గాడిచర్ల హరిసర్వోత్తమ రావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (13), కు → కు (2), గా → గా (2), → (4), , → , , ( → ( using AWB
పంక్తి 17:
}}
 
ఆంధ్రులలో మొట్టమొదటి రాజకీయ ఖైదీ గాఖైదీగా పేరుపొందిన '''గాడిచర్ల హరిసర్వోత్తమ రావు''' ([[సెప్టెంబర్ 14]], [[1883]] - [[ఫిబ్రవరి 29]], [[1960]]) స్వాతంత్ర్య సమర యోధుడిగా, పత్రికా రచయితగా, సాహితీకారుడిగా, గ్రంథాలయోద్యమ నాయకుడిగా ఆయన తెలుగు జాతికి బహుముఖ సేవలు అందించాడు. ఆంగ్ల పదం ఎడిటర్ (Editor) కు సంపాదకుడు అనే తెలుగు పదాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి.
 
==జీవిత విశేషాలు==
[[1883]] [[సెప్టెంబర్ 14]] న [[కర్నూలు]] లో భాగీరథీ బాయి, వెంకటరావు దంపతులకు గాడిచర్ల హరిసర్వోత్తమ రావు జన్మించాడు <ref name=janamaddi>{{cite book |last=జానమద్ది |first=హనుమచ్ఛాస్త్రి |authorlink= |coauthors= |editor= |others= |title=సుప్రసిద్ధుల జీవిత విశేషాలు |origdate= |origyear=1994 |origmonth= |url= https://te.wikisource.org/wiki/%E0%B0%B8%E0%B1%81%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BF%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A7%E0%B1%81%E0%B0%B2_%E0%B0%9C%E0%B1%80%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A4_%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B6%E0%B1%87%E0%B0%B7%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81|format= |accessdate=2013-03-11 |accessyear= |accessmonth= |edition= |series= |date= |year= |month= |publisher=[[విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్]] |location= |language=తెలుగు |isbn= 81-7098-108-5 |oclc= |doi= |id= |pages= |chapter=గాడిచర్ల హరిసర్వోత్తమరావు |chapterurl=https://te.wikisource.org/wiki/%E0%B0%B8%E0%B1%81%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BF%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A7%E0%B1%81%E0%B0%B2_%E0%B0%9C%E0%B1%80%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A4_%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B6%E0%B1%87%E0%B0%B7%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81/%E0%B0%97%E0%B0%BE%E0%B0%A1%E0%B0%BF%E0%B0%9A%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B2_%E0%B0%B9%E0%B0%B0%E0%B0%BF%E0%B0%B8%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B5%E0%B1%8B%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A4%E0%B0%AE%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B5%E0%B1%81 |quote= }}</ref>. వారి పూర్వీకులు [[వైఎస్ఆర్ జిల్లా]] [[సింహాద్రిపురం]] గ్రామానికి చెందినవారు. వారిది పేద కుటుంబం. కర్నూలు, [[గుత్తి]], [[నంద్యాల]] లో ప్రాథమిక, ఉన్నత విద్య చదివాడు. ఇంకా చదువుకునే ఆర్ధికస్తోమత లేకున్నప్పటికీ, ప్రతిభా పారితోషికాల సహాయంతో [[1906]] లో [[చెన్నై|మద్రాసు]] లో ఎం.ఏ డిగ్రీ పూర్తి చేసాడు. తరువాత [[రాజమండ్రి]] లో ఉపాధ్యాయ శిక్షణ పొందుతుండగా, [[1907]] లో స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రవేశించాడు. రాజమండ్రిలో [[బిపిన్ చంద్ర పాల్]] చేసిన ఉపన్యాస స్ఫూర్తితో విద్యార్ధులంతా ''వందేమాతరం'' బ్యాడ్జిలు ధరించి తరగతికి వెళ్ళారు. వీరికి నాయకుడైన సర్వోత్తమ రావును కళాశాల నుండి బహిష్కరించడమే కాక, ఆయనకు ఎక్కడా ఉద్యోగమివ్వరాదని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
 
