యాతగిరి శ్రీరామ నరసింహారావు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
≠[[రాజమండ్రి]]ని రాజమహేంద్రి గా సంభావించే శ్రీ యాతగిరి శ్రీరామ నరసింహారావు (వైఎస్ఎన్)నగర సాంంస్కృతిక వైభవాన్ని చాటుతూ, సాంక్కృతిక వారసత్వ పరిరక్షణకు కృషి చేస్తున్నారు. చారిత్రక పరిశోధకులుగా ఎన్నో అంశాలు వెలుగులోకి తీసుకువచ్చిన ఘనత ఈయనది. అందుకే 'రాజమహేంద్రి తనను తాను అద్దంలో చూసుకుంటే కనిపించేది శ్రీ వైఎస్ నరసింహారావే. నిజమైన కార్యదక్షుడు శ్రీ వైఎస్ ఎన్' అని ఆంధ్రకేసరి యువజనసమితి మాజీ అధ్యక్షులు, నరసాపురం వైఎన్ కళాశాల రిటైర్డ్ లెక్చరర్ డాక్టర్ అరిపిరాల నారాయణరావు అన్నారు.
 
జననం - వంశం
≠తూర్పు గోదావరి జిల్లా [[పెద్దాపురం]] లో అమ్మమ్మ అప్పలి సుభద్రమ్మ కు చెందిన మామిడితోటలో కట్టుకున్న కొత్త ఇంట్లో 18అక్టోబర్ 1936న జన్మించిన శ్రీరామ నరసింహారావు రాజమహేంద్రి స్వస్థ్లలం అయింది.మధ్వ సంప్రదాయానికి చెందిన ఈయన తండ్రి శ్రీ వెంకట నరసింహారావు. తల్లి రామాబాయమ్మ. శ్రీరామ నరసింహారావు తాత గారు శ్రీ యాతగిరి పూర్ణయ్య పంతులు.ఆంధ్రకేసరి [[టంగుటూరి ప్రకాశం పంతులు]] - శ్రీ పూర్ణయ్య పంతులు వీరిద్దరూ నాటక రంగ సహచరులు.
ఆంధ్రకేసరి యువజన సమితి స్థాపన
≠ సహకార శాఖలో ఉద్యోగం చేసిన శ్రీ యాతగిరి శ్రీరామ నరసింహారావు 1962లో ఆంధ్రకేసరి యువజన సమితి ప్రారంభించారు. ప్రకాశం పంతులు అంటే అమితంగా ఇష్టపడే శ్రీ నరసింహారావు ఆయన పేరుతోనే సమితిని నెలకొల్పారు. ఎన్నో సేవాకార్యక్రమాలకు సమితి వేదిక అయింది. కుష్టువ్యాధి నివారణ పధకాన్ని దశాబ్దకాలం పాటు నిర్వహించిన సమితి సాంస్కృతిక వికాసానికి, విద్యాబివృద్దికి, సాంస్కృతిక పరిరక్షణకు కృషి చేస్తూ వచ్చింది. ఇందుకోసం ఎన్నో ఉద్యమాలను కూడా నడిపింది. వీటన్నింటికీ శ్రీ యాతగిరి శ్రీరామ నరసింహారావు మార్గనిర్దేశనం చేస్తూ వచ్చారు. 35గ్రామాల్లో ఈ పధకాన్ని సమర్ధవంతంగా అమలు చేసినందుకు సమితి సంస్థాపకునిగా న్యూడిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో ఆనాటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి 1968లో సత్కారం అనుదుకున్నారు. రాళ్ళబండి సుబ్బారావు మ్యూజియం ప్రభుత్వపరం కావడంలోనూ, సిటీ మున్సిపల్ హైస్కూల్ విషయంలోనూ, గౌతమీ ప్రాంతీయ గ్రంధాలయం తదితర అంశాలలో సమితిని పోరాటదిశగా నడిపించారు.
ఆంధ్రకేసరి విద్యా సంస్థవిద్యాసంస్థల స్థాపన
# ఇది చాలా యాదృచ్చికంగా జరిగిందనే చెప్పాలి. అప్పటికే సమితి కార్యక్రమాలకు ఊతమిస్తూ వచ్చిన ఆనాటి కేంద్రమంత్రి శ్రీ పివి నరసింహారావు సమితి గౌరవ సభ్యులుగా సభ్యత్వం స్వీకరించారు. అప్పట్లొ జూనియర్ కాలేజీల కొరత వుండడం, విటి కళాశాలలో బిల్డింగ్ ఫండ్ వసూలు చేస్తున్న కారణంగా సమితి ఉద్యమం చేపట్టింది. అప్పుడు ముఖ్యమంత్రిగా వున్న శ్రీ పివి ఆంధ్రకేసరి ప్రకాశం శతజయంతి కార్యక్రమానికి కూడా వచ్చారు. సమితి తరపున కాలేజీ పెట్టమని సూచిస్తూ, కార్పస్ ఫండ్ కట్టక్కర్లేకుండా అనుమతి ఇచ్చారు.దీంతో అప్పటివరకూ సేవా కార్యక్రమాలు, ఉద్యమాలు చేస్తూ వచ్చిన సమితి తరపున కాలేజీ పెట్టించి,దిగ్విజయంగా నడుపుతున్నారు. 1972-73లో ఆంధ్రకేసరి శతజయంత్యత్సవ జునియర్ కళాశాల(ఎకెసి కాలేజీ) ఏర్పడితే,సొంత భవనాలను సమకూర్చుకుని, 1994 ఆగస్టు 23న జూనియర్ కళాశాల పక్కనే డిగ్రీ కళాశాల ను కళాప్రపూర్ణ వావిలాల గోపాలకృష్ణయ్య ప్రారంభోత్సవం చేసారు. ఎయిడెడ్ కళాశాలలు ప్రస్తుతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ శ్రీ వైఎస్ఎన్ సమయస్పూర్తితో నిరాటంకగా నడుస్తున్నాయి.
