జి. సుబ్రహ్మణ్య అయ్యర్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Nrgullapalli (చర్చ | రచనలు) |
ChaduvariAWB (చర్చ | రచనలు) |
||
పంక్తి 1:
{{Orphan|date=సెప్టెంబరు 2016}}
{{Infobox person |
name = గణపతి దీక్షితార్ సుబ్రహ్మణ్య అయ్యర్ |
Line 11 ⟶ 13:
occupation = ఉపన్యాసకుడు, పాత్రికేయుడు, సంస్థాపకుడు
}}
గణపతి దీక్షితర్ సుబ్రహ్మణ్య అయ్యర్ ([[తమిళ భాష|Tamil]]
== తొలినాళ్ళు ==
ఆనాటి [[తంజావూరు జిల్లా]]లో [[తిరువది]]లో సుబ్రహ్మణ్య అయ్యర్ జనవరి 1855న జన్మించారు. తిరువది మున్సిఫ్ కోర్టులో న్యాయవాదిగా పనిచేసిన గణపతి దీక్షితార్ ఏడుగురు కుమారుల్లో నాలుగవ వాడు ఆయన. సుబ్రహ్మణ్య అయ్యర్ తొలినాళ్ళలో తిరువేదిలో పాఠశాల విద్యను అభ్యసించడం ప్రారంభించారు, 1871లో తంజావూరులోని సెయింట్ పీటర్స్ కళాశాలలో మెట్రిక్యులేషన్ పూర్తిచేశారు. 1873లో ఆయన ఆర్ట్స్ పరీక్షలను మెరిట్లో పాసయ్యారు, 1874-75లో మద్రాసులో ఉపాధ్యాయ శిక్షణ కోర్సులో చేరి చదివారు.
[[స్కాట్లాండ్]] మిషన్ స్కూల్, మద్రాసులో 1875 నుంచి 1877 వరకూ విద్యాబోధన చేశారు. పచ్చయ్యప్ప హైస్కూలులో 1877 సంవత్సరంలో బోధించారు. 1877లో ఆయన బి.ఎ. పరీక్షలు ప్రైవేటు అభ్యర్థిగా పూర్తిచేసి, ఆంగ్లో-వెర్నాక్యులర్ స్కూల్, [[ట్రిప్లికేన్]]
== ''ది హిందూ'' స్థాపన ==
Line 24 ⟶ 26:
'ట్రిప్లికేన్ సిక్స్' (ఆరుగురు ట్రిప్లికేన్ యువకులు) అని పేరొందిన ఈ సముదాయం ఇతర విద్యార్థులకు బార్ లో సభ్యత్వం వచ్చాకా విడిపోయింది. చివరకు వారిలో వార్తాపత్రికలో సంపాదకుడు జి. సుబ్రహ్మణ్య అయ్యర్, వీరరాఘవాచార్యర్ లు మాత్రమే మిగిలారు.
''ది హిందూ'' ప్రారంభం నుంచి తన ఉనికిని విశిష్టంగా నిలుపుకుంటూ వచ్చింది. సుబ్రహ్మణ్య అయ్యర్ అనేక స్టింగ్ ఆపరేషన్లతో తీక్షణమైన, సునిశితమైన వ్యాసాలు రాశారు. సుబ్రహ్మణ్య అయ్యర్ భారత
ది హిందూ 12 డిసెంబర్ 1885లో భారత జాతీయ [[కాంగ్రెస్]] ఏర్పాటైనప్పుడు ఆ పరిణామాన్ని ఆహ్వానిస్తూ సంపాదకీయంలో రాశారు.
Line 33 ⟶ 35:
== రాజకీయాలు ==
సుబ్రహ్మణ్య అయ్యర్ భారత
1889లో విధవరాలైన తన కుమార్తెకు పునర్వివాహం చేసినప్పుడు [[మైలాపూరు]]లో ఆయన చుట్టూ ఉన్న బంధువులు, స్నేహితులతో కూడిన సమాజమే సామాజికంగా వెలి వేసింది. సుబ్రహ్మణ్య అయ్యర్ భారత జాతీయ కాంగ్రెస్ లోని సంప్రదాయ వర్గపు మద్దతును ఆయన సంస్కరణ భావాలు, ఆచరణ వల్ల కోల్పోవడంతో రాజకీయంగా కూడా పదవులు లభించలేదు.
Line 39 ⟶ 41:
== సాంఘిక సంస్కరణ ==
[[హిందూ]] సమాజంలో సంస్కరణ కోసం సుబ్రహ్మణ్య అయ్యర్ తీవ్రస్థాయిలో ఉద్యమించారు. ఆయన విధవా పునర్వివాహాలను సమర్థించి, అంటరానితనం, బాల్య వివాహాలు నశించాలని ఆశించారు. 13 ఏళ్ళ వయసున్న బాల్య వితంతువు, తన కుమార్తె అయిన శివప్రియమ్మాళ్ కు ఓ యువకునితో 1889లో బొంబాయి కాంగ్రెస్ సమావేశాల్లో వివాహం చేశారు.
ఆంగ్ల పత్రికకు సంపాదకత్వం వహిస్తున్నా మాతృభాష ప్రభావం తెలుసుకుని, బహిరంగ సభల్లో ప్రసంగించేప్పుడు తమిళంలో మాట్లాడేవారు. తమిళ జాతీయ కవిగా సుప్రసిద్ధులైన సుబ్రహ్మణ్య భారతిని తొలినాళ్ళలో ఆదరించి, ప్రోత్సహించి, తన ఇంట్లో ఆతిథ్యం ఇచ్చారు.
== తర్వాతి రోజులు, మరణం ==
1898లో సుబ్రహ్మణ్య అయ్యర్ ది హిందూతో తనకున్న సంబంధాలను విరమించుకుని, 1882లో తాను ప్రారంభించిన తమిళ వార్తాపత్రిక స్వదేశ మిత్రన్ పై దృష్టిపెట్టారు.
సుబ్రహ్మణ్య భారతి తన సంపాదకుడి శైలిని వర్ణిస్తూ - "సుబ్రహ్మణ్య అయ్యర్ కలం బాగా ఘాటైన సన్న పచ్చి మిరపకాయల ముద్దలో ముంచినట్టు ఉంటుందని" అన్నారు. ఆ శైలి ఆయనను సమస్యల్లోకి నెట్టి 1908లో బ్రిటీషర్లు అరెస్టు చేసేదాకా తెచ్చింది. జైలులోని స్థితిగతులు, వేధింపులతో క్రమంగా ఆయన ఆరోగ్యం పాడైంది.
పంక్తి 59:
* {{Cite book|title=Builders of modern India|last=S. A. Govindarajan|publisher=Publications Division, Ministry of Information and Broadcasting, Govt. of India|year=1969}}
* {{Cite book|title=G.Subramania Iyer: his life and career with an introduction|year=1900}}
[[వర్గం:1855 జననాలు]]
[[వర్గం:1916 మరణాలు]]
|