రాయలసీమ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
'''రాయలసీమ''' అనునది [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రంలోని మూడు ముఖ్యప్రాంతాల్లో ఒకటి . ఆంధ్ర ప్రదేశ్ లోని దక్షిణ భాగం లో ఉండే నాలుగు జిల్లాలు ( [[కర్నూలు]], [[కడప]], [[అనంతపురం]], [[చిత్తూరు]]) రాయలసీమ ప్రాంతంలోకి వస్తాయి.
 
రాయలసీమ [[విజయనగర సామ్రాజ్యం]] లో భాగాంగా [[శ్రీ కృష్ణదేవ రాయలు|శ్రీ కృష్ణదేవ రాయల]]చే పరిపాలించబడినది. అది వరకూ [[తూర్పు చాళుక్యులు|తూర్పు చాళుక్యుల]] పరిపాలనా కేంద్రంగా '''హిరణ్యక రాష్ట్రం'''గా ఈ ప్రాంతం విలసిల్లినది. తర్వాత రాయలసీమ పై [[చోళులు|చోళుల]] ప్రభావం పెరిగినది. బ్రిటీషు వారి సహకారాన్ని పలు యుద్ధాలలో పొందిన [[హైదరాబాదు]]కి చెందిన నిజాం సుల్తానులు 1802 లో ఈ ప్రాంతాన్ని వారికి ధారాదత్తం చేయటంతో దీనికి '''దత్త మండలం ''' అని పేరు వచ్చినది. 1808 లో '''దత్త మండలం''' ను విభజించి [[బళ్ళారి]] మరియు [[కడప]] జిల్లాలని ఏర్పరచారు. 1882 లో అనంతపురాన్ని బళ్ళారి నుండి వేరు చేశారు. ఈ ప్రాంతానికి [[1928]]లో [[చిలుకూరి నారాయణరావు]] "రాయలసీమ" అని పేరుపెట్టాడు. అప్పటి నుండి ఆ పేరే స్థిరపడినది.
 
ప్రాథమికంగా తెలుగు మాట్లాడే ఈ జిల్లాలు 1953 వరకూ [[మద్రాసు ప్రెసిడెన్సీ]] లో భాగంగా ఉన్నవి. [[బళ్ళారి]] కూడా రాయలసీమలో ప్రాంతంగానే ఉండేది. [[కోస్తా]], రాయలసీమ నాయకులు జరిపిన అనేక సంవత్సరాల ఉద్యమం ఫలితంగా 1953లో ప్రత్యేక [[ఆంధ్ర రాష్ట్రం]] ఏర్పడింది. అప్పుడు ఈ నాలుగు జిల్లాలను [[ఆంధ్ర రాష్ట్రం]] లో, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు దృష్ట్యా బళ్ళారిని [[కర్ణాటక]] లో కలిపి వేశారు. [[కన్నడ]], [[తెలుగు]] మాట్లాడేవారు సమానంగా ఉన్న బళ్ళారి నగరాన్ని పలు చర్చలు, వివాదాల తర్వాత [[మైసూరు]] లో చేర్చారు. 1956 లో ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణాలో కలపటంతో అప్పటి నుండి ఇవి [[ఆంధ్ర ప్రదేశ్]] లో భాగంగా ఉంటున్నవి.
పంక్తి 22:
 
==వ్యుత్పత్తి==
పలు యుద్ధాలలో బ్రిటీషు వారు నిజాం పాలకులకి సహకరించినందుకు కృతజ్ఞత గా ఈ ప్రాంతాన్ని వారికి ధారాదత్తం చేయటంతో '''దత్త మండలాలు''' లేదా '''దత్త సీమ''' పదాలు వ్యావహారికంలోకి వచ్చాయి. 20వ శతాబ్దపు ప్రారంభం నాటికి ఇక్కడి మేధావులు ఈ పేర్లు అవమాన కారకాలుగా అనుభూతి చెందారు. 1928 నవంబరు 17-18 తారీఖులలో [[నంద్యాల]] పట్టణంలో జరిగిన ఆంధ్ర మహాసభ లో పాల్గొన్న నాయకుల మధ్య జరిగిన తీవ్రమైన చర్చలలో [[చిలుకూరి నారాయణ రావు]] [[విజయనగర సామ్రాజ్యము]]నకు చెందిన రాయల వంశము ఈ ప్రాంతాన్ని పరిపాలించారు కావున, వారి సుపరిపాలనలోనే ఇక్కడి [[సంస్కృతి]] మరియు వారసత్వ సంపదలు ఒక వెలుగు వెలిగాయి కావున, దీనికి రాయలసీమ అని పేరు పెట్టాలని ప్రతిపాదించారు. (ఇది వరకు ఈ పేరు [[గాడిచర్ల హరిసర్వోత్తమ రావు]] ప్రతిపాదించారు అనే ఆలోచన వ్యాప్తిలో ఉండేది. కానీ పరిశోధనల్లో ఈ ఘనత చిలుకూరి వారిదే అని తేలినది.) '''రాయలసీమ''' అన్న పేరు అన్ని వర్గాల మేధావులని/సామాన్య ప్రజానీకాన్ని ఆకర్షించటంతో ఆ పేరే ఈ ప్రాంతానికి స్థిరపడిపోయినది. [[కోస్తా]] ఆంధ్ర నాయకులు మద్రాసు రాష్ట్రం నుండి ఆంధ్ర రాష్ట్రాన్ని వేర్పరచాలని ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం జరుపుతున్న సమయంలో ఈ ప్రాంతం నాయకులు ఆంధ్ర ప్రాంతంతో కలిస్తే రాయలసీమ అభివృద్ధి చెందదేమో అని సంశయించి, మొదట వారికి సహకరించలేదు. రాయలసీమ ప్రజల అనుమానాలు తీర్చటానికే 16 నవంబరు 1937 లో '''శ్రీబాగ్ ఒడంబడిక''' రూపొందించబడినది.
 
==రాయలసీమ సంస్కృతి==
పంక్తి 101:
 
==భౌగోళిక మార్పులు==
స్వతంత్రానంతరం గుంటూరు జిల్లానుండి కొంత భాగాన్ని, కర్నూలు జిల్లా నుండి కొంత భాగాన్ని వేరు చేసి [[ప్రకాశం]] జిల్లాను ఏర్పరచినారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా మొత్తం కోస్తా ప్రాంతంలోనే చూపించబడుతున్నది.
 
==పరిశ్రమలు==
"https://te.wikipedia.org/wiki/రాయలసీమ" నుండి వెలికితీశారు