1948లో [[జెమినివారిజెమినీ పిక్చర్స్|జెమిని]] వారి [[వీరకుమార్]] చిత్రానికి ఒప్పుకుని కొంత అడ్వాన్స్ తీసుకున్నాడు. ఈలోగా యోగివేమన తీసిన [[కె.వి.రెడ్డి]] [[గుణసుందరి కథ]] తీస్తూండడంతో ఆయన్ను [[వాహినీ స్టుడియో]] లో కలవగా ఆయన పాట పాడించుకుని విని, గొంతు బాగాలేకపోయేసరికి చికాకు పడ్డాడు: "బాగా పాడేవాడివే! ఏమైంది? గొంతు ఇలా ఉంటే కప్పులు కడగడానికి కూడా పనికిరావు." అన్నాడు. దాంతో నిరాశపడ్డ పద్మనాభం సింహాద్రిపురం వెళ్ళిపోయాడు.