చిదంబరం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (5), కి → కి (3), గా → గా (2), తో → తో , స్థంభ → స్తంభ, ఉ using AWB
పంక్తి 23:
}}
:''ఈ వ్యాసం కడలూరు జిల్లాలోని ఒక పట్టణానికి సంబంధించినది. [[భారత ఆర్ధిక మంత్రి]] కోసం [[పి. చిదంబరం]] చూడండి.''
'''చిదంబరం''' [[తమిళనాడు]] లోని [[కడలూరు]] జిల్లాకు చెందిన [[మునిసిపాలిటీ]] మరియు తాలూకా కేంద్రం. ఇది తీరానికి 11 కి.మీ మరియు [[చెన్నై]] కి రైలు ద్వారా 240 కి.మీ దక్షిణంగా ఉంది.
 
== పట్టణం ఉనికి ==
పరమ [[శివుడు]] శివతాండవం చేస్తూ [[నటరాజు]] గా వెలసిన చిదంబరం దేవాలయం 40 ఎకరాల సముదాయంలో ఉన్నదిఉంది. [[శైవులకు]] దేవాలయం లేదా [[తమిళం]] లో కోయిల్‌ అంటే చిదంబరం ఉన్న ఈ నటరాజ దేవాలయం. చిదంబరం -- చిత్ - స్పృహ + [[అంబరం]] - [[ఆకాశం]] - అంటే శివుడు తాండవమాడే స్థలం అని అర్థం.
 
== ఆలయ కథా విశేషం ==
పంక్తి 48:
3) నిరాకారం - పంచ భూతాల్లో ఒకటైన ఆకాశానికి ప్రతీకగా గర్భ గుడిలోని ఖాళీ స్థలం
 
ఈ విధంగా చిదంబరం పంచభూత స్థలాల్లో (పంచభూతములు - భూమి, నీరు, నిప్పు, గాలి మరియు ఆకాశం) ఒకటిగా వెలుగొందుతోంది. మిగిలినవి - భూ స్వరూపంగా కొలువబడుతున్న [[కాంచీపురం]] లోని [[ఏకాంబరేశ్వరర్]] దేవాలయం, నీటి స్వరూపంగా కొలువబడుతున్న [[తిరుచ్చిరాపల్లి]] దగ్గరలోని [[తిరువనైకవల్]] లో గల [[జంబుకేశ్వరర్]] దేవాలయం, అగ్ని స్వరూపంగా కొలువబడుతున్న [[తిరువణ్ణామలై]] లోని [[అన్నమలైయర్]] దేవాలయం మరియు గాలి స్వరూపంగా కొలువబడుతున్న [[శ్రీ కాళహస్తి]] లోని [[శ్రీకాళహస్తీశ్వర]] దేవాలయం.
 
[[పరమశివుడు]] నృత్యం చేసినట్లుగా చెప్పబడే ఐదు స్థలాల్లో చిదంబరం కూడా ఒకటి. ఈ స్థలాలు అన్నింటిలోనూ వేదిక/సభై లుసభైలు కనిపించడం విశేషం. చిదంబరం కాక మిగిలిన ప్రాంతాలు [[తిరువాలంగడు]] లోని [[రత్తినసబై]] (రత్తినం - రత్నం), [[కౌర్తాళ్ళం]] లోని [[చిత్రసబై]] (చిత్ర - చిత్రకళకు ప్రతీక), [[మదురై]] లోని [[మీనాక్షి]] దేవాలయంలోని [[రజతసబై]] (రజత - వెండి) మరియు [[తిరునెల్వేలి]] లోని [[నెల్లైఅప్పర్]] దేవాలయంలోని [[తామిరసబై]] (తామిరం - రాగి).
 
