జై ఆంధ్ర ఉద్యమం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎నేపథ్యం: clean up, replaced: నేపధ్యం → నేపథ్యం using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (5), , → , using AWB
పంక్తి 1:
{{విస్తరణ}}
[[హైదరాబాదు]] సంస్థానంలో [[1915]] లో [[నిజాము]] జారీ చేసిన ఒక ఫర్మానా ప్రకారం [[ముల్కీ నియమాలు]] అమలు లోకి వచ్చాయి. వీటి ప్రకారం హైదరాబాదు సంస్థానంలో పుట్టిన వారు కాని, హైదరాబాదులో కనీసం 15 ఏళ్ళుగా నివసిస్తూ, తమ ప్రాంతానికి తిరిగి వెళ్ళమని అఫిడవిట్టు ఇచ్చిన వారు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులు. [[1969]]లో ముల్కీ నియమాలు భారతదేశ ప్రజల మౌలిక హక్కులను కాలరాచేటట్లు ఉండటం వలన రాజ్యాంగ విరుద్ధమని<ref name="supreme1">ముల్కీ నిభంధనాలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో దాఖలైన వ్యాజ్యం యొక్క తీర్పు పాఠం: [http://openarchive.in/judis/1772.htm ఏ. వీ. ఎస్. నరసింహా రావు vs. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం]</ref> భారత అత్యున్నత న్యాయస్థానం తన తీర్పులో ప్రకటించడంతో [[మొదటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమము|మొదటి తెలంగాణా ఉద్యమం]] ఉధృతరూపం దాల్చింది. అయితే [[1972]]లో వేరొక కేసులో అంతకు ముందు తాను చేసిన తీర్పును చెల్లుబాటు కాకుండా ముల్కీ నియమాలను హైదరాబాదులో ఎప్పటినుండో ఉన్న నియమ నిభందనలు కావున వాటిని గౌరవించాలనే ఉద్దేశంతో ముల్కీ నిబంధనలను అమలు చేయాలని అత్యున్నత న్యాసస్థానం తీర్పునిచ్చింది<ref name="supreme2">1972లో సుప్రీంకోర్టు ముల్కీ నిభందనలపై చేపట్టిన తదుపరి వ్యాజ్యం యొక్క తీర్పు పాఠం: [http://openarchive.in/judis/6695.htm డైరెక్టరు, పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం vs. వి. వెంకటరెడ్డి]</ref>. ముల్కీ నిబంధనలపై [[సుప్రీం కోర్టు]] ఇచ్చిన తీర్పునకు పర్యవసానం '''జై ఆంధ్ర''' పేరుతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమానికి దారితీయటం.
 
==నేపథ్యం==
స్వాతంత్ర్యానికి పూర్వమే అమల్లో ఉన్న ఈ నియమాలు రాజ్యాంగబద్ధమే అని [[1971]] అక్టోబర్ లో సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పు అన్యాయమని, తమ రాష్ట్ర రాజధానిలోనే తాము రెండవ తరగతి పౌరులుగా మారామనే ఆవేదనతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనకై ఉద్యమించారు.ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుపై కోస్తా ఆంధ్ర, రాయలసీమ నాయకుల మధ్య ఏర్పడిన విభేదాలను తొలగించటానికి[[శ్రీబాగ్‌ ఒడంబడిక]] , [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రంలో- కోస్తా, [[రాయలసీమ]], [[తెలంగాణ]] నాయకుల్ని సంతృప్తి పరచటానికి [[పెద్దమనుషుల ఒప్పందం]] లాగానే, జై ఆంధ్ర ఉద్యమాన్ని ఆపటంకోసం "[[ఆరుసూత్రాల పధకం]]" రచించారు. ఈ ''[[ఆరు సూత్రాల పథకం]]'' ముందు ఉన్న అన్ని నిబంధనలను రూపుమాపి అమలులోకి వచ్చింది.
 
==ఉద్యమ ప్రస్థానం==
కేంద్రప్రభుత్వం రాజీ ప్రతిపాదనగా ఈ నిబంధనల కాలపరిమితి రాజధానిలో 1977 వరకు, మిగతా తెలంగాణలో 1980 వరకు మాత్రమే అమల్లో ఉంటాయని శాసనం చేసింది. అయితే ఈ ప్రతిపాదన ఆంధ్ర ప్రాంతం వారికి రుచించలేదు. విద్యార్థులు ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఉద్యోగులు నిరవధిక సమ్మెకు పూనుకున్నారు. శాసనసభ స్పీకరు [[బి.వి.సుబ్బారెడ్డి]] పదవికి రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొన్నాడు. ఆ ప్రాంత శాసనసభ్యులంతా [[తిరుపతి]] లో సమావేశమై చర్చించారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన అత్యధిక మంత్రులు రాజీనామా చేసారు.
 
ఉద్యమం హింసాత్మకంగా జరిగింది. సమైక్యవాదులపై దాడులు జరిగాయి. కమ్యూనిస్టు పార్టీ బహిరంగంగా ఉద్యమాన్ని వ్యతిరేకించింది. రాష్ట్ర విభజన రాష్ట్రహితం కాదని వాదించింది. ఆ పార్టీ పత్రిక [[విశాలాంధ్ర దినపత్రిక]] లో ఉద్యమానికి వ్యతిరేకంగా వ్యాసాలు రాసింది. ఉద్యమకారులు పత్రిక ఆఫీసుపై దాడులు చేస్తామని బెదిరించారు.
 
==పరిష్కారం==
పంక్తి 16:
# ప్రభుత్వోద్యోగుల సమస్యల పరిష్కారానికి ఒక ఉన్నతాధికార సంఘాన్ని నియమిస్తారు.
# వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కొరకు రాష్ట్రాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేస్తారు.
# హైదరాబాదు లోహైదరాబాదులో కేంద్రవిశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసి విద్యాభివృద్ధికి దోహదం చేస్తారు.
# పై సూత్రాలను చేరుస్తూ [[రాజ్యాంగ సవరణ]] చేస్తారు.
 
ఉద్యమ కార్యాచరణ సంఘం ఈ పథకాన్ని ఆమోదించింది. [[1973]] [[డిసెంబర్]] లో పార్లమెంటు ఈ ప్రణాళికను 33 వ రాజ్యాంగ సవరణ ద్వారా [[భారత రాజ్యాంగం|రాజ్యాంగం]]లో చేర్చింది. కేంద్రం రాష్ట్రపతి పాలన తొలగించి [[జలగం వెంగళరావు]] నాయకత్వంలో తిరిగి ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసింది.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/జై_ఆంధ్ర_ఉద్యమం" నుండి వెలికితీశారు