్మించబడ్డాయి. ఫెరోజ్ షాహ్ కాలంలో 1376లో వారణాశిలోని మరికొన్ని ఆలయాలు ధ్వశం చేయబడ్డాయి. ఆఫ్గన్ రాజు సికిందర్ లోడి హిదువుల ఆణిచివేతను కొనసాగిస్తూ 1496లో మిగిలిన హిందూ ఆలయాలను ధ్వశం చేయించాడు. ముస్లిం పాలన కాలంలోనే మరికవైపు వారణాశి మేధావులకు మరియు తాత్వికులకు కేంద్రంగా మారింది.
మద్యకాలంలో వారణాశి మతసంప్రదాయాలకు మరియు విద్యకు కేంద్రమై విలసిల్లింది. భక్తి ఉద్యమకాలంలో వారణాశిలో 1389లో రామభక్తుడైన కబీరుదాసు జన్మించాడు. కబీరరుదాసు రచించిన భక్తిరసపూరిత కీర్తనలు 15 వ శతాబ్దంలో భారతదేశంలో కీర్తించబడ్డాయి. అలాగే 15 వ శతాబ్దంలో సంఘసంస్కర్త, యోగి, కవి, యాత్రికుడు మరియు మతగురువు అయిన రవిదాసు వారణాశిలో జన్మించాడు. రవిదాసు జీవనోధి కొరకు తోళ్ళపరిశ్రమలో పనిచేసాడు. అలాగే భారతదేశం మరియు దక్షిణాసియా అంతటి నుండి అనేక ప్రఖ్యాత విద్యావేత్తలు,
=== స్వాతంత్రానికి ముందు చరిత్ర ===
16వ శతాబ్దంలో మొగల్ చక్రవర్తి ఆక్బర్ పాలనలో వారణాశిలో సరికొత్త సంస్కృతి మొదలైంది. ఆక్బర్ చక్రవర్తి ఆధ్వర్యంలో వారణాశిలో శివునికి మరియు విష్ణుమూర్తికి రెండు పెద్ద ఆలయాలను నిర్మించబడ్డాయి. పూనా రాజు 200 మీటర్ల (660 అడుగులు) ఎత్తైన అంపూర్ణాదేవి నమందిరం నిర్మించాడు. అలాగే పూనా రాజు పాలనలో శివా - విష్ణులకు అంకితమివ్వబడిన అక్బారి వంతెన కూడా నిర్మించబడింది. 16వ శతాబ్దం నుండి వారణాశికి యాత్రికుల రాక ప్రారంభమైంది. 1665లో ఫ్రెంచి యాత్రికుడైన " జీన్ బాప్టిస్ట్ ట్రావర్నియర్ " ఈ నగరాన్ని సందర్శించి వారణాశిలోని గంగాతీరంలో ఉన్న " బిందు మహాదేవాలయం " సౌందర్యాన్ని వర్ణించాడు. చక్రవర్తి షేర్ షాహ్ సూరి కాలంలో వారణాశి రహదారి పునరుద్దరినబడి కొలకత్తా నుండి పెషావర్ వరకు పొడిగించబడింది. తరువాత బ్రిటిష్ పాలనా కాలంలో ఈ రహదారి ప్రఖ్యాతమైన " గ్రాండ్ ట్రంక్ రోడ్డుగా " అవతరుంచింది. 1656లో ఔరంగజేబు పలు ఆలయాలు ధ్వంశం చేయబడి మసీదులు నిర్మించబడ్డాయి. నగరం తిరిగి సంస్కృతి పరంగా వెనుకబడింది. అయినప్పటికీ ఔరంగజేబు మరణానంతరం భారాదేశంలో తిరిగి హిందూ రాజ్యాలు తలెత్తి వర్ద్ధిల్ల సాగాయి.
