పెంపుడు కూతురు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 10:
 
[[వర్గం:ఎన్టీఆర్‌ సినిమాలు]]
 
పెంపుడు కూతురు -- ఫ్లాష్ బ్యాక్ @ 50
14/06/2013 | - సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి
 
ఆంధ్రప్రదేశ్‌లోని బుడుగూరు (చిత్తూరు జిల్లా)లో జన్మించారు శ్రీ బుడుగూరు రామకృష్ణయ్య పంతులు (బి.ఆర్. పంతులు). మద్రాస్‌లో చదివి కొంతకాలం టీచర్‌గా పనిచేసి, తరువాత నటుడిగా మారారు. కొన్ని చలనచిత్రాలలో నటించి పేరుసంపాదించిన పిమ్మట తమిళ రచయిత, దర్శకుడు అయిన శ్రీ పి.నీలకంఠతో భాగస్వామిగా పద్మిని పిక్చర్స్ సంస్థను ప్రారంభించారు. తమిళంలో, మలయాళంలో చిత్రాలను నిర్మించి దర్శకత్వం చేశారు. బి.ఆర్. పంతులు తెలుగులో నిర్మించిన చిత్రాలు ‘‘పిల్లలు తెచ్చిన చల్లని రాజ్యం’’ (1960), ‘‘గాలిమేడలు’’ (1962), ‘‘పెంపుడు కూతురు’’ (1963) 6-2-1963న విడుదలైంది.
‘‘పెంపుడు కూతురు’’ చిత్రానికి కథ ఇరా షణ్ముగం, మాటలు, స్క్రీన్‌ప్లే డి.వి.నరసరాజు, నృత్యం పి.యస్. గోపాలకృష్ణ, ఎడిటింగ్ డి.దేవరాజ్, ఫొటోగ్రఫీ వి.రామ్మూర్తి, సంగీతం టి.జి.లింగప్ప.
తిరుపతి (రమణారెడ్డి) సీతమ్మ దంపతుల కుమారుడు రఘు (యన్.టి.ఆర్) వారి పెంపుడు కూతురు ఉమ(దేవిక), గాయనిగా, స్కూల్ టీచర్‌గా మంచి పేరుసంపాదించుకుంటుంది. దశావతారం (రేలంగి) కుమారుడు వాసు (హరనాథ్) కుమార్తె మంజుల (షావుకారు జానకి) భార్య రమాదేవి. వాసు, ఉమ ప్రేమించుకుంటారు. రఘు, తండ్రితో కలిసి పేకాట ఆడడం, బలాదూర్‌గా తిరగడం, కుస్తీపోటీల్లో పాల్గొనటం చేస్తుంటాడు. దశావతారం ధనవంతుడైనా ఉమ గుణం నచ్చి ఆమెతో తన కొడుకు పెళ్ళికి అంగీకరిస్తాడు. రఘు పాల్గొన్న కుస్తీపోటీలకు జడ్జిగా వచ్చిన మంజులను రఘు అవమానిస్తాడు. రఘు సోదరి ఉమ అని తెలుసుకున్న మంజుల, ఆమె తల్లి ఉమతో వాసు పెళ్ళికి అంగీకరించరు. ఇంటినుంచి వెళ్ళిపోవాలనుకున్న ఉమకు తల్లి ఆమె తమ పెంపుడు కూతురని నిజం తెలియచేసి, అన్నను తండ్రిని దారిలోపెట్టమని బాధ్యత అప్పగించి మరణిస్తుంది. మంజుల నాట్యప్రదర్శన చేస్తూ ప్రమాదంలో చూపుకోల్పోతుంది. తండ్రి, అన్నలవల్ల ఉద్యోగం పోగొట్టుకున్న ఉమ, జైలుకి వెళ్ళిన అన్నకోసం, ఓ ముసలివానితో పెళ్ళికి సిద్ధపడుతుంది. రఘులో మార్పు వచ్చి జైలునుంచి రాగానే ఆ పెళ్ళి