కిష్కిందకాండ సినిమా ద్వారా రచయితగా గుర్తింపు పొందిన శ్రీరాం అపుడపుడు కొన్ని సినిమాలలో అతిథి పాత్రలు వేసేవారు. తరువాత ఇ.వి.వి సినిమా [[చాలాబాగుందిచాలా బాగుంది]] ద్వారా పల్లెటూరి యాసతో మాట్లాడే పాత్రతో మంచి నటుడిగానూ గుర్తింపు పొందారు. దాంతో చాలా సినిమాల్లో అవకాశం వచ్చింది. హాస్య పాత్రల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. అంతేకాకుండా సెంట్ మెంట్, భావోద్వేగాలతో మిళితమైన [[అమ్మో ఒకటో తారీఖు]] అనే సినిమాలో నటించారు. ఈ సినిమా ఎల్. బి. శ్రీరామ్ ''ఒంటెద్దు బండి'' అనే నాటకం ఆధారంగా తీయబడింది. అంతేకాకుండా చాలా నాటకాలు రచించారు.