=== ప్రత్యేక సంఘటనలు ===
పంక్తి 113:
=== మణి కర్ణికా ఘాట్ ===
మణి కర్ణికా ఘట్టం ఎంతో పావనమైనదిగా హిందువులు భావిస్తారు. ఒక గాధ ప్రకారం శివుని సమక్షంలో విష్ణువు ఇక్కడ తన సుదర్శన చక్రంతో ఒక గోతిని తవ్వాడు. దానిని తన స్వేదంతో నింపుతుండగా విష్ణువు చెవి కుండలం (మణి కర్ణిక) అందులో పడింది. మరొక కథ ప్రకారం పార్వతీదేవి తన [[చెవిపోగు]] (మణికర్ణిక)ను ఇక్కడ దాచిపెట్టి, దానిని వెతకమని శివుడిని కోరింది. దానికోసం వెతుకుతూ అక్కడే శివుడు ఉండిపోవడం వల్ల అతడు దేశద్రిమ్మరి కాడని పార్వతి ఆలోచన అట. ఇక్కడ దహనమైన శరీరం తాలూకు ఆత్మను శివుడు స్వయంగా మణికర్ణిక కనిపించిందేమోనని అడుగుతాడట. పురాణ కథనాల ప్రకారం ఈ మణికర్ణికా ఘాట్ యజమానే [[హరిశ్చంద్రుడు|హరిశ్చంద్రుడి]]ని కొని, హరిశ్చంద్ర ఘాట్లో కాటిపనికి నియమించాడు. మణి కర్ణికా ఘాట్, హరిశ్చంద్రఘాట్లలో అధికంగా [[దహన సంస్కారాలు]] జరుగుతుంటాయి. మణికర్ణికాఘాటుకు మహాశ్మశానమని మరొక పేరుకూడా ఉంది. ఈ ఘాట్ గురించి మరొక కథనం కూడా ప్రచారంలో ఉంది.
అని ప్రజల విశ్వాసం.
పంక్తి 144:
== ఆలయాలు ==
వారణాసి ఆలయాలకు నెలవు. చరిత్రలో
=== విశ్వనాధ మందిరం ===
[[కాశీ విశ్వనాధ మందిరం]] వారాణసిలో ప్రధాన ఆలయంగా చెప్పుకోవచ్చును. దీని గోపురంపైన పూసిన బంగారు పూత కారణంగా దీనిని "బంగారు మందిరం" అని కూడా అంటుంటారు. ప్రస్తుతం ఉన్న మందిరాన్ని 1780లో [[ఇండోర్]] రాణి [[అహల్యాబాయి హోల్కర్]] కట్టింపించింది. ఇందులో లింగాకారంగా కొలువై ఉన్న దేవుడు "విశ్వేశ్వరుడు", "విశ్వనాధుడు" పేర్లతో పూజలందుకొంటుంటాడు. [[ద్వాదశ జ్యోతిర్లింగాలు|ద్వాదశ జ్యోతిర్లింగాలలో]] ఈ విశ్వేశ్వర లింగం దర్శనం తక్కిన లింగాల దర్శనం కంటే అధిక ఫలప్రథమని భక్తుల విశ్వాసం. ఈ ఆలయం పలుమార్లు విధ్వశం చేయబడి తిరిగి నిర్మించబడింది. ఆలయసమీపంలో ఉన్న " గ్యాంవాపీ " మసీదు ప్రాంతమే అసలైన ఆలయం ఉన్న ప్రదేశం. 1785లో అప్పటి గవర్నర్ జనరల్ [[వారన్ హేస్టింగ్స్]] సూచనల మేరకు కలెక్టర్ మొహమ్మద్ ఇబ్రాహీమ్ ఖాన్ ఈ ఆలయం ముందు భాగంలో ఒక "నౌబత్ ఖానా" కట్టించాడు. 1839లో పంజాబ్ కేసరిగా పేరొందిన [[మహారాజా రంజిత్ సింగ్]] ఈ iఆలయం రెండు గోపురాలకు బంగారపు పూత పూయించడానికి సరిపడా బంగారం సమర్పించాడు. 1983 జనవరి28న ఈ మందిరం నిర్వహణా బాధ్యతలను ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం హస్తగతం చేసుకొని అప్పటి కాశీ రాజు డా. విభూతి నారాయణ సింగ్ అధ్వర్యంలోని ఒక ట్రస్టుకు అప్పగించింది.<ref>{{cite web |url=http://varanasi.nic.in/temple/KASHI.html |title=Shri Kashi Vishwanath Mandir Varanasi |publisher=National Informatics Centre, Government of India |accessdate=2007-02-04}}</ref> మొఘల్ చక్రవర్తి [[ఔరంగజేబు]] కాలంలో అప్పటి మందరిరం విధ్వంసం చేయబడింది. తరువాత సమీపంలో మరొక మందిరం కట్టబడింది. ఈ విషయం హిందూ-ముస్లిమ్ వర్గాల మధ్య ఘర్షణలకు దారితీసే విభేదాలలో ఒకటి<ref>{{cite news |url=http://www.tribuneindia.com/1998/98dec06/head1.htm |title=Countrywide alert on Masjid demolition anniversary |publisher=[[The Tribune]] |date= 1998-12-06 |accessdate=2007-02-05}}</ref>
పంక్తి 161:
=== సంకట మోచన్ హనుమాన్ మందిరం ===
కాశీలో ఉన్న పవిత్రాలయాలలో సంకట్ మోచన్ హనుమాన్ మందిరం ఒకటి. ఈ మందిరం " బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం " ఆవరణలో ఉన్న దుర్గా మరియు కొత్త విశ్వనాథ్ మందిరాలకు పోయే మార్గంలో అసినదీతీరంలో ఉంది.