ఆపాలనుకుంటాడు. కాని ఉమకు, వాసుతో పెళ్ళి జరిగిందని తెలుసుకుని, చూపులేని మంజులను, తాను మూగవాడినని చెప్పి పెళ్ళి చేసుకుంటాడు. మంజులకు నిజం తెలిసి భర్తకు దూరంగా బెంగుళూరు వెళ్ళిపోతుంది. వాసు ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళతాడు. ఉమ అత్తగారు ఆమెను ఇంటినుంచి వెడలగొడుతుంది. ఒక బిడ్డను కని ఆ ఊరికి దూరంగా బ్రతుకుతుంటుంది ఉమ. రఘు భార్య మంజుల దగ్గరకు బెంగుళూరు మారువేషంలో వెళ్ళి ఆమె మనసుమారుస్తాడు. తిరిగి తమ వూరు వచ్చేటప్పుడు రైల్వేట్రాక్ మీద ప్రమాదంలో వున్న ఉమ బిడ్డ (మేనల్లుడి)ని కాపాడి, అందరిచేత మెప్పుపొందుతాడు. వాసు విదేశాలనుంచి తిరిగి రావటంతో కథ సుఖాంతం అవుతుంది.
1962లో ‘‘మహామంత్రి తిమ్మరసు’’, ‘‘రక్తసంబంధం’’, ‘‘గాలిమేడలు’’ చిత్రాలలో నాయకానాయికలుగా నటించి మెప్పించిన యన్.టి.ఆర్, దేవిక ఈ చిత్రంలో అన్నాచెల్లెళ్ళుగా నటించటం విశేషం. మహానటుడు యన్.టి.ఆర్. చిత్రం ప్రథమార్థంలో సోమరిగా, తరువాత బాధ్యతనెరిగిన వ్యక్తిగా మారిన సన్నివేశాలలో తన నటనతో మెప్పించారు. కాని ప్రేక్షకులకు ఈ చిత్రం అంతగా నచ్చక విజయవంతం కాలేదు. పెంపుడు కూతురిగా దేవిక నటన సహజంగా రాణించింది. ఒక కుటుంబ కథాచిత్రంగా మలచిన ఈ చిత్రంలో రేలంగి, బాలకృష్ణ, రమణారెడ్డి వంటి హాస్యనటులు కేరెక్టర్ పాత్రలు పోషించటంవల్ల హాస్యంపాలు కొద్దిగా లోటు అన్పిస్తుంది. ఈ చిత్రంలో పాటలు, యన్.టి.ఆర్‌పై చిత్రీకరించిన ‘‘ఏవి వెలుతురు లేవి నను బ్రతుకుబాటలో’’ (ఘంటసాల-సినారె) యన్.టి.ఆర్. షావుకారు జానకీల తొలిరేయి పాట ‘‘నాకు కనులు లేవు నీవు పలుకలేవు బ్రతుకులోని తీయదనం పంచుకోలేవు’’ (పి.సుశీల, సినారె), నీ జాడ కననైతిరా సామి (పి.లీల- సినారె), యన్.టి.ఆర్‌పై చెప్పిన మాటేననుకో, ఇది చెప్పిన మాటే ననుకో (ఘంటసాల బృందం- కొసరాజు), హరనాథ్, దేవికలపై చిత్రీకరించిన యుగళగీతం ‘‘కన్నుల విందే అందాలు కోరికలూరే డెందాలు’’ (పి.బి.శ్రీనివాస్, ఎస్.జానకి- అనిశెట్టి) ‘జీవనరాగం ఈ అనురాగం మధురానందమయితే’ (ఎస్.జానకి, పి.బి.శ్రీనివాస్- అనిశెట్టి) దేవిక, పియాన్ వాయిస్తుండగా దేవిక, హరనాథ్‌లపై చిత్రీకరణ.
‘పెంపుడుకూతురు’ చిత్రం ఆర్థికంగా అంత విజయం సాధించలేదు.
"https://te.wikipedia.org/wiki/పెంపుడు_కూతురు" నుండి వెలికితీశారు