== దేవాలయపు భక్తులు ==
 
ఈ దేవాలయపు భక్తుల్లో మొదటివారుగా పరిగణింపబడుతున్నవారు ఆలయ నిర్వహణ చూసే తిల్లై వాళ్ అంధనార్ (తిల్లైలో ఉండే పూజారులు అని అర్థం) అని పిలవబడే పూజారులు.
నలుగురు భక్త కవులు ఈ దేవాలయాన్ని ఈ స్వామిని అజరామరం చేశారు. వాళ్ళెవరంటే [[తిరుజ్ఞాన సంబంథర్]] , [[తిరునావుక్కరసర్]] , [[సుందరమూర్తి నయనార్]] మరియు [[మాణిక్కవసాగర్]] . మొదటి ముగ్గురి రచనలు దేవరములుగా ఖ్యాతి పొందాయి. [[తిరుజ్ఞాన సంబంథర్]] చిదంబరం స్వామి పైన రెండు దేవరములు, [[తిరునావుక్కరసర్]] [[నటరాజ]] స్వామి పైన ఎనిమిది దేవరములు మరియు [[సుందరమూర్తి నయనార్]] [[నటరాజ]] స్వామి పైన ఒక్క దేవరము రచించి స్వరపరిచారు. [[మాణిక్కవసాగర్]] రెండు రచనలు చేశారు. మొదటిది చిదంబరంలో ఎక్కువగా పాడబడే [[తిరువాసకం]] (పవిత్ర వచనాలు) మరియు రెండవది పూర్తిగా చిదంబరంలోనే పాడబడే తిరుచిత్రాంబలక్కోవైయార్ (లేదా తిరుకోవైయార్). [[మాణిక్కవసాగర్]] చిదంబరంలోనే ఆధ్యాత్మిక ఆనందం, ముక్తి పొందారని చెప్పబడుతుంది.
 
== భౌగోళికం ==
 
చిదంబరం భౌగోళికంగా {{coor d|11.4|N|79.7|E|}}<ref>[http://www.fallingrain.com/world/IN/25/Chidambaram.html Falling Rain Genomics, Inc - Chidambaram]</ref> లో ఉంది. ఇది రమారమి 3&nbsp;[[మీటర్]] లు (9&nbsp;[[అడుగు (పొడవు కొలమానం)|అడుగులు]]) ఎత్తులో ఉంది.
 
== జనాభా వివరాలు ==
పంక్తి 66:
== దేవాలయ శిల్ప కళ మరియు దేవాలయ విశేషాలు ==
 
ఈ దేవాలయానికి 9 ద్వారాలు ఉన్నాయి. ఈ తొమ్మిదిలో 4 పెద్ద గాలి గోపురాలు ( తూర్పు, పశ్చిమ , ఉత్తర, దక్షిణ దిక్కులలో). ఈ నాలుగు గాలి గోపురాలు చాల పురాతనమైనవి. తూర్పు గాలి గోపురము మీద 108 ముద్రలతో [[భరత నాట్యం]] చేస్తున్న శిల్పాలు చెక్కబడ్డాయి.
ఆలయ సముదాయం 40 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నదిఉంది. ఈ ఆలయ సముదాయములోనే ఒక పెద్ద తటాకము (శివ గంగ) మరియు చిన్న ఇళ్ళు ఉన్నాయి. ఇవి కాక ఐదు సభలు లేదా వేదికలు ఉన్నాయి. అవి - గర్భగుడిగా వెలుగొందుతున్న చిత్సబై, చిత్సబైకి ఎదురుగానే ఉన్న నిత్యపూజలు జరిగే కనకసబై, గర్భగుడికి ఎదురుగానే శివుడు 'కాళి' తో నాట్యమాడినట్లుగా చెప్పబడుతున్న నృత్యసబై లేదా నాట్యసబై - ఇది శక్తి స్వరూపం, భగవంతుడి ఆధిపత్యాన్ని చాటి చెప్పిన ప్రాంతం, రాజ్యసబై లేదా 1000 స్తంభాల మంటపం (నిజానికి ఉన్నది 999 స్తంభాలే, భగవంతుడు దర్శనమిచ్చినప్పుడు ఆయనే 1000వ స్తంభం) మరియు పంచమూర్తులు కొలువైన దేవసబై (పంచ - ఐదు, మూర్తులు - భగవంతుడి విగ్రహాలు. ఆ ఐదు ఏవంటే గణేశుడు - విఘ్నాలు తొలగించే స్వామి, తన భార్య 'శివానందనాయకి'తో కూడి కూర్చున్న భంగిమలో దర్శనమిచ్చే సోమస్కందర్ స్వామి, మురుగా స్వామి మరియు భక్తముఖ్యుడు, ప్రధాన భక్తుడు ఐన చండికేశ్వరర్).
 
