[[బొమ్మ:Hussain Sagar 01.JPG|right|thumb|250px|ట్యాంక్బండ్పై నుంచి హుస్సేన్ సాగర్ జలాశయం దృశ్యం]]
'''హుస్సేన్ సాగర్''' [[హైదరాబాదు]] నగరపు నడిబొడ్డున ఒక మానవ నిర్మిత [[సరస్సు]]. ఈ జలాశయాన్ని [[1562]]లో [[ఇబ్రహీం కులీ కుతుబ్ షా]] పాలనా కాలములో హజ్రత్ హుస్సేన్ షా వలీచే నిర్మింపబడింది. 24 చదరపు కిలోమీటర్ల వైశాల్యమున్న ఈ సరస్సు నగరము యొక్క మంచినీటి మరియు సాగునీటి అవసరాలను తీర్చటానికి [[మూసీ నది]] నిర్మించబడింది. చెరువు మధ్యలో హైదరాబాదు నగర చిహ్నముగా ఒక ఏకశిలా బుద్ధ విగ్రహాన్ని 1992లో స్థాపించారు. దీనికి పక్కన నెక్ లెస్ రోడ్ ఉంది.<ref>{{cite web
|title=View of Buddha Statue, Tank Bund, Hyderabad, Andhra Pradesh
|publisher=indospectrum.com
|accessdate=2006-11-02
}}</ref>
==నిర్మాణం==
1562లో హుస్సేన్ సాగర్ నిర్మాణాన్ని ఇబ్రహీం కులీ కుతుబ్ షా కట్టించినా, దాని నిర్మాణ పర్యవేక్షణ మాత్రం ఇబ్రహీం కులీ అల్లుడు, పౌర నిర్మాణాల సూపరిండెంటైన హుస్సేన్ షా వలీ చేపట్టాడు.చెరువు తవ్వకం పూర్తయినా నీరు నిండకపోవటంతో మూసీ నదికి అనుసంధానం చేశారు. 24 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, 32 అడుగుల లోతుతో చెరువు ఉండేది.