=== తులసీ మానస మందిరం ===
పంక్తి 180:
=== మసీదులు ===
వారణాశిలో ఉన్న మసీదులలో ప్రధానమైనవాటిలో విశ్వేశ్వరాలయ సమీపంలో ఉన్న గ్యానవాపి మసీదు ఒకటి, తరువాత అలాంగిరి మసీదు, ది గంజ్ షహీదాన్ మసీదు మరియు చుఖాంబా మసీదు మొదలైనవి. 10లక్షల ముస్లిములలో నలుగవ వంతు ముస్లిములు వారణాసిలో న నగరంలో ఉన్నచుఖాంబా మసీదులో ప్రార్ధనలు నిర్వహిస్తుంటారు. ఢిల్లీ సుల్తానుల పరిపాలన ఆరంభమైన తరువాత వారణాశిలో ప్రారంభమైన ముస్లిముల రాక ఇప్పటికీ పలు తరాలుగా కొనసాగుతూ ఉంది.
పెరుగుతున్న ఆ ముసల్మానుల సంఖ్య హిందూ సంస్ర్కతికి
=== ముఖ్య శివ లింగాలు ===
పంక్తి 225:
2001లో పరిసర ప్రాంతాలతో కలిపి వారాణసి (Varanasi urban agglomeration) జనాభా 1,371,749. ఆడు, మగ నిష్పత్తి 879 కి 1000 <ref name=censusmillioncities>{{cite web |url=http://www.censusindia.net/results/miilion_plus.html |title=Urban Agglomerations/Cities having population of more than one million in 2001 |accessdate=2006-08-18 |date= 2001-07-25 |work=Census of India 2001 (Provisional) |publisher=Office of the Registrar General, India}}</ref> వారాణసి మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని జనాభా 1,100,748<ref name=uptownscensus1>{{cite web |url=http://www.censusindia.net/results/data/upd_uatowns.PDF |title=Population, Population in the age group 0–6 and literates by sex - Urban Agglomeration/Town: 2001 |accessdate=2006-08-17 |format=PDF |work=Census of India 2001 (Provisional) |publisher=Office of the Registrar General, India |pages=53-54}}</ref> మరియు ఆడు, మగ నిష్పత్తి 883కి 1000.<ref name=uptownscensus1/> అక్షరాస్యత శాతం మొత్తం అర్బన్ ప్రాంతంలో 61.5% మరియు మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 61%.<ref name=uptownscensus1/>. మునిసిపల్ ఏరియాలో సుమారు 138,000 మంది మురికివాడ (slums)లలో నివశిస్తున్నారు.<ref name=censusmillionslums>{{cite web |url=http://www.censusindia.net/results/slum1_m_plus.html |title=Slum Population in Million Plus Cities (Municipal Corporations): Part A |accessdate=2006-08-18 |date= 2002-01-22 |work=Census of India 2001 (Provisional) |publisher=Office of the Registrar General, India}}</ref>. నగరంలో నేరాలు రేటు 2004 సంవత్సరంలోలో 128.5 (ప్రతి 100,000కు). ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ సంఖ్య 73.2 మరియు దేశం మొత్తానికి 168.8.<ref name=ncrb>{{cite book | author =National Crime Records Bureau |year=2004 |title=Crime in India-2004 |chapter=Crimes in Mega Cities | chapterurl = http://ncrb.nic.in/crime2004/cii-2004/CHAP2.pdf | pages= 158 | format= [[PDF|PDF Format]] |publisher=Ministry of Home Affairs | accessdate=2006-08-18}}</ref>
