కేతు విశ్వనాథరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: పని చేసి → పనిచేసి, → (24) using AWB
పంక్తి 2:
[[బొమ్మ:Kethu viswanathareddy kathalu front cover.jpg|thumb|right|[[కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు]] పొందిన కేతు విశ్వనాథరెడ్డి కథలు]]
[[దస్త్రం:Ketu vishvanatha reddy.jpg|thumb|right|200px|కేతు విశ్వనాథరెడ్డి]]
'''కేతు విశ్వనాథ రెడ్డి''' ప్రసిద్ధ సాహితీవేత్త మరియు విద్యావేత్త. ఈయన ప్రధానంగా కథారచయితగా ప్రసిద్ధుడు. కేతు విశ్వనాథ రెడ్డి కథలు అనే కథా సంపుటికి [[కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు]] పొందాడు.
 
==వ్యక్తిగత జీవితం ==
[[జూలై 10]], [[1939]] న [[వైఎస్ఆర్ జిల్లా]] [[కమలాపురం]] తాలూకా [[రంగశాయిపురం]] గ్రామంలో జన్మించాడు.
== విద్యాభ్యాసం, వృత్తి ==
''కడపజిల్లా గ్రామనామాలు'' అనే అంశంపై పరిశోధనకు గాను డాక్టరేట్ పొందాడు. పాత్రికేయుడుగా ఉద్యోగజీవితాన్ని ప్రారంభించి కడప, [[తిరుపతి]], [[హైదరాబాదు]] లాంటి చోట్ల అధ్యాపకుడుగా పని చేసిపనిచేసి [[డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం]]లో డైరెక్టరుగా పదవీవిరమణ చేశాడు. పాఠ్యపుస్తకాల రూపకల్పనలో SCERT సంపాదకుడుగా వ్యవహరించాడు. పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయస్థాయి దాకా అనేక పాఠ్యపుస్తకాలకు సంపాదకత్వం వహించాడు. పాఠ్యప్రణాళికలను రూపొందించాడు. [[ఈనాడు]], [[ఆంధ్రభూమి]], [[ఆంధ్రజ్యోతి]] పత్రికాసిబ్బందికి శిక్షణ ఇచ్చాడు.
== సాహిత్య రంగం ==
ఈయన తొలి కథ అనాదివాళ్ళు [[1963]]లో [[సవ్యసాచి (పత్రిక)|సవ్యసాచి]]లో ప్రచురితమైంది. [[కొడవటిగంటి కుటుంబరావు]] సాహిత్య సంకలనాలకు సంపాదకత్వం వహించాడు. [[విశాలాంధ్ర]] తెలుగు కథ సంపాదక మండలికి అధ్యక్షుడుగా ఉన్నాడు. కొన్నేళ్ళు [[అరసం]] (అభ్యుదయ రచయితల సంఘం) అధ్యక్షుడుగా ఉన్నాడు. ఈయన రాసిన సాహితీవ్యాసాలు "దృష్టి" అనే పేరుతో పుస్తక రూపంలో వచ్చాయి. ఆధునిక తెలుగు కథారచయితల్లో Torch bearers అనదగ్గ ప్రసిద్ధుల గురించి ఈయన రాసిన మరో పుస్తకం దీపధారులు. ప్రస్తుతం "ఈభూమి" పత్రికకు సంపాదకుడుగా పనిచేస్తున్నాడు. జప్తు, ఇచ్ఛాగ్ని, [[కేతు విశ్వనాథరెడ్డి కథలు (1998-2003)]] కథా సంపుటులు కూడా వెలువరించాడు. ఈయన కథలు అనేకం [[హిందీ]], [[కన్నడం]], [[మలయాళం]], [[బెంగాలీ]], [[మరాఠీ]], [[ఆంగ్లం]], [[రష్యన్]] భాష ల్లోకి అనువాదితమయ్యాయి. వేర్లు, బోధి ఈయన రాసిన నవలలు. వేర్లు [[రిజర్వేషన్లు|రిజర్వేషన్లకు]] సంబంధించి [[క్రీమీ లేయర్]] మీద వెలువడిన మొట్టమొదటి [[నవల]]. విశ్వనాధరెడ్డి, పోలు సత్యనారాయణ ఇద్దరూ కలసి చదువుకథలు<ref>{{cite book|last1=విశ్వనాధ రెడ్డి|first1=కేతు|last2=సత్యనారాయణ|first2=పోలు|title=చదువుకథలు|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=chaduvu%20navala&author1=kod%27avat%27igan%27t%27i%20kut%27un%27baraavu&subject1=LANGUAGE.%20LINGUISTICS.%20LITERATURE&year=1982%20&language1=telugu&pages=189&barcode=2990100071276&author2=&identifier1=&publisher1=vishaalaan%27dhra%20pablishhin%27g%20haus&contributor1=&vendor1=NONE&scanningcentre1=ttd,%20s.v%20digital%20library&slocation1=NONE&sourcelib1=Donar&scannerno1=0&digitalrepublisher1=Digital%20Library%20Of%20India&digitalpublicationdate1=2005-09-13&numberedpages1=&unnumberedpages1=&rights1=Copyright%20Permitted&copyrightowner1=&copyrightexpirydate1=&format1=Tagged%20Image%20File%20Format%20&url=/data_copy/upload/0071/281}}</ref> అనే కథల సంపుటిని సంకలనం చేశారు.
పంక్తి 22:
*విశ్వవిద్యాలయ అధ్యాపకులకు రాష్ట్రప్రభుత్వం ఇచ్చే ఉత్తమ అధ్యాపక పురస్కారం.
==వివిధ పత్రికలలో ప్రచురితమైన వీరి కథలు కొన్ని...==
*1991 ''కేతు విస్వనాథరెడ్డి కథలు.''...... ఆంధ్రజోతి వార పత్రిక.
*1975 ''ద్రోహం.'' విశాలాంధ్ర దిన పత్రిక.
*1977 ''ఆత్మ రక్షణ.'' వీచిక మాస పత్రిక.
*1977 ''మన ప్రేమకథలు.'' ఆంధ్ర జోతి మాస పత్రిక.
*1978 ''విశ్వరూపం'' స్వాతి మాస పత్రిక.
*1979 ''ఆరోజులొస్తే...'' నివేదిత మాస పత్రిక.
*1980 ''పీర్ల సావిడి.'' స్వాతి మాస పత్రిక.
*1991 ''ఎస్.2 బోగీలు.'' ఉదయం వార పత్రిక.
*1997 ''ఒక జీవుడి ఆవేదన.'' ఆదివారం ఆంధ్రభూమి.
*2001 ''కాంక్ష '' రచన మాస పత్రిక.
*2003 ''అమ్మవారి నవ్వు.'' ఇండియా టుడే.<ref name=http://shodhganga.inflibnet.ac.in/handle/10603/106230>{{cite web|title=http://shodhganga.inflibnet.ac.in/handle/10603/106230|publisher=http://shodhganga.inflibnet.ac.in/handle/10603/106230|accessdate=27 August 2016|ref=http://shodhganga.inflibnet.ac.in/handle/10603/106230}}</ref>
 