ఆ తరువాత ఆయన పత్రికా రంగంలోకి అడుగు పెట్టాడు. '''స్వరాజ్య''' అనే తెలుగు పత్రికను ప్రారంభించి, బ్రిటిషు పాలనపై విమర్శలు ప్రచురించేవాడు. [[1908]] లో తిరునెల్వేలి లోతిరునెల్వేలిలో పోలీసు కాల్పుల్లో ముగ్గురు మరణించినపుడు ''క్రూరమైన విదేశీ పులి'' (Cruel Foreign Tiger) అనే పేరుతో ఆయన రాసిన సంపాదకీయంపై ప్రభుత్వం కోపించి, ఆయనకు మూడేళ్ళ ఖైదు విధించింది. ఆ విధంగా ఆయన ఆంధ్రులలో ప్రప్రథమ రాజకీయ ఖైదీ అయ్యాడు.<ref name="ap online histroy">{{cite web|title=Modern Period|url=http://www.aponline.gov.in/quick%20links/hist-cult/history_modern.html|website=AP Online|accessdate=1 March 2015}}</ref> వెల్లూరు జైలులో, బందిపోట్లు, గజదొంగలూ ఉండే గదిలో ఆయనను బంధించి, అమానుషంగా వ్యవహరించింది, బ్రిటిషు ప్రభుత్వం. జైలు నుండి విడుదల అయ్యాక కూడా ఆయనపై ప్రభుత్వ నిఘా ఉండేది. ప్రజలు ఆయనతో మాట్లాడటానికి కూడా భయపడేవారు.
 
[[1914]] లో [[బాల గంగాధర తిలక్]] యొక్క [[హోం రూల్ లీగ్]] కు ఆంధ్ర రాష్ట్ర కార్యదర్శిగా విస్తృతంగా ప్రచారం చేసాడు. [[1924]] లో [[కాకినాడ]] లో జరిగిన కాంగ్రెసు సభల సమయంలో '''హిందూస్థానీ సేవా దళ్''' ఏర్పాటులో ఆయన ప్రముఖపాత్ర వహించాడు. [[1927]] లో కాంగ్రెసు అభ్యర్ధిగా [[నంద్యాల]] నియోజక వర్గం నుండి మద్రాసు కౌన్సిల్ కు ఎన్నికయ్యాడు. ఆంధ్ర విశ్వవిద్యాలయ సెనేట్ సభ్యునిగా కూడా పనిచేసాడు.
 
1930 నుండి రాజకీయ కార్యక్రమాలు తగ్గించుకుంటూ, తనకెంతో ప్రీతిపాత్రమైన గ్రంథాలయోద్యమం వైపు దృష్టి మరల్చాడు. ఆంధ్ర గ్రంథాలయ సంస్థకు [[1934]] నుండి జీవితాంతం అధ్యక్షుడిగా ఉన్నాడు. గ్రంథాలయ కార్యకర్తలకు, వయోజన విద్యా ఉపాధ్యాయులకు ఉపయోగపడే పుస్తకాలు రచించాడు. వారికి శిక్షణా శిబిరాలు నిర్వహించాడు.
 
ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించాడు. [[1952]] లో జరిగిన అఖిలపక్ష సదస్సుకు ఆయన అధ్యక్షత వహించాడు. దాని తరపున రాష్ట్రమంతా విస్తృతంగా పర్యటించి ఉద్యమాన్ని తీవ్రతరం చేసాడు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రమే కాక, సమైక్య [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రం ఏర్పాటు కూడా చూసి, [[1960]] [[ఫిబ్రవరి 29]] న గాడిచర్ల హరిసర్వోత్తమ రావు మరణించాడు. ఆయన స్మారకార్ధం [[విజయవాడ]]లో సర్వోత్తమ భవనం వెలసింది.
 
