గులాం రసూల్ ఖాన్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ను → ను , కర్నూల్ → కర్నూలు, పని చేసి → పనిచేసి, → , ( → ( using AWB
పంక్తి 1:
'''గులాం రసూల్ ఖాన్''' [[కర్నూలు నవాబులు]] పాలకవంశానికి చెందిన ఆఖరి పరిపాలకుడు. గులాం రసూల్ ఖాన్ కర్నూలు నవాబుల్లో మూడవ పరిపాలకుడైన ఆలూఫ్‌ఖాన్ కట్టకడపటి కుమారుడు. ఇతనిపై అలూఫ్‌ఖాన్‌కు ఉన్న ప్రేమ కారణంగా మొదట ఆయన జన్మించివుండగానే కర్నూలుకు నవాబును చేసుకున్నారు.
== రాజకీయ నేపథ్యం ==
గులాం రసూల్ ఖాన్ [[1792]] నుంచి కర్నూలును పాలించిన నవాబు అలూఫ్‌ఖాన్ కుమారుడు. అలూఫ్‌ఖాన్ తండ్రి [[మునవర్ ఖాన్]] మరణానంతరం రాజ్యాన్ని పొందగా అప్పటికి రాజ్యం [[మైసూరు]] నవాబుల పరిపాలనలో ఉండేది. అలూఫ్ ఖాన్ పరిపాలన కాలంలో జరిగిన మూడో మైసూరు యుద్ధం కారణంగా ఈ ప్రాంతం నిజాం నవాబు పాలనలోకి వచ్చింది. [[1799]]లో నిజాం నవాబు, ఈస్టిండియా పాలకులు కలిసి మరో మారు శ్రీరంగపట్నాన్ని ముట్టడించి [[టిప్పుసుల్తాన్]] ను చంపేశారు. ఈ పరిణామానంతరం సైనిక ఖర్చుల కింద నిజాం నుంచి [[కడప]], [[బళ్ళారి]] వంటి ప్రాంతాలతో పాటు కర్నూలు కూడా తిరిగి తీసుకున్నారు. దాంతో అలూఫ్ ఖాన్ పరిపాలన కాలంలోనే కర్నూలు నవాబులు ఈస్టిండియా కంపెనీకి సామంతులు అయ్యారు.
 
== రాజ్యాధికారం ==
గులాం రసూల్ ఖాన్ చివరి [[కొడుకు]] కావడం, సంప్రదాయసిద్ధంగా [[తండ్రి]] మొదటి కుమారుడికే రాజ్యం సిద్ధించడం వంటి కారణాలతో ఇతనికి అంత తేలికగా రాజ్యం రాలేదు. అలూఫ్ ఖాన్ తన ఆరుగురు కొడుకుల్లో చివరవాడైన గులాంరసూల్‌ఖాన్ మీద ఉన్న ప్రేమ వల్ల తన బదులుగా అతడిని నవాబును చేసేందుకు అంగీకరించమని గవర్నర్ మింటోను ప్రార్థించారు. నవాబు తమకు చేసిన సహాయాలు, అతని విశ్వాసం పరిగణించి ఆ ప్రకారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ నేపథ్యంలో గులాం రసూల్‌ఖాన్ కర్నూల్కర్నూలు నవాబు అయ్యారు. మళ్ళీ అతనికి మారుగా కొంతకాలం మునవర్‌ఖాన్, ఆపైన ముజఫర్‌ఖాన్ నవాబులు అయ్యారు. క్రీ.శ.[[1815]]లో అలూఫ్‌ఖాన్ మరణించడంతో కంపెనీ ప్రభుత్వాధికారులు ముజఫర్ ఖాన్‌ని తొలగించి మునవర్ ఖాన్‌నే నవాబు చేశారు. [[1823]] సంవత్సరంలో గులాం రసూల్‌ఖాన్ నవాబు అయ్యారు.
 