==ఇతరుల మాటలు==
 
*ఆ కథలో(జప్తు)భాష మా ప్రాంతానికి చెందింది కాదు. అందులో చిత్రితమైన గ్రామం మాసీమకు చెందిందికాదు. కాని ఆగ్రామీణ జీవితంలో అక్కడి రైతుల సమస్యలతో, స్వభావాలతో మా ప్రాంత జీవితానికీ, రైతు సమస్యలకూ దగ్గరతనం కనిపించింది. ఈ రచయిత ఎవరో కట్టుకథలు కాకుండా పుట్టుకథలు రాసే వారనిపించింది-'''[[కాళీపట్నం రామారావు]][[(కారా)]]'''
*1960 నుంచి ఒకపాతిక, ముప్పైయేళ్ళ కాలవ్యవధిలో ఒక నిర్దిష్ట మానవ సమాజంలో వచ్చిన మార్పులన్నింటినీ ఆయన కథలు రికార్డు చేశాయి-'''[[ మధురాంతకం రాజారాం]] '''
*విశ్వనాథరెడ్దిగారి కథల్లో-కథౌండదు-కథనం ఉంటుంది. ఆవేశంవుండదు-ఆలోచనవుంటుంది. అలంకారాలుండవు-అనుభూతివుంటుంది; కృత్రిమత్వంవుందదు-క్లుప్తతవుంటుంది. కథకుడిగా తెలుగు సాహిత్యంలో విశిష్ట స్థానం విశ్వనాథరెడ్దిగారిది-'''[[సింగమనేని నారాయణ]] '''
*నీల్లు లేని రాయలసీమలో జీవన ప్రవాహంలో తనుమోసిన, అనుభవించిన ఉద్రిక్త సుఖదుఃఖాలను ప్రపంచంలో పంచుకోవడానికి విశ్వనాథరెడ్డి కథలు రాసారు-'''[[అల్లం రాజయ్య]] '''
*ప్రజలనాడిని ప్రజలభాష ద్వారా పట్తుకున్న కథకుడు విశ్వనాథరెడ్డి. కథకుడిగా అతని చూపు అత్యంత రాక్షసమైనది. అంటే అంత కఠినమైనది. తెలుగుభాషపై అతనికున్న పట్టు కూడా చాలా గట్టిది.తెలుగు కథల్లో కవిత్వంకాని మంచి వచనం రాసిన కొద్దిమంది కథకుల్లో ఇతనొకడు.-'''[[చేకూరి రామారావు]]'''
*...సానుభూతితో, మానవతావాదంతో, వర్గచైతన్యంతో, స్త్రీపాత్రలను సృష్టించటం దగ్గర మొదలై లింగవివక్షనూ, స్త్రీల అణచివేతనూ అర్థం చేసుకొని ఆ దృష్టితో స్త్రీ పాత్రలను రూపొందించేంత వరకూ ఒక గుణాత్మక పరిణామ ప్రయాణం చేశారు-'''[[ఓల్గా]]'''
పంక్తి 51:
== శీర్షిక పాఠ్యం ==
 
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]
[[వర్గం:1939 జననాలు]]
[[వర్గం:తెలుగు రచయితలు]]