ఇవి కాక పతంజలి, వ్యాఘ్రపాదర్ పూజించిన తిరుమూలతనేశ్వరర్ మరియు ఆయన దేవేరి ఉమయ్య పార్వతి ఆలయం, 63 ప్రధాన భక్తులు లేదా అరుబత్తుమూవర్ ల ఆలయాలు, 'జ్ఞాన శక్తి'కి నిలయమైన శివగామి ఆలయం, విఘ్నాలు పోగొట్టే గణేశాలయం,
మూడు విధాలైన శక్తులు - ఇచ్ఛై లేదా కోరిక అవతారమైన భార్య వల్లి, క్రియకు ప్రతిరూపమైన భార్య దేవయాని, అజ్ఞానాన్ని నాశనం చేసేందుకు స్వామి వాడే జ్ఞానానికి ప్రతిరూపమైన బల్లెం - వీటిని కలిగిన మురుగా లేక పాండియనాయకం ఆలయం కూడా ఉన్నాయి.
ఆలయ ప్రాంగణంలో గోవిందరాజ పెరుమాళ్, ఆయన దేవేరి పుండరీగవల్లి తాయర్ దేవాలయం కూడా ఉంది. ఈ దేవాలయాన్ని తిల్లై తిరుచిత్రకూడమ్ అంటారు. ఇది 108 [[వైష్ణవ దివ్యదేశాలు]] లో ఒకటి. దివ్యదేశాలంటే ప్రముఖ భక్తులైన [[ఆళ్వార్లు]] మంత్రాలు (నాలయిర దివ్యప్రబంధం) చదివి శుద్ధి (మంగళాశాసనం) చేసిన విష్ణ్వాలయాలు.
ఆలయ ప్రాంగణంలో ఇంకా చాలా చిన్న ఆలయాలు ఉన్నాయి.
 
ఆలయపు రూపకల్పనలోనూ, స్థాపత్యంలోనూ (స్థాపత్యం - ఆర్కిటెక్చర్) వేదాంతార్థాలు కోకొల్లలు. ఉన్న తొమ్మిది ద్వారాలు మానవ శరీరంలోని నవరంధ్రాలను సూచిస్తాయి. గర్భగుడిని ఒక ప్రక్కనున్న కనకసబై అనే వేదిక పైనుంచి పంచాచ్ఛరపది అనే ఐదు మెట్లు ఎక్కి చేరుకోవాలి.
పంచాచ్ఛరపది అంటే : పంచ - ఐదు, అ-చ్ఛర - నాశము లేని శబ్దాలు ''' శి వా య న మ '''. పొన్నాంబళం హృదయానికి ప్రతీక కనుక వేదిక పక్క నుంచి వెళ్ళడం (మిగతా దేవాలయాల్లో మాదిరి ముందు నుంచి కాకుండా). పొన్నాంబళం లేదా గర్భగుడిని 28 స్థంభాలుస్తంభాలు మోస్తున్నాయి. ఇవి 28 ఆగమాలను (ఆగమాలు శివుడిని అర్చించే వైదిక విధానాలు) సూచిస్తాయి. ఇక ఆలయం పైకప్పుని 64 కళలకు ప్రతీకలైన 64 దూలాలు, అంతు లేని రక్తనాళాలకు ప్రతీకలైన ఎన్నో అడ్డ దూలాలు మోస్తున్నాయి. పైకప్పుని 21600 శివయనమ అని రాసిన బంగారు పలకలతో కప్పారు. ఇవి 21600 శ్వాసలను సూచిస్తాయి. కప్పుపై 9 రకాలైన శక్తిని సూచించే 9 పవిత్ర కుంభాలు లేదా కలశాలతో తీర్చిదిద్దారు (చూ. ఉమాపతి శివమ్ రచించిన కుంచితాంగ్రిస్తవం)
 
