గుత్తికొండ నరహరి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (3), ను → ను (2), గా → గా , తో → తో (2), హైదరాబాద్ → హైద using AWB
పంక్తి 37:
 
'''గుత్తికొండ నరహరి''' ([[ఆగష్టు 10]], [[1918]] - [[మార్చి 27]], [[1985]]) రచయిత, సంపాదకులు, తెలుగు రాజకీయరంగంలో అసమాన వక్త, రాజకీయ విశ్లేషకుడు.
 
 
==జీవన సరళి==
తెలుగు రాజకీయ రంగంలో అసమాన వక్తగా, రాజకీయ విశ్లేషకుడుగా రాణించిన గుత్తికొండ నరహరి [[ఆగస్టు 10]], [[1918]] న ఆంజనేయులు, రాఘవమ్మ దంపతులకు [[యలవర్రు]] గ్రామం, [[అమృతలూరు]] మండలం ([[గుంటూరు జిల్లా]]) లో పుట్టాడు. ఈ గ్రామం ప్రసిద్ధులకు కాణాచి. సుప్రసిద్ధ శాస్త్రవేత్త [[యలవర్తి నాయుడమ్మ]] అక్కడివాడే. సమీపంలో వున్న [[తురుమెళ్ళ]] పాఠశాలలో చదువుకున్నాడు. [[యలవర్తి రోశయ్య]] , [[మల్లంపాటి మధుసూదన ప్రసాద్]] తన సహాధ్యాయులు. కాలేజీలో చేరకుండానే బర్మా లోని రంగూన్ వెళ్ళి రెండేళ్ళు పత్రికా విలేఖరి గావిలేఖరిగా పనిచేసి , తిరిగి వచ్చి గుంటూరు [[ఆంధ్ర క్రైస్తవ కళాశాల]]లో బి.ఎ. పూర్తి గావించాడు. [[మద్రాస్]] లో న్యాయశాస్త్రము లోన్యాయశాస్త్రములో చేరి మధ్యలోనే స్వస్తిపలికి , [[ఎం.ఎన్.రాయ్]] ప్రభావంలో నవ్య మానవవాద రాష్ట్ర పార్టిపార్టీ కార్యదర్శి అయ్యాడు. 1944 లో గూడవల్లి లో, మేనమామ కూతురు సరోజిని తోసరోజినితో పెళ్ళి అయింది. ఈ వివాహం లౌకిక (Secular way) పద్ధతిలో జరిగి, నమోదు చేయబడినదిచేయబడింది.
 
==రాజకీయాలు ==
1946 ఎన్నికలలో నరహరి యువత నుద్దేశించి పదవులకు రాజీనామాలు చేయమని, స్వాతంత్ర్యం రానున్నందున త్యాగం చేస్తే తరువాత ఉన్నత పదవులు వస్తాయని బోధ చేశాడు. రాడికల్ రాజకీయాలలో అటు కమ్మూనిస్ట్ లను, ఇటు కాంగ్రెస్ వారిని ఎదురుకొని , తన ధారాళ ఉపన్యాసాలతో జనాన్ని ఆకట్టుకున్నాడు. [[ములుకోల]], [[ప్రజామిత్ర]], [[సమీక్ష (పత్రిక)| సమీక్ష]] పత్రికలలో వ్యాసాలు వ్రాసాడు. [[విహారి]], [[ఆంధ్రా లేబరు]] పత్రికల సంపాదకత్వం వహించాడు. రాజకీయ పాఠశాలలో ఎందరినో సుశిక్షితులను గావించాడు. [[త్రిపురనేని గోపీచంద్|గోపీచంద్]], [[ఆవుల గోపాలకృష్ణమూర్తి]] , [[ఎం.వి.రామమూర్తి]], [[కోగంటి రాధాకృష్ణమూర్తి]] , పి.వి.సుబ్బారావు, [[రావిపూడి వెంకటాద్రి]], [[ఎన్.వి.బ్రహ్మం]] లతో నవ్య మానవ వాద ఉద్యమంలో పనిచేశాడు. [[ఆంధ్ర క్రైస్తవ కళాశాల|ఎ.సి.కాలేజి]] ప్రిన్సిపాల్ టి.ఎస్.పాలస్ కు దగ్గర మిత్రుడు. కొన్నాళ్ళు [[ఎన్.జి.రంగా|ఆచార్య రంగా]] తో పనిచేశాడు. 1972లో క్షాత్ర ధర్మ పరిషత్ అనే రాజకీయ పార్టిపార్టీ పెట్టి, లోక్ సభకు పోటీ చేశాడు. అసంపూర్తిగా వదిలేసిన లా నులాను పూర్తి చేసి, 1974 లో, హైదరాబాద్హైదరాబాదు లో ప్రాక్టీస్ చేసాడు.
 
