షోలే: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 45:
రాంగఢ్ అనే కుగ్రామంలో ఠాకూర్ బల్‌దేవ్ సింగ్(సంజీవ్ కుమార్) అనే రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ నివసిస్తూ ఉంటాడు. అతడు విధిలో ఉన్నప్పుడు అరెస్ట్ చేసిన ఇద్దరు చిల్లరదొంగలు వీరూ, జై లను రప్పించి వారితో ఒక ఒప్పందం కుదుర్చుకుంటాడు. బందిపోటు గబ్బర్‌సింగ్‌ను ప్రాణాలతో బంధించే విషయంలో అతడికి సహాయం చేస్తే ప్రభుత్వం ప్రకటించిన 50,000 రూపాయలతోపాటు అదనంగా మరో 20,000 రూపాయలను ఇస్తానని ఠాకూర్ ఆ ఇద్దరికీ ఆశ పెడతాడు.
 
గ్రామస్తులను దోచుకోవడానికి గబ్బర్‌సింగ్ పంపిన బందిపోటు దొంగలను ఆ ఇద్దరూ ఎదుర్కొని వారిని తరిమికొడతారు. వెంటనే హోలీ పండుగ రోజు గబ్బర్ అతని అనుచరులు రాంగఢ్‌పై దాడి చేస్తారు. బందిపోట్లకు, వీరూ, జై ద్వయానికీ మధ్య హోరాహోరీ యుద్ధం జరుగుతుంది. ఠాకూర్ అందుబాటులో తుపాకీ ఉన్నా అతడు వారికి సహాయం చేయడు. వీరూ, జై పోరాడి బందిపోట్లను తరిమికొడతారు. ఆ ఇద్దరూ ఠాకూర్ చర్యకు నిరసన తెలుపుతూ ఆ గ్రామం వదిలి వెళ్లడానికి సిద్ధపడతారు. అప్పుడు ఠాకూర్ తన కుటుంబం అంతటినీ కొన్నేళ్ల క్రితం గబ్బర్‌సింగ్ చంపివేసి, తన రెండు చేతులను నరికివేసిన విషాయాన్ని వారికి వివరిస్తాడు. ఆ కారణంతోనే తాను తుపాకీని ఉపయోగించలేకపోయానని చెప్తాడు. తను ఎప్పుడూ కప్పుకుని ఉండే శాలువాను తీసి తన మొండిచేతులనుమొండిశరీరాన్ని వారికి చూపిస్తాడు.
 
కలివిడిగా ఉండే వీరూ, ముభావంగా ఉండే జై ఆ గ్రామప్రజల అభిమానాన్ని చూరగొంటారు. వీరూ జట్కాబండిని నడిపే బసంతి(హేమమాలిని)ని ఆకర్షిస్తాడు. జై విధవరాలైన ఠాకూర్ కోడలు రాధ(జయబాధురి)ని ప్రేమిస్తాడు.
"https://te.wikipedia.org/wiki/షోలే" నుండి వెలికితీశారు