== చిదంబర రహస్యం ==
పంక్తి 88:
== ఆలయ నిర్వహణ మరియు దైనందిన పూజలు ==
ఆలయ నిర్వహణ బాధ్యతలను ఆనువంశికంగా వైదిక బ్రాహ్మణుల్లో ఒక శాఖ ఐన చిదంబరం దీక్షితార్లు చూసుకుంటున్నారు. పురాణాల ప్రకారం వీరిని కైలాస పర్వతాల నుంచి పతంజలి ఋషి ప్రధానంగా దైనందిన పూజాదికాలు జరపడానికీ, చిదంబరం ఆలయ నిర్వహణకూ తీసుకు వచ్చారు.
దీక్షితార్లను [[శివుడు|శివుడి]]ని [[నటరాజు]] గా కొలవటానికి నియోగించిన పతంజలి ఆలయ పూజా విధానాలను వేదాల నుంచి సేకరించి ఏర్పరిచారు.
 
అలా తిల్లై మూవాయిరమర్ అని పిలవబడే 3000 మంది దీక్షితార్లు (2999 మరియు భగవంతుడు) వచ్చారని ప్రతీతి. ఇప్పుడు మొత్తంగా దాదాపు 360 మంది ఉన్నారు. వీళ్ళు శివపూజకు ఆగమ పద్ధతులు పాటించే శివాచారియర్లు లేదా ఆదిశైవర్ల వలె కాక వైదిక పద్ధతులు పాటిస్తారు.
పంక్తి 96:
అవాళ్టి ప్రధాన పూజారి తనను తాను శుద్ధి చేసుకునే మంత్రాదికాలు పూర్తి చేసి శివోహంభవ రూపు దాల్చడంతో దినచర్య ప్రారంభమౌతుంది. పిమ్మట పూజారి ఆలయ ప్రవేశం చేస్తారు. స్వామివారి పాదుకలను ఉదయం 7 గంటల వేళ పాలియారై లేదా పవళింపు గది నుంచి గర్భగుడికి భక్తుల మేళ తాళాలు, డమరుక ధ్వనుల మధ్య పల్లకీలో తీసుకురావడంతో పూజాదికాలు ఆరంభమౌతాయి. పూజారి అప్పుడు భగవంతుణ్ణి అడ్డంకులను తొలగించమని వేడుకుంటూ నైవేద్యం పెట్టి ఒక ఆవు, దూడ జంటను పూజిస్తారు.
 
పూజ రోజుకు 6 సార్లు జరుగుతుంది. పూజ చెయ్యడానికి ముందు ప్రతిసారీ స్వామి అసంపూర్ణ రూపమైన స్ఫటిక లింగానికి నెయ్యి, పాలు, పెరుగు, అన్నం, చందనం, విబూది తోవిబూదితో లేపనం చేస్తారు. పిమ్మట స్వామికి అప్పుడే తయారు చేసిన తిండి పదార్థాలు, తీపి నైవేద్యం పెట్టి సంస్కృతంలో వేదాలు, పంచపురాణం (పన్నీరు తిరుమురై అని పిలువబడే 12 తమిళ రచనల నుండి ఎన్నిక చేసుకున్న 5 కవితలు) చదువుతూ అందంగా, వివిధ రకాలుగా అలంకరించిన దీపాలతో దీపారాధన చేస్తారు. పూజారి గర్భగుడి తెరను తొలగించి చిదంబర రహస్యాన్ని చూపడంతో పూజ ముగుస్తుంది.
 