==రచనా వ్యాసంగం==
[[దస్త్రం:Gadicharla Hari Sarvottama Rao.jpg|thumbnail|గాడిచర్ల హరిసర్వోత్తమ రావు చిత్రపటం]]
పత్రికా రచయితగా, సంపాదకుడిగా, పుస్తక రచయితగా ఆయన చేసిన కృషి బృహత్తరమైనది.తెలుగుతో పాటు ఇంగ్లీషు, తమిళం, మరాఠీ మొదలైన భాషలు కూడా ఆయబకు వచ్చేవి.ఎం.ఏ చదివే రోజుల్లోనే మొదలైన ఆయన సాహితీ వ్యాసంగం, జీవితాంతం కొనసాగింది. ఎన్నో కొత్త పదాలు సృష్టించాడు. ఆయన సాహిత్య కృషిలో కొన్ని విశేషాలు:
* ప్రముఖ దినపత్రిక [[ఆంధ్ర పత్రిక]] కు ఆయన తొలి సంపాదకుడు. [[1916]] నుండి [[1918]] వరకు ఆయన సంపాదకుడుగా ఉన్నాడు.
* [[ది నేషనలిస్ట్]], [[మాతృసేవ]], [[ఎడల్ట్ ఎడ్యుకేషన్ రివ్యూ]], [[కౌముది]], [[ఆంధ్రవార్త]] అనే పత్రికలకు కూడా సంపాదకత్వం నిర్వహించాడు.
* మహిళల సమస్యలు పరిష్కరం కోసం " సౌందర్యవల్లి " అనే పత్రిక నడిపాడు.
పంక్తి 40:
* ''స్పిరిట్యువల్ స్వదేశీ నేషనలిజం'' అనే పుస్తకం రాసాడు.
* ఆయన రాసిన ''శ్రీరామ చరిత్ర'' అనే పుస్తకాన్ని 11 వ తరగతికి ఉపవాచకంగా ప్రభుత్వం తీసుకున్నది.
* ఆయన రచించిన ''పౌరవిద్య'' అనే పుస్తకాన్ని మద్రాసు ప్రభుత్వం 1 నుండి 6 తరగతుల వరకు పాఠ్యపుస్తకం గాపాఠ్యపుస్తకంగా నిర్ణయించింది.
* ఆయన వ్రాసిన ''అబ్రహాం లింకన్'' అనే పుస్తకాన్ని కొమఱ్ఱాజు వెంకటలక్ష్మణరావు సంకలించి విజ్ఞాన చంద్రికా గ్రంథమాలలో భాగంగా ప్రచురించారు.<ref>{{cite book|last1=హరిసర్వోత్తమరావు|first1=గాడిచర్ల|title=అబ్రహాం లింకన్|date=1907|publisher=విజ్ఞాన చంద్రికా గ్రంథమాల|location=చెన్నై|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=Abraham%20%20Lincoln&author1=G.Harisarvottama%20Rao&subject1=&year=1907%20&language1=telugu&pages=244&barcode=2020120000036&author2=&identifier1=&publisher1=THE%20VIAHAYYANTHI%20RESS&contributor1=CCL&vendor1=NONE&scanningcentre1=ccl,%20hyderabad&slocation1=NONE&sourcelib1=SRI%20VEMANANDHRA%20BHASHA%20NILAYAM&scannerno1=&digitalrepublisher1=PAR%20INFORMATICS%20HYDERABAD&digitalpublicationdate1=2027-01-03&numberedpages1=&unnumberedpages1=&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=enter%20name%20of%20the%20copyright%20owner&copyrightexpirydate1=&format1=BOOK%20&url=/data/upload/0000/035|accessdate=2 January 2015}}</ref>
 
==విశిష్టతలు==
తన సాహిత్య కృషిలో భాగంగా హరి సర్వోత్తమ రావు కొత్త పదాలను సృష్టించాడు. మచ్చుకు కొన్ని:
* '''[[రాయలసీమ]] ''' కు ఆ పేరు పెట్టింది ఆయనే <ref name=janamaddi/>. [[1928]]లో [[కర్నూలు]] జిల్లా [[నంద్యాల]] లో జరిగిన ఆంధ్ర మహాసభలో ఆయన ఈ పేరు పెట్టాడు. అప్పటి వరకు దీనిని '''దత్తమండలం''' (Ceded) అని పిలిచేవారు.
* '''రాయలసీమ ''' పేరును మొదట సూచించింది చిలుకూరి నారాయణరావు{{fact}}. నాడు జరిగిన సభలో గాడిచర్ల, చిలుకూరు నారాయణ రావు చేసిన సూచనను ప్రతిపాదించారు. అప్పటికే '''రాయలసీమ ''' పదం పరివ్యాప్తి చెంది ఉండడంతో సభ అందుకు ఏకగ్రీవ ఆమోదం తెలిపింది.
* ''సంపాదకుడు'', ''భావకవిత్వం'' అనే పదాలను పరిచయం చేసింది కూడా ఆయనే.
* ఎం.ఏ డిగ్రీ పొందిన ఆంధ్రులలో ఆయన రెండవవాడు.