==వ్యాపారం ==
[[గుంటూరు]] లో పొగాకు కంపెనీ పెట్టి [[వ్యాపారం]] చేశాడు. [[కొత్త రఘురామయ్య]]తో కొన్నేళ్ళు కలసి పనిచేశాడు. అప్పుడే వి.కె.కృష్ణ మీనన్ కు చేరువయ్యాడు. పొగాకు వ్యాపారంలో దెబ్బతిన్న తరువాత తన ప్రతిభను రచనలకు వినియోగించాడు. కాని అవి ఇప్పుడు లభించడం లేదు. పొగాకు వాణిజ్యం కోసం కంపెనీల ఆర్డర్లు పొందడానికి తొలుత జపాన్ వెళ్ళాడు. పిమ్మట అనేక దేశాలు పర్యటించి ఆర్డర్లు తెచ్చాడు. వాణిజ్య పరమైన సమావేశాలు జరిపి, పొగాకు నాణ్యతపై వ్యాసాలు ప్రత్యేక సంచికలలో రాశాడు.
 
==మానవతా వాది ==
1955 లో ఆంధ్ర ప్రభ ఎడిటర్ [[నార్ల వెంకటేశ్వరరావు]] కు [[ఎం.ఎన్.రాయ్]] పూర్తి సాహిత్యం అందచేసి ఆయన నవ్య మానవ వాదిగా మారడానికి నరహరి కారకుడయ్యాడు. [[ఎం.ఎన్.రాయ్]] 1955 లో మరణించినప్పుడు ఆయనపై సంపాదకీయం రాయక పోగా, వార్త కూడా [[ఆంధ్రప్రభ]]లో వేయనందుకు [[ఆవుల గోపాలకృష్ణమూర్తి]] విరుచుకపడి నార్లను దుయ్యపట్టాడు. అప్పుడు నరహరిని కోరి, రాయ్ సాహిత్యం, నార్ల తెప్పించుకున్నాడు. నార్ల ఆలోచనా విధానం పై [[ఎం.ఎన్.రాయ్]] రచనలు, సిద్ధాంతాలు ప్రభావితం చేశాయి.
 
==హేతువాది==
[[కొండవీటి వెంకటకవి]] తన నెహ్రునెహ్రూ కావ్యం ద్వితీయ భాగాన్ని నరహరికి అంకితం ఇచ్చాడు. ఎన్.కె.అచార్య, [[ఆలపాటి రవీంద్రనాధ్|ఆలపాటి రవీంద్రనాథ్]], [[నరిశెట్టి ఇన్నయ్య|ఎన్.ఇన్నయ్య]] లతో హేతువాద, మానవవాద విషయాలలో కలసి పనిచేశాడు. నరహరి రాష్ట్ర రాడికల్ డెమొక్రాటిక్ పార్టిపార్టీ కార్య దర్శిగా మానవ విలువలను ప్రజలలోకి తీసుకెళ్ళడానికి కృషి చేశాడు. మూఢనమ్మకాలు వున్న జనానికి చక్కగా శాస్తీయ విషయాలు విడమరచి చెప్పడంలో అందెవేసిన నరహరి,[[1985]] [[మార్చి 27]] న చనిపోయాడు.
 
[[వర్గం:1918 జననాలు]]
[[వర్గం:1985 మరణాలు]]
"https://te.wikipedia.org/wiki/గుత్తికొండ_నరహరి" నుండి వెలికితీశారు