== కంపెనీ పాలనకు వ్యతిరేకంగా కుట్ర ==
[[గులాంరసూల్ ఖాన్]] పరిపాలన కాలంలో [[ఈస్టిండియా]] కంపెనీకి [[ఆఫ్ఘనిస్థాన్]] చక్రవర్తికి యుద్ధం వచ్చింది. ఈ యుద్ధంలో ఆఫ్ఘనిస్తాన్ సుల్తాను విజయం సాధిస్తారని, అలా బలహీనపడివున్న సమయంలోనే ఉపఖండంలో కూడా [[ఈస్టిండియా]] కంపెనీపై తిరుగుబాటు చేసి పోరాడితే కంపెనీ పాలన అంతరించి తాము స్వతంత్ర పాలకులమవుతామని కొందరు ముస్లిం పరిపాలకులు భావించారు. వారిలో నిజాం [[తమ్ముడు]], కర్నూలు నవాబు గులాం రసూల్ ఖాన్ కూడా ఉన్నారు. పైగా దేశంలో చాలా ప్రాంతాల్లో విస్తరించిన ఈ కుట్రకు ప్రధాన కేంద్రంగా కర్నూలును ఎంచుకుని ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ రహస్యం చిత్రంగా బయటపడింది. [[1839]] వేసవి కాలంలో [[హైదరాబాద్]] నగరంలో ఒక బీద ముస్లిం స్త్రీ మరణించడానికి సిద్ధంగా ఉన్న స్థితిలో ఒక వ్యక్తికి తానొక రహస్యం చెప్పదలిచాననీ, తనకొక పని చేసిపెట్టాలనీపనిచేసిపెట్టాలనీ కోరింది. ఆ పెద్దమనిషి అందుకంగీకరించగా ఒక రక్షరేకు (తాయెత్తు) చేతికిచ్చి [[మూసీనది]]లో పారవెయ్యమన్నది. దీనిలో ఏదో రహస్యం వుందని అనుమానించి బ్రిటీష్ వారైన పై అధికారులకు తీసుకువెళ్లి ఇచ్చారు. దాన్ని వారు పరిశీలించి నిజాం నవాబు సోదరుడు కర్నూలు నవాబుకు రాసిన ఉత్తరమనీ, రక్షరేకుల్లో ఉన్న మతపరమైన విషయాల ద్వారా భారీ తిరుగుబాటుకు ప్రయత్నాలు పంపుకుంటున్నారని తెలుసుకున్నారు. ఆపైన కర్నూలు నవాబు వద్దకు వెళ్ళి అతని వద్ద ఉండకూడని భారీ ఆయుధాగారం ఉందన్న అనుమానం మీద సోదా చేశారు. అన్ని విధాలుగానూ, ధైర్యంగా నవాబు సహకరించారు. మొదట ఎంత సోదా చేసినా పెద్దసంఖ్యలోని ఆయుధాలేవీ దొరకలేదు. ఇంగ్లీష్ అధికారులు పట్టువదలక సోదా చేస్తే జనానాలోని మైదానం వద్ద కోట గోడల్లో బోలుగా తయారుచేసి లోపల గొప్ప ఆయుధాగారాన్ని సిద్ధం చేసినట్టు బయటపడింది.
 
== మరణం ==
పంక్తి 13:
== పరిపాలన విధానాలు ==
=== పుణ్యక్షేత్రాలు ===
కర్నూలు నవాబుల్లో చివరి వాడైన [[గులాం రసూల్ ఖాన్]] ప్రజాకంటకమైన పరిపాలన చేశారు. ఇతని కాలంలోనే కాశీయాత్రలో భాగంగా రసూల్ ఖాన్ నవాబు కింద ఉన్న గ్రామాలు, పట్టణాలు, పుణ్యక్షేత్రాల్లో విడిసిన యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య అతని పరిపాలన గురించి తన కాశీయాత్రచరిత్రలో భాగంగా సవివరంగా వ్రాసుకున్నారు.<br />
రసూల్ ఖాన్ కాలంలో తన పరిపాలనలో ఉన్న [[అహోబిలం]], [[శ్రీశైలం]] వంటి హిందూ పుణ్యక్షేత్రాల నుంచి భారీగా డబ్బు రాబట్టుకుని కనీస సౌకర్యాల కల్పనలో కూడా శ్రద్ధ వహించేవారు కాదు. శ్రీశైలంలో శివరాత్రి ఉత్సవాలకు వచ్చే సాధారణ భక్తులకు ఒక్కొక్కరికీ రూ.7, గుర్రానికి రూ.5, అభిషేకానికి రూ.3, వాహనోత్సవం చేయిస్తే ఉత్సవపు సెలవులు కాక రూ.43, దర్పణసేవోత్సవానికి రూ.3 ప్రకారం నవాబుకు చెల్లించాల్సివచ్చేది. అహోబిలంలో ఫాల్గుణమాసంలో [[బ్రహ్మోత్సవాలు]] జరిగే రోజుల్లో 400 వరహాల హాశ్శీలు ఆదాయం వస్తూండేదని, దానిని కందనూరి నవాబు తీసుకుని గుడికి చేయాల్సిన సౌకర్యాల గురించి మాత్రం పట్టించుకునేవాడు కాదని వివరించారు. వీటన్నిటికీ పరాకాష్టగా శ్రీశైల మల్లికార్జునుడికి, భ్రమరాంభాదేవికీ ఎవరైనా ఆభరణాలు, వస్త్రాలు సమర్పిస్తే వాటి ఖరీదుకు తగ్గ హాశ్శీలు తీసుకోవడమే కాక కొన్ని రోజులు గడిచాకా వాటిని తాను అపహరిస్తున్నాడన్న విషయం వ్రాసుకున్నారు<ref name="కాశీయాత్ర చరిత్ర">{{cite book|last1=వీరాస్వామయ్య|first1=యేనుగుల|title=కాశీయాత్రా చరిత్ర|date=1941|publisher=దిగవల్లి వెంకట శివరావు|location=విజయవాడ|edition=మూడవ ముద్రణ|url=http://ia601406.us.archive.org/12/items/kasiyatracharitr020670mbp/kasiyatracharitr020670mbp.pdf|accessdate=26 November 2014}}</ref>.
 
"https://te.wikipedia.org/wiki/గులాం_రసూల్_ఖాన్" నుండి వెలికితీశారు