===వసతిగృహాలు===
ఇచ్చట జంగంబాడి సత్తరం ఉంది.ఇచ్చట గదులు తక్కువ అద్దెకు ఇస్తారు.ఉచిత భోజనం వసతికూడా ఉంది.మరియు నాట్టు కోట్టై నగర సత్తరం తమిళనాడు వారిచే నిర్వహించ బడుచున్నది.ఇచ్చట తక్కువ అద్దెకు గదులు దొరుకుతాయి.సత్తరం చాల పరిశుభ్రంగా ఉంటుంది.ఇచ్చట తక్కువ దరకే ఉదయం టిఫన్,మద్యాన్నం భోజనం,రాత్రికి టిఫన్ లభించును.ఇధి ఆంధ్రావారికి,తమిళ వాడు వారికి భాగుంటుంది.మరియు శ్రీ వాసవి అన్నపూర్న సత్తరం ఉన్నధి.ఇక్కడ గధులు దొరుకుతాయి.ఉచిత భోజనం (మద్యాన్నం)దొరుకుతుంది.రాత్రికి టిఫన్
== రవాణా ==
పంక్తి 237:
|title=Status of landfill sites in 59 cities |accessdate=2006-08-18 |work=Management of municipal solid wastes |publisher=Planning Division, Central Pollution Control Board}}</ref> చాలా మురుగునీరు గంగానదిలోకి విడిచిపెడుతున్నారు. దీనివల్ల, గంగానది వడ్డున ఉన్న అనేక నగరాల లాగానే, తీవ్రమైన నీటి కాలుష్యం జరుగుతున్నది. "గంగా యాక్షన్ ప్లాన్" పరిధిలో ఉన్న ఐదు నగరాలలో వారాణసి ఒకటి.
నగరంలో ఎస్.పి. అత్యధిక హోదా కలిగిన పోలీసు అధికారి.<ref name=uppoliceorg>{{cite web |url=http://uppolice.up.nic.in/About%20UP%20Police.html |title=UP Police Is divided into following zines consisting ranges & districts |accessdate=2006-08-18 |work=UP Police |publisher=[[National Informatics Centre|NIC]]}}</ref>. వారాణసి నగరం ఒక లోక్ సభ నియోజక వర్గం. 2014లో ఇక్కడినుండి భరతియ జనత
== విద్య ==
పంక్తి 252:
== పర్యాటక రంగం ==
వారణాసిలో విలసిల్లిన అసమానమైన సంస్కృతి మూలంగా విదేశీ యాత్రికులకు చాలా ప్రీతిపాత్రమైన యాత్రా స్థలం. నగరంలో 3,4, 5 స్టార్ హోటళ్ళు కూడా ఉన్నాయి. అన్ని రకాల వంటకాలు లభ్యమౌతాయి.అక్కడి సంస్కృతి ప్రభావం వలన వీటిలో చాలా వరకు వీధుల్లోనే లభిస్తాయి. పట్టు వస్త్రాలకు, ఇత్తడి సామానుకు వారాణసి ప్రసిద్ధి చెందినది. ఎంతో చక్కని పనితనం ఉట్టిపడే పట్టు చీరలు, ఇత్తడి పాత్రలు, ఆభరణాలు, చెక్క సామాను, తివాచీలు, గోడకు వేలాడదీసే పటాలు, ఆకర్షణీయమైన దీపపు
అంతేకాక పర్యాటక ఆకర్షణ కలిగిన ప్రదేశాలలో సారనాథ్ మ్యూజియం, జంతర్ మంతర్, భారత్ కళాభవన్ మరియు రామనగర్ కోట ముఖ్యమైనవి.
=== జంతర్ అంతర్ ===
పంక్తి 260:
=== రామనగర్ కోట ===
రామనగర్ కోట గంగానది తూర్పుతీరంలో తులసీఘాటుకు ఎదురుగా ఉంది. రామనగర్ కోటను 18వ శతాబ్దంలో కాశీనరేష్ రాజా బలవంత్ సింగ్ చేత నిర్మించబడిది. ఈ కోట చునార్ ఇసుకరాళ్ళతో నిర్మించబడింది. ఇది మొగల్ నిర్మాణశైలితో వంపైన బాల్కనీలు, బహిరంగ సభామండపాలు మరియు సుందర ద్వారాలు కలిగిఉంది.
ఈ కోట మరియు ఇందులో ఉన్న పురాతన వస్తుసంగ్రహాలయంలో బెనారస్ రాజవంశానికి చెందిన వస్తువులు బధ్రపరచబడి ఉన్నాయి. 18వ శతాబ్దం నుండి ఈ కోట కాశీనరేశ్ నివాసస్థాంగా ఉంది.
== ఇతరాలు ==
|