[[బ్రిటీష్ ఇండియా]]లో భాగమైన [[జునాగఢ్]] సంస్థానం స్వాతంత్రానంతరంస్వాతంత్ర్యానంతరం [[భారత దేశం|భారత]] డొమినియన్ లో భాగమై, ఆపైన పూర్తిగా విలీనం కావడాన్ని '''జునాగఢ్ విలీనం'''గా పిలుస్తారు. [[భారత స్వాతంత్ర్య చట్టం 1947|భారత స్వాతంత్రస్వాతంత్ర్య చట్టంలో]] భారత దేశం, పాకిస్తాన్ లుగా బ్రిటీష్ ఇండియాను విభజిస్తూ స్వాతంత్రంస్వాతంత్ర్యం ఇచ్చేప్పుడే, దేశంలోని వందలాది సంస్థానాలకు భారత్, పాకిస్తాన్ డొమినియన్లలో ఏదో ఒకటి ఎంచుకునేందుకు కానీ, స్వతంత్రంగా ఉండేందుకు కానీ అవకాశం ఇచ్చారు. ఐతే భారతదేశాన్ని ఐక్యం చేసేందుకు సంస్థానాల శాఖమంత్రి [[వల్లభ్ భాయి పటేల్]], ఆయన కార్యదర్శి వి.పి.మీనన్, గవర్నర్ జనరల్ [[లార్డ్ మౌంట్బాటన్]] కృషిచేసి దేశంలోని వివిధ సంస్థానాలను విలీనం చేశారు. ఐతే వాటిలో స్వాతంత్రానంతరంస్వాతంత్ర్యానంతరం వరకూ విలీనం కాకుండా మిగిలిన మూడు సంస్థానాల్లో జునాగఢ్ ఒకటి.