గోండు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWB (చర్చ | రచనలు) AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వున్నాయి. → ఉన్నాయి., వున్నారు. → ఉన్నారు. (2), కూడ → కూడా using AWB |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: పెళ్లి → పెళ్ళి, వొక → ఒక (2), స్వాతంత్ర → స్వాతంత్ర్య, ) using AWB |
||
పంక్తి 34:
# నల్వెన్ సాగా ( Nalven saga : Four brother phratry)
హిందువులు ఎలాగైతే సగోత్రీకులను వివాహం చేసుకోరో, అలాగే గోండులు కూడా ఒక phratryకి చెందినవారు మరొక phratryకి చెందిన వారిని వివాహం చేసుకోరు. ఈ వ్యవస్థకు మూలపురుషుడిగా గోండులు
బస్తర్ ప్రాంతంలో నివసించే గోండులంతా ఒకలా ఉండరు. [[అబుఝమర్ కొండ]]ల్లో (Abujhamar Hills) [[పోడు వ్యవసాయం]] చేసుకొని జీవిస్తున్న కొండ మరియలు వ్యవసాయ పద్ధతుల రీత్యా, [[కొండ రెడ్లు]] లాగా, [[కొలాములు]]లాగా కనిపిస్తారు. వీరు ఎక్కువగా[[చంద్రాపూర్]] జిల్లాలోని [[భామ్రగఢ్]] ప్రాంతంలో విస్తరించి ఉన్నారు. ఈ మధ్య కాలంలో వస్తున్న మార్పుల వల్ల, వీళ్ళు కొండప్రాంతం నుండి మైదాన ప్రాంతాల్లోకి తరలి వచ్చి, అక్కడి వ్యవసాయ పద్ధతులను నేర్చుకొని, [[బియ్యం]] పండిస్తున్నారు.
భిషోహార్ మరియాలు, వ్యవసాయ పద్ధతుల్లోనే కాక, యితర ఆచార వ్యవహారాల్లో, సాంప్రదాయాల్లో కూడా ఆదిలాబాద్లోని రాజగోండులను పోలి వుంటారు. వీరి వివాహాల్లో, ప్రత్యేకంగా ఎద్దుకొమ్ములతో తయారుచేసిన
నాగలి, ఎద్దులతో దున్నుకొని వ్యవసాయం చేసిన గోండులు, క్రమంగా భూమినంతా కోల్పోయి, ప్రస్తుతం కౌలుదారులుగానో, వ్యవసాయ కూలీలుగానో బతుకుతున్నారు. ఆదివాసీ అస్థిత్వాన్ని కోల్పోయే క్రమం (Detribalization Process) గోండులలో వేగంగా జరుగుతోంది
పంక్తి 43:
==నాగోబా జాతర==
{{main|నాగోబా జాతర}}
సర్పజాతిని పూజిచండమే ఈ పండగ ప్రత్యేకత. ఆదిమ గిరిజనుల్లో మేస్రం వంశీయుల ఆరాధ్యదైవం నాగోబా గోండుల దేవత. నాగోబా దేవాలయం ఆదిలాబాద్కు 40 కిలోమీటర్ల దూరంలో ఇంద్రవెల్లి మండలం ముత్నూర్ దగ్గర [[కెస్లాపూర్]] గ్రామంలో ఉంది. కెస్లాపూర్లో జరిగే ఈజాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించింది. కెస్లాపూర్ జనాభా 400కు మించదు. కాని పండగనాడు లక్షలాది మందితో అది జనారణ్యంగా మారుతుంది. జనవరి 25 నుంచి 29 వరకు నాలుగు రోజులపాటు గిరిజనులు ఈ పండుగ జరుపుకుంటారు. యేటా [[పుష్యమాసము]] [[అమావాస్య]] రోజున జాతర ప్రారంభ మవుతుంది. నాగోబాను కొలిస్తే పంటలు బాగా పండుతాయని, శాంతి విరాజిల్లుతుందని, రోగాలు మటు మాయమ వుతాయని గిరిజనుల నమ్మకం. నాగోబా చరిత్రను గోండు గిరిజనులు రకరకాలుగా చెప్పుకుంటారు. పూర్వం మేస్రం కుటుంబానికి చెందిన నాగాయిమోతి రాణికి నాగేంద్రుడు కలలో కనిపించి [[సర్పం]] రూపంలో ఆమె గర్భాన జన్మిస్తానని చెప్పాడని, ఆ కల నిజమైందని గోండుల నమ్మకం. సర్పరూపంలోని నాగేంద్రునికి తల్లి అంటే రాణి తన