రెండవ సారి పూజకు ముందు మామూలుగా స్ఫటిక లింగానికి చేసే సేవలతో పాటు ఒక రత్న [[నటరాజు]] విగ్రహం (రత్న సభాపతి) కూడా సేవలందుకుంటుంది. మూడవ పూజ మధ్యాహ్నం 12:00 గంటల సమయంలో జరుగుతుంది. తర్వాత ఆలయం మూసివేసి మళ్ళీ సాయంత్రం 4:30 గంటలకు తెరుస్తారు. నాల్గవ పూజ సాయంత్రం 6:00 గంటలకు, ఐదవది రాత్రి 8:00 గంటలకు, చివరి పూజ రాత్రి పది గంటలకు జరుగుతాయి. దీని తర్వాత స్వామివారి పాదుకలను ఆయన విశ్రమించడానికి వీలుగా ఊరేగింపుగా తీసుకువెళ్తారు. ఐదవ పూజకు ముందు పూజారి చిదంబర రహస్యానికి ప్రత్యేక పూజలు చేసి యంత్రానికి సుగంధ ద్రవ్యాలతో లేపనం చేస్తారు.
పంక్తి 102:
అర్ధజాము పూజ అని పిలువబడే చివరి పూజను చిదంబరంలో ప్రత్యేకమైన ఉత్సాహంతో చేస్తారు. స్వామివారు రాత్రి విశ్రమించేటప్పుడు విశ్వంలోని దైవిక శక్తి అంతా ఆయనలో విశ్రమిస్తుందని భక్త జనుల నమ్మకం.
== ప్రభుత్వ అధీనంలోకి ==
చిదంబరం ఆలయాన్ని ప్రైవేటు ఆలయంగా ప్రకటించాలన్న స్థానిక దీక్షితుల అభ్యర్థనను మద్రాస్ హైకోర్టు తిరస్కరించింది. దీంతో ఆ ఆలయ నిర్వహణా బాధ్యతలు జిల్లా యంత్రాంగం అధీనంలోకి వచ్చాయి. సుమారు 1500 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన చిదంబరం ఆలయంలో న్యాయస్థానం నిర్ణయం కారణంగా ఓ శకం ముగిసినట్త్లెంది. ఈ ఆలయం కొన్ని వందల సంవత్సరాలుగా స్థానిక దీక్షితుల అధీనంలో ఉంది. వీరి పూర్వీకులు స్వయంగా కైలాసం నుంచి వచ్చి ఈ ఆలయ వ్యవహారాలను చక్కదిద్దేవారని ఈ సాంప్రదాయ బ్రాహ్మణ వంశం గట్టిగా నమ్మేది. సుదీర్ఘ న్యాయపోరాటం అనంతరం గతవారం మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో ఈ ఆలయం ప్రభుత్వం పరమైంది. (ఈనాడు 9.2.2009)
 
== పండుగలు ==
పంక్తి 129:
* ఒక అందరికీ అందుబాటులో ఉన్న మూలం [http://85.1911encyclopedia.org/C/CH/CHIDAMBARAM.htm] నుండి సంగ్రహించి, తగిన మార్పులు చేయడమైనది
* http://www.tamilnadutourism.org/chidam.htm
* http://www.templenet.com/Tamilnadu/s122.html లోhtmlలో చూచినది
* http://www.templenet.com/Tamilnadu/chidambaram.html
* [http://www.templenet.com/Tamilnadu/chidchid.html Nataraja Temple at Chidambaram]
"https://te.wikipedia.org/wiki/చిదంబరం" నుండి వెలికితీశారు