యాతగిరి శ్రీరామ నరసింహారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 48:
#ఇది చాలా యాదృచ్చికంగా జరిగిందనే చెప్పాలి.అప్పటికే సమితి కార్యక్రమాలకు ఊతమిస్తూ వచ్చిన ఆనాటి కేంద్రమంత్రి శ్రీ పి.వి.నరసింహారావు సమితి గౌరవ సభ్యులుగా సభ్యత్వం స్వీకరించారు.అప్పట్లొ జూనియర్ కాలేజీల కొరత వుండడం,వి.టి.కళాశాలలో బిల్డింగ్ ఫండ్ వసూలు చేస్తున్న కారణంగా సమితి ఉద్యమం చేపట్టింది.అప్పుడు ముఖ్యమంత్రిగా వున్న శ్రీ పి.వి.ఆంధ్రకేసరి ప్రకాశం శతజయంతి కార్యక్రమానికి కూడా వచ్చారు.సమితి తరపున కాలేజీ పెట్టమని సూచిస్తూ,కార్పస్ ఫండ్ కట్టక్కర్లేకుండా అనుమతి ఇచ్చారు.దీంతో అప్పటివరకూ సేవా కార్యక్రమాలు, ఉద్యమాలు చేస్తూ వచ్చిన సమితి తరపున కాలేజీ పెట్టించి,దిగ్విజయంగా నడుపుతున్నారు. 1972-73లో ఆంధ్రకేసరి శతజయంత్యత్సవ జునియర్ కళాశాల(ఎకెసి కాలేజీ) ఏర్పడితే,సొంత భవనాలను సమకూర్చుకుంది.ఆనాటి సమితి ప్రెసిడెంట్ ఎం ఎన్ చారి కృషి కీలకం. ఇక 1994 ఆగస్టు23న జూనియర్ కళాశాల పక్కనే డిగ్రీ కళాశాలను కళాప్రపూర్ణ వావిలాల గోపాలకృష్ణయ్య ప్రారంభోత్సవం చేసారు.ఎయిడెడ్ కళాశాలలు ప్రస్తుతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ శ్రీ వైఎస్ఎన్ సమయస్పూర్తితో నిరాటంకగా నడుస్తున్నాయి.
==రాష్ట్రపతులు-ఫ్రధానులతో అనుబంధం==
# అది యాదృచ్చికమో ఏమో గానీ ఇంచుమించు చాలామంది రాష్ట్రపతులు, ప్రధానులతొ అనుబంధం శ్రీ యాతగిరి శ్రీరామ నరసింహారావుకి వుండడం విశేషం. భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ బాబూ రాజేంధ్రప్రసాద్ 1955లో విజయవాడ మున్సిపల్ హైస్కూల్ లో హిందీ ప్రేమీమండలి ఉత్సవాల్లో మాట్లాడుతుంటే శ్రీ వైఎస్ఎన్ చూసారు. ఇక 1962 సెప్టెంబర్-అక్టోబర్ లలో రెండునెలల పాటు జరిగిన సహకార శిక్షణ పొందిన శ్రీ వైఎస్ ఎన్ నాయకత్వంలో ఆనాటి రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ని కలుసుకున్నారు. అలాగే 1962లో ఆనాటి ఉప రాష్ట్రపతి శ్రీ జాకీర్ హుస్సేన్ ని ఆయన అధికార నివాసంలో, 1970లో ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ ని రాష్ట్రపతి భవన్ లో కలుసుకున్నారు. అఖిల భారత కుష్టు నివారణ సంఘ్ కార్యవర్గ సమావేశం రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ అధ్యక్షతన 6ఆగస్టు1983లో జరగ్గా సమితి పక్షాన శ్రీ వైఎస్ఎన్ హాజరయ్యారు. మాజీ రాష్ట్రపతి శ్రీ నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, 1957 ఏప్రియల్ లో రాజమండ్రి ట్రావెలర్స్ బంగ్లాకు వచ్చినపుడు భారత్ సేవక్ సమాజ్ పట్టణ కార్యదర్శిగా వున్న శ్రీ వైఎస్ఎన్ కలుసుకుని వినతిపత్రం అందించారు. అలాగే భారత తొలిప్రధాని నెహ్రు రాజమండ్రి ఎన్నికల ప్రచారానికి 1951డిశెంబర్లో వచ్చినపుడు చూసారు.ఇక మాజీ ప్రధాని ఇందిరా గాంంధితో డిల్లీలో సన్మానం అందుకున్నారు. ఇక మాజీ ప్రధాని పి.వి.అయితే సమితి శాశ్వత సభ్యులు కావడంతో అనుబంధం చివరివరకూ కొనసాగింది.
==స్వాతంత్ర్య సమరయోధురాండ్ర పార్కు==
#ఒకరా ఇద్దరా ఏకంగా 12మంది మహిళా స్వాతంత్ర్య సమరయోధురాండ్ర పార్కుని రాజమండ్రి పాల్ చౌక్ (ఇన్నీసుపేట)లో నెలకొల్పి,విగ్రహాలు ఏర్పాటుచేయించడంలో శ్రీ వై.ఎస్.ఎన్.చూపిన చొరవ అద్వితీయం. శిలాఫలకాలపై మహిళా సమరయోధుల గురించి లిఖించారు.
 
==ఇండియా ఇండిపెండెన్స్ సెంటర్==
అంతేకాదు పార్కుని ఆనుకుని ఇండియా ఇండిపెండెన్స్ సెంటర్ నెలకొల్పిన శ్రీ వైఎస్ఎన్, స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటాలు, వాడిన వస్తువులు అన్నీ సేకరించి అందులో ఏర్పాటుచేయిస్తున్నారు. ఇంకం టాక్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ మేడిశెట్టి తిరుమలకుమార్ తోకల్సి'మనవావిలాల'పుస్తకం రచించారు. రాజమహేంద్రి నగరానికి సంబంధించి అన్ని విషయాలు క్రోడీకరించి, క్విజ్ మాదిరిగా "నృసింహ ప్రశ్నోపనిషత్" పేరిట 'సమాచారమ్'స్థానిక దినపత్రికలో ధారావాహికంగా అందించిన ప్రశ్నలు-జవాబులు పుస్తక రూపంలోకి తెచ్చారు. ప్రస్తుతం3వముద్రణ అయింది.ఆలాగే శ్రీ యాతగిరి శ్రీరామనరసింహారావు ధారావాహికంగా రాసిన "గుర్తుకొస్తున్నాయి"శీర్షిక ఆతర్వాత"నరసింహావలోకనం"(స్వీయచరిత్ర)పుస్తకంగా రూపుదిద్దుకుంది. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి ఎపి నూతన రాజధాని 2015లో తొలిసారి [[తుళ్ళూరు]]లో జరిగిన ఉగాది ఉత్సవంలో ప్రభుత్వం నుంచి పురస్కారం అందుకున్నారు.