తమ్ముడి కూతురు గౌరీతో వివాహం జరిపించింది. అత్త ఆజ్ఞ మేరకు గౌరీ భర్తను బుట్టలో పెట్టుకొని గోదావరికి ప్రయాణం కాగా, ఒకచోట పాము ఉడుం రూపంలో కనిపించగా ఆ ఊరు ఉడుంపూరైంది. ఆ తరువాత గౌరి ధర్మపురి వద్ద గోదావరిలో స్నానం చేయడానికి వెళ్లగా ఆమెను చూసి నాగేంద్రుడు మనిషి రూపంలోకి మారాడని, అయితే పేరు ప్రతిష్టలు కావాలో.. సంప్రదాయం కావాలో.. తేల్చుకోమనగా గౌరి సంప్రదాయాలను లెక్కచేయక పోవడంతో తిరిగి పాముగా మారాడని కథ. ఆ తరువాత ఉడుంపూర్ నుంచి గరిమెల వరకు అతనికోసం వెతికిన గౌరి గోదావరిలోనే సత్యవసి గుండంలో కలిసిపోయిందని, నాగేంద్రుడు ఆమె వెంట ఉంచిన ఎద్దు రాయిగా మారిందని భక్తుల విశ్వాసం. ఆ తరువాత
పుష్యమాసంలో వచ్చే పౌర్ణమినాడు [[మేస్రం]] వంశీయులు 20 మంది గిరిజనులు వెంటరాగా కొత్త కుండలతో కడెం మండలంలోని గొడిసిర్యాల పరిసర ప్రాంతాల్లో ప్రవహిస్తున్న [[గోదావరి]] జలాన్ని తీసుకువచ్చేందుకు బయలుదేరుతారు. దీంతో జాతర ప్రారంభమైనట్టే. ఆ జలాన్ని తీసుకురావడానికి కెస్లాపూర్ నుంచి గోదావరి దాకా కాలినడకన 80 కిలోమీటర్లు వెళ్తారు. కెస్లాపూర్ చేరుకొని జాతర ప్రాంగణంలోని గిరిజనులు చెప్పుకునే ప్రాశస్త్యం గల [[మర్రి చెట్టు]] కింద విడిదిచేసి అమావాస్యరోజు రాత్రి నాగోబాకు కొత్త కుండల్లో గోదావరి నుంచి తెచ్చిన నీళ్లతో అభిషేకం చేస్తారు. తరువాతే క్షీరాభిషేకం చేసి గిరిజన ఆచారాల మేరకు పూజలు నిర్వహిస్తారు. 3 సంవత్స రాల కొకసారి పూజారిని మార్చడం ఆనవాయితీ. జాతరకు వచ్చే మేస్రం వంశీయులు వేలాది మంది ఉన్నా వారు వంట చేసుకునేది మాత్రం 22 పొయ్యిల మీదే. ఈ పొయ్యిలు ఎక్కడపడితే అక్కడ పెట్టడానికి వీల్లేదు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రహరీ గోడ లోపల, గోడకు చుట్టూ దీపాలు వెలిగించేందుకు ప్రత్యేక అరలు (దుగుడు) ఉన్నాయి. ఆ దీపాల కాంతుల వెలుగులో 22 పొయ్యిల్లో మేస్రం వంశీయుల వంతుల వారిగా వంటలు చేసుకుంటారు. మిగితా జాతుల వారు ఎక్కడైనా వంట చేసుకోవచ్చు. జాతర సందర్భంగా ఏర్పాటయ్యే దర్బార్కు ఒక ప్రత్యేకత, చరిత్ర ఉన్నాయి. 63 ఏడేళ్ల క్రితం మారుమూల గ్రామాలకు ఎలాంటి సౌకర్యాలు లేవు. నాగరికులంటేనే ఆదివాసులు పరుగెత్తేవారు. గిరిజనుల వద్దకు అధికారులెవరు వెళ్లేవారు కాదు. అప్పుడే భూమి కోసం.. విముక్తి కోసం సాయుధ పోరాటం చేసి కొమురం భీం మరణించిన సంఘటన జరిగింది. ఈ సంఘటనతో ఉలిక్కిపడ్డ నిజాం ప్రభువులు గిరిజన ప్రాంతాల పరిస్థితులు, గిరిజనుల స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు ప్రముఖ మానవ పరిణామ శాస్త్రవేత్త ప్రొఫెసర్ హైమన్డార్ఫ్ ను ఆదిలాబాద్ జిల్లాకు పంపారు. ఆయన దృష్టి జాతరపై పడింది. కొండలు, కోనలు దాటి వచ్చే గిరిజనుల సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు జాతరలో దర్బార్ ఏర్పాటు చేయాలని అనుకున్నాడాయన. దీన్ని ప్రొఫెసర్ [[హైమన్డార్ఫ్]] 1946లో మొదట నిర్వహించారు.
==ఇవీ చూడండి==
|