#
రాష్ట్రపతులు - ఫ్రధానులతో అనుబంధం
# అది యాదృచ్చికమో ఏమో గానీ ఇంచుమించు చాలామంది రాష్ట్రపతులు, ప్రధానులతొ అనుబంధం శ్రీ యాతగిరి శ్రీరామ నరసింహారావుకి వుండడం విశేషం. భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ బాబూ రాజేంధ్రప్రసాద్ 1955లో విజయవాడ మున్సిపల్ హైస్కూల్ లో హిందీ ప్రేమీ మండలి ఉత్సవాల్లో మాట్లాడుతుంటే శ్రీ వైఎస్ ఎన్ చూసారు. ఇక 1962 సెప్టెంబర్ - అక్టోబర్ లలో రెండునెలల పాటు జరిగిన సహకార శిక్షణ పొందిన శ్రీ వైఎస్ ఎన్ నాయకత్వంలో ఆనాటి రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ని కలుసుకున్నారు. అలాగే 1962లో ఆనాటి ఉప రాష్ట్రపతి శ్రీ జాకీర్ హుస్సేన్ ని ఆయన అధికార నివాసంలో, 1970లో ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ ని రాష్ట్రపతి భవన్ లో కలుసుకున్నారు. అఖిల భారత కుష్టు నివారణ సంఘ్ కార్యవర్గ సమావేశం రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి జ్ఞాని జైలు సింగ్ అధ్యక్షతన 6 ఆగస్టు 1983లో జరగ్గా సమితి పక్షాన శ్రీ వైఎస్ఎన్ హాజరయ్యారు. మాజీ రాష్ట్రపతి శ్రీ నీలం సంజీవ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా 1957 ఏప్రియల్ లో రాజమండ్రి ట్రావెలర్స్ బంగ్లాకు వచ్చినపుడు భారత్ సేవక్ సమాజ్ పట్టణ కార్యదర్శి గా వున్న శ్రీ వైఎస్ ఎన్ కలుసుకుని వినతి పత్రం అందించారు. అలాగే భారత తొలి ప్రధాని నెహ్రు రాజమండ్రి ఎన్నికల ప్రచారానికి 1951డిశెంబర్లో వచ్చినపుడు చూసారు.ఇక మాజీ ప్రధాని ఇందిరా గాంంధితో డిల్లీలో సన్మానం అందుకున్నారు. ఇక మాజీ ప్రధాని పివి అయితే సమితి శాశ్వత సభ్యులు కావడంతో అనుబంధం గురించి తెల్సిందే.
స్వాతంత్ర్య సమరయోధురాండ్ర పార్కు
#ఒకరా ఇద్దరా ఏకంగా 12మంది మహిళా స్వాతంత్ర్య సమరయోధురాండ్ర పార్కుని రాజమండ్రి పాల్ చౌక్ (ఇన్నీసుపేట)లో నెలకొల్పి, విగ్రహాలు ఏర్పాటుచేయించడంలో శ్రీ వైఎస్ఎన్ చూపిన చొరవ అద్వితీయం. శిలాఫలకాలపై మహిళా సమర యోధుల గురించి లిఖించారు.
ఇండియా ఇండిపెండెన్స్ సెంటర్
#అంతేకాదు పార్కుని ఆనుకుని ఇండియా ఇండిపెండెన్స్ సెంటర్ నెలకొల్పిన శ్రీ వైఎస్ఎన్, స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటాలు, వాడిన వస్తువులు అన్నీ సేకరించి అందులో ఏర్పాటుచేయిస్తున్నారు. ఇంకం టాక్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ మేడిశెట్టి తిరుమలకుమార్ తో కల్సి'మనవావిలాల' పుస్తకం రచించారు. రాజమహేంద్రి నగరానికి సంబంధించి అన్ని విషయాలు క్రోడీకరించి, క్విజ్ మాదిరిగా నృసింహ ప్రశ్నోపనిషత్ పేరిట 'సమాచారమ్'స్థానిక దినపత్రికలో ధారావాహికంగా అందించిన ప్రశ్నలు - జవాబులు పుస్తక రూపంలోకి తెచ్చారు. ప్రస్తుతం 3వ ముద్రణ అయింది. ఆలాగే శ్రీ యాతగిరి శ్రీరామ నరసింహారావు ధారావాహికంగా రాసిన "గుర్తుకొస్తున్నాయి" శీర్షిక ఆతర్వాత "నరసింహావలోకనం"(స్వీయచరిత్ర) పుస్తకంగా రూపుదిద్దుకుంది.
అశీతి ఉత్సవం
#11వ శతాబ్దంనాటి శ్రీ లక్ష్మినరసింహస్వామి విగ్రహం గల ఉత్తరాదిమఠాధికారిగావున్న శ్రీ యాతగిరి శ్రీరామ నరసింహారావు ప్రస్తుతం 80సంవత్సరాలు పూర్తిచేసుకుని,2016 అక్టోబర్ 1న అశీతి ఉత్సవం జరుపుకుంటున్నారు.ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ శాసన సభ ఉప సభాపతి శ్రీ మండలి బుద్ధప్రసాద్ ముఖ్య అతిధిగా వస్తున్నారు. నన్నయ్య విశ్వవిద్యాలయ విసి ఆచార్య ముర్రు ముత్యాల నాయుడు గౌరవ అతిధిగా పాల్గొంటారు. ప్రజాప్రతినిధులు, ప్రముఖులు హాజరవుతారు.